సీఎంపై విరుచుకుపడ్డ రేవంత్రెడ్డి
ఏపీ మోసం చేస్తే 5 నెలలుగా ఎక్కడ పడుకున్నావు?
నువ్వు తెలంగాణకు పట్టిన శని..
హైదరాబాద్: ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఇవ్వకుండా అన్యాయం చేస్తుంటే ఐదునెలలుగా ఏం చేశావు? నువ్వు ముఖ్యమంత్రి వా? సన్నాసివా.. దద్దమ్మవా? కృష్ణపట్నం నుం చి విద్యుత్ ఇవ్వలేదని కేంద్రానికి ఫిర్యాదు ఎందుకు చేయలేదు? శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి న్యాయబద్ధమైతే కృష్ణా రివర్బోర్డుకు నువ్వెందుకు వెళ్లలేదు? 1996లో 69 జీవో వచ్చినప్పుడు చంద్రబాబు దగ్గర తాబేదారుగా ఉన్న వు. అప్పుడు తెల్వదా అన్యాయమని? అప్పుడెం దుకు నోరు విప్పలేదు? సిగ్గులేదా?..’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుపై టీడీపీ నేత రేవంత్రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ తెలంగాణకు పట్టిన శని అని విమర్శించారు. శనివారం రేవంత్రెడ్డి ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ మంత్రివర్గ సమావేశం తరువాత చెప్పినవన్నీ అబద్ధాలన్నారు. ఆయన అసమర్థతను, నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబును తిడుతూ కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు.
ఎస్ఆర్ఎల్డీసీ, కేంద్ర పంపిణీల ద్వారా జూన్ 18 నుంచి అక్టోబర్ 13 వరకు ఐదు నెలల్లో ఏపీలో కన్నా తెలంగాణలోనే 273 మెగావాట్ల విద్యుత్ అదనంగా వినియోగమైందని పేర్కొన్నారు. ‘‘ల్యాంకో సంస్థ 150 మెగావాట్ల విద్యుత్ ఇస్తానంటే కొననన్నవ్. కమీషన్లు రావనా? ల్యాంకో రాజగోపాల్తో రాజకీయ వైరమా? నీ మూర్ఖత్వంతో రాష్ట్ర ప్రజలకు విద్యుత్ కష్టాలు తెచ్చిపెట్టి ఇప్పుడు కథలు చెబుతున్నావు. బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, టాటా కంపెనీల నుంచి మూడేళ్లలో 14 వేల మెగావాట్ల విద్యుత్ వస్తుందని.. అందులో ఆరు వేల మెగావాట్లు తెలంగాణకు వస్తే 24 గంటలు కరెంటు ఇస్తానని మళ్లీ అబద్ధాలు చెబుతున్నవు. 2017 నాటికి ఆ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి ప్రారంభమైతే... నువ్వు విధించే ఏ శిక్షకైనా సిద్ధం. లేదంటే ముక్కు నేలకు రాస్తావా?..’’ అని రేవంత్ సవాల్ విసిరారు.
అఖిలపక్షం పెడితే నిజాలు తెలుస్తాయి
కృష్ణపట్నంలో విద్యుత్వాటా, శ్రీశైలంలో విద్యుదుత్పత్తిపై అఖిల పక్షంలో చర్చిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని, ఏపీ, తెలంగాణ వాదనల్లో ఎవరి తప్పేంటో తేలుతుందని తెలంగాణ టీడీపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్కు సూచిం చారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు, పార్టీ నాయకులు ఇనుగాల పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ రాథోడ్, సీతక్క విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 27, 28 తేదీల్లో 10 జిల్లాల్లోని అన్ని మండల కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టాలని నిర్ణయించినట్టు టీడీపీ నేత, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తెలిపారు.
కేసీఆర్.. ఇన్నాళ్లుగా ఏం చేశావు?
Published Sun, Oct 26 2014 1:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement