-
ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట
-
గిరిపుత్రుల చెంతకు గవర్నర్
సాక్షి విజయనగరం : రాష్ట్ర ప్రధమ పౌరుడు, గవర్నర్ బిశ్వభూషన్ హరి చందన్ తొలిసారి జిల్లా పర్యటనకు వస్తున్నారు. గురువారం ఆయన సాలూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారు కావడంతో అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ముఖ్యంగా గిరిజనులతో సమావేశమవుతారు. ప్రభుత్వ పరంగా వారికి అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి చర్చిస్తారు. అధికారులు గిరిజన సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల గురించి ఆయనకు వివరించేందుకు సిద్ధమయ్యారు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఒక్కరోజు పర్యటన నిమిత్తం గురువారం జిల్లాకు వస్తున్నారు. విశాఖపట్నం నుంచి నేరుగా సాలూరుకు హెలీక్యాఫ్టర్లో వస్తున్న ఆయన అక్కడ గర్భిణుల కోసం ఏర్పాటు చేసిన వసతిగృహానికి వెళ్లి వారితో మాట్లాడుతారు. అక్కడి నుంచి అమ్మవలస వెళ్లి గిరిజనులు సాగు చేస్తున్న పంటల గురించి తెలుసుకుని అక్కడి వారితో ముఖాముఖి అవుతారు. అనంతరం పి.కోనవలస ఆశ్రమ పాఠశాలలో జూనియర్ కాలేజీ విద్యార్థులతో మాట్లాడుతారు. అనంతరం ఆయన విశాఖపట్నం వెళతారు. ఈ పర్యటనలో ఆయన పూర్తిగా గిరిజనులకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. గవర్నర్ పర్యటనకు సంబంధించి అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఆయన పర్యటనలో భాగంగా హెలీప్యాడ్ మొదలుకుని ఆయన పర్యటించే ప్రాంతాల్లో పక్కాగా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గిరిజనులతో మాటాడేందుకు ఏర్పాటు చేయడమే గాకుండా... గిరిజనులను కూడా ఇందుకోసం సిద్ధం చేశారు. ప్రభుత్వపరంగా అమలవుతున్న కార్యక్రమాలు వివరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దేశంలో మరెక్కడా లేని విధంగా సాలూరులో ఏర్పాటైన గర్భిణుల వసతి గృహాన్ని మొదటి గా గవర్నర్ సందర్శించనున్నారు. ప్రత్యేకించి గర్భిణుల కోసం ఇక్కడ గతేడాది అప్పటి ఐటీడీఏ పీఓ లక్ష్మీశ ఈ వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. కొండప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు సరైన పోషకాహారం అందకపోవడం, వైద్య సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలున్నాయి. ఈ అంశాలపై అప్పట్లో ‘సాక్షి’ దినపత్రిక కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో పీఓ వసతిగృహాన్ని ఏర్పాటు చేసి గర్భిణులకు సౌకర్యం కల్పించారు. ఇప్పటివరకు ఇక్కడ సుమారు 300మంది గర్భిణులు ఇక్కడ ఆశ్రయం పొందారు. ప్రస్తుతం 28మంది గిరిజన మహిళలు ఇక్కడ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి అందుతున్న సదుపాయాలు, ప్రభుత్వ లక్ష్యం తదితర విషయాల గురించి గవర్నర్ తెలుసుకోనున్నారు. అమ్మవలసలో గిరిజన రైతులతో ముఖాముఖి :ఇదిలాఉండగా తదుపరి పర్యటనలో ఆయన అమ్మవలస గ్రామంలో గిరిజనులు పంటలు పండించే విధానం గురించి తెలుసుకుంటారు. అక్కడి గిరిజనులు పత్తి పంట ద్వారా లాభాలు పొందుతున్నారు. పత్తితోపాటు అంతర్పంటలు సాగు చేస్తున్నారు. ఈ విషయాల గురించి తెలుసుకుని తర్వాత గిరిజనులతో పంటలతోపాటు ఇతర అంశాలపై మాట్లాడుతారు. అనంతరం గవర్నర్ పి.కోనవలస గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో పలు అంశాలపై చర్చిస్తారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఆయన వచ్చి వెళ్లేందుకు, గిరిజనులతో మాట్లేందుకు, పంటలు పరిశీలించేందుకు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఎం. హరి జవహర్లాల్, ఐటీడీఏ పీఓ బి.ఆర్.అంబేడ్కర్ బుధవారం మరోసారి పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
బోగస్కు ఇక శుభం కార్డు !
బోగస్ కార్డుల అసలు రంగు తేలిపోనుంది. దర్జాగా అనుభవిస్తున్నవారి బండారం బయటపడనుంది. వేలకువేలు జీతాలు తీసుకుంటున్నా... ఇంకా నిరుపేదలకు అందించే సౌకర్యాలకోసం వెంపర్లాడేవారికి గుణపాఠం కలగనుంది. డీలర్ల వ్యవస్థలో గుట్టుగా సాగిపోయిన ఈ వ్యవహారానికి ఇక చెక్పడనుంది. ఆధార్ కార్డుల అనుసంధానంతో ఈ రహస్యం కాస్తా బట్టబయలవుతోంది. కొందరు ఉద్యోగుల కుటుంబీకులు తాము అర్హులమేననీ... తమ పిల్లలకు ఉద్యోగం ఉన్నంతమాత్రాన తామెలా అనర్హులమని విన్నవించుకోవడంతో సర్వేకు సన్నాహాలు మొదలయ్యాయి. సాక్షి, విజయనగరం: ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ... వేలాది రూపాయల వేతనం తీసుకుంటున్న వారిలో చాలా మంది దారిద్య్రరేఖకు దిగువనున్నవారికోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సౌకర్యాలు పొందుతున్నారు. ఈ విషయం ఆధార్ అనుసంధానంతో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అధికారులు వారి కార్డులు తొలగించే ప్రక్రియ చేపడుతున్నారు. కొందరి కార్డులు ఆగిపోగా... తాము అర్హులమేనని, అయినా తమ కార్డులు తీసేశారని పలువురు వినతులు కూడా ఇవ్వడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని అర్హులను ఎట్టి పరిస్థితుల్లో తొలగించవద్దని అధికారులను ఆదేశించింది. ఇప్పుడు అధికారులు విచారణ చేపట్టి నిజమైన ఉద్యోగులెవరో తేల్చాలన్న నిర్ణయానికి వచ్చారు. అంతవరకు రేషన్ సరుకుల సరఫరా కొనసాగించాలని నిర్ణయించారు. ఉద్యోగుల వద్ద 7,204 కార్డులుప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ఇతర అవసరాల కోసం తమ ఆధార్ నంబరు లింక్ చేశారు. అంతేగాకుండా ఉద్యోగులకు సంక్రమించే పలు ప్రయోజనాల కోసం వారి కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ నంబర్లు నమోదు చేశారు. ఈ వివరాలను తీసుకున్న పౌరసరఫరాలశాఖ అధికారులు రేషన్కార్డులను ఆధార్తో అనుసంధానం చేశారు. ఈ విధంగా రరేషన్కార్డులు కలిగిన ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు గుర్తించారు. జిల్లాలో మొత్తం 7,12,303 రేషన్కార్డులు ఉన్నాయి. ఆధార్ అనుసంధానంతో ఇందులో 7,204 రేషన్కార్డులు ప్రభుత్వ ఉద్యోగుల వద్ద ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ సెప్టెంబర్ నెలలో రేషన్ ఆపేశారు. రేషన్కార్డుల్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగి కార్డుగా గుర్తించారు. అయితే పదేళ్ల కిందట కార్డులు ఇవ్వడంతో ఇందులో కొందరు ఉద్యోగం పొందిన తర్వాత కార్డులు పొందగా కొందరు మాత్రం ఉద్యోగం రాకముందు కార్డులు పొందారు. ఉద్యోగం వచ్చిన తర్వాత వారు కార్డులు రద్దు చేసుకోపోవడం విశేషం. పిల్లలకు ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులు కూడా బీపీఎల్ నుంచి బయటకు వస్తారు. కానీ ఉద్యోగం పిల్లలది కాబట్టి తమకు ఉద్యోగం లేదని వాదిస్తున్నారు. ఈ విధంగా ఇందులో అనేకమంది తాము పేదలమేనని, తమకు ఉద్యోగాలు లేవని అధికారులకు విన్నవించారు. కొందరు మాత్రం తప్పుగా ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు కావడంతో కార్డులు ఆగినట్లు సమాచారం. దీంతో వీరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ తమ కార్డులు కొనసాగించాలని వేడుకున్నారు. దీనిపై గందరగోళ పరిస్థితి తలెత్తడంతో వెంటనే ఆపేసిన కార్డులు పునరుద్ధరించి సరుకులు సరఫరా యధాతథంగా కొనసాగించి, తదుపరి చర్యలు మొదలుపెట్టారు. వ్యక్తిగతంగా విచారణ కార్డులన్నింటినీ విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై ఉన్నతాధికారులు జిల్లా అధి కారులకు ఆదేశాలు జారీ చేసి విచారణ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా సంయుక్త కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి విచారణ చేయాలని మండల పౌరసరఫరాల అధికారులు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి వ్యక్తిగతంగా పరిశీలించాలని, అందులో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరో గుర్తించాలని ఆదేశించారు. అంతా కలిసి ఉన్నారా? లేకుంటే వేర్వేరుగా ఉన్నారా? అన్నది విచారించాలని ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొనడంతో ఆ విధంగా ముందుకెళ్లాలని జేసీ సూచించారు. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత కార్డుకు అర్హులవునో కాదో తేల్చాలి. ఈ మేరకు సర్వే ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ఇంటిస్థలాలకు లబ్ధిదారులు, స్థలాల గుర్తింపు పనిలో బిజీగా ఉన్నారు. దీనికితోడు ఎన్నికలు, ఇతర విధులు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు పూర్తయిన తర్వాత రేషన్కార్డులపై దృష్టి పెడతారని సమాచారం. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ ఉద్యోగుల కార్డుల్లో ఎన్ని బోగస్వి ఉన్నా యో తేలిపోతుంది. అందులో తెల్లదొరలు బయటకు వస్తారు. విచారణ జరగాల్సి ఉంది ప్రభుత్వ ఉద్యోగులుగా భావంచి ఆపేసిన తెల్లకార్డులను పదిరోజుల్లోనే పునరుద్ధరించాం. సరుకులు ఇస్తున్నాం. కానీ ఇందులో బోగస్ ఎన్ని అన్నది ప్రతి ఇంటికి వెళ్లి విచారించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇంకా విచారణ జరగాల్సి ఉంది. అందులో అనర్హులని తేలితే కార్డులు ఆపేస్తారు. – ఎ. పాపారావు, డీఎస్ఓ, విజయనగరం -
289వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, బొబ్బిలి: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 289వ రోజు షెడ్యూల్ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. రాజన్న తనయుడు శనివారం ఉదయం బొబ్బిలి మండలంలో ఇందిరమ్మ కాలనీ, పొలవాని వలస, మెట్టల వలస మీదుగా పాదయాత్రను చేపడతారు. మధ్యాహ్న భోజన సమయం తరువాత భోజరాజ పురం, సీతారామపురం, పారాడి వరకు జననేత పాదయాత్రను కొనసాగిస్తారు. ఈ మేరకు వైఎస్సార్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. -
288వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, బొబ్బిలి: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 288వ రోజు షెడ్యూల్ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. రాజన్న తనయుడు బుధవారం ఉదయం బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం పెద్ద భీమవరం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి జె.రంగరాయపురం, రంగరాయపురం, అప్పయ్య పేట, బొబ్బిలి వరకు పాదయాత్ర కొనసాగనుంది. బొబ్బిలిలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో జననేత వైఎస్ జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు వైఎస్సార్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement