శత్రు ఆస్తుల విక్రయంతో రూ.3,400 కోట్లు | Sakshi
Sakshi News home page

శత్రు ఆస్తుల విక్రయంతో రూ.3,400 కోట్లు

Published Wed, Feb 22 2023 7:28 AM

New Delhi: Central Govt Earns Over Rs 3400 Crore From Disposal Of Enemy Properties - Sakshi

న్యూఢిల్లీ: శత్రువుల ఆస్తుల (ఎనిమీ ప్రాపర్టీస్‌) అమ్మకంతో కేంద్రం రూ.3,407 కోట్లు ఆర్జించింది. ఇందులో అధిక భాగం షేర్లు, బంగారం వంటి చరాస్తులేనని అధికారులు తెలిపారు. దేశ విభజన సమయంలో, 1962, 1965 నాటి యుద్ధాల తర్వాత భారత్‌ నుంచి పాకిస్తాన్, చైనాకు వెళ్లి, అక్కడి పౌరసత్వం పొందినవారి ఆస్తులను శత్రువుల ఆస్తులంటారు. పాక్‌ జాతీయులకు చెందిన 12,485, చైనా పౌరులకు చెందిన 126 ఆస్తులను తాజాగా విక్రయించారు.

Advertisement
Advertisement