-
ఈత సరదా ప్రాణం తీసింది
వైఎస్సార్: లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో ఈత నేర్చుకోవాలని చిన్నారి సరదా పడగా... ప్రమాదవశాత్తూ ఆమె ప్రాణం తీసింది. స్థానికుల వివరాల మేరకు.. తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన తోట రవీంద్రారెడ్డి, మంజుల దంపతుల కుమార్తె మహిత(12) బుధవారం గ్రామంలోని చెరువులో ఈత నేర్చుకునేందుకు తోటి పిల్లలతో కలిసి వెళ్లింది.నడుముకు ఖాళీ క్యాన్ కట్టుకుని చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. ఆ సమయంలో నడుముకు ఉన్న క్యాన్ ఊడిపోయింది. అక్కడున్న పిల్లలు, పెద్దలు చూస్తుండగానే భయానికి గురైన మహిత నీటిలో మునగగానే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు షాక్ తగిలింది. పెండ్లిమర్రి బెనీటమైన్స్ బాధితులు షర్మిలను నిలదీశారు. తమ వాహనాలకు రూ.6 లక్షల అద్దె చెల్లించలేదని నిలదీశారు. మహేశ్వర్రెడ్డి, గౌరీశంకర్రెడ్డి షర్మిల ప్రచారాన్ని అడ్డుకున్నారు. డబ్బులు చెల్లించాలని బాధితులు నిలదీయగా.. బెనీటమైన్స్కు, తనకు సంబంధం లేదని చెప్పి షర్మిల వెళ్లిపోయారు.మరో వైపు, పీసీసీ చీఫ్ షర్మిల, సునీతలకు కడప కోర్టు మరోమారు షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన అర్డర్ను డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇటీవల హైకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేయగా, కడప కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టు విచారణ చేపట్టింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. సునీత, షర్మిల దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ.10 వేల జరిమానాను ర్టు విధించింది. జరిమానాను జిల్లా లీగల్ సెల్కు కట్టాలని కడప కోర్టు పేర్కొంది. -
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
వైవీయూ: ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన ‘సిద్ధం’ పాటల సీడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ ఆవిష్కరించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీడీని రూపొందించిన సూర్య చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు, ఎన్ఆర్ఐ సూర్యనారాయణ, పాటల రూపకర్త, ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ ఎం.ప్రభాకర్లను భారతమ్మ అభినందించారు.ఈ సందర్భంగా డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘జనహృదయాల్లోకి చొచ్చుకెళ్లే శక్తి పాటకు ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ యజ్ఞాన్ని పాటల రూపంలో గ్రామస్థాయికి తీసుకెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. సోషల్ మీడియా ద్వారా కోట్లాది మంది అభిమానులకు ఈ పాటలను అందుబాటులోకి తెస్తాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ‘సిద్ధం’ పాటల సీడీ రూపకల్పనకు సహకారం అందించిన బి.రామతులసి, డా.వి.ఉష, ఎన్.సుదీప్రెడ్డి పాల్గొన్నారు. -
అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
చక్రాయపేట: ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించిన మీ అందరివాడు సీఎం వైఎస్ జగన్ను ఆశీర్వదించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి భారతమ్మ ప్రజలను కోరారు. ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమె శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి, మండల ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డితో కలసి సురభి గ్రామం బీటీపల్లెలో ఇంటింటి ప్రచారం, రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా భారతమ్మ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘వైఎస్ జగన్ ప్రభుత్వం ఎలాంటి బేధాలు లేకుండా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టనన్ని పథకాలను అమలు చేసి.. అందరినీ ఆ రి్థకంగా బలోపేతం చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. అమ్మ ఒడి, చేయూత, పింఛన్లు, ఆసరా, సున్నా వడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన.. ఇలా దేశంలో ఎక్కడా లేని పథకాలను మన రాష్ట్రంలో అందించి ఆదర్శంగా నిలిచారు.పేదల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఇంతటి గొప్ప పాలన మళ్లీ కావాలన్నా.. సంక్షేమాభివృద్ధి కొనసాగాలన్నా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వైఎస్ జగన్ను, అవి నాష్ రెడ్డిని గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించండి’ అని ప్రజలకు భారతమ్మ విజ్ఞప్తి చేశారు. గడప గడపకూ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ.. ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతమ్మ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీటీపల్లెలో గడప గడపకూ వెళ్లారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను వివరిస్తూ మళ్లీ ప్యాన్ గుర్తుకు ఓట్లేయాలని కోరారు. లక్షుమమ్మ అనే వృద్ధురాలు తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పడంతో భారతమ్మ ధైర్యం చెప్పారు. పులివెందులలోని ఆస్పత్రిలో చూపించుకోవాలని సూచిస్తూ.. అక్కడి వైద్యుడికి లేఖ రాసి ఇచ్చారు.అలాగే శారదమ్మ అనే మహిళ తన సమస్య చెప్పుకోగా.. న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రీ, కొడుకులు ఓబుళశెట్టి శ్రీరాములు, అయ్యప్ప ప్రసాద్ను భారతమ్మ ఆప్యాయంగా పలకరించారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. చెన్నకేశవులు అనే వృద్ధుడిని ‘ఆరోగ్యంగా ఉన్నావా తాతా’ అంటూ పలకరించారు. మందులు సకాలంలో వేసుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు.అలాగే చిన్నారులను, విద్యార్థులను పలకరించిన భారతమ్మ.. బాగా చదువుకోవాలని చెప్పారు. మీ కోసం అమ్మ ఒడి, గోరుముద్ద, వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యాదీవెన వంటి పథకాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని వివరించారు. కాగా, భారతమ్మతో సెల్ఫీలు దిగేందుకు యువతీయువకులు పోటీ పడగా.. మహిళలు హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో చక్రాయపేట, తొండూరు మండల ఇన్చార్జ్లు వైఎస్ కొండారెడ్డి, వైఎస్ మధురెడ్డిల సతీమణులు ధనలక్ష్మి, మాధవీలత, కొండారెడ్డి, సతీ‹Ùరెడ్డిల తనయులు రాహుల్రెడ్డి, రోహన్ నాగిరెడ్డి, ఎంపీపీ మాధవీ బాలకృష్ణ, జెడ్పీటీసీ శివప్రసాదరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు రామాంజనేయరెడ్డి, ప్రసాదరావు, సభాపతి నాయుడు, వెంకట సుబ్బయ్య, వేదమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
బెడిసికొట్టిన జడ్జి రామకృష్ణ దాడి నాటకం
సాక్షి ప్రతినిధి, కడప: అన్నమయ్యజిల్లా బి.కొత్తకోటకు చెందిన సస్పెన్షన్లో ఉన్న జూనియర్ సివిల్ జడ్జి ఎస్. రామకృష్ణ ఇంటిపై దాడి ఘటన ఓ నాటకంగా తేలిపోయింది. దాడిచేసి ఇంటి కిటికీ అద్దాలను పగులగొట్టింది స్వయానా జడ్జి తమ్ముడు రామచంద్ర అని విచారణలో నిర్ధారించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంతో నాటకానికి తెరపడింది. సోదరుల మధ్య కుటుంబ ఆస్తి పంపకాల విషయంలో తలెత్తిన విభేదాలను కూడా మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి ఆపాదించే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మదనపల్లెలో గురువారం మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై జడ్జి రామకృష్ణ చేసిన ఆరోపణలు నిరాధారమని అర్థమైంది.గతంలోనూ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధం లేని వివాదంలోకి లాగడం కూడా ఇలాంటిదేనని స్పష్టమైంది. రామకృష్ణ చేసిన ఫిర్యాదులో నిందితుడు అతని తమ్ముడేనని తేల్చి ఈ మేరకు అరెస్ట్ చేసి 41 నోటీసు జారీ చేశామని బి.కొత్తకోట సీఐ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. గతనెల 30న రాత్రి బి.కొత్తకోట కరెంట్ కాలనీలో ఉంటున్న రామకృష్ణ ఇంటివద్దకు వచ్చిన తమ్ముడు రామచంద్ర ఆస్తి పంపకాల గురించి ప్రశ్నించేందుకు ప్రయత్నించాడు, ఇంటిలో నుంచి రామకృష్ణ వెలుపలికి రాకపోవడంతో అక్కడే ఉన్న కట్టెను తీసుకుని గేటుకు కొట్టడంతో రామకృష్ణ బయటకు రాగా ఇద్దరి మధ్య ఆస్తి పంపకాలకు సంబంధించి వివాదం జరిగింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న గొడవతో రామచంద్ర కిటికీ అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై గుర్తు తెలియని వ్యక్తులు తనను హతమార్చేందుకు దాడిచేశారని ఈనెల ఒకటిన రామకృష్ణ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, పరిసరాల్లో జరిపిన విచారణలో రామచంద్రే ఇంటి కిటికీ అద్దాలను ధ్వంసం చేసినట్టు తేలింది. ఈ కేసులో నిందితుడైన రామచంద్రను అరెస్టు చేశామని సీఐ తెలిపారు. రామచంద్రపై బి.కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఏడు కేసులు నమోదైనట్టు ఆయన పేర్కొన్నారు. -
వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు
-
సకుటుంబ సపరివార సమేతంగా
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కుటుంబానికి కంచుకోట అయిన వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఘనవిజయానికి ఆయన కుటుంబమంతా కదిలింది. పులివెందుల అసెంబ్లీ స్థానంలో సీఎం వైఎస్ జగన్కు, కడప ఎంపీ స్థానంలో వైఎస్ అవినాశ్రెడ్డి, పార్టీ ఇతర అభ్యర్థులకు గత ఎన్నికల్లోకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించే బాధ్యతలను కుటుంబ సభ్యులు భుజాన వేసుకున్నారు. అందరూ కలిసి ప్రణాళిక ప్రకారం జిల్లా ప్రజల ముందుకు వెళ్తున్నారు. వైఎస్సార్ సోదరులు, సమీప బంధువులు నియోజకవర్గాలు, మండలాల వారీగా ప్రచార బాధ్యతలు తీసుకున్నారు.సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ సహా మరికొందరు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన సంక్షేమం, సాధించిన అభివృద్ధి, సుపరిపాలనను వివరిస్తూ గత ఎన్నికలకంటే మరింత ఎక్కువ మెజార్టీతో ఘనవిజయాన్ని అందించాలని ప్రజలను కోరుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, సామాన్యుల ఉన్నతే లక్ష్యంగా, విశేష పారిశ్రామిక ప్రగతి సాధించిన సీఎం వైఎస్ జగన్ను, వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావించారని, మరోమారు ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని, కడప ఎంపీగా వైఎస్ అవినాశ్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. కుటుంబ సభ్యులకు బాధ్యతలిలా.. వైఎస్సార్ సోదరులు వైఎస్ రవీంద్రనాథరెడ్డి, వైఎస్ సు«దీకర్రెడ్డి, వైఎస్ మధుకర్రెడ్డి కడప నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల మున్సిపాలిటీకి వైఎస్ మనోహర్రెడ్డి, లింగాలకు వైఎస్ అభిõÙక్రెడ్డి, తొండూరుకు వైఎస్ మదన్మోహన్రెడ్డి ఇన్చార్జిలుగా ఉన్నారు. పులివెందుల రూరల్, కొండాపురం మండలాలకు చవ్వా దుష్యంత్రెడ్డి, జమ్మలమడుగుకు చవ్వా జగదీష్రెడ్డి ప్రచార బాధ్యతలు చేపట్టారు. వేముల మండల ఇన్చార్జిగా డాక్టర్ ఈసీ దినేష్రెడ్డి, సింహాద్రిపురానికి గండ్లూరు వీరశివారెడ్డి, చక్రాయపేటకు వైఎస్ కొండారెడ్డి, వేంపల్లెకు వైఎస్సార్ మేనల్లుడు యువరాజ్రెడ్డి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ విజయం కోసం సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ, ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి సతీమణి వైఎస్ సమతారెడ్డి, సోదరి వైఎస్ శ్వేతారెడ్డి, చవ్వా సునీతారెడ్డి, వైఎస్ తేజారెడ్డి, దివ్య (వైఎస్సార్ మేనకోడలు) విస్తృతంగా పర్యటిస్తున్నారు. వీరంతా ఇప్పటికే పులివెందుల, కడప, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో పర్యటించారు. జగన్ చెబితే చేస్తారు.. చంద్రబాబు చెప్పినా చేయరు: వైఎస్ భారతమ్మ పులివెందుల/తొండూరు: సీఎం వైఎస్ జగన్ చెబితే చేస్తారని, చంద్రబాబు చెప్పినా చేయరని సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ చెప్పారు. రాష్ట్ర ప్రజలందరిదీ కూడా ఇదే అభిప్రాయమన్నారు. ఆమె ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం ఇనగలూరులో ప్రజలతో మమేకమయ్యారు. పులివెందులలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ప్రజలతో మాట్లాడారు.తమకు సీఎం జగన్ వల్ల అన్ని పథకాలూ అందుతున్నాయని అక్కడున్న వారంతా చెప్పారు. తమ కుటుంబాలన్నీ ఎంతో సంతోషంగా ఉన్నాయని, తమ ఓట్లు వైఎస్సార్సీపీకే అని బదులిచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు భారతమ్మ స్పందించారు. పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి గత ఎన్నికల్లోకంటే మరింత ఎక్కువ మెజార్టీని ఇస్తారని చెప్పారు. ఇందుకు వారే నిదర్శనమంటూ ప్రజలను చూపించారు. అక్కడున్న ప్రజలంతా జగన్మోహన్రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీని అందిస్తామంటూ నినదించారు. మేనిఫెస్టో గురించి భారతమ్మ మాట్లాడుతూ ఇప్పుడున్న పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఆ పథకాలకు సీఎం జగన్ మరింత మెరుగులు దిద్ది అందిస్తారని చెప్పారు. పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి బలమని, 40 ఏళ్లుగా ప్రజలు ఆదరిస్తున్నారని, వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు. ఆమెతో పాటు వైఎస్ సమత, వైఎస్ మధురెడ్డి కోడలు చైతన్య, డాక్టర్ చందన ఉన్నారు.ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ఎదురు లేని వైఎస్సార్ కుటుంబంఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ కుటుంబానికి ఇప్పటివరకు ఎదురే లేదు. కడప పార్లమెంటు నుంచి 1989లో తొలిసారి వైఎస్సార్ ఎంపీగా ఎన్నికయ్యారు. వరసగా నాలుగు పర్యాయాలు ఆయనదే విజయం. 1989 నుంచి 2019 వరకు 10 సార్లు కడప పార్లమెంటుకు ఎన్నికలు జరగ్గా, అన్ని ఎన్నికల్లో జిల్లా ప్రజానీకం వైఎస్ కుటుంబానికే పట్టం కట్టారు. నాటి నుంచి నేటి వరకు వైఎస్ కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
పులివెందులలో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ప్రతి గ్రామంలో వైఎస్ భారతికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వన్స్మోర్ సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినదించారు.వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వైఎస్ భారతి అన్నారు. ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు ఆమె వివరిస్తున్నారు. -
వివేకా భార్య సౌభాగ్యమ్మకు వైఎస్ భాస్కరరెడ్డి సతీమణి బహిరంగ లేఖ
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్ భాస్కరరెడ్డి సతీమణి వైఎస్ లక్ష్మీ గురువారం ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. దీనిని వివేకా భార్య సౌభాగ్యమ్మకు రాశారు లక్ష్మీ. ‘2009లో తండ్రిని కోల్పోయినప్పుడు జగన్ ఎంతో మనోవేదన అనుభవించాడని ఇప్పుడు గుర్తొస్తోందా? 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ను చిన్నచూపు చూసినపుడు జగన్కు అండగా నిలచి పెద్ద దిక్కుగా ఉండవలసిన మీరందరూ కలిసి ఒంటరివాడిని చేసి మీ స్వార్థం మీరు చూసుకున్నపుడు జగన్ మనోవేదన గుర్తుకురాలేదా’.. అన్నారు వైఎస్ లక్ష్మీ.2011లో నీ భర్తను నువ్వు, నీ కుమార్తె, అల్లుడు విజయమ్మపై పోటీచేయించినప్పుడు వాళ్ల మనోవేదన ఎలా ఉందో మీకు తెలీదా? నీ కుమార్తె, అల్లుడు పూలంగళ్ల వద్ద డిగ్రీ కాలేజీలో కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు వారెంత మనోవేదన అనుభవించారో కూడా తెలీదా? వివేకానందరెడ్డి వైఎస్ జగన్ను సీఎంగా చూడాలని కోరుకున్న మాట ఎంతో వాస్తవమో, 2019 మార్చి 14 రాత్రి కూడా అవినాష్ను ఎంపీగా గెలిపించమని ప్రచారం చేసిన మాట కూడా అంతే వాస్తవం. ఈ విషయం స్వయంగా మీ కూతురు సునీతే మీడియాకు వెల్లడించింది. ఇప్పుడు మళ్లీ మీరే అదే ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం.. సంబంధంలేని వారిని ఈ కేసులో ఇరికించడం మీకు తప్పనిపించడంలేదా?ఎవరిని కాపాడుకునేందుకు మీరిలా చేస్తున్నారు? మీ కుమార్తె న్యాయం కోసం పోరాటం చేస్తుంటే జగన్ సంపూర్ణ మద్దతు తప్పక ఉంటుంది. అలా కాకుండా.. మీ కుమార్తె వైఎస్సార్, జగన్ శత్రువులతో చేతులు కలిపి, వారి చేతిలో పావుగా మారి సంబంధంలేని వ్యక్తులను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి వారి జీవితాలు నాశనం చేయాలని చూస్తే జగన్ మీకెలా మద్దతివ్వగలడు? హత్యకు కారకులైన వారు మీతోనే ఉన్నారు.. మీలోనే ఉన్నారు. దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతాడు దొంగ. ఇక మాటిమాటికి హంతకులని మీరు మాట్లాడుతున్నారు.. పైగా చాలా తీవ్రమైన పదజాలంతో అవినాష్ను తిడుతున్నారు."న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరంతట మీరే హంతకుడని ఎలా మాట్లాడగలరు? అలా మాట్లాడటం మీకు తప్పనిపించడంలేదా? నీ కుమార్తెను, షర్మిలమ్మను ఎవరు టార్గెట్ చేయలేదు. వారి మాటలే ఇతరులు హేళన చేయడానికి కారణం. ఇప్పటికైనా వైఎస్సార్, జగన్ శత్రువుల చేతిలో పావుగా ఉండకుండా వారి కుట్రలు, కుతంత్రాల నుంచి బయటకొచ్చి చేసిన తప్పు తెలుసుకుని నిజమైన న్యాయ పోరాటం చేయండి. అన్యాయంగా మీవల్ల బాధపడుతున్న వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థంచేసుకునే ప్రయత్నం చేయండి. నిజం ఎంత లోతులో దాచినా దాగదు.. తప్పకుండా బయటపడుతుంది" అని లేఖలో పేర్కొన్నారు లక్ష్మీ. -
‘ఎంతమంది కలిసొచ్చినా వైఎస్సార్సీపీ విజయాన్ని ఆపలేరు’
సాక్షి, పులివెందుల: గత ఎన్నికలప్పుడు ఏవైతే హామీలిచ్చారో సంక్షేమ పథకాలు చెప్పారో చెప్పినవి చెప్పినట్టుగా గడిచిన ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా.. కోవిడ్ వల్ల రెండు సంవత్సరాలు కోల్పోయినా చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసి సీఎం జగన్ చూపించారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా పులివెందులోని సీఎస్ఐ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగించారు.‘‘ఐదు సంవత్సరాల జగనన్న పాలనలో ఈ నియోజకవర్గం అన్నిరకాలుగా అభివృద్ధి చెందింది. మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు టౌన్లో జరిగింది మీరంతా చూశారు. సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు ముఖ్యంగా సాగునీటి రంగం గురించి ఒకసారి ఆలోచించండి. 2019 నుంచి 2024 వరకు ఈ ఐదేళ్లలో నాలుగుసార్లు సీబీఆర్ను ఫుల్ కెపాసిటీ 10 టీఎంసీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా పైడిపాలెం 6 టీఎంసీలు నాలుగుసార్లు నింపడం జరిగింది. మరి అలా నింపాం కాబట్టే ఈ ఐదేళ్లపాటు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మనం సాగునీరు అందించాం....మీరు ఒక్కసారి ఆలోచించండి, 16 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో రాయలసీమ ప్రాంతానికి అందులో భాగంగా పులివెందుల కూడా రావడం జరిగింది. ఆయన పులివెందుల వచ్చి వెళ్లాక ఈ 16 నెలల్లో వర్షమే లేదు. చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన తర్వాత వర్షమనేది దూరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మనం ఈ 16 నెలల కరువు కాలంలో కూడా ఎక్కడా ఇబ్బంది పడకుండా మనం లింగాల బ్రాంచ్ కెనాల్ క్రింద చెరువులు కావొచ్చు, పీబీసీ క్రింద చెరువులు కావొచ్చు, జీకేఎల్ఐ క్రింద చెరువులకు కావొచ్చు సమృద్ధిగా అరటి, చీని రైతులకు సమృద్ధిగా మనం నీళ్లు అందించామంటే జగనన్న ముందుచూపుతో సీబీఆర్లో 10 టీఎంసీలు పెట్టడం, పైడిపాలెంలో 6 టీఎంసీలు పెట్టడం వల్లనే సాధ్యమైందనే విషయాన్ని ప్రతి రైతు సోదరుడికి తెలియజేస్తున్నా...ముఖ్యంగా పంటల బీమా గురించి ఒకసారి ఆలోచించండి. 2014 నుంచి 2019 వరకు మన జిల్లా రైతాంగానికి రూ.750 కోట్లు పంటల బీమా వస్తే, జగనన్న ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు రూ.1,100 కోట్లు పంటల బీమా రైతులకు అందింది. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ.. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో కేవలం రూ.40 కోట్లు మాత్రమే అందింది. జగనన్న హయాంలో 2019 నుంచి 2024 వరకు దాదాపు రూ.278 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ జిల్లాలోని రైతుల ఖాతాల్లో జమ అయ్యింది. 2023 ఖరీఫ్ లో వర్షాభావ పరిస్థితుల వలన మనం ఏదైతే నష్టపోయామో దానికి సంబంధించి పంటల బీమా వచ్చే జూన్ మాసంలో రైతుల ఖాతాల్లో తప్పకుండా జమ అవుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా...ఒకవైపు మొగమేరు మీరు చూస్తే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉందో ఒక్కసారి చూడండి. రైతులకు ప్రయోజనకరంగా మొగమేరు కట్టలు పటిష్టం చేయడం జరిగింది, చెక్ డ్యామ్ లు నిర్మించడం జరిగింది. మరోవైపు చక్రాయపేట మండలం చూడండి. గాలేరు నగరి హంద్రీనీవా సుజల స్రవంతి అనుసంధానంలో భాగంగా ఇప్పటికే అక్కడ కాలేటివాగు డ్యామ్ ను 0.1 నుంచి 1.2 టీఎంసీల స్టోరేజీ డ్యామ్ గా దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇవాళ వర్షం నీళ్లు వస్తే మనం అక్కడ పంప్ హౌస్ల నిర్మాణం పూర్తి చేస్తే మరి చక్రాయపేట మండలంలో దాదాపు 40 చెరువులకు నీళ్లిచ్చే అవకాశం ఉందనే విషయాన్ని అందరికీ మనవి చేస్తున్నా. తప్పకుండా సంవత్సరం రోజుల్లో ఆ పంప్ హౌస్ ను కూడా పూర్తి చేసి చక్రాయపేట మండలాన్ని కూడా మిగిలిన 6 మండలాల మాదిరి సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రతి రైతన్నకు తెలియజేస్తున్నా....మరి ఇవాళ మన ప్రతిపక్షాలు మనం ఇంత పెద్దఎత్తున సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నాం కాబట్టే మన తప్పులను చూపలేక, మనల్ని తప్పుబట్టలేక చేసేదేమీలేక, మనల్ని ఎదుర్కొనే బలం లేక గుంపుగా మన మీదకు వస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా మన మీదకు వస్తున్నారు. ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని విష ప్రచారాలు చేస్తున్నారు. లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు విష ప్రచారాలు చేస్తున్నారు ఇవంతా కూడా మీరు గమనించండి. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే అది నిజమవుతుందనేది చంద్రబాబు, ఎల్లోమీడియా సిద్ధాంతం. వాళ్ల ట్రాప్లో ఎవరూ పడొద్దని చెప్పి మనవి చేసుకుంటూ ఎంతమంది కలిసొచ్చినా, ప్యాకేజీ స్టార్ కావొచ్చు, బీజేపీ కావొచ్చు, పరోక్షంగా కాంగ్రెస్ కావొచ్చు, ఎల్లోమీడియా కావొచ్చు మీరు ఎన్ని తప్పుడు హామీలిచ్చినా జగన్ మోహన్ రెడ్డిని టచ్ చేయలేరని తెలియజేస్తున్నా చంద్రబాబు అండ్ కోకు....మీకు చాలామంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు, కానీ జగన్ మోహన్ రెడ్డి ఒక్కడు ఆయనకు అండగా రాష్ట్రంలో లక్షలమంది యువకులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతులు జగన్ మోహన్ రెడ్డి గార్కి స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డి గార్కి అండగా నిలబడేందుకు మేమంతా సిద్ధమంటున్నారు. కాబట్టి ఎంతమంది కలిసొచ్చినా సరే జగన్మోహన్రెడ్డి గారి విజయాన్ని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఏ ఒక్కరూ కూడా ఆపలేరు....2019 లో మీరు ఎలా ఆదరించారో, ఆశీర్వదించారో మరి 2024 ఈ ఎన్నికల్లో కూడా మే 13న జరిగే ఎన్నికల్లో మీ ఆదరణ, ఆశీస్సులు సంపూర్ణంగా ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మనందరి అన్న జగనన్నపైనా, అదేవిధంగా ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నాపైనా మెండుగా ఉంచాలని, 2019కి మించిన ఘన విజయాన్ని అందించాలని మళ్లీ ప్రజాసేవను, ఈ అభివృద్ధి యజ్ఞాన్ని, సంక్షేమ రాజ్యాన్ని ముందుకు కొనసాగించే విధంగా మీ అందరి ఆశీస్సులు ఉండాలని పేరుపేరున ప్రతి అన్న, తమ్ముడ్ని, ప్రతి అక్కచెల్లెమ్మకు మనవి చేస్తున్నా’’ అని అవినాష్రెడ్డి తెలిపారు. -
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
సాక్షి ప్రతినిధి, కడప: ఎంతటి సమావేశమైనా సరే, ఆయన వచ్చేంతవరకూ వేచి ఉండాల్సిందే. కుటుంబ సభ్యులకైనా, అనుచరులకైనా, సన్నిహితులైనా ఎవరికైనా సరే, ఆయన చెప్పిందే వేదం, సూచించిందే ఫైనల్. మరీ ముఖ్యంగా బాబాయ్ మాట కోసం అబ్బాయ్కి ఎదురుచూపులు ఉండేవి. ఇదంతా గతం. ప్రస్తుతం కథ అడ్డం తిరిగింది. అబ్బాయ్ లేనిదే బాబాయ్ బయటికెళ్లలేని దుస్థితి ఎదురవు తోంది. ‘అహం బ్రహ్మస్మీ’ అన్నట్లుగా వ్యవహారం తల్లకిందులయ్యింది. నా అనుకున్న వారంతా ఛీదరించుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. అబ్బాయ్ కోసం బాబాయ్ వెయిట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈమొత్తం వ్యవహారం జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డికి వర్తించనుంది. ‘ఆది మాట తప్పడు, మడమ తిప్పడు’ అనే నినాదంతో ఆదినారాయణరెడ్డి రాజకీయ ఆరంగ్రేటం చేశారు. అనతికాలంలోనే అవకాశవాదికి నిదర్శనం ‘ఆది’ అని ఆయన చర్యలు రుజువు చేశాయి. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చలువ నీడలో ఎదిగిన ఆది తక్కువ కాలంలోనే సహజ సిద్ధమైన ప్రవర్తన బహిర్గతమవుతూ వచ్చింది. అప్పట్లో జిల్లాలోని నాయకులంతా వైఎస్ కుటుంబానికి అండగా పదవులు త్యజించేందుకు సిద్ధం అయ్యారు. అప్పటి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా నిలిచారు. ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులుపై అనర్హత వేటు పడింది. కానీ అప్పట్లో ‘అసెంబ్లీలో కిరణ్...బయట జగన్’ అంటూ ఆదినారాయణరెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. అధికారాన్ని కోల్పోయేందుకు ఇష్టపడని ఆయన వైఎస్ కుటుంబానికి అండగా నిలువలేకపోయారు. కానీ వైఎస్ కుటుంబం అండ లేకపోతే, గెలిచే పరిస్థితి లేదని 2014లో మళ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థిత్వం స్వీకరించి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పారీ్టలో చేరి ..మంత్రి పదవి దక్కించుకున్నారు. అంతటితో ఆగకుండా వైఎస్ కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడారు. తొమ్మిదిన్నర్ర చెప్పుతో కొట్టాలన్నారు. ఫలితంగా తర్వాత జరిగిన ప్రజాతీర్పులో ఆదినారాయణరెడ్డి కొట్టుకుపోయారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కుటుంబంలోనూ ఏకాకిగా... కుటుంబంలో ఎప్పుడూ పైచేయిగా నిలిచే ఆదినారాయణరెడ్డి తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఏకాకిగా మిగిలారు. విభజించు, పాలించు అన్న ధోరణిని వంటబట్టించుకున్న ఆయన దేవగుడి కుటుంబంలో అన్న కుమారుడు భూపేష్రెడ్డి రాజకీయ వారసత్వానికి బ్రేకులు వేశారు. మరో సోదరుల తనయులు గోవర్ధన్రెడ్డి, రాజే‹Ùరెడ్డిలను చేరదీశారు. ఒక్కమాటలో చెప్పాలంటే భూపేష్ రెడ్డికు ప్రత్యామ్నాయంగా తయారు చేశారు. ‘టీడీపీ ఇన్ఛార్జిగా తీసుకోవడం కాదు, టికెట్ తెచ్చుకోవడం గొప్ప. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుంది, బీజేపీ టికెట్ తనకే ఇస్తుందని’ ఏడాదికి ముందు నుంచే ఆదినారాయణరెడ్డి సన్నిహితులతో చెప్పుకుంటూ వచ్చారు. అచ్చం అదే తీరులో పొత్తు పొడవడం, ఆదికి బీజేపీ టికెట్ దక్కడం క్రమంగా తెరపైకి వచ్చాయి. అప్పటి వరకూ రాజకీయంగా బలోపేత చర్యలు చేపట్టిన భూపేష్ నిర్ఘాంతపోయారు. జమ్మలమడుగులో సీన్ రివర్స్ఆదికి బీజేపీ టికెట్ ప్రకటించిన తర్వాత నాలుగు రోజులైనా స్వగ్రామంలో అడుగు పెట్టని పరిస్థితి తలెత్తింది. కుటుంబం యావత్తు భూపేష్కు అండగా నిలిచింది. స్వతంత్ర అభ్యరి్థగా రంగప్రవేశం చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఈ పరిస్థితిని పసిగట్టిన ఆది కొంత ఓపిక పట్టారు. భూపే‹Ùకు టీడీపీ పార్లమెంటు టికెట్ అప్పగించేంత వరకూ వేచి ఉండి తర్వాత అడుగుపెట్టారు. ఇక తామంతా ఒక్కటేనంటూ చెప్పుకోవాల్సిన దుస్థితి ఆదినారాయణరెడ్డి వచ్చి చేరింది.జమ్మలమడుగు పర్యటనల్లో భూపేష్ కోసం ఆదినారాయణరెడ్డి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకు మనకు అండగా ఉంటున్నాడా? లేదా? అని సన్నిహితులతో క్రాస్ చెక్ చేసుకోవాల్సిన దౌర్భాగ్యం నెలకొంది. మరోవైపు గ్రామస్థాయి నాయకులు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డిని విశ్వసించే పరిస్థితి లేదు. సన్నిహితులే కాదు, సమీప బంధువులు సైతం దూరమవుతున్నారు. ఈక్రమంలోనే జమ్మలమడుగుకు మాజీ మున్సిపల్ చైర్మన్ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి సైతం వైఎస్సార్సీపీలో చేరిపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆది పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అడుగడుగునా అవకాశవాదం తెరపైకి వస్తుండడమే ఇలాంటి దుస్థితికి కారణమని పలువురు చెప్పుకుంటున్నారు. -
‘దస్తగిరిని అడ్డంపెట్టుకుని సునీత నాటకమాడుతోంది’
సాక్షి, వైఎస్సార్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత చెప్పేవన్నీ అబద్ధాలేనని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘దస్తగిరి వాంగ్మూలాన్ని నిజం చేసే ప్రయత్నం జరుగుతుంది. సీబీఐ వద్ద దస్తగిరి స్టేట్మెంట్ తప్ప ఏ ఒక్క ఆధారం లేదు. సునీత దస్తగిరిని అడ్డంపెట్టుకుని ఓ బూటకం ఆడుతుంది. ఇంటి తలుపులు బద్దలైతే అన్నీ బాగున్నాయని సీబీఐకి చెప్పింది. ఇంటి తలుపులు బద్దలు కొట్టారనేది విడిచిపెట్టి ఇంట్లో వాళ్లే చంపారని సునీత ప్రస్తావిస్తోంది. చంపినప్పుడు లెటర్ రాశాడన్నారు, చేతి వేళ్లు నరికితే రక్తపు మరకలు ఉండవా.. అసలు ఎలా రాయగలడు?. దస్తగిరి, రంగన్న చెప్పిన సమాచారం పూర్తి విరుద్ధంగా ఉంది. రెండో భార్య సమీమ్కు ఆస్తి గొడవలున్నాయి. ఆస్తి పత్రాలు దొంగిలించాల్సిన అవసరం ఎవరికి ఉంది?. దీన్ని కూడా సీబీఐ పట్టుకోలేకపోయింది’ అని డాక్టర్ చైతన్యరెడ్డి తెలిపారు. -
‘తప్పు చేస్తున్నావ్ షర్మిలా’
వైఎస్ రాజశేఖర్రెడ్డి కుటుంబాన్ని రోడ్డుమీదకు గుంజడానికే వైఎస్ అని పేరుపెట్టుకుని ప్రజల ముందుకు వస్తే తమలాంటి అభిమానులు వదిలిపెట్టరని, తస్మాత్ జాగ్రత్త అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను హెచ్చరించారు వైఎస్సార్టీపీ మాజీ నేత కొండా రాఘవరెడ్డి. వైఎస్సార్జిల్లాలో పర్యటిస్తున్న కొండా రాఘవరెడ్డి.. షర్మిలపై మండిపడ్డారు. వైఎస్సార్ కుటుంబాన్ని చీల్చే కుట్రలను ఆయన తప్పుబట్టారు. వైఎస్సార్ అభిమానిగా షర్మిల చర్యలు తమనెంతో బాధించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘మురుసుపల్లి షర్మిలగా నువ్వు ఏ ఫుట్పాత్పై తిరిగినా మాకు అభ్యంతరం లేదు. మేము రాజశేఖర్రెడ్డి గారి వీరాభిమానులము. రాజశేఖర్రెడ్డిగారంటే మాకు ప్రాణం. రాజశేఖర్రెడ్డిగారు చనిపోయిన తర్వాత రెండు పుష్కరాలు వస్తే.. కృష్ణా, గోదావరి పుష్కరాల్లో పిండాలు పెట్టినటువంటి బిడ్డలం మేము. మాలాంటి వారు లక్షలమంది తెలుగు ప్రజల్లో ఉన్నారు. ఇవాళ నువ్వు మోసం చేసి రాజశేఖర్రెడ్డి కుటుంబాన్ని రోడ్డుమీదకు గుంజడానికి వైఎస్ అని పేరు పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నావ్ చూడు. మా లాంటి వీరాభిమానులు నిన్ను వదిలిపెట్టరు తస్మాత్ జాగ్రత్త అని చెప్పడానికే తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి కడప ప్రజలను జాగృతం చేస్తున్నాం. అక్కడ ఉన్నప్పుడు(తెలంగాణలో) ఆడ(అక్కడ) బిడ్డ అని అంటివి. ఇక్కడకొచ్చి(ఏపీ) ఈడ బిడ్డ అంటివి. దానికోసం సామెతలు. రక్తసంబంధం ఉన్నటువంటి రక్షాబంధన్ కట్టాల్సిన అన్నకు నువ్వు రాక్షస రూపంలో ఆయన స్వప్నంలోకి వస్తున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గురాలివో మాకు అర్థమైతాంది.నేను ఇవాళ జగన్మోహన్రెడ్డిగారిని కాపాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడుకోవాలి. ఏం తప్పు చేసిండు జగన్మోహన్రెడ్డిగారు. నీకు ఏమి ఎరుక. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదవడానికి నువ్వు ఇక్కడికి వచ్చినావా? నీకు తెలుసా నాడు-నేడు, తెలుసా నీకు అమ్మ ఒడి, తెలుసా నీకు గోరుముద్ద. ఏం తెలుసు నీకు. రాజశేఖర్రెడ్డిగారు ఉన్నప్పుడు 850 రుగ్మతలు ఆరోగ్య శ్రీలో ఉంటే, ఈరోజు రెండు వేల ఐదువందల రుగ్మతలను ఆరోగ్య శ్రీలో పెట్టిన మహానాయకుడు జగన్మోహన్రెడ్డిగారు. నీది నాలుకనా.. తాటిమట్టనా? అని అడగదల్చుకున్నాం. ఏ కోశాన కూడా వైఎస్ రాజశేఖరరెడ్డిగారి కూతురిగా అంగీకరించడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా లేరనే విషయం తెలుసుకో షర్మిలా. నువ్వు మురుసుపల్లి షర్మిలవు. నువ్వు మురుసుపల్లి అనిల్కుమార్ భార్యవు. అసలు నీకు ఏం కావాలి. నీకు ఆశ ఎక్కువ. ఆశయం మాత్రం లేదు. ఓర్వలేని తనం ఎక్కువ. నువ్వు రాజకీయాలకు పనికొస్తావా? అని ధ్వజమెత్తారు కొండా రాఘవరెడ్డి. -
జమ్మలమడుగులో మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డిని ప్రకటించగా, బీజేపీ ఒప్పుకుంటే జమ్మలమడుగులో పోటీకి సిద్ధమని భూపేష్రెడ్డి అంటున్నారు. బీజేపీ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పేరును బీజేపీ అధిష్టానం పరిశీలన చేస్తోంది. పార్టీ అధిష్టానంతో ఇప్పటికే ఆదినారాయణ చర్చలు జరిపారు. జమ్మలమడుగు సీటును వదులుకుంటే టీడీపీకి మరో సీటు పెరగనుంది. ఇదీ జరిగింది.. కాగా, కడప పార్లమెంట్ బలిపీఠం ఎక్కించేందుకు టీడీపీ నానా హైరానా పడింది. అభ్యర్థి ఎంపికకు పలు రకాలుగా కసరత్తు చేసింది. క్రమం తప్పకుండా ఐవీఆర్ఎస్ ఫోన్ సర్వేలు నిర్వహిస్తూ రోజుకొక పేరు తెరపైకి తెచ్చింది. ఎట్టకేలకు జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జి భూపేష్రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అసెంబ్లీ టికెట్ ఆశించిన భూపేష్ను ఏకంగా ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం వెనుక కుయుక్తుల మంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎవరైనా సరే, ఓటమి ఎదుర్కోవాల్సిన సీటుకు భూపేష్ను ఎంపిక చేయడం వెనుక ఆదినారాయణరెడ్డి తెరవెనుక వ్యూహం పన్నినట్లు సమాచారం. ఇదీ చదవండి: నాడు తండ్రి.. నేడు తనయుడికి ‘ఆది’పోటు -
#MemanthaSiddham : జైత్రయాత్ర ఆరంభం
మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: మండుటెండనూ లెక్క చేయకుండా కి.మీ. కొద్దీ రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనం.. నిప్పులు చిమ్ముతున్న సూరీడుతో పోటీపడుతూ చంటిబిడ్డలను చంకనేసుకుని బస్సు వెనుక పరుగులు తీసిన ఆడబిడ్డలు.. రోడ్డుకు ఇరువైపులా గ్రామాల్లో టెంట్లు వేసి వంటలు వండుకుని, సామూహికంగా భోజనాలు చేసి గంటల తరబడి నిరీక్షించిన ప్రజానీకం..! వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో తొలిరోజు కనిపించిన దృశ్యాలు ఇవి. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన నమ్మకానికి ఈ దృశ్యాలు ప్రతీకగా నిలిచాయి. వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయ నుంచి వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార భేరిని సీఎం జగన్ బుధవారం మోగించారు. తాడేపల్లి నివాసం నుంచి ఉదయం 11.50 గంటలకు బయలుదేరిన సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకున్నారు. తన మాతృమూర్తి వైఎస్ విజయమ్మతో కలిసి వైఎస్సార్కు నివాళులు అర్పించారు. అనంతరం తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి భారీ ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల నినాదాల నడుమ బస్సు యాత్రను సీఎం జగన్ ప్రారంభించారు. ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి వద్దకు బస్సు యాత్ర చేరుకునే సరికి రోడ్డుకు ఇరువైపులా భారీ ఎత్తున జనం బారులు తీరారు. భారీ క్రేన్తో గజమాల వేసి సీఎం జగన్కు ఆత్మీయ స్వాగతం పలికారు. జనసంద్రమైన వేంపల్లి.. ప్రజలు భారీ ఎత్తున తరలిరావడంతో వేంపల్లి జనసంద్రంగా మారింది. వేంపల్లి అడ్డ రోడ్డు నుంచి హనుమాన్ సర్కిల్ వరకూ సీఎం జగన్ రోడ్ షో నిర్వహించారు. సీఎం జగన్ను చూడగానే అవ్వాతాతల నుంచి చిన్న పిల్లల వరకూ హర్షద్వానాలతో ఘనస్వాగతం పలికారు. హనుమాన్ సర్కిల్ వరకూ కి.మీ. కొద్దీ ఇసుకేస్తే రాలనంత స్థాయిలో రోడ్డుపై కిక్కిరిసిన జనం సీఎం జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు పలికారు. మండటెండను కూడా లెక్క చేయకుండా చంటిబిడ్డలను ఎత్తుకుని బస్సు వెంట నడుస్తూ సీఎం జగన్ను చూసేందుకు పోటీపడ్డారు. బస్సు యాత్ర సాగుతున్న రహదారికి ఇరువైపులా మారుమూల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున రోడ్డుపైకి తరలివచ్చి టెంట్లు వేసుకుని, వంటలు వండుకుని, సామూహికంగా భోజనాలు చేస్తూ సీఎం జగన్ రాక కోసం గంటల కొద్దీ నిరీక్షించారు. బస్సు యాత్ర తమ వద్దకు చేరుకోగానే సీఎం జగన్పై బంతిపూల వర్షం కురిపిస్తూ అడుగడుగునా నీరాజనాలు పలకడంతో యాత్ర ఆలస్యంగా ముందుకు సాగింది. అమ్మ భావోద్వేగం... పులివెందుల: ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థన నిర్వహించిన వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా బిడ్డను నీకే అప్పజెబుతున్నా దేవుడా..! నా బిడ్డ కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నావు..! ప్రతి బాధలోనూ తోడుగా ఉన్నావు..! నా బిడ్డ తలపెట్టిన కార్యక్రమాలను జయప్రదం చేయాలి..! నా బిడ్డను మళ్లీ సీఎంగా చేయాలని కోరుకుంటున్నా..!’ అంటూ ప్రార్థన చేసిన అనంతరం సీఎం జగన్ను ఆప్యాయంగా ముద్దాడగా.. ఆయన భావోద్వేగంతో తన తల్లిని ఆలింగనం చేసుకున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వారిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాష్రెడ్డి, మిథున్రెడ్డి, చింతా అనూరాధ, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్రెడ్డి, సుధాకర్బాబు, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్యాదవ్, రామచంద్రారెడ్డి, ప్రభాకర్, తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, జడ్పీ ఛైర్మన్ అమర్నాథరెడ్డి, చల్లా మధుసూదన్రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్రెడ్డి, వైఎస్ కొండారెడ్డి, సీఎం కార్యాలయ కోఆర్డినేటర్ జనార్దన్రెడ్డి, ఎన్ఆర్ఐ రత్నాకర్ తదితరులున్నారు. జిల్లా చరిత్రలో అతి పెద్ద ప్రజాసభ.. ప్రొద్దుటూరులో బహిరంగ సభ షెడ్యూలు ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కావాలి. కానీ.. రహదారి పొడవునా జనం బారులు తీరి స్వాగతం పలకడంతో బైపాస్ రోడ్డు సమీపంలోని సభా ప్రాంగణానికి సాయంత్రం 6.30 గంటలకు సీఎం చేరుకున్నారు. అప్పటికే 30 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. సీఎం జగన్ వేదికపైకి చేరుకుని ర్యాంప్ వాక్ చేస్తూ అభివాదం చేస్తున్నంత సేపు ప్రాంగణం ప్రజల హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో చేసిన మంచిని వివరిస్తూ.. టీడీపీ– జనసేన–బీజేపీ కూటమి సర్కార్ 2014–19 మధ్య చేసిన మోసాలను ఎండగడుతూ సీఎం జగన్ చేసిన ప్రసంగానికి విశేష స్పందన లభించింది. ప్రొద్దుటూరులో సీఎం జగన్ నిర్వహించిన సభ వైఎస్సార్ కడప జిల్లా చరిత్రలో అతి పెద్ద ప్రజాసభగా నిలిచింది. ప్రచండ భానుడితో పోటీపడుతూ.. నిప్పులు గక్కుతున్న సూరీడుతో పోటీపడుతూ సీఎం జగన్ కోసం రహదారిపై భారీ ఎత్తున జనం గంటల కొద్దీ నిలబడ్డారు. కమలాపురం నియోజకవర్గంలో వీరపునాయునిపల్లె, గంగిరెడ్డిపల్లి, సంగాలపల్లిలో బస్సు యాత్రకు నీరాజనాలు పలికారు. మండల కేంద్రమైన వీరపునాయునిపల్లిలో సీఎం జగన్ నిర్వహించిన రోడ్ షోకు విశేష స్పందన లభించింది. జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లలోని మెయిన్ రోడ్డు జనసంద్రంగా మారింది. ఎర్రగుంట్లలో సీఎం జగన్ నిర్వహించిన రోడ్ షో సూపర్ హిట్ అయ్యింది. రాత్రి పూట జన నీరాజనం.. ప్రొద్దుటూరు సభ రాత్రి 8 గంటలకు ముగిసింది. అనంతరం బస్సు యాత్ర మైదుకూరు నియోజకవర్గం దువ్వూరుకు చేరుకునే సమయంలో దారిలో రాత్రి పూట కూడా జనం భారీ ఎత్తున రహదారిపై గంటల తరబడి నిరీక్షించారు. సీఎం జగన్పై బంతి పూలవర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో బస్సు యాత్ర ముగిసి బుధవారం రాత్రి 9.20 గంటలకు నంద్యాల జిల్లా చాగలమర్రిలో ప్రవేశించింది. చాగలమర్రిలో జనం సీఎం జగన్కు నీరాజనాలు పలికారు. దారి పొడవునా ఘనస్వాగతాల నడుమ ఆళ్లగడ్డ క్రాస్లో బస చేసేందుకు ఏర్పాటు చేసిన శిబిరానికి రాత్రి 10 గంటలకు చేరుకున్నారు. బస్సు యాత్ర తొలి రోజు గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది. నేడు నంద్యాలలో సీఎం జగన్ సభ ఆళ్లగడ్డ నుంచి రెండో రోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభం సాక్షి, అమరావతి: మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజైన గురువారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం జగన్మోహన్రెడ్డి నైట్ హాల్ట్ ప్రాంతం నుంచి ప్రారంభంకానుంది. యాత్ర గురు వారం షెడ్యూల్ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. ఉదయం 9 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామ స్థులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం గోవిందపల్లి మీదుగా ప్రయాణించి చాబోలు శివారులో భోజన విరామం తీసుకుంటారు. తర్వాత నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురంలో ప్రజలతో మమేకమవుతూ పెంచికలపాడులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
ఆత్మలనూ వాడుకుంటున్న రామోజీ
ఎల్లోమీడియా అధినేత రామోజీరావు తన జీవితపు అంతిమ ఘడియల్లోనూ తన తన క్షుద్ర బుద్ధినిపోనిచ్చుకోవడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ ఏ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నా దాన్ని ఏపీ ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అంటగట్టేందుకు ఎంతగానో తాపత్రయపడిపోతున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరంలో సుబ్బారావు అనే చేనేత కార్మికుడు కుటుంబం విషాదాన్ని ప్రభుత్వం మెడకు చుట్టే ప్రయత్నం చేసిన ఈనాడు. వాస్తవానికి ఎక్కడో కొండల్లో ఉన్న ప్రభుత్వ భూమిని టీడీపీ హయాంలో రికార్డులను తారుమారు చేసే అధికారులను పట్టుకుని 2015 లో తన తండ్రిపేరు రికార్డ్ చేయించారు. తరువాత ప్రభుత్వం రికార్డులనుంచి ఆయన పేరును తొలగించింది. అంతేకాకుండా ఆ భూమి గతంలో ఎన్నడూ. ఎవరికీ ఎసైన్ చేయలేదు. రాళ్ళూ, రప్పలతో ఉన్న ఆ భూమి కనీసం సాగుకు కూడా పనికిరాదు.. గతంలో ఎన్నడూ ఎవరూ అధికారికంగా అనధికారికంగా కూడా అక్కడ సాగు చేయలేదు. ఆ భూమి తనకు ఇవ్వాలని ప్రభుత్వానికి సుబ్బారావు కూడా ఎన్నడూ అర్జీ కూడా పెట్టుకోలేదు.. ఏ అధికారిని కలవలేదు. జూదం.. క్రికెట్ బెట్టింగులు.. ఇతర వ్యసనాలతో ఇరవై లక్షల వరకు అప్పులు చేసి.. ఇటు కులవృత్తిని సైతం వదిలేసి ఇబ్బందులు పాలయ్యాడు.. దీంతో భార్యకుమార్తెను అయన హత్య చేసి తరువాత తానూ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక వివరాలను బట్టి తెలుస్తోంది. ఇలాంటి ఘటనలను సైతం ప్రభుత్వానికి అంటగట్టే కుట్రలకు ఎల్లో మీడియా తెగబడుతోంది. -
నాలుగు కాళ్ల కోడిపిల్ల
ఏపీలోని వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం ఎర్రబల్లె పంచాయతీ పరిధిలోని మల్లికార్జునపురంలో నాలుగు కాళ్లతో జన్మించిన ఓ కోడి పిల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రామానికి చెందిన దామోదర్.. తన ఇంట్లో మూడు రోజుల కిందట ఓ కోడి పెట్టిన గుడ్లను పొదిగేశారు. అందులో ఒక కోడి పిల్ల నాలుగు కాళ్లతో పుట్టింది. ఆరోగ్యంగా ఉన్న ఈ కోడి పిల్లను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. – పులివెందుల రూరల్ -
YSRCP వైఎస్సార్ జిల్లా అభ్యర్థులు వీళ్లే
వైఎస్సార్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ. -
రూ.266 కోట్లతో కడప విమానాశ్రయం అభివృద్ధి
కడప కోటిరెడ్డిసర్కిల్/కడప కార్పొరేషన్: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని విమానాశ్రయంలో రూ.266 కోట్లతో నిర్మించనున్న నూతన టెర్మినల్ భవనానికి ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ విమానాశ్రయం 25 లక్షల మంది ప్రయాణికుల వార్షిక సామర్థ్యం మేరకు ఆధునిక సొబగులద్దుకుంటోంది. ఇక్కడి రన్వేని 45 మీటర్ల వెడల్పున 2,515 మీటర్ల పొడవున విస్తరించనున్నారు. పనులు పూర్తయిన తరువాత ఈ విమానాశ్రయం పీక్ అవర్ సరి్వంగ్ కెపాసిటీ 1,800 మంది ప్రయాణికులుగా ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషితో విమానాశ్రయం విస్తరణకు రూ.75 కోట్లతో స్థలం సేకరించారు. దీంతో రన్వే పొడిగిస్తున్న నేపథ్యంలో విమానాల నైట్ ల్యాండింగ్కు కూడా అవకాశం లభిస్తుంది. ఇప్పటికే ఇక్కడి నుంచి నిరంతరాయ సర్విసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కూడా భరించింది. 2015లో ప్రారంభమైన ఈ విమానాశ్రయం నుంచి 2017లో ట్రూ జెట్ సంస్థ ఉడాన్ స్కీమ్ కింద ఆర్సీఎస్ (రీజినల్ కనెక్టివిటీ స్కీమ్) అమలు చేసింది. 2021లో ఆ సంస్థ తన విమానాలను ఉపసంహరించుకుంది. 2022 మార్చి నుంచి ఇండిగోసంస్థ విమానాలను ప్రారంభించింది. ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజద్బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ విమానాశ్రయంలో అభివృద్ధి పనులతోపాటు టెర్మినల్ నిర్మాణంతో రూపురేఖలు మారిపోయి మహర్దశ పట్టనుందని చెప్పారు. ఈ విమానాశ్రయం ఏర్పాటుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కృషిచేయగా, ఎయిర్పోర్టు అభివృద్ధికి ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎయిర్పోర్టు సుందరీకరణలోను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. ఎయిర్పోర్టుకు అతి సమీపంలో అటవీప్రాంతం ఉండడంతో అటవీశాఖ అనుమతులు తీసుకుని భూసేకరణ చేసినట్లు తెలిపారు. ఎయిర్పోర్టు అభివృద్ధి పనులు చేపట్టిన ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరావు సిందియాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు, ఎయిర్పోర్టు డైరెక్టర్ సుజిత్కుమార్ పోదార్, ›ప్రొటోకాల్ ఆఫీసర్ సురేష్బాబు, టెర్మినల్ మేనేజర్ జోసెఫ్ పాల్గొన్నారు. ముసుగు తొలగించారంతే: ఎంపీ అవినాశ్రెడ్డి అనంతరం ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎప్పటినుంచో పొత్తులో ఉన్న టీడీపీ, పవన్కళ్యాణ్, బీజేపీ ఇప్పుడు ముసుగు తొలగించారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పొత్తులు కొత్తేమీ కాదని, ఎన్నికలు వచ్చాయంటే ఆయనకు పొత్తులు గుర్తొస్తాయని చెప్పారు. 2019లో టీడీపీ ఓటమి పాలుకాగానే చంద్రబాబు తన అనుచరులైన సుజనాచౌదరి, సీఎం రమేశ్లను బీజేపీలోకి పంపారని గుర్తుచేశారు. అప్పటి నుంచి ప్రత్యక్షంగా పొత్తులో ఉన్న టీడీపీ, వవన్కళ్యాణ్, బీజేపీ.. పరోక్షంగా కాంగ్రెస్, ఇతర పార్టీలతో కూడా కలిసే ఉన్నట్లు చెప్పారు. ఎంతమంది కలిసొచి్చనా, ఎల్లో మీడియా వారికి ఎంత మద్దతు ఇచ్చినా గెలిచేది వైఎస్సార్సీపీయేనని ఆయన తెలిపారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ బీజేపీతో పొత్తుకోసం టీడీపీ వెంపర్లాడిందని ఎద్దేవా చేశారు. సింహం సింగిల్గానే వస్తుందని, జగన్ సింగిల్గా పోటీచేసి మళ్లీ సీఎం కావడం తథ్యమని చెప్పారు. -
కడప ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్కు ప్రధాని మోదీ శంకుస్థాపన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్కు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రూ.265 కోట్ల రూపాయల వ్యయంతో నూతన టర్మీనల్ భవన నిర్మాణం చేపట్టారు. ఢిల్లీ నుండి వర్చువల్ విధానంలో ప్రధాని పాల్గొన్నారు. కడప నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్రెడ్డి మాట్లాడుతూ, కడప ప్రజల కల నెరవేరుతున్న వేళ సంతోషంగా ఉందన్నారు. కడప విమానాశ్రయ అభివృద్ధి కోసం దివంగత మహానేత వైఎస్సార్ చేసిన కృషి అందరికి తెలిసిందే.. రూ. 75 కోట్ల రూపాయలతో స్థల సేకరణ పూర్తి చేశామని తెలిపారు. ఉడాన్ పథకం ద్వారా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, చెన్నైకు తక్కువ ధరకు విమాన సర్వీసులు నడపడం జరిగిందన్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో నైట్ ల్యాండింగ్, రన్ వే పొడిగింపు, పెద్ద విమానాలు ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరావు సిందియా, ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇదీ చదవండి: స్నేహం కాదు, దాసోహం! -
రేపు వైఎస్సార్ జిల్లాలో సీఎం పర్యటన
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 11వ తేదీన వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. సీఎం జగన్ 11వ తేదీ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. ముందుగా డాక్టర్ వైఎస్సార్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బనాన ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్సార్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్కు చేరుకుని ప్రారంభిస్తారు. అనంతరం డాక్టర్ వైఎస్సార్ జంక్షన్కు వెళ్లి ప్రారంభిస్తారు. అక్కడే సెంట్రల్ బౌల్ వార్డ్ ప్రారంభించిన తర్వాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్కు చేరుకుని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గాంధీ జంక్షన్కు చేరుకుని ప్రారంభించిన అనంతరం డాక్టర్ వైఎస్సార్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ వద్దకు చేరుకుని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్కు చేరుకుని ఫేజ్–1 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి సంయూ గ్లాస్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్ మెమోరియల్ పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వైఎస్సార్ ఎస్టేట్లోని గెస్ట్హౌస్కు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు. -
‘దస్తగిరి వెనుక సునీత, ఆమె భర్త ఉన్నారు’
వైఎస్సార్ జిల్లా: మాజీ మంత్రి వైఎస్ వివేకాను హత్య చేశానని దస్తగిరి ఒప్పుకున్నాడని భరత్ యాదవ్ తెలిపారు. వివేకా కేసులో జైలులో ఉంటున్న గంగిరెడ్డి నోరు విప్పితే కేసు చిక్కుముడి వీడుతుంది అని భరత్ యాదవ్ స్పష్టం చేశారు. కాగా, భరత్ యాదవ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పుడు దస్తగిరి వైఎస్ కుటుంబంపై బురదజల్లుతున్నాడు. దస్తగిరి వెనుక ఎవరుండి మాట్లాడిస్తున్నారు?. ఇది వరకు.. ఇప్పుడు దస్తగిరి ఆర్థిక పరిస్దితి ఎంటీ?. సునీత ఇంట్లో పని మనిషి బీబీ అనే మహిళ ద్వారా దస్తగిరితో సునీత మాట్లాడుతుంది. డబ్బు కూడా అమె ద్వారానే దస్తగిరికి అందుతోంది. అందుకే సునీత మాట్లాడమన్నట్లు దస్తగిరి మాట్లాడుతున్నాడు. దస్తగిరికి ప్రాణహానీ ఉన్నప్పుడు.. వంట మనిషి బీబీ ద్వారా ప్రాణహానీ ఎందుకు ఉండదు. ఎన్నికల్లో పోటీ చేస్తాను అనేంత డబ్బు ఎలా వస్తుంది?. ఐస్ బండి నడిపే దస్తగిరికి ఇంత డబ్బు ఎలా వచ్చింది?. ఖచ్చితంగా దస్తగిరి వెనక సునీత, అమె భర్త రాజశేఖర్ ఉండి మాట్లాడిస్తున్నారు. వైఎస్ వివేకా రెండవ భార్యకు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఆయన చంపించారు. వైఎస్ వివేకాను హత్య చేసింది దస్తగిరి, సునీల్ యాదవ్, గంగిరెడ్డి. వైఎస్ వివేకా హత్య తర్వాత దస్తగిరి, సునీల్, ఎర్ర గంగిరెడ్డి మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి నుంచి డబ్బు రావాలి అని ఎర్ర గంగిరెడ్డి చెప్పేవారు. జైలులో ఉంటున్న గంగిరెడ్డి నోరు విప్పితే కేసు చిక్కుముడి వీడుతుంది’ కీలక వ్యాఖ్యలు చేశారు. -
YSR District: రమేష్రెడ్డికి సీటు పోటు!
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ అధికారిక పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అధినేత చంద్రబాబు యూజ్ అండ్ త్రో పాలసీ అమలు చేయడంలో దిట్టగా పేరు గడించారు. అవసరాలకు అనుగుణంగా నాయకులను వాడుకోవడంలో ఆయనకు మరెవ్వరు సాటిరారని విశ్లేషకులు సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. అలాంటి పరిస్థితి తాజాగా మాజీ ఎమ్మెల్యే రమేష్కుమార్రెడ్డికి ఎదురైంది. రెడ్డెప్పగారి కుటుంబం రాజకీయ వారసుడిగా తెరపైకి వచ్చిన ఆయనకు అటు ఇంటి నుంచి ఇటు పార్టీ నుంచి సీటు పోటు తప్పలేదు. 25 ఏళ్లుగా పార్టీ విధేయునిగా ఉన్నా, అసెంబ్లీ సీటు దక్కకపోవడానికి సోదరుడి సారథ్యమే ప్రధాన కారణమని సమాచారం. దివంగత మాజీ మంత్రి రెడ్డెప్పగారి రాజగోపాల్రెడ్డి రాజకీయ వారసుడిగా రమేష్కుమార్రెడ్డి అరంగ్రేటం చేశారు. 1999లో లక్కిరెడ్డిపల్లె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో లక్కిరెడ్డిపల్లె రద్దు అయింది. రాయచోటి నియోజవకర్గంలో లక్కిరెడ్డిపల్లె, రామాపురం, గాలివీడు మూడు మండలాలు కలిసిపోయాయి. 2009 ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి సాయిప్రతాప్ చేతిలో ఓడిపోయారు. 2014, 19లలో రాయచోటి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రమేష్రెడ్డి 1999 నుంచి ఇప్పటివరకు టీడీపీ నాయకుడుగా చెలామణీ అవుతున్నారు. కాంట్రాక్టర్గా స్థిరపడిన సోదరుడు శ్రీనివాసులరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014లో తొలిసారి అరంగ్రేటం చేసిన వెంటనే కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. క్రమంగా టీడీపీ సారధ్య బాధ్యతలకు దగ్గరయ్యారు. అధినేత చంద్రబాబు మనుసెరిగి మసులుకోవడంలో దిట్టగా మారడంతో టీడీపీలో పొలిట్బ్యూరో సభ్యుడుగా ఎదిగారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. దీనికి తోడు శ్రీనివాసులరెడ్డి ధనవంతుడు కావడంతో అధినేత చంద్రబాబు మరింత ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. కుటుంబానికి ఒక్కటే సీటు నిబంధన.... తెలుగుదేశం పార్టీలో ఇటీవల అనధికారికంగా కుటుంబానికి ఒక్కటే సీటు అనే నిబంధన పెట్టుకున్నారు. ఈక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న శ్రీనివాసులరెడ్డి ఆ ఒక్క సీటు మా సోదరుడు రమేష్కుమార్రెడ్డికి ఇవ్వాలని అభ్యర్థించి ఉంటే తప్పకుండా వచ్చేదని పలువురు వివరిస్తున్నారు. అలా కాకుండా తన సతీమణీ మాధవీరెడ్డికి కడపలో అవకాశం కల్పించాలని శ్రీనివాసులరెడ్డి కోరడంతోనే రమేష్రెడ్డి సీటు ప్రశ్నార్థమైనట్లు సమాచారం. 1999 నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ బాధ్యతగా, విధేయుతతో పనిచేస్తున్న తనను కాదని, నిబంధనలు ముడిపెట్టి తనకు ఎగనామం పెడతారా? అన్న ఆక్రోశం రమేష్రెడ్డి వెళ్లగక్కుతున్నారు. ఆరు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తనకు ఇటు ఇంటిలోని వారు, అటు పార్టీకి చెందిన వారు వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమేరకు అనుచరగణం తీవ్రస్థాయిలో రగిలిపోతున్నట్లు సమాచారం. అవకాశవాద రాజకీయాలతోనే.. నిబద్ధతతో రాజకీయాలు చేసేవారు కొందరైతే, అందివచ్చిన అవకాశాలతో ఎదిగే నేతలు మరికొందరు. చేయి అందించిన వారినే తొక్కుకుంటూ ఎదిగే నేతలు మరికొందరు. చంద్రబాబు తెరపైకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి అవకాశవాదులు అధికమయ్యారు. తన..మన భేదం లేకుండా రాజకీయ ఉన్నతి కోసం సొంత మనుషులను, రక్త సంబంధీకులను తొక్కేయడంలో వీరు దిట్టలు. ఇలాంటి పరిస్థితితోనే రాయచోటి సీటు చేజార్చుకోవాల్సి వచ్చిందని రమేష్రెడ్డి సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తుదకు తనకు కాకపోయినా రాయచోటి సెగ్మెంట్లో మాధవీరెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేసినా ఇంతటి క్షోభ ఉండేది కాదని, సొంత నియోజకవర్గం రెడ్డెప్పగారి కుటుంబం నుంచి చేజార్చుకునే పరిస్థితి లేకుండా ఉండేదని పలువురితో వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రాజకీయ భవిష్యత్ కోసం సన్నిహితులతో ప్రత్యేకంగా చర్చిస్తూ, రాయచోటి నుంచి పోటీ చేయాలనే దిశగా అడుగులు వేస్తూ, తదనుగుణంగా సమీకరణలు చేస్తున్నట్లు సమాచారం. -
యువతకు ఉపాధి.. రైతులకు లాభం
సాక్షి, అమరావతి: ఓవైపు యువతకు ఉపాధి.. మరోవైపు రైతులకు ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరంలో పారిశ్రామిక పార్క్ను అందుబాటులోకి తెచ్చింది. కలప ఆధారిత పరిశ్రమల కోసమే ప్రత్యేకంగా ఈ పారిశ్రామిక పార్క్ను అభివృద్ధి చేసింది. ఈ వుడ్ పార్క్లో ప్రధాన (యాంకర్) కంపెనీగా అగ్రగామి సంస్థ సెంచురీ ప్యానల్స్ భారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. రూ.1,000 కోట్ల పెట్టుబడితో 100 ఎకరాల్లో నెలకొల్పిన సెంచురీ ప్యానల్స్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల రోజుల క్రితం లాంఛనంగా ఉత్పత్తిని ప్రారంభించారు. సెంచురీ ప్యానల్స్కు డిసెంబర్ 23, 2021లో సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేవలం రెండేళ్లలోనే వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం. ఈ యూనిట్ ద్వారా 2,266 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉపాధి లభించనుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే రెండో దశ విస్తరణ పనులను ప్రారంభించడానికి సెంచురీ ప్యానల్స్ ప్రణాళికలు సిద్ధం చేసింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు.. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో సుబాబుల్, జామాయిల్ సాగు చేసే రైతులు గిట్టుబాటు ధరలు లేక గుట్టలుగా పేరుకుపోయిన కలప లాట్లను చూపించి ఆయనకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చాక 2021 జూలైలో బద్వేలు నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గోపవరం పారిశ్రామిక పార్క్ను అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వేగంగా భూసేకరణ పూర్తి చేసిన ఏపీఐఐసీ గోపవరం వద్ద 490.36 ఎకరాల్లో కలప ఆధారిత పరిశ్రమల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్ను అభివృద్ధి చేసింది. రైతులకు సబ్సిడీ ధరలకే 50 లక్షల విత్తన మొక్కలు.. సెంచురీ ప్యానల్స్లో హై ప్రెజర్ లామినేట్స్ (హెచ్పీఎల్), మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్స్ (ఎండీఎఫ్) తయారవుతాయి. రోజుకు 950 టన్నుల సామర్థ్యం గల ఎండీఎఫ్లను తయారుచేస్తారు. ఇందుకోసం భారీ సంఖ్యలో కలప అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో 150 కి.మీ పరిధిలో వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతుల నుంచి సెంచురీ ప్యానల్స్ జామాయిల్ను సేకరించనుంది. ఇందుకోసం సుమారు 80,000 ఎకరాల్లో జామాయిల్ పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు సెంచురీ ప్యానల్స్ జనరల్ మేనేజర్ రమేష్కుమార్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా జామాయిల్ను కొనుగోలు చేస్తామన్నారు. దీనివల్ల సుమారు 25,000 రైతు కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఇప్పటికే రైతులకు 50 లక్షల విత్తన మొక్కలను సబ్సిడీ ధరలకు అందించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఉద్యోగ నియామకాల్లో 80% మంది స్థానిక యువతనే తీసుకుంటున్నామన్నారు. తొలుత గోపవరం, బద్వేలు మండలాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. వీటి తర్వాత వైఎస్సార్ జిల్లాతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అలాగే ఈ యూనిట్కు అవసరమైన ముడి సరుకును అందించే రీసిన్ తయారీ యూనిట్ను నాయుడుపేట వద్ద రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ యూనిట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. యాంకర్ యూనిట్ ఏర్పడటంతో దీనికి అనుబంధంగా అనేక కలప ఆధారిత పరిశ్రమలు ఇక్కడకు రానున్నాయని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఉద్యోగం రాదనుకున్నా.. ఐటీఐ ఎలక్ట్రికల్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఐదేళ్లపాటు ఎదురుచూశాను. ఇక ఉద్యోగం రాదనుకున్నా. సెంచురీ ప్యానెల్స్ ఏర్పాటుతో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వడంతో నన్ను ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది. దీంతో మా కుటుంబం ఆనందానికి అవధులు లేవు. – గుడి మెగురయ్య కలసపాడు, వైఎస్సార్ జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగాలు.. రైతులకు మేలు.. సెంచురీ ప్యానెల్స్కు అవసరమయ్యే రా మెటీరియల్ కోసం జామాయిల్ సాగు చేసుకునేందుకు పరిశ్రమ వారు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఎలాంటి రవాణా ఖర్చు లేకుండా మొక్కలను సబ్సిడీ ద్వారా నేరుగా రైతు పొలాల వద్దకే తెచ్చిస్తామన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా కనీస మద్దతు ధరకు వారే కొనుగోలు చేస్తామన్నారు. జామాయిల్ సాగుపై ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించారు. ఈ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు, కూలీలకు ఉపాధితో పాటు రైతులకు మేలు జరుగుతుంది. – రూకల దేవదాసు గోపవరం ప్రాజెక్టు కాలనీ, వైఎస్సార్ జిల్లా వెనుకబడిన ప్రాంతంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ బాగా వెనుకబడిన ప్రాంతమైన బద్వేలులో యూనిట్ ఏర్పాటు చేయడానికి సెంచురీ ప్యానల్స్ ముందుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి 0.07 టీఎంసీల నీటిని కేటాయించడంతోపాటు 132 కేవీ విద్యుత్ సరఫరా, రహదారుల నిర్మాణం వంటి మౌలిక వసతులను కల్పించాం. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలతోపాటు సబ్సిడీ ధరపై విద్యుత్ అందించాం. స్థానిక యువతకు ఉపాధి కల్పించడానికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ అందిస్తున్నాం. – ఎన్.యువరాజ్, కార్యదర్శిరాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ -
నాయకులు పొత్తులు అంటుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం మంటలు
అధికారం కోసం ఎవరితో అయినా కలిసేందుకు సిద్ధపడుతున్నారు చంద్రబాబు ఆయన దత్త పుత్రుడు పవన్కల్యాణ్లు. అయితే అన్ని జిల్లాల్లోనూ టీడీపీ, జనసేన పార్టీల నేతలు కత్తులు దూసుకుంటున్నారు. పెద్ద నాయకులు పొత్తులు అంటుంటే..క్షేత్ర స్థాయిలో మాత్రం మంటలు రేగుతున్నాయి. ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో కూడా రెండు పార్టీల మధ్య ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ జిల్లాలో ఐదు సీట్లలో పోటీకి రెడీ అంటున్నారు జనసేన నేతలు. అసలు వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీ, జనసేన మధ్య ఏం జరుగుతోందో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన ఉమ్మడి కడప జిల్లాలో విపక్షాల పోటీ నామమాత్రంగానే ఉండబోతోంది. కాని జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోటీకి టీడీపీ నేతలు ఉవ్విళ్ళూరుతున్నారు. వీరికి తోడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కూడా కనీసం ఐదు సీట్లు తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తోందనే టాక్ నడుస్తోంది. ఇటు పార్టీలో పోటీ..అటు జనసేన నుంచి వస్తున్న డిమాండ్లతో పచ్చ పార్టీ బాస్ చంద్రబాబుకు దిక్కు తోచడంలేదట. అసలు పోటీయే నామమాత్రం అయితే..ఇంతమంది సీట్ల కోసం పోటీ పడుతున్నారేంటని చంద్రబాబు అనుకుంటున్నారట. కాని వారి లెక్కలు వేరే ఉన్నాయంటున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు మాటలకే పరిమితం అవుతుందని క్షేత్రస్థాయిలో కత్తులు దూసుకోవడం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జిల్లాలో జనసేన అభ్యర్ధులు కడప, రాజంపేట, రైల్వేకోడూరు, మైదుకూరు, బద్వేలు నియోజవర్గాల్లో పోటీ చేసేందకు ఉత్సాహం చూపుతున్నారు. ఇందులో భాగంగా పలుమార్లు పార్టీ నాయకులతో సమావేశమై తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కడప నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన సుంకర శ్రీనివాస్ మరోమారు పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. కానీ కడపలో టిడిపి తరుపునే ముగ్గురు పోటీ పడుతున్నారు. అందరు కలిసి పని చెయ్యాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడే పలుమార్లు అదేశించినా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వీరిలో ఒకరికి టిక్కెట్ ఇస్తే మిగిలిన ఇద్దరూ కలిసి పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు జనసేన నేత సుంకర శ్రీనివాస్ సైతం కడపలో బలిజుల ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నందున తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మొదట్లో అందరు కలిసి ష్యూరిటీ... బాబు గ్యారెంటీ పేరుతో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కానీ టిడిపి వ్యూహం తెలుసుకున్న జనసేన నేతలు ఆ పార్టీకి ప్రచారం చేయడం మానేశారు. ఇప్పుడు జనసేన నేత సుంకర శ్రీనివాస్ కూడా ప్రత్యేకంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక అన్నమయ్య జిల్లా పరిధిలోని రాజంపేటలోను ఇలాంటి పోరే నడుస్తొంది. ఇక్కడా టిడిపిలో ఇద్దరు నేతల మధ్య టికెట్ వార్ నడుస్తోంది. వీరిద్ధరి మధ్యలోకి జనసేన అభ్యర్ధిగా మాజీ టిడ్కో అధికారి యల్లటూరి శ్రీనివాసరాజు తెరపైకి వచ్చారు. ఈయన రాష్ర్ట స్థాయి అధికారిగా పనిచేస్తూ టిడిపి పెద్దలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజంపేటలో స్వంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తు వస్తున్నారు. ఇప్పుడు శ్రీనివాసరాజు పరిస్థితి కూడా అయోమయంగా మారింది. టికెట్ ఖాయమని చెప్పడంతో ఉద్యోగం వదులుకుని జనసేనలో చేరితే ఇంతవరకు టికెట్ ఖరారు చెయ్యలేదు. ఏదేమైనా రాజం పేట టిక్కెట్ తనకే కావాలని మాజీ ప్రభుత్వ అధికారి గట్టిగా తన గళం వినిపిస్తున్నా..టీడీపీలోని పోటీ దారులు కూడా ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు. రైల్వేకోడూరు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్తితే కొనసాగుతోంది. రాష్ట్ర స్థాయిలో అధికారం కోసం చంద్రబాబు, పవన్లు నానాగడ్డి కరుస్తుంటూ..క్షేత్ర స్థాయిలో మాత్రం టిక్కెట్ల కోసం ఫైట్ కొనసాగుతోంది. టీడీపీ, జనసేన నాయకులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ను ఎదుర్కొని ఒక్క సీటు కూడా టీడీపీ, జనసేన గెలిచే పరిస్తితి లేదని..కాని పోటీ ఎక్కువైందంటే వారి లెక్కలు వేరేగా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రేపే అప్పన్న చందనోత్సవం
రాజకీయ పోరు
తప్పక చదవండి
- PK: 'పులుసు కారుతోంది'..!
- ఓటీటీకి వచ్చేసిన పుష్ప విలన్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- Lok Sabha Election 2024: ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
Advertisement