రుణమాఫీ చేయకుండా రైతుయాత్రలా! | Sakshi
Sakshi News home page

రుణమాఫీ చేయకుండా రైతుయాత్రలా!

Published Sat, Sep 5 2015 7:16 PM

రైతులకు రుణమాఫీ చేయకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు యాత్రలు ఎలా చేస్తారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా డ్వాక్రా యాత్రలు కూడా చేస్తారేమోనని ఎద్దేవా చేశారు. మ్యానిఫెస్టో అంతా కూడా అమలు చేసేశామని యాత్రలు చేసేట్టున్నారన్నారు. ఓటుకు కోట్ల కేసుకు భయపడి గతంలో కేబినెట్ సమావేశాన్ని విజయవాడలో పెట్టారని, ఇప్పుడు మళ్లీ విజయవాడలో పెడితే రైతులు అడ్డుకుంటారని హైదరాబాద్లో పెట్టారని విమర్శించారు.

Advertisement
Advertisement