పెడన రూరల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలుపొంది, పార్టీ ఫిరాయించి పెడన మండల పరిషత్ అధ్యక్షురాలిగా టీడీపీ తరఫున ఎన్నికైన జన్ను భూలక్ష్మిపై అనర్హత వేటు పడింది. వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ జారీ చేసి పార్టీ విప్ను ధిక్కరించి ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ఓటు వేసి, పార్టీ ఫిరాయింపు చట్టంను అనుసరించి అనర్హురాలిగా ప్రకటిస్తూ సీపీవో వెంకటేశ్వర్లు బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. భూలక్ష్మికి అనర్హత ఉత్తర్వులను పోస్ట్ ద్వారా పంపినట్లు సీపీవో తెలిపారు.
ఏప్రిల్ 7వ తేదీన జరిగిన ప్రాదేశిక ఎన్నికలలో మండలంలోని నందిగామ ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈమె టీడీపీ అభ్యర్థి జన్ను వరలక్ష్మీపై 431 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పెడన మండలంలో ఉన్న మొత్తం పది స్థానాల్లో వైఎస్సార్ సీపీ తరఫున ఆరుగురు ఎంపీటీసీలు, టీడీపీ తరఫున నలుగురు ఎంపీటీసీ సభ్యులు గెలుపొందారు.
అసలు జరిగింది ఇదీ..
పెడన మండల పరిషత్కు జూలై 4న ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఎంపీపీ అభ్యర్థిగా చేవేండ్ర ఎంపీటీసీ సభ్యుడు రాజులపాటి అచ్యుతరావును పార్టీ నిర్ణయించింది. వైఎస్సార్ సీపీ తరఫున నందిగామ ఎంపీటీసీగా గెలుపొందిన జన్ను భూలక్ష్మి పార్టీ విప్ను ధిక్కరించి టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారు. పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ జారీ చేసిన విప్ను ఆమె ధిక్కరించారు. ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీ సభ్యుల బలాలు సమానమయ్యాయి.
దీంతో ఎన్నికల అధికారి, సీపీవో వెంకటేశ్వర్లు లాటరీ పద్ధతిలో ఎంపీపీ ఎన్నిక నిర్వహించగా టీడీపీ తరఫున ఎంపీపీ అభ్యర్థిగా జన్ను భూలక్ష్మి ఎంపికయ్యారు. ఈ పరిణామంతో జన్ను భూలక్ష్మి తమ పార్టీ విప్ను ధిక్కరించారని, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.రఘునందనరావుకు ఉప్పాల రాంప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై వివరాలు సేకరించిన అనంతరం పెడన ఎంపీపీపై అనర్హత వేటు వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
పెడన ఎంపీపీపై అనర్హత వేటు
Published Thu, Aug 28 2014 1:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement