-
వైఎస్సార్ విద్యార్థి విభాగం ఇంఛార్జ్ల నియామకం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీలోని యూనివర్సిటీలకు వైఎస్సార్ విద్యార్థి విభాగం ఇంఛార్జ్లను నియమించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ వైఎస్సార్ విద్యార్థి విభాగం ఇంఛార్జ్గా బీ. మోహన్ నియమితులయ్యారు. నాగార్జున వర్సిటీ ఇంఛార్జ్గా కిరణ్ నియమితులు కాగా, కాకినాడ జేఎన్టీయూ, కేఎల్ వర్సిటీల బాధ్యతలను కే రాజశేఖర్లకు అప్పగించారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి విభాగం ఇంఛార్జ్గా పీ, మురళీ, ఎస్కేయూ, రాయలసీమ, విక్రమసింహపురి వర్సిటీలకు జీ లింగారెడ్డిను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. -
25న జిల్లా కేంద్రాల్లో ఫీజుపోరు: YSRSU
-
నిరుద్యోగ దీక్షా శిబిరం తొలగింపు.. ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ భృతి, ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ విద్యార్థి సంఘం నేతలు నిరుద్యోగ దీక్షలకు దిగారు. పలుచోట్ల పోలీసులు నిరుద్యోగ శిబిరాలను తొలగించి దీక్షలకు ఆటంకం కల్పించారు. మరికొన్ని చోట్ల విద్యార్థి సంఘం నాయకులకు, పోలీసులకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. అనంతపురం: జిల్లాలో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం నేతలు తలపెట్టిన నిరుద్యోగ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరాన్ని తొలగించారు. దీనికి నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థి నేతలు ఆందోళన నిర్వహించి, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వందలాది మంది విద్యార్థులను ఈడ్చిపడేశారు. బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే కోపమెందుకని విద్యార్థులు మండిపడ్డారు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నేతలను మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరశురాం పరామర్శించారు. పోలీసుల చర్యను వారు ఈ సందర్భంగా తప్పుబట్టారు. నిరుద్యోగ భృతి పేరుతో మరోసారి చంద్రబాబు మోసానికి తెరలేపారని, రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేసినట్టే నిరుద్యోగులను కూడా మోసం చేస్తున్నారని వైస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్. సిద్దారెడ్డి ఆరోపించారు. టూటౌన్ పీఎస్లో వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలను మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగేపరశురాం తదితరులు పరామర్శించారు. విజయవాడ : వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నిరుద్యోగ దీక్షకు ధర్నా చౌక్లో పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 48 గంటల నిరుద్యోగ దీక్ష ప్రారంభించిన కృష్ణా జిల్లా వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం నేతలు. పశ్చిమగోదావరి జిల్లా: నిరుద్యోగ భృతి, ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్ది విభాగం అధ్యక్షుడు దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో రెండు రోజుల పాటు నిరసన దీక్షలకు దిగారు. దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ, ఏలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఆళ్ల నాని ప్రారంభించారు. తిరుపతి: ఎస్వీయూలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి నేతృత్వంలో నిరసన దీక్ష. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సలాం బాబు. చిత్తూరు పార్లమెంట్ ఇన్ ఛార్జ్ జంగాలపల్లి శ్రీనివాసులు, పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సలాంబాబు మాట్లాడుతూ..ఓటుకు నోటు కేసు భయంతోనే ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టాడని విమర్శించారు. అందువల్లే రాష్ట్రంలో పరిశ్రమలు రాక నిరుద్యోగ సమస్య ఏర్పడిందని ధ్వజమెత్తారు. పెట్టుబడుల పేరుతో విదేశీ పర్యటనలకు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయలేదు..ఔట్ సోర్సింగ్ పోస్టులను కుడా టీడీపీ నేతలు అమ్ముకున్నారని ఆరోపించారు. వైఎస్సార్ జిల్లా: నిరుద్యోగ సమస్యలపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్లో 48 గంటల దీక్షలు. దీక్షలను ప్రారంభించిన ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా. దీక్షలో పాల్గొన్న విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖాజారహతుల్లా, యోగివేమన యూనివర్సిటీ విద్యార్థులు. కర్నూలు: విద్యా, ఉద్యోగం , నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో 48 గంటల నిరుద్యోగ దీక్ష . కృష్ణ దేవరాయ సర్కిల్లో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న వైఎస్సార్సీపీ సమన్వయకర్త బి.వై. రామయ్య, ఎమ్మెల్యే గౌరు చరిత, కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్ తదితరులు. విశాఖపట్నం: నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలు కాంతారావు, సురేష్, గోవింద్ ఆధ్వర్యం లో 48 గంటల నిరాహార దీక్ష. విద్యార్థి సంఘ నేతల దీక్షలను ప్రారంభించిన నగర అధ్యక్షుడు మళ్ల విజయ్ ప్రసాద్. పాల్గొన్న విద్యార్థి సంఘం నేతలు సుధీర్, తుళ్లి చంద్రశేఖర్ యాదవ్తో పాటు విద్యార్థులు . సంఘీభావం తెలిపిన కన్వీనర్లు తిప్పల నాగిరెడ్డి, డాక్టర్ రమణ మూర్తి, చెట్టి ఫాల్గుణ, జిల్లా మహిళ అధ్యక్షురాలు పీలా వెంకట లక్ష్మీ, కొయ్యా ప్రసాద్ రెడ్డి, కొండ రాజీవ్ గాంధీ, బోని శివరామకృష్ణ తదితరులు. -
నారాయణను మంత్రిపదవి నుంచి బర్తరఫ్ చేయాలి
కడప ఎడ్యుకేషన్: మంత్రి నారాయణవి విద్యాసంస్థలు కావని, ఆవి కారాగారాలని పిల్లల ప్రాణాలను హరించే చెరశాలలని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ మంత్రి నారాయణపై ధ్వజమెత్తారు. కడప నగరంలో మంగళవారం వైఎస్సాఆర్ స్టూడెంట్ జిల్లా అధ్యక్షుడు ఖాజారహ్మతుల్లా ఆధ్వర్యంలో సంధ్య సర్కిల్ నుంచి కోటిరెడ్డి సర్కిల్ వరకు మంత్రి నారాయణ దిష్టిబొమ్మతో శవయాత్రను నిర్వహించి అనంతరం కోటిరెడ్డి సర్కిల్లో దహనం చేశారు. ఈ సందర్భంగా ఖాజా రహ్మతుల్లా మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక క్లాస్రూముకు 60 మంది ఉండాల్సి ఉంటే నారాయణ కళాశాలల్లో మాత్రం వందమందికి పైగా ఉంటున్నారన్నారు. వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నా విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయిందన్నారు. ఎంతమంది విద్యార్థులు చనిపోయినా నారాయణ విద్యాసంస్థల అధిపతి మంత్రి నారాయణపై చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం చంద్రబాబు ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మంత్రపదవి నుంచి నారాయణను బర్తరఫ్ చేయాలన్నారు. తిరుపతిలో మనోజ్కుమార్, సాయిచరణ్నాయక్లు చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కేసుమాత్రం ముందుకు సాగడం లేదన్నారు. అసలు వారివి హత్యలా లేక ఆత్మహత్యలా అనేవి ప్రశ్నలుగా మిగిలిపోయాయన్నారు. ఇదే సమస్య ఓ సాధారణ కళాశాలలో జరిగితే ఇలాగే ప్రభుత్వం వ్యవహరించేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క తిరుపతిలోనే కాదు కడప, నెల్లూరు. గుంటూరు. కర్నూల్తోపాటు రాష్ట్రం మొత్తం మీదే ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. నారాయణ ధనదాహానికి పసిమొగ్గలు నేలరాలుతున్నారని అందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యల కేసులో న్యాయం చేయాలని అడిగిన వైఎస్సార్ విద్యార్థిసంఘం నాయకులపై అక్రమ కేసులు బనాయించారన్నారు. విద్యార్థుల భవిషత్తు కోసం మేము జైలు కెళ్లడానికైనా సిద్ధమన్నారు. కానీ తల్లితండ్రులు కూడా ఒక్కసారి ఆలోచించి పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ స్టూడెంట్ నాయకులు మాసిన్, గంగాధర్, విజయ్, రహీమ్, శ్రీనాద్తోపాటు పలువురు పాల్గొన్నారు. -
ప్రాక్టికల్స్కు పరికరాలేవీ?
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ధర్నా నెల్లూరు (టౌన్): విద్యార్థుల నుంచి ఫీజుల పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తూ శ్రీచైతన్య కళాశాల్లో ప్రాక్టికల్స్కు కనీసం పరికరాలు కూడా లేవని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు శేషు తెలిపారు. గురువారం స్థానిక రామలింగాపురంలోని శ్రీచైతన్య కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల్లో సగం మంది విద్యార్థులకు కూడా సరిపడా పరికరాలు లేవన్నారు. అధికారులు తనిఖీలకు వెళ్లిన సమయంలో ఒక క్యాంపస్లో ఉన్న పరికరాలను మరో క్యాంపస్లోకి తీసుకెళ్లి ప్రాక్టికల్స్ను తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల నుంచి ల్యాబ్ల పేరుతో ప్రత్యేకంగా ఫీజలు వసూళ్లు చేస్తున్నారని తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచి జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ జరుగుతాయని విద్యాశాఖాధికారులు చెప్పినా కళాశాల యాజమాన్యం నేటికీ పరికరాలను అందుబాటులో ఉంచకపోవడం దారుణమన్నారు. కళాశాల్లో ఎలాంటి ప్రయోగాలు నిర్వహించకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో పరికరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
ఆ స్థానానికి ఓటింగ్ తేదీలో మార్పు.. ఆరో దశలో ఎన్నికలు!
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
- ‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
Advertisement