సాక్షి ప్రతినిధి, విజయనగరం : రుణమాఫీ దగాతో నష్టపోయిన గంట్యాడ మండలం చంద్రంపేట రైతుల సమస్యను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావిస్తాంచారు. ప్రభుత్వ నిర్వాకాన్ని కేస్ స్టడీస్తో వివరించారు. ప్రభుత్వం విధానాన్ని దుయ్యబట్టారు. గంట్యాడ మండలం చంద్రంపేటలో బండారు రామునాయుడికి 2.63 ఎకరాల భూమి ఉంది. అందులో వరి పండించేందుకు లక్కిడాం ఎస్బీహెచ్లో రూ.50 వేల రుణం తీసుకున్నారు. కానీ ఆయనకు కేవలం రూ.3.10 పైసల రుణం మాత్రమే మాఫీ అయింది. అలాగే అదే గ్రామానికి చెందిన బండారు అప్పలనాయుడికి 2.63 ఎకరాల భూమి ఉంది . వరి పంట నిమిత్తం రూ.50 వేలు రుణం తీసుకున్నారు. రుణ మాఫీలో కేవలం రూ.95 మాత్రమే మాఫీ అయింది.
సోమవారం అసెంబ్లీలో రుణమాఫీ పై చర్చజరిగినప్పుడు వీరిద్దరికీ జరిగిన అన్యాయాన్ని కేస్ స్టడీలుగా తీసుకుని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడమే కాకుండా, సర్కార్ తీరును ఎండగట్టారు. అసెంబ్లీలో రుణమాఫీపై చర్చ జరిగినప్పుడు మన జిల్లాలోని గంట్యాడ మండలం చంద్రంపేట రైతులకు చంద్రబాబు చేసిన రుణ మాఫీ దగాను వైఎస్ జగన్ ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలను టీవీల ద్వారా జిల్లాలో చాలా మంది వీక్షించారు. తమ తరఫున అసెంబ్లీలో ప్రస్తావించి, న్యాయం జరిగేలా ప్రతిపక్ష నేత డిమాండ్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు చెప్పినప్పుడే ప్రభుత్వం కళ్లు తెరుస్తుందని, లోపాలను సరిదిద్దుకుని న్యాయం చేసే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో చంద్రంపేట ప్రస్తావన
Published Tue, Dec 23 2014 2:38 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఎన్నికల సమాచారం సమస్తం... వేలి కొసలపైనే!
- జిల్లా జడ్జి నియామకాల్లో వర్టికల్ రిజర్వేషన్లు !
- జీన్స్, టీషర్ట్స్ వేసుకు రావొద్దు
- నేడు రాష్ట్రంలో అమిత్ షా ప్రచారం
- బీజేపీపై తప్పుడు ప్రచారం
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
Advertisement