వెంకటగిరిటౌన్ : మంత్రి పి.నారాయణ అసమర్థత వల్లే జిల్లాకు దక్కాల్సిన స్మార్ట్సిటీ, హీరో కంపెనీలు దక్కలేదని వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి విమర్శించారు. వెంకటగిరిలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన కనీస బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందన్నారు. జిల్లాలో అన్ని మౌలిక వసతులు ఉన్నా హీరో కంపెనీ చిత్తూరు జిల్లాకు కేటాయించడం కేవలం మంత్రి అసమర్థతేనన్నారు. జిల్లాలో ఏ పల్లె ఏ మండలంలో ఉందో తెలియని ఆయనకు కేవలం ఎన్నికల్లో ఆర్థికంగా ఆదుకున్నాడనే కారణంతో సీఎం చంద్రబాబు మంత్రి పదవి కట్టబెట్టారన్నారు. రైతులు ఓ వైపు రుణమాఫీ కాక, మరోవైపు గిట్టుబాటు ధరల్లేక కన్నీటి పర్యం తం అవుతుంటే టీడీపీ నేతలు వందరోజులు సంబరాలు జరుపుకోవడం దారు ణమన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చి న రైతు, డ్వాక్రా, చేనేత రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి రూ.2వేలు, బెల్ట్షాపుల రద్దు, 9 గంటల వ్యవసాయ విద్యుత్, కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య, ధరల నియంత్రణ కు చర్యలు, పింఛన్ పెంపు తదితర వాటి ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోగా, ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టేందుకు కమిటీలు, సర్వేలు చేపట్టడంతో ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. రైతు రుణమాఫీలో రోజుకో విధంగా కొర్రీలు పెడుతున్న బాబు, తాజాగా పింఛన్ల కోతకు రంగం సిద్ధం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్కుమార్యాదవ్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మేరిగ మురళీధర్, జెడ్పీ వైస్ చైర్మన్ శిరీష, కార్పొరేటర్ రూప్కుమార్యాదవ్, బాలాయపల్లి ఎంపీపీ సింగంశెట్టి భాస్కర్రావు, కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు అనిల్కుమార్రెడ్డి, నేతలు దుంపా రామచంద్రారెడ్డి, బీవీరారెడ్డి, జి.ఢిల్లీబాబు, చిట్టేటి హరికృష్ణ, సాయినాయుడు పాల్గొన్నారు.
పోలేరమ్మకు ప్రత్యేక పూజలు
వెంకటగిరి గ్రామ దేవత పోలేరమ్మను వైఎస్సార్ సీపీ నేతలు దర్శించుకున్నారు.ప్రసన్నకుమార్రెడ్డి మాట్లాడుతూ పోలేరమ్మ దీవెనలతో ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలని వేడుకున్నట్టు చెప్పారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మేరిగ మురళీధర్, జెడ్పీ వైస్ చైర్మన్ శిరీషా అమ్మవారికి పూజలు నిర్వహించా రు. సంప్రదాయం ప్రకారం ఆలయ కమిటీ వారికి సత్కరించారు.
మంత్రి అసమర్థతతో జిల్లాకు నష్టం
Published Fri, Sep 19 2014 3:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మీ పనులు సులువుగా అవ్వాలంటే.. ఇవి వాడాల్సిందే..!
తలసేమియాపై అవగాహన
Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
పంజాబ్కు బ్రేకులు వేసిన సీఎస్కే
ప్రచారంలో భారతమ్మ..!
బాబే భూబకాసురుడు
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. సీపీ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు కేతిరెడ్డి సవాల్
రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
ఆస్పత్రిలో హీరోయిన్.. మత్తు మందు.. బాధ తట్టుకోలేకపోతున్నా!
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- Parvathipuram: ఎన్ఆర్ఐకు ఎదురుగాలి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement