-
రేషన్ బియ్యూనికి రెక్కలు!
మహారాష్ట్రకు తరలుతున్న పేదోళ్ల బియ్యం - విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ముమ్మర తనిఖీలు - రైల్వే స్టేషన్లలో 36 క్వింటాళ్ల బియ్యం పట్టివేత మంచిర్యాల టౌన్ : రేషన్ బియ్యూనికి రెక్కలొస్తున్నాయ్..పేదల కడుపు నింపాల్సిన ఈ బియ్యం ఏకంగా రాష్ట్రం సరిహద్దులే దాటిపోతోంది. మహారాష్ట్రలోని వీరూర్కు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి రేషన్ బియ్యూన్ని పథకం ప్రకారం రైళ్ల ద్వారా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. బియ్యం మాఫియూ కట్టడికి ఎన్ఫోర్స్మెంట్,విజిలెన్స్ విభాగాలు చేస్తున్న ప్రయత్నాలు కొంతమేర సఫలమవుతున్నారుు. అరుుతే పూర్తిస్థారుులో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు గ్రామాల స్థారుులోనే పక్కా ప్రణాళికలను అమలుపర్చే దిశగా పౌర సరఫరాల శాఖ, పోలీసు విభాగం, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు సంయుక్తంగా కృషిచేయూల్సిన అవసరముంది. తద్వారా ఎక్కడికక్కడే బియ్యం రవాణాదారుల ఆటకట్టించే అవకాశాలుంటారుు. బియ్యం అక్రమ రవాణా కారణంగా దారిద్య్రరేఖకు దిగువనున్న వారి ఆకలి తీర్చాలనే సర్కారు మహోన్నత లక్ష్యం నీరుగారుతోంది. రేషన్ దుకాణంలో బియ్యూన్ని కొన్న తర్వాత ప్రజలు ఎందుకు విక్రరుుస్తున్నారు? నాణ్యత లేకపోవడం వల్లా? డబ్బుల కోసమా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సింది సంబంధిత శాఖల అధికారులే. రేషన్ బియ్యూన్ని అమ్మి వచ్చిన డబ్బుతో సన్నబియ్యూన్ని కొంటున్నారా? అనే సందేహాలూ పలువురు వ్యక్తం చేస్తున్నారు. బియ్యం నాణ్యత పెంచి సరఫరా చేస్తే రేషన్కార్డుల లబ్ధిదారులు దాన్ని బహిరంగ మార్కెట్లో విక్రరుుంచకుండా చేయొచ్చనే అభిప్రాయూలున్నాయ్.గురువారం పలుచోట్ల అక్రమంగా తరలిస్తున్న బియ్యూన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాగ్పూర్ ప్యాసింజర్ రైలులో.. కాజీపేట నుంచి నాగ్పూర్ వైపు మంచిర్యాల మీదుగా వెళ్తున్న నాగ్పూర్ ప్యాసింజర్ రైలులో బుధవారం అర్ధరాత్రి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 22 క్వింటాళ్ల 60 కిలోల రేషన్ బియ్యూన్ని స్వాధీన పర్చుకున్నారు.బియ్యూన్ని తరలిస్తున్న ఓదెలకు చెందిన జీ.తిరుపతి, పెద్దపల్లికి చెందిన ఆర్.మాధవిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని వీరూర్కు బియ్యూన్ని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తనిఖీల్లో విజిలెన్స్ సీఐలు సుధాకర్రావు, రాంచందర్రావు, శశిధర్, ఎన్ఫోర్స్మెంట్ డీటీ మోహన్రెడ్డి పాల్గొన్నారు. మందమర్రి రైల్వే స్టేషన్లో.. మందమర్రి రూరల్ : అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తహశీల్దార్ ఇత్యాల కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం రాత్రి మందమర్రి రైల్వే స్టేషన్లో నాగ్పూర్ ప్యాసింజర్ ద్వారా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 8 క్వింటాళ్ల 50 కిలోల బియ్యాన్ని పట్టుకున్నట్లు చెప్పారు. తనిఖీల్లో ఎన్పోర్స్మెంట్ డిప్యుటీ తహశీల్దార్ దత్తు ప్రసాద్, ఆర్ఐ శంకర్, వీఆర్ఏ మధుకర్ పాల్గొన్నారు. -
గూ గూడెంలో విజిలెన్స్ దాడులు
తాడేపల్లిగూడెం : పట్టణంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం ఆకస్మికంగా అపరాల దుకాణాలపై దాడులు నిర్వహించారు. సుమారు 11 గంటలపాటు సాగిన ఈ దాడులలో నాలుగు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. రికార్డులలో పేర్కొన్నదానికంటే సరుకులు ఎక్కువుగా ఉండటంతో సీజ్ చేశారు. రికార్డులకు , వాస్తవ స్టాకునకు అదనంగా ఉన్న సుమారు రూ.కోటి మూడు లక్షల విలువైన పప్పులు, నూనెలు స్వాధీనం చేసుకొన్నారు. దుకాణదారులపై నిత్యావసరాల చట్టంలోని 6ఏ ప్రకారం కేసు నమోదు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ సురేష్బాబు ఆదేశాల మేరకు పట్టణంలో ఈ దాడులు గురువారం ఉదయం డీఎస్పీ కె.అనిల్కుమార్ పర్యవేక్షణలో మొదలయ్యాయి. తొలుత భీమవరం రోడ్డులోని వెంకటేశ్వర డిపార్డుమెంటల్ స్టోర్సులో సోదాలు సాగాయి. ఈ సంస్థకు సంబంధించి రెండో దుకాణంలో కొన్ని సరుకులు రికార్డులకు అనుగుణంగా ఉన్నాయి. పెసలు వంటి వాటిలో వ్యత్యాసాలు ఉండటంతో సుమారు 23 లక్షల63 వేల 625 రూపాయల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నారు. కేఎన్ఆర్ అండ్కో లో సోదాలు చేసి రెండు లక్షల 36 వేల , 547 రూపాయల విలువైన సరుకులను సీజ్ చేశారు. మహాలక్ష్మి అండ్కోలో చేసిన సోదాలలో కందిపప్పు, శనగపప్పు, వేరుశనగ పప్పు, మినపగుళ్లు, పెసర పప్పులలో తేడాలు ఉండటంతో 42 లక్షల 10 వేల 620 రూపాయల సరుకును సీజ్ చేశారు. అప్పిరెడ్డి అండ్ కంపెనీలో వ్యత్యాసాలు ఉన్న నేపథ్యంలో 34 లక్షల రూపాయల విలువైన సరుకులను సీజ్ చేశారు. ఈ దాడులలో సీఐ వెంకటేశ్వరరావు, తహసిల్దార్ శైలజ, ఏజీపీఓ .ఆర్.సత్యనారాయణరాజు, ఏఓ ఎం.శ్రీనివాసకుమార్లు పాల్గొన్నారు. మధ్యవర్తి రిపోర్టులను వీఆర్వోలు కృష్ణస్వామి, వినోద్లు రాశారు. రాత్రి 9.30 గంటల వరకు సోదాలు ముగిశాయి. -
రెండు రేషన్ దుకాణాలు సీజ్
మహేశ్వరం: మండల పరిధిలోని మంఖాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం సాయంత్రం తనిఖీలు నిర్వహించి రెండు రేషన్ దుకాణాలను సీజ్ చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ హరినాథ్, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డిలు మంఖాల్ గ్రామంలో నరేష్ నిర్వహిస్తున్న ఆరో నంబర్ రేషన్ దుకాణ ంలో తనిఖీలు చేశారు. దుకాణంలో స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా లేవు, నిర్వాహకులు సమయ పాలన పాటించడం లేదని గుర్తించారు. దీంతో రేషన్ దుకాణాన్ని సీజ్ చేశారు. అదేవిధంగా గ్రామంలోని 19వ నంబర్ రేషన్ డీలర్ కప్పల సుగంధ పేరు మీద ఉన్న దుకాణాన్ని అదే గ్రామానికి చెందిన బాకీ దాసు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సమయపాలన, రిజిస్టర్లు సక్రమంగా పాటించడం లేదని తనిఖీలో వెల్లడి కావడంతో ఈ దుకాణాన్నీ సీజ్ చేశారు. రెండు దుకాణాలకు చెందిన స్టాక్ రిజిస్టర్లు, దుకాణాల తాళాలు మహేశ్వరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాబురావు, వీఆర్వో రాములకు అప్పగించారు. రేషన్ దుకాణాల్లోని సరుకుల స్టాక్ వివరాలను ఆర్ఐ బాబురావు, వీఆర్వో రాములు నమోదు చేసుకున్నారు. -
173 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
దొనకొండ : నల్ల బజారుకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 173 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన మండలంలోని ఇండ్లచెరువు పంచాయతీ గుట్టమీదపల్లెలో బుధవారం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ సీఐ వి.శ్రీరామ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తమ్మనేని వెంకటేశ్వరరెడ్డి రేకుల షెడ్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ ఎస్పీ కేఎస్కే రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ వంగా సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వెళ్లి వెంకటేశ్వరరెడ్డికి చెందిన రేకుల షెడ్లో 175 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బాధ్యులైపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తహశీల్దార్ కేవీ సత్యనారాయణకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సూచించారు. పట్టుకున్న బియ్యాన్ని వీఆర్ఓ మాల్యాద్రికి అప్పగించామని సీఐ శ్రీరామ్ తెలిపారు. బియ్యం పట్టుకున్న వారిలో ఎస్సై సాంబయ్య, సిబ్బంది ఎ.సత్యం, వి.మల్లికార్జున్, రఘురామిరెడ్డిలు ఉన్నారు. మరోచోట 20 క్వింటాళ్లు.. పామూరు : నిబంధనలకు విరుద్ధంగా రెండు ఆటోల్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. మండలంలోని కంభాలదిన్నె జిల్లా పరిషత్ హైస్కూల్కు మధ్యాహ్న భోజన పథకం కోసం స్థానిక పౌరసరఫరాలశాఖ గోడౌన్ నుంచి రెండు ఆటోల్లో నిబంధనలకు విరుద్ధంగా 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పౌరసరఫరాలశాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది కలిసి ఆ రెండు ఆటోలను మండలంలోని నుచ్చుపొద గ్రామం వద్ద అడ్డగించి అందులో ఉన్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని నిర్దేశించి కాంట్రాక్టర్ వాహనంలో తరలించకపోవడం.. వాహనానికి ఎలాంటి బోర్డు లేకపోవడం.. బియ్య రిలీజ్ ఆర్డర్ లేకపోవడం.. రూట్ ఆఫీసర్ లేకపోవడం.. తదితర కారణాలతో వాహనాలను సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. వాహనదారులపై 6 ఏ కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. ఎక్కడైనా రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఆయనతో పాటు ఎస్సై మస్తాన్వలి, కనిగిరి ఎఫ్ఐ నాయబ్స్రూల్, ఆర్ఐ జి.పుల్లారెడ్డి, వీఆర్వోలు పి.రమేష్, ఎస్కే ర ఫీ, కాశయ్య ఉన్నారు. ఇంకో చోట 280 కేజీలు.. చీరాలటౌన్ : అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 280 కేజీల రేషన్ బియ్యాన్ని ఆర్ఐ మహేశ్వరి బుధవారం రాత్రి తన సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. పేరాల సాయిబాబా గుడి సమీపంలో ఓ మహిళ రేషన్ బియ్యాన్ని గోనె సంచుల్లో కట్టుకుని ఆటోలో తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందడంతో ఆర్ఐ తన సిబ్బందితో దాడి చేయగా ఆ మహిళ బియ్యం అక్కడే వదిలి పరారైంది. బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్ఐ చెప్పారు. తనతో పాటు వీఆర్వోలు రాంబాబు, రాము, సురేష్ ఉన్నట్లు పేర్కొన్నారు. -
రూ. 25లక్షల విలువైన విత్తనాలు సీజ్
ఎరువులు, విత్తనాల దుకాణాలపై విజిలెన్స్ దాడులు నరసరావుపేట టౌన్: నరసరావుపేట పట్టణంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. స్టేషన్రోడ్డులోని వెంకటేశ్వర సీడ్స్ దుకాణంలో విజిలెన్స్ సీఐ వంశీధర్, డీఈ సుందరబాబు, హెడ్కానిస్టేబుల్ రాంబాబులు తనిఖీ చేయగా నిబంధనలకు విరుద్ధంగా ఇతర జిల్లాలకు రూ.35 లక్షల మేర సీడ్స్ విక్రయించినట్లు నిర్థారించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్త దాడుల్లో భాగంగా ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఎరువులు, విత్తనాలు దుకాణాల్లో నిల్వలు, ఇతర జిల్లాలకు విక్రయాలు, రికార్డులు సక్రమంగా ఉన్నాయా లేదా అనే అంశాలతో పాటు విత్తనాలు, ఎరువులు ఎక్కడి నుంచి దిగుమతి చేస్తున్నారనేది ఆరా తీస్తున్నామని చెప్పారు. వెంకటేశ్వర సీడ్స్దుకాణంలో అక్రమంగా ఇతర జిల్లాలకు సీడ్స్ ఎగుమతి చేసినట్లు రికార్డుల ప్రకారం తేలడంతో ఆ షాపు యజమానిపై కేసు నమోదు చేయడంతోపాటు దుకాణంలో క్రయవిక్రయాలు నిలుపుదల చేయాలని ఆదేశించామన్నారు. షాపులో ఉన్న విత్తనాలకు, రిజిస్టర్లో పొందుపరిచిన లెక్కలకు వ్యత్యాసం ఉండడంతో అక్కడున్న రూ. 25లక్షల పైచిలుకు విలువగల విత్తనాలను సీజ్ చేశామన్నారు. రూ.5 లక్షల విలువైన పత్తి విత్తనాలు సీజ్.. మాడుగుల (గుర జాల): విజిలెన్స్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి ఆదేశాలమేరకు మాడుగుల గ్రామంలో విజిలెన్స్ అధికారులు శనివారం దాడులు చేపట్టారు. మండలంలోని మాడుగుల గ్రామంలో పురుగు మందులు విక్రయిస్తున్న వెంకటలక్ష్మీ ట్రేడర్స్, లక్ష్మీ ట్రేడర్స్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా ఈ షాపుల్లో పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రెండు షాపుల్లో రూ. 5 లక్షల విలువైన 540 ప్యాకెట్ల పత్తి విత్తనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఏవో వెంకట్రావు మాట్లాడుతూ అనుమతులు లేకుండా విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు విత్తనాలు కొనే సమయంలో జాగ్రత్తలు వహించాలన్నారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని రైతులకు సూచించారు. గ్రామంలో విజిలెన్సు అధికారుల రాకను పసిగట్టిన యజమానులు తమ షాపులను మూసివేశారు. గురజాల మండల వ్యవసాయాధికారి అంజిరెడ్డికి మూసివేసిన షాపులను అదివారం, సోమవారం విచారించాల్సిందిగా సూచించారు. దాడుల్లో విజిలెన్స్ ఎస్ఐ షేక్ కాశీంసాహెబ్, విజిలెన్స్ ఫారెస్టు అధికారి శ్రీరాములు, గురజాల వ్యవసాయాధికారి బి.అంజిరెడ్డి, గ్రామరెవెన్యూ అధికారి పద్మ, విజిలెన్స్ కానిస్టేబుళ్లు రమేష్, నాగరాజు పాల్గొన్నారు. 300 బస్తాల వరి విత్తనాలు స్వాధీనం రెంటాల (రెంటచింతల): రెంటాల గ్రామంలోని ఓ నివాసంలో అక్రమంగా నిల్వచే సిన 300 బస్తాల వరి విత్తనాలను శనివారం రాత్రి మండల వ్యవసాయాధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన పూజల చిన్ననాగేశ్వరావు నివాసంలో లెసైన్స్ లేకుండా నంద్యాలకు చెందిన నీలకంటేశ్వర సీడ్స్ కంపెనీ బీపీటీ వరి విత్తనాల బస్తాలను నిల్వ చేసి బిల్లు లేకుండా విక్రయిస్తున్నాడు. గ్రామస్తుల సమాచారం మేరకు జేడీఏ వి.శ్రీధర్ ఆదేశాల మేరకు ఏవో నరసింహారావు, ఏఈవో తారాసింగ్లు దాడిచేసి విత్తనాలను స్వాధీనం చేసుకొని కేసునమోదు చేశారు. వీటి విలువ రూ.3.60 లక్షలు ఉంటుందన్నారు. విత్తన బస్తాలను రెంటచింతల మార్కెట్ యార్డ్కు తరలిస్తున్నట్లు ఏవో తెలిపారు. దాడిలో ఇన్చార్జి ఆర్ఐ కటికల బాలయ్య, మార్కెట్ అధికారి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement