గుంటూరు మెడికల్ : దంత వైద్యంలో ఆధునిక చికిత్సా విధానాలు ఎన్నో వస్తున్నా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఆ ఛాయలే కనిపించడంలేదు. చికిత్స కోసం వస్తున్న రోగులకు కేవలం ప్రాథమిక వైద్యసేవలే అందుతున్నారుు. తగినంత మంది వైద్యులు, సిబ్బంది ఉన్నప్పటికీ పళ్లు పీకటం మినహా మరే వైద్యసేవలనూ అందించటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీజీహెచ్ దంత వైద్య విభాగంలో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. వీరికి తోడుగా ఇద్దరు డెంటల్ టెక్నీషియన్లు ఉన్నారు. అరుునా రోగులకు సరైన వైద్య సేవలు అందటం లేదు. సాధారణంగా పన్ను నొప్పితో వచ్చేవారికి చాలా రకాలుగా వాటిని నయం చేసే విధానాలు వచ్చేశారుు. ముఖ్యంగా రూట్కెనాల్ ట్రీట్మెంట్, పళ్లమధ్య ఏర్పడిన ఖాళీలను సిమెంట్తో పూరించడం, ప్రమాదాల్లో విరిగిన పళ్లకు క్యాప్వేసి కవర్ చేయడం, కృత్రిమ పళ్లసెట్ అమర్చడం వంటివి చేయొచ్చు. ఆ తరహా చికిత్సలు ఇక్కడ మచ్చుకైనా కానరావు. ఎత్తు పళ్లు, వంకర పళ్లను సరిచేసేందుకు క్లిప్లు పెట్టడం వంటి విధానాలే లేవు.
ఆరోగ్యశ్రీ నిధులు దండిగా ఉన్నా....
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జీజీహెచ్కు కోట్లాది రూపాయలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా అధిక ఆదాయం సంపాదించే ఆస్పత్రుల్లో జీజీహెచ్ మొదటి మూడు స్థానాల్లో ఉంటోంది. ఇంతటి ఆదాయం వస్తున్నప్పటికీ దంత వైద్యవిభాగాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన అధికారులకు లేకపోవటం విస్మయం కలిగిస్తోంది. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఆధునిక వైద్యసేవలను అందిస్తుండగా జీజీహెచ్లో మాత్రం నామమాత్ర సేవలు అందిస్తున్నారు.
సిబ్బంది, సౌకర్యాలు చాలటం లేదు: దంతవైద్యవిభాగంలో అరకొర వైద్యసేవలపై విభాగాధిపతి డాక్టర్ పార్వతి వద్ద ప్రస్తావించగా వైద్య సిబ్బంది సరిపోవటం లేదని చెప్పారు. దంతాల చికిత్సకు అవసరమైన మెటీరియల్ సకాలంలో పంపిణీ చేయటం లేదని తెలిపారు. వైద్యం చేసే సమయంలో సరిపడా నీటి సరఫరా జరగటం లేదని పేర్కొన్నారు. మెడికో లీగల్ కేసులకు ఆపరేషన్లు, పంటి నొప్పిని తగ్గించే చికిత్సలు చేస్తున్నామని వివరించారు.
పన్ను పీకేస్తారు
Published Fri, Oct 31 2014 10:50 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ప్రశాంత పోలింగ్కు పటిష్ట చర్యలు
టీడీపీ చీప్ ట్రిక్స్
డబ్బు పంపిణీపై దృష్టి పెట్టిన అభ్యర్థులు
అద్భుతంగా చందనోత్సవం: స్వరూపానందేంద్ర సరస్వతి
ఎలక్షన్ స్పెషల్స్!
స్టీల్ప్లాంట్పై ప్రకటన చేస్తే పోటీకి దూరం
కేజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ సరెండర్
పతంగుల పోటీలో ఘోరం.. గొంతు తెగి ఆరుగురు విలవిల.. 35 మందికి గాయాలు!
ఐటీతో రాజకీయ కుట్ర
నేటితో ప్రచారానికి తెర
తప్పక చదవండి
- సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement