-
కాళేశ్వరం జలాలకు లక్ష జన హారతి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాళేశ్వరం జలాలకు ఇచ్చిన లక్ష జన హారతి.. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్లో చోటు దక్కించుకుంది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో సూర్యాపేట జిల్లాలోని నాగారం మండలం ఈటూరు నుంచి పెన్పహాడ్ మండలం చీదెళ్ల చెరువు వరకు 68 కిలో మీటర్ల పొడవున, 126 గ్రామాల పరిధిలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ డీబీఎం–71 కాలువ ద్వారా ప్రవహించే గోదావరి జలాలకు లక్ష హారతి కార్యక్రమం నిర్వహించారు. చివ్వెంల మండలం కాలువ వద్ద నిర్వహించిన సంబరాల్లో మంత్రి జగదీశ్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కు చెందిన ఐడబ్ల్యూఎస్ఆర్ చీఫ్ డాక్టర్ బి.నరేందర్గౌడ్, తెలంగాణ కోఆర్డినేటర్ గంగాధర్. మెడల్, మెమెంటో, ప్రశంసాపత్రాన్ని మంత్రి జగదీశ్రెడ్డికి అందజేశారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్కు చివ్వెంల వద్ద, జాజిరెడ్డిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం వద్ద తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్కు మెమెంటోలు అందజేశారు. లక్ష అనుకుంటే అంతకు మించి జనం మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరు మండలాలకు చెందిన 126 గ్రామాల్లో వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధుల బృందం పర్యటించింది. కాళేశ్వరం జలాలకు లక్ష మందితో జన హారతి అనుకున్నప్పటికి కార్యక్రమంలో 1,16,142 మంది పాల్గొన్నట్లు బృందం నిర్ధారించింది. ఇందులో 65,042 మంది మహిళలు, 51,100 మంది పురుషులు పాల్గొన్నట్లు వెల్లడించింది. 107 వీడియో కెమెరాలు, 8 డ్రోన్లతో చిత్రీకరణ వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్కు చెందిన మూడు బృందాల నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించేందుకు 107 వీడియో కెమెరాలు, 8 డ్రోన్లను వినియోగించారు. 62 కళా బృందాలు, 126 చోట్ల డప్పు మేళాలు, 54 బతుకమ్మ బృందాలు ఇందులో పాల్గొన్నాయి. కాలువ పొడవునా లక్ష మందికీ భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు సన్మానించారు. కేసీఆర్తోనే సాధ్యమైంది: మంత్రి జగదీశ్రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలలో పర్యటించినప్పుడు.. ఈ ప్రాంతానికి నీరు అందాలి అంటే గోదావరి జలాలే శరణ్యం అని భావించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. కేసీఆర్ కృషితోనే తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాలకు నీళ్లు పారుతున్నాయన్నారు. అందుకు సీఎంకి కృతజ్ఞత చెప్పుకునేందుకు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నీటిపారుదల దినోత్సవం రోజున ఈ ప్రాంత రైతాంగం కాళేశ్వరం జలానికి లక్ష జన హారతి నిర్వహించామన్నారు. -
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి వైఎస్సార్సీపీకి సర్టిఫికెట్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్వహించిన రక్తదానం రికార్డులకెక్కింది. ఈ మేరకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సర్టిఫికెట్ అందింది. మంగళవారం ఈ సర్టిఫికెట్ను పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మధుసూధన్రెడ్డి, ఆప్కో చైర్మన్ చిల్లపల్లితో కలిసి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రదర్శించారు. చదవండి: (రక్తం పంచిన అభిమానం) ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం జగన్ జన్మదినం సందర్భంగా చేసిన రక్తదానం రికార్డులకెక్కింది. మేము రికార్డుల కోసం పనిచేయలేదు. కోవిడ్ సమయంలో రక్తం కొరత దృష్టిలో ఉంచుకొని ఓ మంచి పనిని చేపట్టాం. పార్టీ కార్యకర్తలుగా మాకు గర్వంగా ఉంది. ఈ రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రాలకు మేము రక్తం అందిస్తున్నాం. భవిష్యత్తులో ప్రజల కోసం మరిన్ని సేవా కార్యాక్రమాలు చేస్తాం' అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
హేట్సాఫ్ టు సాక్షి
సాక్షి, రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరానికి చెందిన సవితాల సుబ్బలక్ష్మి పేరు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది. బీకామ్ కంప్యూటర్స్ పూర్తి చేసిన ఆమె ఒక ప్రై వేట్ సంస్థలో చిరుద్యోగి. తండ్రి వేణుగోపాలకృష్ణ మరణంతో తల్లితో కలసి ఉంటున్నారు. సుబ్బలక్ష్మికి మొదటినుంచీ ’సాక్షి’ దినపత్రిక అంటే ఇష్టం. అందులోనూ ఫ్యామిలీ పేజీల్లో ప్రచురితమయ్యే వెజ్, నాన్వెజ్ కర్రీల వివరాలు చదివి, ఆ క్లిప్పింగులను భద్రపరిచేవారు. ఈవిధంగా 2010 అక్టోబర్ నుంచి 2018 డిసెంబర్ వరకూ ’సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వంటకాలకు సంబంధించిన క్లిప్పింగులను పదిలపరచి, బైండింగ్ చేయించారు. ఈ సేకరణకు గానూ ఆమె పేరు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా ఆమె ఆదివారం వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ’సాక్షి’ దినపత్రికలో ప్రచురితమవుతున్న ’వింతలు – విచిత్రాలు’ శీర్షికకు సంబంధించిన క్లిప్పింగులను కూడా పదిలపరిచానని, త్వరలో మరో మూడు బుక్ ఆఫ్ రికార్డుల్లో తన పేరు నమోదు కానున్నదని సుబ్బలక్ష్మికి తెలిపారు. పరోక్షంగా తనకు గుర్తింపు తీసుకువచ్చిన ’సాక్షి’కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
5 నిమిషాల్లో 900 పంచ్లు
సాక్షి, అమ్రాబాద్ (అచ్చంపేట): పదర మండలం రాయలగండి కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం విద్యార్థిని మహేశ్వరి కరాటేలో ఐదు నిమిషాల రెండు సెకన్లలో 900పంచ్లు కొట్టి ప్రపంచవండర్ బుక్ రికార్డు సాధించింది. విక్టరీ షోటోకాన్ ఆసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండలో వండర్బుక్ ఇంటర్నేషనల్ రికార్డు పోటీలు నిర్వహించారు. మొత్తం 200మంది బాలికలు పాల్గొన్నారు. అయితే, అందరూ కలిసి 5.2 నిమిషాల్లో ఒక లక్ష 50వేల పంచ్లు కొట్టగా.. మహేశ్వరీ అదే సమయానికి అత్యధికంగా 900 పంచ్లు కొట్టి వండర్బుక్ రికార్డు సాధించింది. ఈమేరకు వండర్బుక్ ఆఫ్ చీఫ్ ఇండియా కో–ఆర్డినేటర్ బింగి నరెందర్గౌడ్ చేతులమీదుగా రికార్డు నమోదు పత్రాన్ని అందుకుంది. ఈమేరకు సోమవారం కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయానికి వచ్చిన విద్యార్థిని మహేశ్వరిని ఎస్ఓ ఉమాదేవి, వెన్నెల, మాస్టర్ లవకుమార్తో పాటు, ఉపాధ్యాయులు, తోటివిద్యార్థులు అభినందించారు. ఒక్క కరాటేలోనే కాదు అన్నిరంగాల్లో పట్టుదలతో క్రమశిక్షణతో విద్యార్థులు ముందుకెళ్తూ విద్య కొనసాగించాలని ఈ సందర్భంగా ఎస్ఓ ఉమాదేవి ఆశాభావం వ్యక్తం చేశారు. -
వండర్బుక్లో మణిపూసలు
తాండూరు టౌన్ : వికారాబాద్ జిల్లా తాండూరు ఆణిముత్యం, మణిపూసల సృష్టికర్త, కవి వడిచర్ల సత్యంకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన పరిచయం చేసిన ‘మణిపూసలు’ అనే నూతన కవితా ప్రక్రియకు అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం దక్కింది. ఈ సందర్భంగా బుధవారం తెలుగు సాహిత్య కళాపీఠం ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో జరిగిన కార్యక్రమంలో వడిచర్ల సత్యం దంపతులను వండర్బుక్ వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి3 ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్ మాట్లాడుతూ.. సత్యం సృష్టించిన మణిపూసలు కవితా ప్రక్రియ అతి తక్కువ కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ తెలుగు సాహిత్యంలోనూ గుర్తింపు పొందిందన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల తెలుగు సాహిత్య లోకంలో 30 వరకు నూతన కవితా ప్రక్రియలు వచ్చాయని, అయితే అన్నింటిలోకెల్లా మణిపూసలను అనేక మంది కవులు అనుసరించారన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ బుక్ ట్రస్టు అధికారి మోహన్, నేటినిజం పత్రికా సంపాదకులు దేవదాస్, రామదాసు, సమ్మన్న, వండర్ బుక్ భారత్ కోఆర్డినేటర్ బింగి నరేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంజిలప్పకు సన్మానం... బొంరాస్పేట: తెలుగు సాహిత్యంలోకి నూతనంగా ప్రవేశించిన కవితా ప్రక్రియ ‘మణిపూసలు’ రచనల్లో మండల పరిధిలోని రేగడిమైలారానికి చెందిన రచయిత అంజిలప్పకు సన్మానం దక్కింది. నియోజకవర్గం నుంచి మణిపూసలు రాసినందుకు గానూ పలువురు సాహితీవేత్తలు అంజిలప్ప సత్కరించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
'కల్కి' కాపీ సినిమా కాదు.. క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
Advertisement