-
Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
లాస్ ఏంజెలిస్: గాజాలో తక్షణ కాల్పుల విరమణ డిమాండ్తో లాస్ ఏంజెలిస్ నగరంలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థులు, నిరసనకారుల తాత్కాలిక శిబిరాలను పోలీసులు చెల్లాచెదురుచేశారు. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల నిరసనకారులకు మధ్య ఘర్షణతో వర్సిటీలో బుధవారం ఉద్రిక్తత నెలకొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు వర్సిటీలోకి ప్రవేశించారు. టెంట్లను తొలగించి నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో 1000 మందికిపైగా నిరసనకారులు పోలీసులను ప్రతిఘటించారు. ‘‘ జరిగింది చాలు శాంతించండి’’ అని వర్సిటీ చాన్స్లర్ జీన్ బ్లాక్ వేడుకున్నారు. డార్ట్మౌత్ కాలేజీలో టెంట్లు కూల్చేసి 90 మందిని పోలీసులు అరెస్ట్చేశారు. ఏప్రిల్ 17న కొలంబియాలో మొదలైన ఈ పాలస్తీనా అనుకూల నిరసన ఉదంతాల్లో అమెరికావ్యాప్తంగా 30 విద్యాలయాల్లో 2,000 మందికిపైగా అరెస్ట్చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ‘అసమ్మతి ప్రజాస్వామ్యానికి కీలకం. అయితే శాంతిభద్రతలకు విఘాతం కల్గించేస్థాయికి అసమ్మతి పెరిగిపోకూడదు’’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. బ్రిటన్లోని బ్రిస్టల్, లీడ్స్, మాంచెస్టర్, న్యూక్యాజిల్, షెఫీల్డ్ వర్సిటీల్లోనూ నిరసనకారుల శిబిరాలు వెలిశాయి. యూనివర్సిటీ కాలేజ్ లండన్లలో ఇప్పటికే నిరసనకారులు ఆందోళనలు మొదలెట్టారు. ఫ్రాన్స్, లెబనాన్, ఆ్రస్టేలియాలకూ నిరసనలు విస్తరించాయి. -
Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలో ఉద్రిక్తత
లాస్ఏంజెలిస్: పాలస్తీనా–ఇజ్రాయెల్ రగడ అమెరికాలో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. లాస్ ఏంజెలిస్లోని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాలో పాలస్తీనా, ఇజ్రాయెల్ అనుకూల వర్గాల విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బైడెన్ ప్రభుత్వ ఇజ్రాయెల్ అనుకూల విధానాలను నిరసిస్తూ పాలస్తీనా వర్గం వర్సిటీలో టెంట్లు వేసుకుని నిరసనలను సాగిస్తున్న విషయం తెలిసిందే. హెల్మెట్లు, మాస్కులు ధరించిన కొందరు కర్రలు చేతబట్టుకుని మంగళవారం అర్ధరాత్రి టెంట్లపైకి దాడికి దిగారు. బాణసంచా కూడా కాల్చినట్టు లాస్ఏంజెలెస్ టైమ్స్ తెలిపింది. ఈ సందర్భంగా ఇరువర్గాల వారు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కుర్చీలతోపాటు అందిన వస్తువులను విసురుకున్నారు. వర్సిటీని పాలస్తీనా అనుకూల వర్గాలు ఆక్రమించుకుని తమను లోపలికి రానివ్వడం లేదన్న ఇజ్రాయెల్ అనుకూల విద్యార్థుల ఆరోపణల నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. హింసాత్మక ఘటనల కారణంగా వర్సిటీలో బుధవారం తరగతులు రద్దయ్యాయి. సోమవారం కొలంబియా వర్సిటీ కూడా ఈ ఘర్షణలకు వేదికవడం తెలిసిందే. హామిల్టన్ హాల్లో దాదాపు 20 గంటలపాటు తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థులను పోలీసులు బలవంతంగా బయటకు పంపించారు. వర్సిటీతోపాటు సిటీ కాలేజీలో ఆందోళనలకు దిగిన దాదాపు 300 మందిని అరెస్టు చేశారు. నార్తర్న్ ఆరిజోనా యూనివర్సిటీలో టెంట్లు వేసి నిరసన సాగిస్తున్న పాలస్తీనా అనుకూల విద్యార్థులను పోలీసులు ఖాళీ చేయించారు. కొద్ది వారాలుగా అమెరికాలో పాలస్తీనా, ఇజ్రాయెల్ విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు వర్సిటీలకు విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. రోడ్ ఐలాండ్స్ క్యాంపస్లో ఆందోళన చేస్తున్న పాలస్తీనా అనుకూల విద్యార్థి వర్గంతో బ్రౌన్ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే అక్టోబర్ నుంచి వర్సిటీలోకి ఇజ్రాయెల్ వ్యక్తుల పెట్టుబడులను స్వీకరించరాదనేది వారిలో ప్రధాన షరతు. ఆందోళనకారుల డిమాండ్కు ఇలా ఒక యూనివర్సిటీ తలొగ్గడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారని చెబుతున్నారు! -
‘శెభాష్ ప్రజ్ఞ’.. సీజేఐ సన్మానం
న్యూఢిల్లీ: కలలు కనడం సులువే. వాటిని నెరవేర్చుకోవడమే కష్టం. నిరంతర శ్రమ, పట్టుదల, అంకితభావంతో కలలు సాకారం చేసుకొనేవారు కొందరే ఉంటారు. అలాంటి కొందరిలో ఒకరే ప్రజ్ఞ. సుప్రీంకోర్టులో పని చేస్తున్న వంట మనిషి కుమార్తె ప్రజ్ఞ(25) అమెరికాలోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ అభ్యసించే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. న్యాయశాస్త్రంలో ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్న ప్రజ్ఞను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్తోపాటు ఇతర న్యాయమూర్తులు బుధవారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆమె ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, దేశానికి సేవలందించాలని వారు ఆకాంక్షించారు. భారత రాజ్యాంగంపై రచించిన మూడు పుస్తకాలపై వారంతా సంతకాలు చేసి, ఆమెకు బహూకరించారు. స్వయంకృషి, పట్టుదలతో ప్రజ్ఞ ఈ స్థాయికి చేరుకున్నారని, భవిష్యత్తులో ఆమెకు తమ వంతు తోడ్పాటు అందిస్తామని జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. పిల్లలు వారి కలలు నెరవేర్చుకొనేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు తల్లిదండ్రులపైనా ఉందని సూచించారు. సన్మాన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించిన ప్రజ్ఞ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. వారిని కూడా న్యాయమూర్తులు సన్మానించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయా, యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్లో మాస్టర్స్ చదవడానికి ప్రజ్ఞకు అవకాశం దక్కింది. స్కాలర్షిప్ లభించింది. ఆమె తండ్రి అజయ్ సమాల్ సుప్రీంకోర్టు వంట మనిషి. న్యాయశాస్త్రంలో ఉన్నత చదవులు చదవడానికి జస్టిస్ డీవై చంద్రచూడ్ తనకు స్ఫూర్తిగా నిలిచారని ప్రజ్ఞ చెప్పారు. ప్రజ్ఞ ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్లో రీసెర్చర్గా పనిచేస్తున్నారు. -
హైహై నాయికా
నాయకత్వ లక్షణాల్లో ఎవరు గొప్ప.. మహిళలా.. పురుషులా? దీనిచుట్టూ జరిగిన అనేక పరిశోధనలు, అధ్యయనాల్లో బయటపడింది ఏమంటే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా మహిళల్లోనే మెరుగ్గా ఉంటాయట!. అమెరికాకు చెందిన ప్యూ రిసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం ఒక మంచి నేతకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు నిజాయితీ, మేధాశక్తి, కరుణతోపాటు సృజనాత్మకత. ఈ లక్షణాలు ఎక్కువగా మహిళల్లోనే ఉంటాయని ఈ సంస్థ పరిశోధనాత్మక వ్యాసంలో పేర్కొంది. ఇతరులు చెప్పేది వినడం, తనతోపాటు అందరి అభివృద్ధికి సాయం చేయడం, ఎలాంటి పరిస్థితులనైనా సృజనాత్మకతతో ఎదుర్కోవడం వంటి నాయకత్వ లక్షణాలు మహిళల్లో అధికంగా ఉంటాయని అమెరికాకు చెందిన నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎలైస్ ఈగ్లొ వెల్లడించారు. సాధారణ పరిస్థితుల్లో స్త్రీ, పురుషులు దాదాపు ఒకేవిధమైన నిర్ణయాలు తీసుకున్నా అధిక ఒత్తిడిలో పురుషులు ప్రమాదంతో కూడిన క్లిష్టమైన నిర్ణయాలు తీసుకుంటారని, కానీ మహిళలు ఒత్తిడిలోనూ సానుకూల నిర్ణయాలు తీసుకుంటారని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. అధిక ఒత్తిడికి లోనైనప్పుడు మనిషి లో కార్టిసొల్ అనే హార్మోన్ అధికంగా విడుదల అవుతుంది. ఈ కార్టిసొల్ హార్మోన్ విడుదలైనప్పుడు అది మనం తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. కార్టిసొల్ స్థాయి పెరిగినా మహిళల మెదడు పురుషులకంటే సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు శాస్త్రీయ పరిశోధనలో వెల్లడైంది. మందకొడిగా నాయకత్వ హోదా.. ఒక మహిళ మంచి నాయకురాలిగా రాణించగలదని సామాజిక, శాస్త్రీయ పరిశోధనలు, అధ్యయనాలు చెబుతున్నా ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు నాయకత్వ హోదాలోకి ఎదగడం అత్యంత మందకొడిగా సాగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నాయకత్వ హోదా విషయంలో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం సాధించడానికి ఇంకో 130 ఏళ్లు పడుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా. ప్రస్తుత పరిస్థితి ఇదీ.. ♦ గతేడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లోనే మహిళలు దేశాధ్యక్ష లేదా ప్రభుత్వ అధినేత్రి హోదాలో ఉన్నారు. అందులో భారత్ సహా 13 దేశాల్లో అధినేత్రిలుగానూ మరో 15 దేశాల్లో ప్రభుత్వ అధినేత్రిలుగా ఉన్నారు. ♦అన్ని దేశాలు కలిపి మంత్రుల స్థానాల్లో 21 శాతమే మహిళలు ఉన్నారు. 14 దేశాల్లో మాత్రమే మంత్రివర్గాల్లో సగం లేదా ఆపైన అతివలు ఉన్నారు. ♦ ప్రస్తుతానికి అన్ని దేశాల పార్లమెంటుల్లో కలిపి 26 శాతం మహిళా అభ్యర్థులు సభ్యులుగా ఉన్నారు. 1995 నాటికి ఇది 11 శాతమే ఉండేది. వీటిలో ఐదు దేశాల్లో సగానికిపైగా మహిళా పార్లమెంటు సభ్యులు ఉన్నారు. రువాండాలో 61 శాతం, క్యూబాలో 53 శాతం, నికరగ్వాలో 51, మెక్సికోలో 50, యూఏఈలో 50 శాతం మంది మహిళలు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. ♦ మరో 27 దేశాల్లో మహిళా పార్లమెంటు సభ్యులు 40 శాతానికిపైగా ఉన్నారు. అందులో 15 యూరప్లో, 5 లాటిన్ అమెరికా దేశాల్లో, 5 ఆఫ్రికాలో, చెరొకటి ఆసియా, పసిఫిక్ దేశాల్లో ఉన్నాయి. ఇందులో అధిక దేశాల్లో మహిళల కోసం పార్లమెంటు స్థానాల్ని రిజర్వు చేయడం వల్ల సాధ్యమైంది. ♦ ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల్లో పార్లమెంటులో 10 శాతం కన్నా తక్కువగా మహిళలు ఉన్నారు. అందులో మూడు దేశాల్లో ఒక్క మహిళ కూడా పార్లమెంటులో లేరు. అవి మైక్రోనేసియా, పపువా న్యూగినియా, వనౌతు దేశాలు. ♦136 దేశాల సమాచారం క్రోడీకరిస్తే స్థానిక సంస్థలకు ఎన్నికైన మహిళల సంఖ్య 30 లక్షలుగా (34 శాతం) ఉంది. ఈ విషయంలో ప్రపంచ సగటు కంటే భారత్లో స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం మెరుగ్గా ఉంది. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కారణంగా మనదేశంలో మొత్తంగా మహిళా ప్రాతినిథ్యం 44 శాతానికి పెరిగింది. అదే ఫ్రాన్స్లో 40, బ్రిటన్లో 34, జర్మనీలో 27.5, చైనాలో 23, జపాన్లో 13 శాతంగా ఉంది. ♦ భారత్లో మొత్తం 2.5 లక్షల పంచాయతీలు ఉండగా మొత్తం 32 లక్షల మంది వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో 14.5 లక్షల మంది మహిళలే. అత్యధికంగా ఉత్తరాఖండ్లో మహిళా ప్రాతినిధ్యం 54.8 శాతం ఉండగా అత్యల్పంగా జమ్మూకశ్మీర్లో 32 శాతం ఉంది. ♦ మహిళలు నేతృత్వం వహిస్తున్న స్థానిక సంస్థల పనితీరు మెరుగ్గా ఉంటోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ♦ భారత్లో మంచినీటి ప్రాజెక్టులు విషయంలో పురుషులు నేతృత్వం వహిస్తున్న పంచాయతీలకన్నా మహిళా నాయకత్వంలోని పంచాయతీల్లోనే 62 శాతం అధికంగా ఉన్నాయని తేలింది. ♦ ప్రపంచవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో మహిళా ప్రాతినిధ్యం 50 శాతం దాటిన దేశాలు రెండే ఉన్నాయి. మరో 20 దేశాల్లో 40 శాతంగా ఉంది. అధినాయికలు నామమాత్రమే.. ప్రపంచవ్యాప్తంగా 1960 నుంచి ఇప్పటివరకు 59 దేశాల్లో మహిళలు అత్యున్నత స్థానాన్ని అధిరోహించారు. మొత్తంగా 77 మంది మహిళలు ఉన్నత స్థానాలకు ఎదిగారు. 1960లో సిరిమావో బండారునాయికే శ్రీలంక ప్రధానిగా ఎన్నికై ప్రపంచంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన తొలి మహిళా నేతగా ఖ్యాతిగాంచారు. ఈ ఏడాది ప్రారంభం నాటికి 15 దేశాలకు మహిళలు నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో ఇటలీ, హొండురస్లో తొలిసారి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకున్నాయి. నిరంతరాయంగా అత్యధిక కాలం దేశాధినేతగా కొనసాగిన కీర్తి జర్మనీకి చెందిన ఎంజెలా మెర్కెల్కు దక్కింది. ఆమె జర్మనీ చాన్సలర్గా 16 ఏళ్ల 16 రోజులు ఉన్నారు. ఆ తరువాత స్థానాల్లో డొమినికన్ రిపబ్లిక్కు చెందిన దామె యుజెనియా చార్లెస్ (14 ఏళ్ల 328 రోజులు), లైబిరియాకు చెందిన ఎలెన్ జాన్సన్ సిర్లీఫ్ (12 ఏళ్ల 6 రోజులు) ఉన్నారు. మధ్యలో అంతరాయం వచ్చినా మొత్తంగా అత్యధికకాలం ప్రభుత్వాధినేత్రి హోదాలో ఉన్న ఘనత ఇందిరాగాందీకి కూడా దక్కుతుంది. ఆమె భారత్ ప్రధానిగా మొత్తం 16 ఏళ్ల 15 రోజులు పనిచేశారు. ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఏకంగా 19 ఏళ్లకుపైగా ప్రధాని పదవిని అలంకరించారు. - దొడ్డ శ్రీనివాసరెడ్డి -
స్ఫూర్తి: ముంబై మురికివాడ నుంచి... యూఎస్ యూనివర్శిటీ వరకు!
దురదృష్టం ఒక ద్వారం మూసిపెడితే, కష్టపడేతత్వం పదిద్వారాలను తెరిచి ఉంచుతుంది... అంటారు. ముంబై పేవ్మెంట్స్పై పూలు అమ్మిన సరిత మాలికి ‘యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా’లో పీహెచ్డి చేసే అవకాశం లభించింది. ఈ విజయానికి కారణం ఆమె ఇష్టపడే కష్టపడేతత్వం... సరిత మాలి తల్లిదండ్రులు ఉత్తర్ప్రదేశ్లోని మూరుమూల ప్రాంతం నుంచి పొట్ట చేతపట్టుకొని మహానగరం ముంబైకి వచ్చారు. అక్కడి ఘడ్కోపర్ మురికివాడలో పుట్టి పెరిగింది సరిత.స్థానిక మున్సిపల్ స్కూల్లో పదవతరగతి చదువుకుంది. ఆ తరువాత కాలేజి చదువు కొనసాగిస్తూనే ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టింది. ట్యూషన్స్ చెప్పగా వచ్చిన డబ్బులను జాగ్రత్తగా దాచుకునేది. పై చదువులకు అవి ఎంతో కొంత సహాయపడ్డాయి. ఒకసారి సెలవులలో అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లినప్పుడు, బంధువులలో ఒకరు దిల్లీలోని ‘జేఎన్యూ’ గురించి గొప్పగా చెప్పారు. ఆ సమయంలోనే అనుకుంది...ఆ యూనివర్శిటీలో ఎలాగైనా చేరాలని! ఆ ఉత్సాహంపై నీళ్లుపోసే మాటలు ఎదురయ్యాయి. ‘జేఎన్యూలో అడ్మిషన్ దొరకడం అంతేలికైన విషయం కాదు’ ‘తెలివైన విద్యార్థులు మాత్రమే అక్కడ చదువుకుంటారు’... మొదలైనవి. ఆ తెలివైన విద్యార్థి తాను ఎందుకు కాకూడదు? అని మనసులో గట్టిగా అనుకుంది సరిత. బీఏ మొదటి సంవత్సరం నుంచే ప్రవేశపరీక్షకు ప్రిపేర్ కావడం మొదలుపెట్టింది! ఆమె కష్టం వృథా పోలేదు. ప్రసిద్ధమైన యూనివర్శిటీలో ఎం.ఏ హిందీలో ఆమెకు సీటు వచ్చింది. ‘నేను మరిచిపోలేని రోజు, నా జీవితాన్ని మలుపు తిప్పిన రోజు అది. జేఎన్యూలో విస్తృతమైన∙ప్రపంచాన్ని చూశాను. ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలిగాను’ అంటుంది సరిత. యూనివర్శిటీలో తనతో ఒక్కొక్కరూ ఒక్కోరకంగా వ్యవహరించేవారు. పేదకుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన యంగెస్ట్ రిసెర్చ్ స్కాలర్గా తనను స్ఫూర్తిగా తీసుకున్నవారు కొందరైతే,‘సాఫ్ట్వేర్ సైడ్ వెళ్లకుండా ఈ సాహిత్యం, కవిత్వం వల్ల ఉపయోగం ఏమిటి?’ అని తక్కువ చేసి మాట్లాడిన వారు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ, తన మాటల్లో చెప్పాలంటే ‘జేఎన్యూ’ సరితకు మరోప్రపంచాన్ని చూపింది. జేఎన్యూలో ఎంఫిల్ పూర్తి చేసిన సరితకు తాజాగా ‘యూనివర్శిటి ఆఫ్ కాలిఫోర్నియా’లో పీహెచ్డి(హిందీ సాహిత్యం) చేసే అవకాశం లభించింది. ‘భక్తి ఉద్యమకాలంలో అట్టడుగు వర్గ మహిళల సాహిత్యం’ అనేది ఆమె పీహెచ్డి అంశం. ‘నాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంతో ఇష్టం. అయితే పేదరికం వల్ల ఎన్నోసార్లు చదువు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చినా నేను వెనక్కి తగ్గలేదు. ఏదో రకంగా కష్టపడి చదువుకున్నాను. నాకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల సహకారం మరవలేనిది. భవిష్యత్లో పేదపిల్లలకు నా వంతుగా సహాయపడాలనుకుంటున్నాను’ అంటుంది 28 సంవత్సరాల సరిత మాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అడవిమామిడిపల్లిలో అగ్నిప్రమాదం
Lok Sabha Election 2024: పోలింగ్ బూత్ గుర్తింపు...మొబైల్ నంబర్తో
మంటలు అంటుకొని రైతు మృతి
బాధిత జర్నలిస్టుకు ఆర్థికసాయం
కడియం ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
రగులుతున్న క్యాంపస్లు!
మహిళలు వ్యాపారాల్లో రాణించాలి
అభివృద్ధే ప్రధాని మోదీ లక్ష్యం
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
సీత్యతండాలో అగ్ని ప్రమాదం
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement