ప్రతిదానికి గొడవేనా?: చంద్రబాబు | Sakshi
Sakshi News home page

ప్రతిదానికి గొడవేనా?: చంద్రబాబు

Published Wed, Oct 22 2014 5:05 PM

ప్రతిదానికి గొడవేనా?: చంద్రబాబు - Sakshi

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రతిదానికి గొడవ చేయాలని చూస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. శ్రీశైలం జలాశయంలో మొదట కుడి గట్టు నుంచి, తర్వాత ఎడమ గట్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తారని తెలిపారు. ఎడమ, కుడి గట్టు ఉత్పత్తి తక్కువగా ఉంటే స్పిల్ వే ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చన్నారు. మిగులు జలాలు ఉంటే ఎస్ ఎల్ బీసీకి ముందుగా విడుదల చేయాలన్నారు. 854 అడుగులకు దిగువకు నీటి మట్టం ఉంటే సాగర్, కృష్ణా డెల్టాకు విడుదల చేయాలన్నారు.

మిగులు జలాలు ఉన్నప్పుడు మాత్రమే ఎడమగట్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే విధానం ఉండాలన్నారు. మిగులు జలాలు లేనప్పుడు 11 వేల క్యూసెక్కుల మాత్రమే వినియోగించాలని చంద్రబాబు చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement