Sakshi News home page

ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి

Published Tue, Apr 16 2024 6:50 AM

- - Sakshi

మియాపూర్‌: రోడ్డు పక్కన నడిచి వెళుతున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు కిందపడి మృతి చెందిన సంఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫతేనగర్‌కు చెందిన ఆంజనేయులు(63) జేసీబీ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం అతను సమీపంలో జేసీబీని రిపేర్‌ చేసేందుకు మియాపూర్‌ వచచ్చాడు.

పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు అతను బొల్లారం రోడ్డులో న్యూ కాలనీ వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్నాడు. ప్రమాదవశాత్తు అతను అదే సమయంలో రోడ్డుపై వెళుతున్న మియాపూర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కిందపడ్డాడు. బస్సు వెనుక చక్రాల అతడి తల మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు చరణ్‌ తేజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement