సాక్షి, గుంటూరు/విజయవాడ : అంతా అనుకున్నట్లే జరిగింది. చిన్న చిన్న నేరాలు చేసిన వారిని అరెస్టు చేసి, హడావుడి సృష్టించి, మీడియా ముందు ప్రవేశపెట్టే పోలీసులు... కారు రేసులు నిర్వహిస్తూ ఓ విద్యార్థి మృతికి కారకుడైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు తనయుడు సిద్ధార్థ, అతడి స్నేహితుడు శివరాం విషయంలో మాత్రం వల్లమాలిన ప్రేమను కురిపించారు. అధికార పార్టీ నేతల మెప్పు పొందేందుకు పడరాని పాట్లు పడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యే తనయుడు సిద్ధార్థను ఎవరికి కనిపించకుండా స్టేషన్ పై గదిలో దాచి ఉంచిన విషయం తెలిసిందే. అనంతరం సకల మర్యాదలతో అతడిని విజయవాడ పంపించేశారు. పైకి మాత్రం సిద్ధార్థ పరారీలో ఉన్నట్లు బొంకారు. నిషిద్ధ కారు రేసులు నిర్వహిస్తూ ఓ యువకుడి మృతికి కారకుడైన వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 304 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేయాల్సి ఉంటుందని సీనియర్ పోలీసు అధికారులు చెబుతుండగా, అధికార పార్టీ ఎమ్మెల్యే తనయుడు కావడంతో బొండా సిద్ధార్థపై మాత్రం 304ఏ, 337 సెక్షన్ల కింద నామమాత్రపు బెయిలబుల్ కేసులు నమోదుచేశారు. 140 కిలో మీటర్ల వేగంతో రేసులు ఆడుతుండగా.. రెండు కార్లు ప్రమాదానికి గురయ్యూయని స్థానికులు చెబుతున్నా.. పోలీసులు మాత్రం కుక్క అడ్డురావడంతో ప్రమాదవశాత్తూ కార్లు ఢీకొన్నాయని కట్టు కథ అల్లి కేసును తప్పుదోవ పట్టించారు.
రహస్యంగా కోర్టుకు
రెండు రోజుల్లో నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామని చెప్పిన పోలీసులు గురువారం ఉదయం 7 గంటల సమయంలో విజయవాడలో రైతు బజారు వద్ద నిందితులను అరెస్టు చేశామని చెబుతూ, వారిని రహస్యంగా కోర్టుకు హాజరుపరిచే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బెయిల్ మంజూరైంది. ఉదయం 7 గంటలకు అరెస్టు అయిన ఎమ్మెల్యే తనయుడు అతడి స్నేహితులు మధ్యాహ్నం 3 గంటల వరకు ఎక్కడ ఉన్నారనే విషయం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
పోలీసుల అత్యుత్సాహం
కోర్టులో హాజరుపరిచే వరకు నిందితులను పోలీసులు వారి ఆధీనంలో ఉంచుకోవాల్సి ఉంది. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయుడు సిద్ధార్థ, అతడి స్నేహితుడు శివరాం మాత్రం అత్తారింటికి వచ్చినట్లుగా.. మందీమార్బలంతో వారి కార్లలో దర్జాగా కోర్టు ప్రాంగణంలో దిగారు. అక్కడే ఉన్న విలేకరులు ఫొటోలు తీసేందుకు యత్నించగా.. ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకుని సిద్ధార్థ చుట్టూ వలయంలా ఏర్పడ్డారు. ఈ సమయంలో పోలీసులెవరూ అక్కడ లేకపోవడం గమనార్హం. కోర్టులో బెయిల్ పొందిన సిద్ధార్థ, శివరాం తమ అనుచరుల చక్రబంధంలో ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని బయటకువచ్చి వారి కార్లలో వెళ్లిపోయూరు. గమనించిన స్థానికులు వీరు నేరం చేసి వచ్చారా.. పండగకు అత్తారింటికి చుట్టపుచూపుగా వచ్చారా.. అంటూ సందేహం వెలిబుచ్చారు. ఎమ్మెల్యే తనయుడి విషయంలో పోలీసులు చూపిన ప్రేమ చట్టం అధికారపార్టీ చుట్టం అన్నట్లుగా మారిందనే విమర్శలు గుప్పుమంటున్నారుు.
అత్తారింటికి వెళ్లొచ్చినట్లు..
Published Fri, Oct 31 2014 11:48 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఏపీలో పోలింగ్ శాతం పెరిగింది: ఏపీ సీఈవో
బాబర్ ఆజం అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
డాక్టర్ కాళ్లు పట్టుకున్నా.. అర్ధరాత్రి రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లా..
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
ఆలస్యం చేయొద్దు.. కదలండి ఓటేయండి.. (ఫొటోలు)
ఓటు వేసిన వైఎస్సార్సీపీ నేతలు (ఫొటోలు)
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హేమంత్ సోరేన్కు కేజ్రీవాల్ తరహా ఊరట: సుప్రీంను కోరిన కపిల్సిబల్
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement