-
సినిమాలో విలన్స్ కంటే బయటే ఎక్కువ: విశాల్ హాట్ కామెంట్స్
సినిమాల్లో కంటే బయటే ఎక్కువ విలన్లు ఉన్నారని కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పేర్కొన్నారు. ఆయన ఇటీవల హీరోగా నటించిన మార్క్ ఆంటోని చిత్రం ఘన విజయాన్ని సాధించింది. తాజాగా హరి దర్శకత్వంలో రత్నం చిత్రంలో నటించారు. నటి ప్రియా భవానీశంకర్ నాయకిగా నటించిన ఈ చిత్రం ఈనెల 26న తెరపైకి రానుంది. తాజాగా తమిళ నూతన సంవత్సరం సందర్భంగా తమిళ సినీ పాత్రికేయుల సంఘం ఆదివారం ఉదయం స్థానిక వడపళనిలోని సంగీత కళాకారుల సంఘం ఆవరణలో నిర్వహించిన వేడుకలో విశాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాత్రికేయులతో ముచ్చటించారు. తాను తాజాగా నటించిన రత్నం చిత్రం కుటుంబసమేతంగా చూసి ఆనందించే కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. దర్శకుడు హరి ఈ చిత్ర కథ చెప్పినప్పుడే అందులోని ముఖ్య పాయింట్ అద్భుతం అనిపించిందన్నారు. ఈ చిత్రం విడుదల తరువాత తాను స్వీయ దర్శకత్వంలో నటించే తుప్పరివాలన్- 2 చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు. మే 5తేదీన షూటింగ్ లండన్లో మొదలవుతుందని చెప్పారు. దీంతో విశాల్ కూడా దర్శకుడు అవుతున్నాడు.. కొత్తగా ఈయనే చేస్తారులే అని అనుకునేవారు ఇక్కడ ఉంటారన్నారు. అలాంటి వారి కోసమే తాను తుప్పరివాలన్–2 చేస్తున్నట్లు చెప్పారు. కాగా దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తిచేస్తామని చెప్పారు. మెరీనా తీరంలో ఎంజీఆర్ సమాధిని చూడడానికి ఎలాగైతే ప్రజలు వస్తారో.. అలా నటీనటుల సంఘం నూతన భవనాన్ని చూడడానికి వచ్చేలా దీన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించే విధంగానూ, కల్యాణమంటపం, రంగస్థల నటుల కోసం వేదికను వంటి పలు వసతులతో ఈ భవనం ఉంటుందని విశాల్ పేర్కొన్నారు. -
తెలంగాణ శత్రుదేశమా? కేంద్రం వైఖరిపై మంత్రి కేటీఆర్ ధ్వజం
ఏజీవర్సిటీ (హైదరాబాద్): కేంద్ర ప్రభుత్వం తెలంగాణను శత్రుదేశంగా చూస్తోందని, రాజకీయంగా పడనందునే మనల్ని అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం ఎంత ఇబ్బంది పెట్టినా దేశంలో అభివృద్ధిలో మనమే టాప్లో నిలిచామని చెప్పారు. కరోనాతో రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల నష్టం వచి్చందని, అయినా ఎక్కడ కూడా అభివృద్ధి ఆగలేదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. కేటీఆర్ శుక్రవారం రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, కార్మిక మంత్రి మల్లారెడ్డిలతో కలిసి జాతీయ పంచాయతీ అవార్డులను ప్రదానం చేశారు. దేశంలో 70 శాతం ప్రజలు పల్లెల్లోనే జీవిస్తున్నారని తెలంగాణలో పల్లె ప్రగతి కోసం రూ.14,232 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా గ్రామ పంచాయతీలకు రూ.1,300 కోట్లు ఈ రోజే విడుదల చేస్తున్నామన్నారు. ఇంకా రూ.250 కోట్లు ఇవ్వాల్సి ఉందని గ్రామీణాభివృద్ధి అధికారులు చెబుతున్నారని, త్వరలోనే వాటినీ విడుదల చేస్తామని స్పష్టంచేశారు. మొత్తం 12,769 పంచాయతీలకు కొత్త కంప్యూటర్లు ఇస్తామని చెప్పారు. జిల్లాస్థాయిలో అవార్డులు సాధించిన పంచాయతీలకు రూ.10 లక్షలు, రాష్ట్రస్థాయిలోని వాటికి 20 లక్షలు, జాతీయస్థాయిలోని వాటికి రూ. 30 లక్షలు నజరానా ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లికి సూచించారు. అభివృద్ధి ఆగొద్దు... పంచాయతీ సర్పంచ్లు, కార్యదర్శులు కష్టపడినందునే మనకు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయని, ఈ అభివృద్ధి ఆగకుండా నిరంతరం కొనసాగాలని కేటీఆర్ చెప్పారు. ప్రతీ గ్రామ పంచాయితీ ఉత్తమ పంచాయతీగా అవార్డు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణలో సమతుల్యమైన అభివృద్ధి జరుగుతోందని పల్లెలు, పట్టణాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమైందన్నారు. ఇప్పటివరకు మనకు 79 జాతీయ అవార్డులు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన నాడు మన తలసరి ఆదాయం రూ.1,24,000 ఉండగా, 2023 మార్చి నాటికి రూ.3,17,000గా ఉందని చెప్పారు. ఇది తాను చెబుతున్న మాట కాదని సర్వేల్లో వెల్లడైందని తెలిపారు. సీఎస్డీఎస్ అనే సంస్థ దేశంలోని 13 రాష్ట్రాల్లో సర్వే చేస్తే.. తలసరి ఆదాయంలో తెలంగాణ ఫస్ట్ ఉందని, అవినీతిలో చివరిగా ఉందని తేలిందన్నారు. అనంతరం గ్రామ పంచాయితీల అభివృద్ధిపై రూపొందించిన బుక్లెట్ను కేటీఆర్ విడుదల చేశారు. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో అవార్డులకు ఎంపికైన పంచాయితీలకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, అధికారులు పాల్గొన్నారు. చదవండి: బీఆర్ఎస్ ఆఫీసులో రూ. 75 కోట్లు ఇచ్చా: సుఖేశ్ చంద్రశేఖర్ -
శత్రు ఆస్తుల విక్రయంతో రూ.3,400 కోట్లు
న్యూఢిల్లీ: శత్రువుల ఆస్తుల (ఎనిమీ ప్రాపర్టీస్) అమ్మకంతో కేంద్రం రూ.3,407 కోట్లు ఆర్జించింది. ఇందులో అధిక భాగం షేర్లు, బంగారం వంటి చరాస్తులేనని అధికారులు తెలిపారు. దేశ విభజన సమయంలో, 1962, 1965 నాటి యుద్ధాల తర్వాత భారత్ నుంచి పాకిస్తాన్, చైనాకు వెళ్లి, అక్కడి పౌరసత్వం పొందినవారి ఆస్తులను శత్రువుల ఆస్తులంటారు. పాక్ జాతీయులకు చెందిన 12,485, చైనా పౌరులకు చెందిన 126 ఆస్తులను తాజాగా విక్రయించారు. -
ట్రెండింగ్ పాటకు క్రికెటర్స్ అదిరిపోయే స్టెప్పులు
టీమిండియా మహిళా క్రికెటర్లు విశాల్ 'ఎనిమి' సినిమాలోని 'టమ్ టమ్(Tum Tum)' పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్లో ఉన్న టీమిండియా మహిళా బృందం టి20 ప్రపంచకప్కు ముందు సన్నాహకంగా నిర్వహించిన టి20 ట్రై సిరీస్లో ఆడుతుంది. అయితే గురువారం ఫైనల్ మ్యాచ్కు ముందు జెమిమా రోడ్రిగ్స్ సహా దీప్తి శర్మ, స్నేహ్ రాణా, ఇతర క్రికెటర్లు తమ స్టెప్పులతో అలరించారు. ఈ వీడియోనూ ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ వీడిమోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. 'స్లేయింగ్ ది ట్రెండ్' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలవ్వగా.. ముక్కోణపు టోర్నీ విజేతగా ఆతిథ్య దక్షిణాఫ్రికా నిలిచింది. ఫైనల్లో టీమిండియాను సఫారీ బృందం 5 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులే చేయగలిగింది. అనంతరం దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో 5 వికెట్లకు 113 పరుగులు చేసి విజయాన్నందుకుంది. దక్షిణాఫ్రికా కూడా 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడినా...‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్లో ట్రైఆన్ (32 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడు ప్రదర్శించి జట్టును గెలిపించింది. భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచింది. ఈ నెల 10నుంచి దక్షిణాఫ్రికా గడ్డపైనే మహిళల టి20 వరల్డ్ కప్ జరగనుంది. View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) చదవండి: ఆస్ట్రేలియా సాధన షురూ.. -
ఇలా కూడా పగ తీర్చుకోవచ్చా..!
ఏర్పేడు(తిరుపతి జిల్లా): మనకు సరిపడని వ్యక్తిపై ఎలా అయినా పగ తీర్చుకోవచ్చు. అలాంటి సంఘటనే మండలంలోని గోవిందవరం పంచాయతీ జింకలమిట్ట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు సుబ్రహ్మణ్యం నాయుడుకు, రాధికా కిరణ్కు మధ్య గత కొంతకాలంగా భూతగాదా నడుస్తోంది. అయితే తన పొలంలో సాగు చేసిన వరినారుపై రెండు రోజుల క్రితం రాధికాకిరణ్ కూలీలతో రాత్రిళ్లు కలుపు మందు పిచికారీ చేయించడంతో నారు ఎండిపోయిందని బాధితుడు ఏర్పేడు సీఐ శ్రీహరికి మంగళవారం ఫిర్యాదు చేశాడు. సుబ్రహ్మణ్యం నాయుడుకు 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రబీ సీజన్లో వరి వేసుకునేందుకు నారు మడిని సిద్ధం చేసుకున్నాడు. అయితే భూతగాదా నడుస్తున్న నేపథ్యంలో అతను వరి నాట్లు వేయడానికి సాగు చేసిన నారుపై కలుపు మందు పిచికారీ చేయడంతో ఎండిపోయింది. అతని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు. చదవండి: ఇద్దరు కుమార్తెలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఆల్ సెట్... గో
ఆనందం ఆవిరై.. ఆందోళన ఆవిష్కృతమై..!
గెలవలేని యుద్ధం చేసిన పాక్
నోటు కథేంటి?
కొంచెం ఇష్టం... కొంచెం కష్టం...
వరల్డ్కప్కు సెలక్ట్ చేయలేదు.. ఆ కసి మొత్తం చూపించేశాడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై విపక్షాల రాద్ధాంతం అర్థరహితం
SRH vs RR: వారెవ్వా భువీ .. ఉత్కంఠ పోరులో ఎస్ఆర్హెచ్ విజయం
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం.. యువ క్రికెటర్ మృతి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (02-05-2024)
తప్పక చదవండి
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
Advertisement