సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్చరణ్ తేజ తమ బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన ఇమేజ్కు తగ్గ సేవలు అందిస్తామని కొత్త విమానయాన సంస్థ టర్బో మేఘ మేనేజింగ్ డెరైక్టర్ వి. ఉమేష్ చెప్పారు. రామ్చరణ్ డెరైక్టర్గా కొనసాగుతున్న టర్బో మేఘ ఎయిర్వేస్కు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమాన సర్వీసుల నిర్వహణ నిమిత్తం నో అబ్జెక్షన్ (ఎన్ఓసీ) జారీ చేసిన సందర్భంగా ఆ కంపెనీ కార్యకలాపాల్ని ఉమేష్ ‘సాక్షి ’కి వివరించారు.
వ్యాపార అవకాశాలు...
ఎయిర్వేస్ వ్యాపారంలో మంచి అవకాశాలున్నాయి. ఆక్యుపెన్సీ నిష్పత్తి పెంచుకుంటే లాభాలను ఆర్జించవచ్చు. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న పోటీ సంస్థ 80 శాతం ఆక్యుపెన్సీ సాధిస్తోందని మార్కెట్ వర్గాల అంచనా. మా బలం రామ్చరణ్ తేజ బ్రాండ్ ఇమేజ్. ఆయన ఇమేజ్ ఆధారంగా మా సంస్థ సేవలను నాణ్యత కోరే ప్రయాణికులకు అందుబాటు ధరల్లో అందిస్తాం. చరణే మా బ్యానర్.
మీ సంస్థ మూలధన నిర్మాణం గురించి చెప్పండి?
మా అధీకృత మూలధనం రూ. 15 కోట్లు. పెయిడ్ అప్ క్యాపిటల్ రూ. 12 కోట్లు. ప్రస్తుతం సంస్థలో ఇద్దరే డెరైక్టర్లుగా ఉన్నాం. ఇది చాలా ప్రాథమిక దశ. ఒక ఆకృతికి తీసుకు రావడానికి కనీసం మూడు నాలుగు నెలలు పడుతుంది. బోర్డులోకి మరికొంత మంది చేరే అవకాశం ఉంది. ఇందులో రవాణా రంగ నిపుణులతోపాటు అంతర్జాతీయ కన్సల్టెంట్లు కూడా ఉంటారు.
మీ ఎయిర్లైన్స్ ప్రాజెక్టుకు క్యాపిటల్ అవసరాలను అంచనా వేశారా?
తొలి దశలో రూ. 50 కోట్లు అవసరం ఉంటుందని అంచనా. మూలధన సమీకరణకై హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐలు), హెడ్జ్ ఫండ్లు, ప్రైవేట్ ఈక్విటీ సమకూర్చే వారితో దశల వారిగా సంప్రదింపులు జరుగుతాయి. బలమైన బ్రాండ్ అంబాసిడర్ మా డెరైక్టర్ కావడంతో మూలధన సమీకరణ పెద్ద సమస్య కాకపోవచ్చు.
ఎన్ని విమానాలను కొనుగోలు చేయనున్నారు?
చెన్నై, బెంగళూరు, టుటికారిన్, మదురై, బెల్గాం, హుబ్లీ ప్రాంతాల మధ్య సర్వీసులను ప్రారంభించాలన్నది మా ప్రస్తుత ఆలోచన. దీనికోసం 68 సీట్లుంటే క్యూ-400 బొంబార్డియర్ ఎయిర్ క్రాఫ్ట్లను సిద్ధం చేస్తున్నాం. వీటిని ఫ్రెంచ్ సంస్థనుండి డ్రై లీజుకు తీసుకుంటున్నాం.
ఈ రంగంలో మీకున్న అనుభవం ఏమిటి?
టర్బో ఏవియేషన్ సంస్థను 2003లోనే ఏర్పాటు చేశాం. తొలుత ఎయిర్ డక్కన్ సంస్థకు గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించాం. 2007 నుండి ప్రధాన ఎయిర్లైన్స్ అయిన జెట్ , కింగ్ ఫిషర్, బ్లూడార్ట్, ఎయిర్ సహారా, ప్యారామౌంట్, స్పైస్ జె ట్, హెచ్ఏఎల్, ఎయిర్ ఇండియా సంస్థలకు ఈ సేవలను అందిస్తున్నాం. 2009 నుండి నాన్ షెడ్యూల్ ఆపరేటర్ లెసైన్స్తో చార్టర్ సేవలు అందిస్తున్నాం. రాబిన్సన్ ఆర్-44 హెలికాప్టర్తో దేశ వ్యాప్త చార్టర్ సేవలందించాం. ప్రస్తుతం హైదరాబాద్ నుండి రెండు సెస్నా లైట్ ట్విన్ ఇంజిన్ కార్పొరేట్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్లను చార్టర్ సర్వీసులుగా నడుపుతున్నాం. దేశంలోని 20 ప్రధాన కార్పొరేట్ సంస్థలతో చార్టర్ సర్వీసులు అందించేందుకు ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం.
మీ ఇతర ప్రణాళికలు...?
పూర్తి స్థాయి ఎయిర్లైన్గా ఎదగడమే మా లక్ష్యం. ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కోసం మా గ్రూపు సంస్థకు జీఎంఆర్ ఎయిరోపార్క్ ఎస్ఈజెడ్లో ఒకటిన్నర ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అలాగే విమానాల ఎయిర్ వర్తీనెస్ ధుృవీకరించేందుకు డెరైక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి అనుమతులు పొందాం. దీంతో ఇతర ఎయిర్ క్రాఫ్ట్లకు డీజీసీఏ తరుపున ఈ సేవలను అందించే అవకాశం ఉంది.
రామ్ చరణే మా బ్రాండ్ అంబాసిడర్..
Published Thu, Jul 24 2014 2:02 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
గురుద్వారా సేవా కార్యక్రమంలో మోదీ! ఏంటీ లంగర్ .?
సదుపాయాల విషయం లో అధికారులు అప్రమత్తం అవ్వాలి
అప్పటిలోపు కొనేసుకోండి.. షేర్ మార్కెట్లపై అమిత్షా
మళ్ళీ గెలిచేది జగనే.. ఓటు హక్కు వినియోగించుకున్న తానేటి వనిత
సీఎం ఇంట్లో నాపై దాడి చేశారు: ‘ఆప్’ ఎంపీ సంచలన ఆరోపణలు
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా
ఓటరును చెంపదెబ్బ కొట్టడంపై స్పందించిన ఎమ్మేల్యే
టీడీపీ కుట్రలు.. పోలీసు అధికారులకు బెదిరింపులు: మనోహర్రెడ్డి
తల్లితో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా నటుడిపై దాడి.. తీవ్రగాయాలు
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement