సింహాచలం అప్పన్నను దర్శించుకున్న వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

సింహాచలం అప్పన్నను దర్శించుకున్న వైఎస్ జగన్

Published Tue, Jan 27 2015 5:34 PM

సింహాచలం అప్పన్నను దర్శించుకున్న వైఎస్ జగన్ - Sakshi

విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం జిల్లా సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద  వైఎస్ జగన్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని దేవుణ్ని కోరుకున్నానని జగన్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సింహాచలం భూముల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మంగళవారం విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ ఆర్కే బీచ్ లో కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. శారదాపీఠంలోని పలు ఆలయాలను వైఎస్ జగన్  సందర్శించారు. శారదాపీఠం నిర్వహిస్తున్న చతుర్వేద యాగంలో పాల్గొన్నారు. స్వరూపానందస్వామి శారదాపీఠం విశిష్టతను తెలియజేశారు.


 

Advertisement
Advertisement