► విశాఖ హవాలా కుంభకోణంపై సీఐడీ అంచనాలు
► ఇందులో బడాబాబులు, బ్యాంకర్ల పాత్ర
సాక్షి, విశాఖపట్నం: ఇప్పటిదాకా వందల కోట్లకే పరిమితమైందనుకుంటున్న విశాఖలో వెలుగు చూసిన హవాలా కుంభకోణం విలువ రూ.వేల కోట్లు ఉంటుం దని ఏపీ సీఐడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు వడ్డి మహేష్ కింది స్థాయిలో వ్యవహారం నడిపాడని, ఆయనకన్నా పై స్థాయిలో ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు, బ్యాంకర్ల పాత్ర ఉండవచ్చని భావిస్తున్నారు. సీఐడీ ఐజీ అమిత్గార్గ్ పర్యవేక్షణలో కేసు విచారణ ప్రక్రియ మొదలయింది. ప్రధాన నిందితుడు వడ్డి మహేష్ను సోమవారం ఉదయం కోర్టుకు తరలించగా రిమాండ్ విధించారు. మహేష్ను కస్టడీకి తీసుకొని విచారించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు.
ఏపీ చరిత్రలో అతి పెద్ద కుంభకోణం!
మహేష్ తండ్రి శ్రీనివాసరావే కొడుకును ఇందులో సూత్రధారులకు పరిచయం చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. ఆయనను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబడుతున్నారు. మరోవైపు గోయల్, గోయంకా, గుప్తా అనే హవాలా వ్యాపారులను అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నారు. ఈ కేసును ఛేదించేందుకు సీఐడీ అధికారులు సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల సాయాన్ని తీసుకోనున్నారు. నకిలీ కంపెనీల రిజిస్ట్రేషన్ ప్రక్రియపైనా సీఐడీ దృష్టి సారించనుంది. ఈ కంపెనీల సంబంధిత డైరెక్టర్లను అదుపులోకి తీసుకుంటే మరిన్ని విషయాలు బయటపడతాయని సీఐడీ భావిస్తోంది. మరోవైపు ఈ కుంభకోణంలో పెద్దల పాత్ర ఉందన్న వీరు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటిదాకా రూ.1,369 కోట్ల హవాలా కుంభకోణం జరిగినట్టు ప్రాథమికంగా తేల్చినా మున్ముందు ఇది వేల కోట్లకు చేరుకుంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా నిలిచిపోవచ్చని అంటున్నారు.
12 కంపెనీలు.. 30 ఖాతాలు
హవాలా కుంభకోణంలో 12 బోగస్ కంపెనీలను సృష్టించారని, 30 బ్యాంకు ఖాతాలను తెరిచారని, నకిలీ పాన్కార్డులు, డాక్యుమెంట్లను రూపొందించి మోసానికి పాల్పడ్డారని విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్ చెప్పారు. ఆయన సోమవారం కమిషనరేట్లో విలేకరులకు కేసు వివరాలను వెల్లడించారు. నిందితుడు మహేష్ ఆయా కంపెనీల ఉద్యోగులతో వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి హవాలా సొమ్ముతో రూ.680.94 కోట్ల లావాదేవీలు నిర్వహించారని తెలిపారు. ఈ కంపెనీలు రూ.569.93 కోట్ల మేర విదేశీ మారకద్రవ్యాన్ని భారత్కు నష్టం కలిగించాయని చెప్పారు. అంతేగాక.. కోల్కతా బ్యాంకుల్లో మరో రూ.800 కోట్ల సొమ్మును జమ చేసినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెప్పారన్నారు. 2014 నుంచి మొదలైన ఈ వ్యవహారం పెద్దనోట్ల రద్దు వరకు వేగంగా సాగిందన్నారు. సమావేశంలో డీసీపీ నవీన్ గులాటీ, స్పెషల్ బ్రాంచి ఏడీసీపీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
రూ. వేల కోట్ల హవాలా!
Published Tue, May 16 2017 3:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
ఓసీపీ..ఉక్కిరిబిక్కిరి
‘నల్లసూరీడు’పై నజర్
తప్పక చదవండి
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
Advertisement