బేర్‌ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Sakshi
Sakshi News home page

బేర్‌ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Published Thu, May 9 2024 3:34 PM

Stock Market rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 345 పాయింట్లు నష్టపోయి 21,957 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 1062 పాయింట్లు దిగజారి 72,404 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ లాభాల్లో ముగిశాయి. ఎల్‌ అండ్‌ టీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, సన్‌ ఫార్మా, పవర్‌గ్రిడ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, విప్రో కంపెనీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

 

Advertisement
 
Advertisement
 
Advertisement