రుద్రవరం: తెలుగుదేశం పార్టీ నేతలు బరితెగించారు. చట్టబద్ద కార్యకలాపాలకు అడ్డుతగులుతూ..తాము చెప్పిందే వేదమంటూ హుకుం జారీ చేస్తున్నారు. అధికారం ఉందనే అండతో ప్రభుత్వ ఉద్యోగులపై పెత్తనం చెలాయించడంతో మనస్తాపానికి గురైన రుద్రవరం మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది శుక్రవారం విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు తాళలేక మండల పరిషత్ అభివృద్ధిఅధికారిణి విజయలక్ష్మి, ఈఓపీఆర్డీ దస్తగిరి, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ అనీఫ్తో పాటు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బది ముక్కుమ్మడిగా సెలవు పెట్టి స్థానిక కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మండలంలో విధులు నిర్వహిస్తుండగా అధికార పార్టీ నాయకుడు భాస్కర్రెడ్డితోపాటు అయన అనుచరులు తమపై వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ విధులకు అడ్డం తగులుతూ మాటవినకపోతే బదిలీ చేయిస్తామని బెదిరిస్తున్నట్లు సిబ్బంది పేర్కొన్నారు. టీడీపీ నేతల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఉద్యోగులు పోలీసులను కోరారు.విషయం తెలుసుకున్న ఎస్ఐ హరినాధరెడ్డి, సిబ్బందితో కార్యాలయానికి చేరుకొని ఎంపీడీఓ విజయలక్ష్మితో చర్చించారు. ఉద్యోగుల ఆందోళనపై ఎస్ఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకె ళ్లారు. అధికారుల ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హామీ ఇవ్వడంతో ఉద్యోగులు శాంతించారు. అధికార పార్టీ నేతల వ్యవహారంపై శనివారం కలెక్టర్ విజయ మోహన్కు ఫిర్యాదు చేయనున్నట్లు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు.
వైఎస్ఆర్సీపీ నాయకులు సంఘీభావం..
కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఉద్యోగులకు వైఎస్ఆర్సీపీ మండల నాయకులు సంఘీభావం తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన మరో వర్గం నాయకులు కూడా ఉద్యోగులకు బాసటగా నిలిచారు.
అధికారులపై తెలుగు తమ్ముళ్ల పెత్తనం
Published Sat, Sep 20 2014 12:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement