ప్రొద్దుటూరు చైర్మన్ ఎన్నికలో హైడ్రామా
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పదవి వైఎస్సార్సీపీకి దక్కకుండా ఉండేందుకు శనివారం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తోపాటు ఆయన వర్గీయులు బీభత్సం సృష్టించి ఎన్నిక వాయిదా పడేలా చేశారు. మినిట్స్ బుక్ను టీడీపీ కౌన్సిలర్లు చించి వేయడం,ఫర్నీచర్ ధ్వంసం చేయడంతోపాటు ప్రిసైడింగ్ అధికారి (ఆర్డీఓ) వినాయకం చేతిలోని మైక్ను విసిరేశారు. ఎన్నికల హాల్పై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. గేట్లు తోసేసి నేరుగా లోనికి వెళ్లారు. దీంతో ఎన్నిక ఆదివారానికి వాయిదా వేశారు. కాగా ప్రొద్దుటూరు కౌన్సిల్కు సంబంధించి మొత్తం 40మంది సభ్యులు ఉన్నారు.
గత ఎన్నికల్లో టీడీపీ తరఫున 22మంది, వైఎస్సార్సీపీ తరఫున 18 మంది గెలిచారు. ఏడాది క్రితం వైఎస్సార్సీపీకి చెందిన మున్సిపల్ మాజీ ఇన్చార్జి చైర్మన్ ముక్తియార్తోపాటు 9 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. వరదరాజులరెడ్డి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చైర్మన్గా ఉన్న గురివిరెడ్డితో ఇటీవల పదవికి రాజీనామా చేయించారు. ముక్తియార్ టీడీపీలో చేరినప్పటి నుంచి వరదరాజులరెడ్డి వ్యతిరేక వర్గంలో కొనసాగుతున్నాడు.
ఈ నేపథ్యంలో స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్న ముక్తియార్ మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీపడ్డారు. ఎన్నిక సమయంలో ముక్తియార్ మొత్తం 15మంది కౌన్సిలర్లతో హాజరు కాగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి 9మందితో హాజరయ్యారు. మొత్తం 25మంది సభ్యులు ఎన్నికకు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం 21 మంది సభ్యులు హాజరైతే ఎన్నిక జరపాలి.దీంతె చేయిదాటిపోతోందని తెలుసుకున్న వరదరాజులరెడ్డి వర్గీయులు బీభత్సం సృష్టించారు.దీనిపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు పంపారు.
ఓటమి భయంతో తమ్ముళ్ల బీభత్సం
Published Sun, Apr 16 2017 1:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement