పంచాయతీరాజ్ ఏఈపై టీడీపీ నేతల దాడి | Sakshi
Sakshi News home page

పంచాయతీరాజ్ ఏఈపై టీడీపీ నేతల దాడి

Published Thu, Sep 3 2015 3:31 PM

పంచాయతీరాజ్ ఏఈపై టీడీపీ నేతల దాడి - Sakshi

బద్వేల్‌ అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేతల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించి ఓ పంచాయతీరాజ్ ఏఈపై దాడికి తెగబడ్డారు. అధికార పార్టీకి చెందిన తాము చెప్పినట్లు వినకుండా నియమాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఉద్యోగిని తీవ్రంగా కొట్టారు. బద్వేలు పంచాయతీ రాజ్ ఏఈగా పనిచేస్తున్న ప్రసాద్‌పై స్థానిక ఎంపీపీ ప్రతాప్ రెడ్డి దాడి చేశారు. ఏఈ కార్యాలయంలో కంప్యూటర్‌ను పగులగొట్టారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement