వ్యవసాయంలో యాంత్రీకరణకు అక్కడ అధికారులే తూట్లు పొడుస్తున్నారు. రైతులకు సబ్సిడీపై పరికరాలు అందివ్వడంలో విఫలమవుతున్నారు. కలుపునివారణకు వినియోగించే స్ప్రేయర్లకోసం సబ్సిడీ మొత్తాలు సిద్ధంగా ఉన్నా వాటిని అందివ్వలేకపోతున్నారు. ఇదే అదనుగా అన్నదాతల అవసరాన్ని ప్రైవేటు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు.
గార : జిల్లా రైతాంగానికి కలుపునివారణ కష్టంగా మారుతోంది. దీనికోసం వినియోగించాల్సిన సబ్సిడీ స్ప్రేయర్ల సరఫరాలో అధికారులు విఫలమవుతున్నారు. ఫలితంగా ఎక్కువ మొత్తాలతో ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. కేంద్రప్రభుత్వం ద్వారా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. రాష్ట్ర వ్యవసాయ సాధారణ ప్రణాళిక, జాతీయ ఆహార భధ్రతా మిషన్ వంటి పథకాల కింద రైతులకు ఆధునిక పరికరాలు 50 శాతం రాయితీపై ఇచ్చేందుకు జిల్లాలో సుమారు రూ. 15 కోట్లు ప్రస్తుతం సిద్ధంగా ఉంది. వాటిలో పవర్, సాధారణ స్పేయర్లకు 50 శాతం రాయితీ ఇచ్చేందుకే రూ. కోటి వినియోగించుకోవచ్చు. గతేడాది స్పేయర్లు పంపిణీ చేసిన కంపెనీలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన 50 శాతం రాయితీని ఇంతవరకు జమచేయలేదు. దీంతో ఈ ఖరీఫ్కు కావాల్సిన స్పేయర్లు కంపెనీల వద్ద అందుబాటులో ఉన్నా జిల్లాకు మాత్రం పంపించేందుకు ససేమిరా అంటున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో రాయితీలేకుండానే ప్రైవేటు డీలర్ల వద్ద రైతులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇదే అదనుగా డీలర్లు ఒక్కో స్పేయరుపై రూ. 200 నుంచి రూ.300 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు.
కలుపునివారణకు స్ప్రేయర్లు తప్పనిసరి
ఖరీఫ్ సీజన్లో వరి పంటలో కలుపు నివారణకు సాధారణంగా ఎక్కువ మొత్తం ఖర్చుచేయాల్సి ఉంటుంది. పెరిగిన తరువాత తొలగించాలంటే కూలీలకోసం దాదాపు రూ. ఆరువేలకుపైబడి ఖర్చుపెట్టాలి. అయితే కలుపుమందులు ముందుగానే చల్లేస్తే కేవలం వెయ్యిరూపాయలతో నివారించుకోవచ్చు. అయితే ఈ మందు పిచికారీ చేస్తేనే కలుపు నివారణ సాధ్యమవుతుంది. ఇందుకోసం పవర్, సాధారణ స్ప్రేయర్లను ఎవరి శక్తిని బట్టి వారుకొనుగోలు చేస్తారు. సాధారణ స్ప్రేయర్లయితే రూ. 1800 నుంచి రూ. 3000 వరకూ లభ్యమవుతుండగా, పవర్ స్ప్రేయర్లు రూ. 2000 నుంచి 30వేల వరకూ లభ్యమవుతున్నాయి. అన్నింటికీ యాభైశాతం సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా అవిరైతులకు ఉపయోగపడటంలేదు. జిల్లాలో లక్షా 50 వేల ఎకరాల్లో 70వేల మంది రైతులు ఎద సాగు చేస్తున్నారు. కానీ వీరందరికీ జిల్లాలో కేవలం 5వేల స్ప్రేయర్లే ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెద జల్లిన మూడు రోజుల నుంచి కలుపు మందు పిచికారి చేయాలి. అందరూ ఒకేసారి స్పేయర్లు కావాలనుకోవడం, ప్రభుత్వం రాయితీపై అందుబాటులో ఉంచకపోవడంతో సమస్య ఏర్పడింది.
గత ఏడాది లెక్కతేలకే మూలుగుతున్న సబ్సిడీ
జిల్లాలో స్ప్రేయర్ల పంపిణీపై వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు సీహెచ్ అప్పలస్వామి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా గతేడాది స్ప్రేయర్లు ఎన్ని ఇచ్చారో కంపెనీలు రాతపూర్వకంగా తమకు ఇవ్వకపోవడంవల్లే సబ్సిడీ జమచేయలేకపోయామని తెలిపారు. సాధారణ స్ప్రేయర్ వాస్తవ ధర రూ. 1800 కాగా రూ. 600 మాత్రమే సబ్సిడీ అందిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందనీ, పవర్ స్ప్రేయర్కు మాత్రం 50 శాతం రాయితీ వర్తిస్తుందనీ చెప్పారు. గతంలోలా కాకుండా స్ప్రేయర్ కోసం మీసేవలో అప్లోడ్ చేస్తే ఏవో, ఏడీ, జేడీఏ అమోదం తెలుపుతారనీ, అనంతరం బ్యాంకులో డీడీ తీయాలని చెప్పారు. అధికారులు ఆన్లైన్లో అనుమతులిచ్చాక డీలరు స్ప్రేయర్ ఇవ్వాలని తెలిపారు. దీనంతటికీ ఎక్కువ సమమయం పడుతున్నందున సాధారణ స్ప్రేయర్కు వెసులుబాటు కల్పించాలని ఉన్నతాధికారులకు నివేదించామనీ, రెండు రోజుల్లో జిల్లాకు స్పేయర్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఇదేనా... యాంత్రీకరణ?
Published Fri, Jul 31 2015 2:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement