ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబులో 'ఆ ఆనందం' మూడు నాళ్ల ముచ్చటగా మారింది. ఓ వైపు రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటు, మరోవైపు జారుకుంటున్న తెలుగు తమ్ముళ్ల వ్యవహారంతో బాబుగారికి కునుకు కరువైంది. టీఆర్ఎస్ ఆకర్షణ మంత్రంలో పడి తెలంగాణలోని తెలుగు తమ్ముళ్లు ఒక్కొరుగా కారు ఎక్కేస్తున్నారు. దీంతో ఆ రెండు కళ్ల సిద్దాంతకర్తకు ఏటు వైపు చూడాలో అర్థం కాక తెగ సతమతమైపోతున్నాడు. రాజధాని ఏర్పాటుపై ఓ కమిటీ వేసి ఆ సంగతి మంత్రి వర్గానికి అప్ప చెప్పి చేతులు దులుపుకున్నారు. కానీ తెలంగాణలో తెలుగు తమ్ముళ్ల గోడ దూకూళ్లను అడ్డుకోలేకపోతున్నారు. ఇప్పటికే 30 ఏళ్లుగా తనతో పార్టీతో అనుబంధం ఉన్న తుమ్మల చటుక్కున కారు ఎక్కెశారు.
దీంతో సదరు జిల్లాలో సైకిల్ అడ్రస్ గల్లంతయ్యే ప్రమాదంలో పడింది. వరంగల్ జిల్లాకు చెందిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి కూడా రేపోమాపో కారు ఎక్కేస్తారంటూ ప్రచారం జరిగింది. తాను అసలు తెలంగాణ సీఎం కేసీఆర్నే కలవలేదని సదరు తమ్ముడు చెప్పాడు. దీంతో అర్థరాత్రి కేసీఆర్ను కలసిన ఎర్రబెల్లి అంటూ మీడియా రచ్చరచ్చ చేయడంతో సదరు తమ్ముడు మళ్లీ మీడియా ముందుకు వచ్చి కేసీఆర్ను కలిసిన మాట వాస్తవమే కానీ అర్థరాత్రి కాదు సాయంత్రం అంటూ చెప్పిన తప్పును మీడియా సాక్షిగా కరెక్ట్ చేసుకున్నారు.
అలాగే సనత్నగర్ ఎమ్మెల్యే, పొలిట్బ్యూరో సభ్యుడు టి.శ్రీనివాసయాదవ్ పార్టీ సమావేశాలకే హాజరుకావడం లేదు. దీంతో ఆయన మానసికంగా ఎప్పుడో కారు ఎక్కేశారని ఇప్పటికే తమ్ముళ్లు చెవ్వుల్లో చెప్పుకుంటున్నారు. అదికాక గ్రేటర్ ఎన్నికలు ఆగమేఘాలపై దూసుకు వస్తున్నాయి. దీంతో ఇక ఉపేక్షిస్తే తెలంగాణలో కారు దెబ్బకు సైకిల్ నుజ్జునుజ్జుకాక తప్పదని భావించిన చంద్రబాబు రంగంలోకి దిగి తమ్ముళ్లను బుజ్జగించే ప్రయత్నంలో పడ్డారు.
అందులోభాగంగా గులాబీ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో బాబు మంగళవారం భేటీ అయ్యారు. పార్టీలో మాంచీ ప్రాధాన్యమున్న పోస్ట్ అప్పగిస్తామంటూ బాబు తీగలకు భరోసా కూడా ఇచ్చారు. కానీ కారు ఎక్కెందుకు తీగల ఉన్నట్లు సమాచారం. కార్యకర్తులు, అభిమానులతో మాట్లాడి చెబుతానని అన్నట్లు సమాచారం. అంతేకాకుండా తెలంగాణలోని తెలుగు తమ్ముళ్లకు ప్రతిరోజు కౌన్సిలింగ్ ఇస్తూ... మీకు నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. వచ్చే గ్రేటర్ ఎన్నికలే కాదు... 2019 నాటికి తెలంగాణలో టీడీపీ అధికారంలోకి తీసుకురావాలి... తీసుకువద్దాం అంటూ తమ్ముళ్ల మైండ్ మసాజ్ చేస్తున్నారు. కానీ బాబుగారి కలలను తమ్ముళ్లు నిజం చేస్తారో లేదో కాలమే చెప్పాలి. కాదు కాదు పచ్చ తమ్ముళ్లే చెప్పాలి.
తమ్ముళ్లకు 'మైండ్ మసాజ్'
Published Tue, Sep 30 2014 2:22 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement