క్రాకర్స్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి.. | Sakshi
Sakshi News home page

క్రాకర్స్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి..

Published Tue, Feb 6 2024 1:32 PM

Explosion Broke Out Fire Cracker Factory Harda Madhya Pradesh - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించారు. 

వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌ ఉన్న హార్దా ప్రాంతంలోని బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో పక్కనే ఇళ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ టెండర్లు మంటలను అదుపులోకి తెస్తున్నాయి.  ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Advertisement
Advertisement