కర్నూలు(హాస్పిటల్): తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ జూనియర్ వైద్యులు రెండో రోజు విధులను బహిష్కరించారు. జీవో 107ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని క్లినికల్ లెక్చర్ గ్యాలరీ నుంచి క్యాజువాలిటీ వరనకు జూనియర్ వైద్యులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంతో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడే ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జూడా నేతలు ప్రశాంత్, పవన్, భానుప్రదీప్ తదితరులు మాట్లాడారు. జూనియర్ వైద్యులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. తమ సమస్యలను 2012, 2013 నుంచి వరుసగా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్గా వ్యవహరిస్తుండటంతో న్యాయం జరుగుతుందని ఆశించామన్నారు.
అయితే 107 జీవోను అమలు చేసి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పేద రోగులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జూనియర్ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది వేలాది వైద్య విద్యార్థులు పట్టా పుచ్చుకుని బయటికి వస్తున్నా.. ప్రభుత్వం వైద్యుల పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. తమ భవిష్యత్తు కోసమే సమ్మె చేస్తున్నామని, ప్రభుత్వం తక్షనం స్పందించి శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని కోరారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తామని చెబుతున్నా ఎందుకు పెడచెవిన పెడుతుందో అర్థం కావడం లేదు. అంధకారంగా మారుతున్న మా భవిష్యత్తు కోసం రోడ్డెక్కాం. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. తాత్కాలికంగా వైద్యులతో సేవలు చేయించుకోకుండా, శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి.
-డాక్టర్ ఉమాతేజస్వి
ఆనాడు చంద్రబాబు వ్యతిరేకించారు
రాష్ట్రంలో జూనియర్ వైద్యులపై నిర్బంధ వైద్యసేవ కొనసాగుతోంది. ఇదే విషయాన్ని అప్పటి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు. జూడాలకు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో నిర్బంధ వైద్య సేవ చేయాలని జీవో 107ను జారీ చేయడం తగదు. ప్రభుత్వం ద్వంద్వ విధానాలను అవలంబిస్తోంది. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తాం.
- డాక్టర్ నిరంజన్
జీవో 107ను రద్దు చేయాలి
Published Mon, Nov 24 2014 3:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement