చింతలగూడెం (నెల్లిపాక): మట్టిని నమ్ముకోవడమే ఆయన పాపమైంది. ఫలితంగా తన ఊపిరిని తానే గాలిలో కలుపుకొన్నారు. ఏ పంట వేసినా, ఎంత చెమటోడ్చినా సాగు నాగుబాముతో చెలగాటమైంది. పేరుకున్న అప్పులు పాముకాట్లలా బాధిస్తుంటే.. విషమే ఆ బాధకు విరుగుడైంది. నెల్లిపాక మండలం కన్నాయిగూడెం పంచాయతీ పరిధిలోని చింతలగూడెం గ్రామానికి చెందిన లంకపల్లి నర్శింహారావు(40) అనే రైతు గురువారం రాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు సంబంధించి మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నర్శింహారావు తనకున్న ఎకరం సొంత పొలంతో పాటు మరో 3.5 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి, కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. అయితే గత మూడేళ్ల నుంచి ఏ పంట వేసినా గోదావరి వరదలు, తుపానుల తాకిడికి పాడవడం రివాజైంది. అయినా ఆయనకు ప్రభుత్వపరంగా ఒక్క రూపారుు కూడా పంట నష్ట పరిహారంగా అందలేదు.
అరుునా నర్శింహారావు వ్యవసాయూన్ని విడిచిపెట్టక ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేసి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. గత ఏడాది నాలుగు ఎకరాల్లో పత్తి పంటను సాగుచేయగా గోదావరికి వచ్చిన వరదలకు చేను నీటమునిగి కుళ్లిపోయింది. దీంతో పొలంలో పత్తి మొక్కలను తొలగించి మరలా టమాటా, వంగ, దోస పంటలను సాగు చేశారు. అరుుతే ప్రకృతి పగబట్టినట్టు ఏ పంటా ఆశాజనకంగా, ఏపుగా ఎదగలేదు. దీంతో నర్శింహారావు దిగులు పడ్డాడు.
చావే శరణ్యమనుకుని..
ఇదే సమయంలో చేలలో గ్రామానికి చెందిన కొందరి పశువులు పడి పంటలను పాడు చేశాయి. ఈ విషయంపై గ్రామంలో పెద్దలు పంచాయితీ నిర్వహించినప్పటికీ నర్శింహారావుకు ఎటువంటి ఆర్థిక సహాయం పశువుల యజమాని ఇవ్వలేదు. ఈ పరిణామం నర్శింహారావును మరింత బాధించింది. బ్యాంకులో తీసుకున్న సుమారు రూ.50వేల రుణంతో పాటు ప్రైవేటుగా తెచ్చిన మరో రూ.1.5 లక్షల అప్పు ఎలా తీర్చాలో దిక్కుతోచక మనో వేదనకు గురయ్యారు. ఇంకోవైపు పెళ్లీడుకు వచ్చిన కుమార్తె సరితకు పెళ్లి చేయూల్సిన బాధ్యతను తలుచుకుని మరింత కుంగిపోయూరు.
వీటన్నింటి నుంచీ విముక్తికి చావే శరణ్యం అనుకున్నారు. రోజూ లాగే కూరగాయల తోట వద్ద కాపు కాసేందుకు గురువారం రాత్రి ఇంటి నుంచి వెళ్లారు. చేలో ఉన్న పురుగుల మందును తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తెల్లవారిన తరువాత చేలో విగత జీవిగా పడి ఉన్న నర్శింహారావును చూసిన తోటి రైతులు కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుడికి భార్య యాకమ్మ, కుమార్తె సరిత, పదవ తరగతి చదువుతున్న కుమారుడు సాయికుమార్ ఉన్నారు. ఆయన ఆత్మహత్యతో వారంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కూనవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నర్శింహారావు పంట నష్టపోయినప్పుడు ఎలాంటి పరిహారం ఇవ్వని ప్రభుత్వం.. ఇప్పుడు ఆయననే పోగొట్టుకున్న కుటుంబాన్నైనా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సాగే నాగై కాటేసింది..
Published Sat, Mar 28 2015 3:03 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement