ఆర్టీసీ బస్సు-ఆటో ఢీ.. 8మందికి గాయాలు | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు-ఆటో ఢీ.. 8మందికి గాయాలు

Published Mon, Feb 8 2016 12:05 PM

ఆర్టీసీ బస్సు-ఆటో ఢీ.. 8మందికి గాయాలు - Sakshi

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహానాలు ఢీకొన్న ఘటనలో 8 మందికి తీవ్రగాయాల య్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అనంతపురం జిల్లా నల్లచెరువు దగ్గర సోమవారం ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ప్రయాణికులను ఆటోను ఢీకొట్టింది.

దీంతో ఆటోలో ఉన్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
Advertisement