చిలప్చెడ్(నర్సాపూర్): చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారితో పాటు ఆలయంలోని బ్రహ్మి, కాళి, వైష్ణవి అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు సమర్పించుకున్నారని ఆలయ అర్చకులు తెలిపారు. ఆదివారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మవారికి కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించమన్నారు.
నల్లపోచమ్మదేవి ఆలయంలో..
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి నల్లపోచమ్మదేవి ఆలయం భక్తులతో రద్దీ నెలకొంది. ఉదయం ఈఓ మోహన్రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో పురోహితులు శివ్వప్ప, రాజేశ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శివ్వంపేట మండలం దొంతికి చెందిన భిక్షపతి ఆలయ అభివృద్ధికి రూ.10వేలు ఇచ్చారు. ఆలయ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, రాములు, పర్వతాలు, ప్రభాకర్చారి తదితరులు ఉన్నారు.
1/1
చిలప్చెడ్(నర్సాపూర్): అమ్మవార్లను దర్శించుకుంటున్న భక్తులు