-
Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
న్యూఢిల్లీ/బిష్కెక్: స్థానికులు, విదేశీయులకు మధ్య ఘర్షణలతో కిర్గిజ్స్తాన్ రాజధాని బిష్కెక్ అట్టుడికిపోతోంది. విదేశీయులను లక్ష్యంగా చేసుకుని కొందరు స్థానికులు దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడి మెడికల్ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న ఇండియా, పాకిస్తాన్ విద్యార్థులపై అల్లరి మూకలు దాడులకు దిగుతున్నాయి. ఈ నేపథ్యలో బిష్కెక్లోని భారతీయ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం శనివారం సూచించింది. గొడవలు సద్దుమణిగేదాకా ఎవరూ బయటకు రావొద్దని, హాస్టళ్లు, ఇళ్లల్లో ఉండాలని స్పష్టం చేసింది. భారతీయ విద్యార్థులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నామని కిర్గిజ్స్తాన్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. బిష్కెక్ లో పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని, అయినప్పటికీ విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని, హాస్టళ్లు, ఇళ్లల్లో ఉండాలని స్పష్టంచేసింది. ఏదైనా సహాయం కావాలంటే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని బిషె్కక్లోని భారతీయ విద్యార్థులకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సూచించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మన విద్యార్థుల భద్రత గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కిర్గిజ్స్తాన్లో ప్రస్తుతం దాదాపు 14,500 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఎంత మంది బిష్కెక్లో ఉన్నారన్నది ఇంకా తెలియరాలేదు. అయితే, బిషె్కక్లో ప్రశాంతమైన వాతావరణ ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం, పౌరుల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కిర్గిజ్స్తాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. ఎందుకీ ఘర్షణలు? కిర్గిజ్స్తాన్లో అలజడికి మూలాలు ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఉన్నాయి. ఒకప్పటి సోవియట్ యూనియన్లో భాగమైన కిర్గిజ్స్తాన్ 1991లో స్వతంత్ర దేశంగా మారింది. ఇక్కడి అధికారిక భాష రష్యన్. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా హఠాత్తుగా దాడి చేయడంతో కిర్గిజ్స్తాన్కు ఒక్కసారిగా కష్టాలు వచి్చపడ్డాయి. రష్యా నుంచి వచ్చే పెట్టుబడులు ఆగిపోయాయి. రష్యాలోని కిర్గిజ్స్తాన్ కారి్మకులకు వేతనాలు రాక సొంత దేశానికి డబ్బులు పంపడం లేదు. దీనికితోడు కిర్గిజ్స్తాన్పై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. మరోవైపు రష్యా నుంచి లక్షలాది మంది కిర్గిజ్స్తాన్కు వలస వస్తున్నారు. కుటుంబాలతో సహా ఇక్కడే స్థిరపడుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే 2022 సెపె్టంబర్ నుంచి ఇప్పటిదాకా 1,84,000 రష్యన్లు కిర్గిజ్స్తాన్కు తరలివచ్చారు. ఆర్థిక పరిస్థితి దిగజారడంతో పరిశ్రమలు, దుకాణాలు మూతపడుతున్నాయి. స్థానికులు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతున్నారు. దాంతో వారిలో అసంతృప్తి, అసహనం పెరిగిపోతోంది. విదేశీయులను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నారు. ప్రధానంగా రాజధాని బిషె్కక్లోని వైద్య విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్టు సహా ఇతర దేశాల విద్యార్థులపై వారి కన్నుపడింది. విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లు, ఇళ్లల్లోకి గుంపులు గుంపులుగా చొరబడిమరీ దాడి చేస్తున్నారు. ఇదే అదనుగా అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. విద్యార్థులు సైతం ప్రతిఘటిస్తుండడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇరువర్గాల మధ్య దాడుల్లో ఇప్పటికే పలువురు గాయపడ్డారు. ముగ్గురు పాకిస్తాన్ విద్యార్థులు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. -
China–Russia relations: ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం
బీజింగ్: ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోవడానికి త్వరలోనే రాజకీయ పరిష్కారం కనుగొంటామని చైనా అధినేత షీ జిన్పింగ్ సంకేతాలిచ్చారు. ఐరోపా ఖండంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. గురువారం చైనా రాజధాని బీజింగ్లో రష్యా అధ్యక్షుడు పుతిన్తో జిన్పింగ్ సమావేశమయ్యారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. చైనా–రష్యా మధ్య వ్యూహాత్మక సంబంధాలను దెబ్బతీసేందుకు అమెరికా చేసే ప్రయత్నాలను సహించకూడదని, గట్టిగా ఎదిరించాలని నిర్ణయానికొచ్చారు. తమ రెండు దేశాల సంబంధాల్లో కలుగజేసుకోవద్దని అమెరికాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అంతకుముందు రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఉయదం రష్యా నుంచి చైనాకు చేరుకున్న పుతిన్కు ఘన స్వాగతం లభించింది. ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పుతిన్ తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. చర్చల అనంతరం జిన్పింగ్, పుతిన్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్ సంక్షోభానికి త్వరగా తెరపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చైనా–రష్యా సంబంధాలను మూడోదేశం ప్రభావితం చేయలేదని పేర్కొన్నారు. అలా ప్రభావితం చేసేందుకు సాగే ప్రయత్నాలను అడ్డుకుంటామని వెల్లడించారు. తమ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయని స్పష్టం చేశారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలం కంటే ఇప్పుడు తమ బంధం ఇంకా దృఢమవుతోందని పేర్కొన్నారు. తమ చట్టబద్ధమైన హక్కులను, ప్రయోజనాలను కచి్చతంగా కాపాడుకుంటామని తేలి్చచెప్పారు. అణు ఇంధనం నుంచి ఆహార సరఫరా దాకా భిన్న రంగాల్లో చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని పుతిన్ వెల్లడించారు. రష్యాలో చైనా కార్ల తయారీకి ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభానికి తెరదించే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నందుకు చైనాకు పుతిన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చైనా–రష్యా మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా ఒకఒప్పందంపై జిన్పింగ్, పుతిన్ సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. ఇరుదేశాల అధికారుల మధ్య విస్తృత స్థాయి చర్చల తర్వాత 30 పేజీల ఈ ఒప్పందం డాక్యుమెంట్ను సిద్ధం చేసినట్లు రష్యా ప్రతినిధి యూరి ఉషకోవ్ చెప్పారు. -
పశ్చిమాసియా ఘర్షణ ఆర్థికానికి చేటే!
భారీ ఆర్థిక వ్యవస్థల కంటే భారత్ మెరుగైన వృద్ధి రేటు నమోదు చేయగల సమయంలో ఇరాన్ , ఇజ్రాయెల్ల మధ్య ఘర్షణ మొదలైంది. గల్ఫ్ ముడిచమురుపై భారత్ ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో రవాణాలో వచ్చే ఇబ్బంది ఏదైనా మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. పైగా యుద్ధం ముదిరితే ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు కొండెక్కుతాయి. అత్యధిక లాభాలనిచ్చే యూరోపియన్ మార్కెట్లకు భారత్ తన సరుకులు రవాణా చేయడం కూడా కష్టమవుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటి అంటే... పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం నుంచి మన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోగలదా అన్నది!పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలు భారత్ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. తీవ్రత, నష్టం ఏమిటన్నవి ఇంకా అంచనా వేయాల్సే ఉన్నా ఈ ఆర్థిక సంవత్సరంలో బాహ్య పరిణామాలు మన ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ముప్పు కాగలవని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఉక్రెయిన్ , రష్యా మధ్య 2022లో యుద్ధం మొదలైన తరువాత పలు దేశాల్లో పరిస్థితులు మారినట్లే పశ్చిమాసియా పరిణామాలు కూడా అంతర్జాతీయంగానే కాకుండా, స్థానికంగానూ కలకలం సృష్టించనున్నాయి. పరిస్థితి సద్దు మణగకుంటే... లేదా మరింత దిగజారితే ఇప్పటికే ఎదురవుతున్న పలు సవాళ్లను తట్టుకోవడం కష్టమని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం ఇక్కడ ప్రస్తావనార్హం. అంతేకాదు... కొన్ని అసందిగ్ధ పరిస్థితులు ఎదు ర్కోవాల్సి రావచ్చు అని కూడా ఆమె సూచనప్రాయంగా తెలిపారు. సప్లై చెయిన్ లో వచ్చే ఇబ్బందుల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశముందని అంటున్నారు కేంద్ర మంత్రి. ఆర్థిక పరిపుష్టి మార్గంలో కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయన్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వ్యాఖ్యలు అర్థం చేసుకోదగ్గవే. ప్రపంచంలోని భారీ ఆర్థిక వ్యవస్థల కంటే భారత్ మెరుగైన వృద్ధి రేటు నమోదు చేయగల సమయంలో ఇరాన్ , ఇజ్రాయెల్ల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ(స్థూల జాతీయోత్పత్తి) 7 శాతం కంటే ఎక్కువ ఉండవచ్చునని ప్రభుత్వం ఉత్సాహంగా ఉన్న వేళ అంతర్జా తీయ సంస్థలు కూడా తమ అంచనాలను సవరించుకుంటున్న విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (అంత ర్జాతీయ ద్రవ్యనిధి – ఐఎంఎఫ్) ఇటీవలే భారత్ జీడీపీ వృద్ధిరేటును 6.5 నుంచి 6.8 శాతానికి సవరించింది. ప్రపంచ బ్యాంకు కూడా 6.4 నుంచి 6.6 శాతానికీ, ‘స్టాండర్డ్ అండ్ పూర్ గ్లోబల్’ 6.4 నుంచి 6.8 శాతానికీ ఈ ఆర్థిక సంవత్సరపు భారత జీడీపీ రేటును సవరించాయి. అయితే ఈ అద్భుతమైన పురోగతిని అంతర్జాతీయ అంశాలు నిరాశా పూరితం చేసే అవకాశం ఉంది. రానున్న వారాల్లో పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితులు ఒక దశ దాటాయంటే మాత్రం ఇప్పటివరకూ హెచ్చరికలు అనుకుంటున్న పలు ఘటనలు వాస్తవం కావచ్చు. ఒకవేళ ఇరాన్ తన హోర్ముజ్ జలసంధి ద్వారా ముడిచమురు, సహజవాయువు రవాణాలను నిలిపివేసిందని అనుకుందాం. పెర్షియన్ , ఒమాన్ గల్ఫ్లను కలిపే ఈ సన్నటి రవాణా మార్గాన్ని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గంగా యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ గుర్తించింది. పర్షియన్ గల్ఫ్ నుంచి రవాణా అయ్యే ముడిచమురులో 80 శాతం ఈ జలసంధి ద్వారానే ఖండాలు మారుతుంది. భారత దేశం కూడా ఈ ప్రాంతపు ముడిచమురుపై ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో రవాణాలో వచ్చే ఇబ్బంది ఏదైనా మనపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. భారత్ ఉపయోగించే ముడిచమురులో 30 శాతం వరకూ రష్యా నుంచే వస్తున్నా మిగిలిన మొత్తం సౌదీ అరేబియా, పశ్చిమాసియా, యూఏఈ వంటి దేశాల నుంచే వస్తూండటం గమనార్హం. హోర్ముజ్ జలసంధి ఎంత కీలకమో దీనిద్వారా అర్థం చేసుకోవచ్చు. రెండో అంశం... పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగితే సూయిజ్ కాలువను కూడా మూసివేసే అవకాశం ఉంది. ఆసియా నుంచి ఎర్ర సముద్రం మీదుగా ఈ కాలువకు వెళ్లే మార్గం బాబ్ ఎల్–మందేబ్ అనే చిన్న కాలువ దగ్గరి నుంచి మొదలవుతుంది. యెమెన్ కేంద్రంగా పనిచేసే హౌతీ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్న ప్రాంతమిదే. వీరంతా హమాస్కు మద్దతుగా ఉన్నవారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రవాణా కొంత ‘కేప్ ఆఫ్ గుడ్హోప్’ (దక్షిణాఫ్రికా) మీదుగా మళ్లింది. ఫలితంగా రవాణ ఖర్చులు పెరిగిపోవడమే కాదు... సమయం కూడా ఎక్కువవుతోంది. పరిస్థితి ముదిరితే అత్య ధిక లాభాలనిచ్చే యూరోపియన్ మార్కెట్లకు భారత్ తన సరుకులు రవాణా చేయడం కష్టమవుతుంది. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఎగుమతులు స్తంభించిపోతే వాణిజ్య ప్రవాహాలు తీవ్రస్థాయిలో ప్రభావితమవుతాయి.మూడో ప్రమాదం ఇంకోటి ఉంది. యుద్ధం ముదిరితే ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు కొండెక్కుతాయి. బారెల్కు 75–80 డాలర్ల అత్యంత తక్కువ శ్రేణి ధరలు ఇప్పటికే లేకుండాపోయాయి. ప్రస్తుతం బ్రెంట్ ముడిచమురు ధరలు 87 నుంచి 89 డాలర్ల మధ్య ఉన్నాయి. ఇప్పటికైతే ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య ఘర్షణ ఈ ధరల మీద పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఇంకొంచెం తీవ్రమైతే అవి పెరగడం ఖాయం.ముడిచమురు ధరలు పెరిగితే ఏమవుతుందో మనందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వ ఖర్చులు పెరిగిపోతాయి. కరెంట్ అకౌంట్పై ఒత్తిడి పెరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు పెట్రోలు, డీజిళ్ల ధరలు పెంచాలని చమురు కంపెనీలు ఇప్పటికే కోరుతూండటం గమనార్హం. ఇది బహుశా ఎన్నికల తరువాతే జరగవచ్చు. అయినా, ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం పడటం ఖాయం. ముడి చమురుకు మనం పెట్టే ఖర్చు మాటెలా ఉన్నా... పశ్చిమాసియా మీద అలుముకున్న యుద్ధమేఘాలు తొలగకపోతే మన వ్యూహా త్మక అవసరాల కోసం స్థిరంగా చమురు అందుబాటులో ఉండటమూ అత్యంత కీలకమే. మన దేశ చమురు అవసరాల్లో 80 శాతం దిగు మతులతోనే తీరుతున్నాయన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి.ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటి అంటే?... పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం నుంచి మన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోగలదా? అన్నది. ప్రస్తుతం మన చేతుల్లో ఏమీ లేదు కానీ... మనకు మిత్రదేశాలే అయిన ఇజ్రాయెల్, ఇరాన్ లకు నిగ్రహం పాటించమని కోరడం మాత్రం చేయదగ్గ పనే. ముడిచమురు విషయానికి వస్తే ఇటీవలి కాలంలో వేర్వేరు మార్గాల ద్వారా కొను గోలు చేయడం కొంచెం ఎక్కువైంది. అలాగని గల్ఫ్ నుంచి వచ్చే లోటు మొత్తం భర్తీ అవుతుందని కాదు. కానీ ఈ మార్గాల గుండా వచ్చే ఇతర సరుకుల విషయంలో మాత్రం ప్రత్యామ్నాయాలు వెత కడం అసాధ్యం. కానీ ఈ ప్రవాహానికి ఆటంకాలు ఎదురుకావొచ్చు. ఇలాంటి పరిణామాలే ఎదురైతే రానూ పోనూ సరుకుల ఖర్చులు తడిసి మోపెడవుతాయి.ఘర్షణ తాలూకు ఇతర ప్రభావాలను ఇప్పుడే అంచనా వేయ లేము. కానీ ఉదాహరణకు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు వేర్వేరు లోహాల ధరలు అమాంతం పెరిగాయి. సన్ ఫ్లవర్ నూనెలు దొరక్కుండా పోయాయి. ఇలాగే పశ్చిమాసియాలో యుద్ధం లాంటి వాతావరణం ఏదైనా ఏర్పడితే భారత ఆర్థిక వ్యవస్థపై అనూహ్య పరిణామాలు తప్పకుండా ఉంటాయి. నిజానికి ప్రపంచీకరణ నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం ఏ దేశానికీ సాధ్యం కాదు. అందుకే... పశ్చిమాసియా ప్రాంతంలో అత్యంత త్వరగా శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని మాత్రమే ఎవరైనా కోరుకోగలిగేది!సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మాక్రాన్ Vs పుతిన్: ఫ్రాన్స్కు రష్యా మాస్ వార్నింగ్..
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా సైన్యం దాడులు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్కు మద్దతిస్తున్న ఫ్రాన్స్కు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ తమ మాటను కాదని ఉక్రెయిన్కు దళాలను పంపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరింది. కాగా, తాజాగా రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగో.. ఫ్రాన్స్ రక్షణమంత్రి సెబాస్టియన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్లో దాడుల నేపథ్యంలో అక్కడ ఫ్రెంచ్ దళాల మోహరింపుపై షోయిగో ప్రస్తావించారు. ఒకవేళ నిజంగానే ఉక్రెయిన్లో ఫ్రెంచ్ దళాలు ఉంటే అది వారి దేశానికే తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. అంతేకాకుండా భవిష్యత్త్లో ఉక్రెయిన్కు సైన్యాన్ని పంపించడానికి ఫ్రాన్స్ సాహసిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. దీంతో, వీరి మధ్య సంభాషణ ఉద్రిక్తంగానే జరిగినట్టు సమాచారం. ఇక, ఇటీవల కాలంలో రష్యా విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ గురువారం మరో కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జులైలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్ను రష్యా లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. తప్పుడు సమాచారంతో ఈ క్రీడలకు ఆటంకం కలిగించేందుకు మాస్కో ప్రయత్నిస్తుందని అన్నారు. ఉక్రెయిన్పై జరుగుతున్న యుద్ధంలో రష్యా ఓటమి చెందాల్సిందేనని మెక్రాన్ ఇటీవల ప్రకటనలు ఇస్తున్నారు. రష్యాపై శత్రుత్వాన్ని ప్రేరేపించే ఉద్దేశం ఫ్రాన్స్కు లేనప్పటికీ, ఏదో ఒకరోజు ఐరోపా దళాలు ఉక్రెయిన్కు వెళ్లడం ఖాయమని చెప్పుకొచ్చారు. -
పుతిన్ సేనలకు చెక్.. ఉక్రెయిన్కు బ్రిటన్ భారీ సాయం
లండన్: ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్ తీవ్ర ప్రాణ, నష్టాన్ని చవిచూస్తోంది. మరోవైపు.. చాలా దేశాలు ఉక్రెయిన్కు అండగా నిలుస్తూనే ఉన్నాయి. తాజాగా ఉక్రెయిన్ను బ్రిటన్ భారీ సాయాన్ని అందించినున్నట్టు స్పష్టం చేసింది. కాగా, రష్యా దాడులను సమర్థంగా ఎదుర్కోవడానికి ఉక్రెయిన్కు 10,000 డ్రోన్లు అందిస్తామని బ్రిటన్ తెలిపింది. అయితే, బ్రిటన్ రక్షణ శాఖ మంత్రి గ్రాంట్ షాప్స్ కీవ్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. గతంలో డ్రోన్ల కోసం ఉక్రెయిన్కు 256 మిలియన్ డాలర్ల ప్యాకేజీని బ్రిటన్ ప్రకటించింది. దానికి అదనంగా మరో 160 మిలియన్ డాలర్లను ఈ డ్రోన్ల కోసం కేటాయించారు. 🇬🇧#Britain is set to provide over 10,000 drones to #Ukraine, as reported by European Pravda, citing British Defense Secretary Grant #Shapps. During his visit to Kyiv, he announced that the UK will allocate £325 million to acquire more than 10,000 drones for of Ukraine. 📷: AFP pic.twitter.com/hhL1smfiVz — KyivPost (@KyivPost) March 7, 2024 ఈ ఆయుధ ప్యాకేజీలో 1,000 కమికేజ్ (వన్వే అటాక్) డ్రోన్లు ఉండనున్నాయి. ఇవి నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయగలవు. యూకే అందించిన ఆయుధాలతో ఉక్రెయిన్ బలగాలు నల్ల సముద్రంలో రష్యా నౌకాదళంపై సమర్థంగా దాడి చేస్తున్నట్లు షాప్స్ ఈ సందర్భంగా తెలిపారు. కొద్దిరోజులుగా రష్యా నౌకాదళంపై అనూహ్య దాడులు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం సైతం నల్లసముద్రంలో పెట్రోలింగ్ చేస్తున్న రష్యా యుద్ధనౌకను ఉక్రెయిన్ సముద్ర డోన్లు ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో అది తీవ్రంగా దెబ్బతింది. -
‘ఉక్రెయిన్ యుద్ధంలో హైపర్సోనిక్ మిసైల్స్ వాడాం’
గత రెండేళ్ల నుంచి రష్యా.. ఉక్రెయన్పై దాడులతో యుద్ధం చేస్తూనే ఉంది. పలు ప్రాంతాలు రష్యా ఆక్రమించుకుంది. మరోవైపు పలుదేశాల మద్దతుతో ఉక్రెయిన్ సైతం రష్యా దాడులకు భయపడకుండా అదును చూసుకోని ప్రతిదాడులకు దిగుతోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ఆయన జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి గురువారం మాట్లాడారు. రష్యా ఆరేళ్ల కిందట ప్రవేశపెట్టిన అత్యాధునిక ఆయుధాలను ప్రస్తుతం ఉపయోగిస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో కింజాల్, సిర్కాన్ లాంటి హైపర్సోనిక్ మిసైల్స్ను రష్యా సైనిక బలగాలు వాడుతున్నట్లు పేర్కొన్నారు. అవి ఉక్రెయిన్ మిలిటరీ స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో దాడి చేసినట్లు కూడా తెలిపారు. అవన్గార్డ్ స్ట్రాటజిక్ హైపర్సోనిక్ గ్లైడర్లు, పెరిస్వెల్ లేజర్ వ్యవస్థలు ఇప్పటికే పనిచేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా హైపర్సోనిక్ గ్లైడర్లు.. లక్ష్యం దిశగా అణ్వాయుధాలను మోసుకెళ్లుతాయి. హై ఆల్టిట్యూడ్లో అత్యంత వేగంగా ఆ మిసైల్స్ ప్రయాణిస్తాయి. త్వరలోనే హెవీ స్ట్రాటజిక్ ఖండాంతర బాలిస్టిక్ సర్మట్ మిసైల్స్ను విడుదల చేయనున్నట్లు పుతిన్ తెలిపారు. అణ్వాయుధ సహిత క్రూయిజ్ మిసైల్ బురెవెస్నిక్తో పాటు అండర్ వాటర్ అణ్వాయుధ పోసిడాన్ డ్రోన్ ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నాయని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. -
‘ఓడితే.. చంపేస్తారు’
శాక్రమెంటో(కాలిఫోర్నియా): ప్రపంచ బిలీయనీర్ ఎలాన్ మస్క్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదని.. ఒకవేళ పుతిన్ ఓడితే గనుక ఆయన్ని హతమారుస్తారంటూ మస్క్ వ్యాఖ్యానించారు. ‘ఎక్స్’ స్పేసెస్ వేదికపై పలువురు ప్రముఖ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చలో సోమవారం ఎలాన్ మస్క మాట్లాడుతూ.. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గరనే అనుకుంటున్న. ఒకవేళ ఓడితే మాత్రం.. కచ్చితంగా ఆయన్ని హతమార్చే అవకాశం ఉంది. కాబట్టే.. ఆయన ఈ యుద్ధాన్ని కొనసాగిస్తారు. ఆయనపై అంత ఒత్తిడి ఉంది అని మస్క్ చెప్పారు. అయితే మస్క్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ‘‘గతంలోనూ నేను ఇదే చెప్పా. ఆ సమయంలో నన్ను చాలామంది విమర్శించారు. కానీ, వాస్తవాలు వేరు. అవి అంతా తెలుసుకోవాలి. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ గెలిచే అవకాశమే లేదు. గెలుస్తుందనుకోవడం ఆ దేశానికి మంచిది కాదు. పైగా ఇంకా ఎక్కువ రోజులు యుద్ధం జరిగితే వాళ్లకే( ఉక్రెయిన్)కే ప్రమాదం. యుద్ధంలో.. అమెరికా ప్రకటించే ఆర్థిక సాయం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు’’ అని మస్క్ తేల్చేశారు. అదే సమయంలో రష్యాతో స్పేస్ ఎక్స్ ఒప్పందం రద్దు అంశాన్ని ప్రస్తావించిన మస్క్.. ఈ యుద్ధంలో తన మరో కంపెనీ పోషిస్తున్న పాత్రపైనా వివరణ ఇచ్చారు. ‘‘రష్యాను అణచివేయడానికి మా కంపెనీల కంటే మరేవీ గొప్పగా పనిచేయలేదు. ఉక్రెయిన్కు ఇప్పటికే స్పేస్ఎక్స్ స్టార్లింక్ సేవలను అందిస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా కీవ్ సమాచార వ్యవస్థలో ఇప్పుడు అది కీలకంగా మారింది. రెండువైపులా ప్రాణనష్టాన్ని నిలువరించడమే తన లక్ష్యమని అన్నారాయన. -
ఉక్రెయిన్పై రష్యా దాడి.. ఖచ్చితంగా ఉత్తర కొరియా మిసైల్!
ఉక్రెయిన్పై రష్యా దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఇటీవల ఉక్రెయిన్లోని ఖార్కివ్ నగరంపై మిసైల్ దాడి చేసింది. ఖార్కివ్పై రష్యా ప్రయోగించిన మిసైల్ ఆ దేశానికి చెందినది కాదని ఉక్రెయిన్ ప్రతినిధి డిమిట్రో చుబెంకో అన్నారు. జనవరి 2 తేదీని ఖార్కివ్ నగరంపై దాడి చేసిన రష్యా మిసైల్ గమనిస్తే.. రష్యా దేశానికి చెందినది కాదని తెలుస్తోందని పేర్కొన్నారు. గతంలో రష్యా ప్రయోగించిన మిసైల్ కంటే పెద్దదిగా ఉందని అన్నారు. దాని తయారి విధానం చూస్తే.. అధునాతనమైనదిగా లేదని చెప్పారు. గతంలో ఖార్కివ్పై రష్యా ప్రయోగించిన మిసైల్.. ఇప్పటి మిసైల్ను పరిశీలిస్తే అది ఉత్తర కొరియాకు చెందినదిగా నిర్థారించడానికి అవకాశలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. నాజిల్, ఎలక్ట్రికల్ వైండింగ్స్, పలు పరికారలు కూడా చాలా వ్యత్యాసంతో ఉన్నాయని తెలిపారు. ఇది ఖచ్చితంగా ఉత్తర కొరియా మిసైల్ అని తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నట్లు కూడా డిమిట్రో చుబెంకో తెలిపారు. అందుకే రష్యా వేసిన మిసైల్ ఉత్తర కొరియా నుంచి సరఫరా చేసినట్లుగా అనుమానం కలుగుతోందని తెలిపారు. రష్యా ఖార్కివ్ నగరంపై చేసిన మిసైల్ దాడిలో ఇద్దరు మృతి చెందగా.. 60 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. చదవండి: Hamas Attackers: ‘వాళ్లు మనుషులు కాదు.. పెద్దగా నవ్వుతూ రాక్షస ఆనందం’ -
యుద్ధం కన్న అనాథలు
ప్రపంచంలో ఎంతో మంది ఒక పూట తిండి కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో మరెంతో మంది కన్న ప్రేమను కోల్పోయి తల్లడిల్లుతున్నారు. – మదర్ థెరెసా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లు. ఇరువైపులా ఎంతో మంది మరణించారు. రష్యా దాడులు తట్టుకోలేక ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది వలసపోయారు. అటు పాలస్తీనాలో ఇజ్రాయెల్ దాడులతోనూ లక్షలాది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. అంతా యుద్ధ నష్టం గురించి, ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుకుంటుంటే.. అభంశుభం ఎరుగని ఎందరో చిన్నారులు యుద్ధం మిగిల్చిన అనాథలుగా భవిష్యత్తు ఏమిటో తెలియని దుస్థితిలో పడిపోయారు. జనవరి 6న (శనివారం) ప్రపంచ యుద్ధ సంక్షుభిత అనాథ పిల్లల దినోత్సవం (వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్) నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక కథనం.. నేను ఎందుకిలా అయ్యానో తెలియదు ఈ చిత్రంలోని అమ్మాయి పేరు మసిక. వయసు పన్నెండేళ్లు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్సీ)లో జరుగుతున్న అంతర్యుద్ధంలో తిరుగుబాటుదారులు ఆమె కళ్ల ముందే తల్లిదండ్రులను కాల్చి చంపేశారు. ఎవరూ దిక్కులేక తన స్నేహితురాలి తల్లితో కలసి జీవిస్తోంది. నాటి ఘటనను తలచుకుని కుమిలిపోతూ.. తినేందుకు తిండి, సరైన రక్షణ లేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ‘‘అసలు వాళ్లెవరో, ఎందుకోసం ఇలా చేస్తున్నారో, మా అమ్మానాన్నను ఎందుకు చంపేశారో, నేను ఎందుకిలా బతకాల్సి వస్తోందో నాకు తెలియదు..’’ అంటూ మసిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. అమ్మానాన్నను కోల్పోయి.. ఈ చిన్నారి పేరు కరీనా. వయసు ఏడేళ్లు. ఉక్రెయిన్లోని చెర్నిగివ్ ప్రాంతంలోని ఓ గ్రామం. రష్యా యుద్ధం మొదలుపెట్టాక తమ ఊరిని విడిచిపోతున్న సమయంలో.. జరిగిన బాంబు దాడిలో కరీనా తల్లిదండ్రులు చనిపోయారు. ఇప్పుడు ఉక్రెయిన్లోని కీవ్ నగరంలో తమ బంధువుల ఇంట్లో ఉంటోంది. తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ, బాంబు దాడిలో అయిన గాయాలతో బాధపడుతూ గడుపుతోంది. ప్రపంచ యుద్ధాలతో ముమ్మరమై.. ► రెండు ప్రపంచ యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అనాథ చిన్నారులను మిగిల్చాయి. అధికారిక అంచనాల ప్రకారమే.. అప్పట్లో పోలాండ్లో 3 లక్షలు, యుగోస్లే్లవియాలో 2 లక్షల మంది పిల్లలు అనాథలయ్యారు. ► ‘యూనిసెఫ్ (ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి)’ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సంక్షుభిత ప్రాంతాల్లో 25 కోట్ల మందికిపైగా చిన్నారులు కనీస అవసరాలైన ఆహారం, మంచినీరు, నిలువనీడ లేక అవస్థ పడుతున్నారు. ఇందులో సుమారు 14 కోట్ల మంది తండ్రినిగానీ, తల్లిదండ్రులు ఇద్దరినీగానీ కోల్పోయి అనాథలుగా బతుకీడుస్తున్నారు. ► అనాథలుగా మారినవారిలో సుమారు 6 కోట్ల మంది ఆసియా దేశాల్లో, 5 కోట్లకుపైగా ఆఫ్రికా, మరో కోటిన్నర మందికిపైగా లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంత దేశాల్లో ఉన్నారు. ► యుద్ధాలు, తిరుగుబాట్లతో అట్టుడుకుతున్న మధ్య ప్రాచ్యం, ఆసియా, దక్షిణ అమెరికా దేశాల్లో.. ముఖ్యంగా సిరియా, ఇరాక్, అఫ్గానిస్తాన్ వంటి దేశాల్లో.. ఆఫ్రికా ఖండంలోని సూడాన్, కాంగో, ఉగాండా, సోమాలియా వంటి దేశాల్లో అనాథ పిల్లల సమస్య పెరుగుతోంది. ఇలాంటి చోట్ల చాలా మంది చిన్నారులు తిరుగుబాటు దళాల్లో సైనికులుగా తుపాకులు చేతబట్టాల్సి వస్తోంది. ► సూడాన్లో అయితే ప్రతి వంద మంది చిన్నారుల్లో పది మంది అనాథాశ్రమాల్లో, వీధుల్లో బతుకు వెళ్లదీస్తున్నారు. ► ఇటీవల ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన హమాస్ దాడికి ప్రతిగా గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ విరుచుకుపడటంతో.. వేల మంది మరణించారు. లక్షలాది మంది వలసపోయారు. ఈ యుద్ధంలో నూ పెద్ద సంఖ్యలో చిన్నారులు అనాథలయ్యారు. ఏనాటి యుద్ధమైనా.. పిల్లలూ సమిధలే.. ఏ పిల్లలకైనా తల్లిదండ్రులే అన్నీ. చదువు కోసమో.. ఉద్యోగం కోసమో దూరంగా ఉంటున్నా..తల్లడిల్లేది వారి గురించే. అమ్మ ఒడికి, నాన్న చెంతకు చేరితేనే సాంత్వన. అలాంటి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోతే.. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోతే.. ఆ బాధ వర్ణనాతీతం. అలాంటిది అస్తిత్వం కోసమో, అన్నం కోసమో, ఆక్రమణ కోసమో.. మానవ నాగరికత మొదలైన నాటి నుంచీ జరుగుతున్న యుద్ధాల్లో ఎందరో పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తమ వారంటూ ఉన్న బంధువుల మధ్య పెరుగుతున్నవారు కొందరు.. ఏతోడూ లేకుండా కునారిల్లిపోతున్నవారు మరికొందరు. సరైనదారిలో పడ్డవారు మంచి జీవితం గడపగలిగితే..‘దారి తప్పిన’వారి బతుకులు ఆగమైపోతున్నాయి. ఉక్రెయిన్లో రెండేళ్లుగా పిల్లల గోస రష్యా–ఉక్రెయిన్ ఒకప్పుడు ఒకే సోవియట్ యూనియన్లో భాగం. అందుకే ఇరు దేశాల మధ్య రాకపోకలూ, సంబంధ బాంధవ్యాలూ సాధారణమే. కానీ ఇరు దేశాల మధ్య పొరపొచ్చాలు, యుద్ధంతో ఇరువైపులా ఉండిపోయిన మరోదేశపు కుటుంబాలు ఆగమైపోయాయి. మరణించిన, వలస వెళ్లినవారి పిల్లలు, సైనికులు బలవంతంగా తల్లిదండ్రుల నుంచి విడదీసినవారు.. ఇలా ఎందరో చిన్నారులు అనాథలుగా మారారు. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన ‘కిడ్సేవ్’ అనే స్వచ్ఛంద సంస్థ తమ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్కు మిలటరీ సాయమేకాదు.. యుద్ధంతో అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరింది. బలవంతంగా క్యాంపులకు చిన్నారులు 2022 ఫిబ్రవరి చివరివారం నాటికి ఉక్రెయిన్లో అనాథ పిల్లల సంఖ్య లక్ష వరకు ఉండగా.. ఆ తర్వాత ఈ సంఖ్య మరింతగా పెరిగింది. కానీ సంక్షుభిత పరిస్థితుల్లో లెక్కలు తేల్చేదెలాగని, వేల మంది చిన్నారులు క్యాంపుల్లో మగ్గుతున్నారని అమెరికాకు చెందిన కాన్ఫ్లిక్ట్ అబ్జర్వేటరీ సంస్థ గతంలోనే పేర్కొంది. మరోవైపు రష్యా తమ దేశంలోని సుమారు 14 వేల ఉక్రెయిన్ కుటుంబాల పిల్లలను తల్లిదండ్రుల నుంచి బలవంతంగా విడదీసి క్యాంపులకు తరలించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో యూరప్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన యూదు చిన్నారులు వీరు. వారికి కొత్త జీవితం అందించడం కోసం 1921లో అమెరికాలోని న్యూయార్క్కు తరలించినప్పుడు హార్బర్లో తీసిన ఫొటో ఇది. ఫ్రెంచ్ ఆర్గనైజేషన్ చొరవతో..ప్రత్యేక రోజుగా.. ఫ్రాన్స్కు చెందిన ‘ఎస్ఓఎస్ ఎన్ఫాంట్స్ ఎన్ డెట్రెసెస్’ స్వచ్ఛంద సంస్థ చొరవతో యూనిసెఫ్ ఏటా జనవరి 6న ‘వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్ డే’గా నిర్వహిస్తోంది.యుద్ధాలు, తిరుగుబాట్ల కారణంగా అనాథలుగా మారుతున్న చిన్నారులు.. వారు శారీరకంగా, మానసికంగా తీవ్ర దుస్థితిని ఎదుర్కొంటున్న అంశంపై అవగాహన కల్పించడం, వారిని ఆదుకోవడం లక్ష్యంగా చర్యలు చేపట్టడమే దీని లక్ష్యం. అనాథలను ఆశ్రమాల్లో చేర్చడంతోపాటు చదువుకోవడానికి, సాధారణ జీవితం గడపడానికి తోడ్పడాలని స్వచ్ఛంద సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. -
ఉక్రెయిన్పై రష్యా అతి పెద్ద డ్రోన్ ఎటాక్, ఏకంగా 75 డ్రోన్లతో
ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడింది. సుమారు 75 ఇరానియన్ షాహెద్ డ్రోన్లతో అతిపెద్ద దాడికి దిగింది. ఉక్రెయిన్ రాజధానిని లక్ష్యంగా 2022లో రష్యా దాడి తరువాత శనివారం ఉదయం ఉక్రెయిన్పై అత్యంత తీవ్రమైన డ్రోన్ దాడికి దిగిందని సైనిక అధికారులు తెలిపారు. 71 డ్రోన్లు ఎయిర్ డిఫెన్స్ అడ్డగించిందని, వాటిని ధ్వంసచేశాయని ఉక్రెయిన్ సాయుధ దళాలు వెల్లడించాయి. కైవ్పై డ్రోన్ల ద్వారా జరిగిన అత్యంత భారీ వైమానిక దాడి అని కైవ్ నగర పరిపాలన అధిపతి సెర్హి పాప్కో తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారు జామున 4 గంటలకు ప్రారంభమైఆరు గంటలకు పైగా కొనసాగింది. 77 నివాస భవనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాకుత తీవ్ర అంతారాయం ఏర్పడింది. కనీసం ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. కాగా ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ నవంబర్ 11న రెండు నెలల్లో మొదటిసారిగా క్షిపణి దాడులను ఎదుర్కొంది. కీవ్ ఆ రాత్రి ప్రాణ నష్టం నుండి తప్పించుకున్నప్పటికీ వారాంతంలో డ్రోన్ దాడులతో సహా కీవ్, దాని పరిసరాలపై దాడులు కొనసాగుతున్నాయి. రష్యా గత ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభించినప్పటి నుండి దాదాపు 560 మంది చిన్నారులు, 10వేల మంది పౌరులు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఇప్పటికైనా యుద్ధాన్ని ఆపాలన్న డిమాండ్ ఊపందుకుంటున్న తరుణంలో తాజా దాడి మరింత ఆందోళన రేకత్తిస్తోంది. -
గాయపడిన సైనికులకు జెలెన్స్కీ పరామర్శ
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించడానికి న్యూయార్క్ వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ యుద్ధంలో గాయపడి న్యూయార్క్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉక్రెయిన్ సైనికులను పరామర్శించారు. ఈ సందర్బంగా సైనికులతో మాట్లాడిన అయన వారిని ధైర్యంగా ఉండమై చెబుతూనే రష్యా నాయకులను తీవ్రవాదులుగా సంబోధించారు. ఏడాదిన్నరగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎందరో ఉక్రెయిన్ సైనికులు చనిపోగా మరెందరో సైనికులు గాయపడ్డారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక గత నెల ప్రచురించిన కథనంలో ప్రకారం ఉక్రెయిన్ సైనికుల్లో చనిపోయిన వారు గాయపడిన వారు మొత్తం కలిపి ఐదు లక్షలకు పైగా ఉంటారని తెలిపింది. యూఎన్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించేందుకు, యుద్ధంలో తమ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి మరింత అమెరికా సాయ కోరడానికి ఇక్కడికి విచ్చేసిన జెలెన్స్కీ నేరుగా యుద్ధంలో గాయపడిన సైనికులు చికిత్స పొందుతున్న స్టాటిన్ ఐలాండ్ యూనివర్సిటీ హాస్పిటల్కు చేరుకున్నారు. ఆయన వచ్చేసరికి కృత్రిమ కాళ్లు అమర్చిన సైనికులు నడక ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. మిగిలిన సైనికుల్లో అత్యధికులు వీల్ ఛైర్లలో ఉండగా కొంతమంది కృత్రిమ చేతులు అమర్చి ఉన్నారు. ఈ సందర్బంగా సైనికులతో మాట్లాడుతూ.. తొందరగా ఇంటికి చేరుకోవాలన్న దృఢ సంకల్పం ఉన్న సైనికులను నేనెప్పుడూ చూడలేదు. మీకోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. మీ అవసరం మాకు చాలా ఉంది. మీ సంకల్పం చాలా గొప్పది. మీరంతా తొందరగా కోలుకుని తిరిగి ఉక్రెయిన్ రావాలని మన శత్రువుపై గెలుపులో మీరంతా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా అన్నారు. చివరిగా సైనికులకు ధైర్యంగా ఉండమని చెప్పారు. అనంతరం సైనికులతోపాటు అక్కడ హాస్పిటల్ స్టాఫ్ కు ఉక్రెయిన్ గౌరవ అవార్డులిచ్చి సత్కరించి వారితో ఫోటోలు కూడా తీసుకున్నారు. LIVE: Ukraine President Volodymyr Zelenskiy visits a New York hospital Nur 96 Zuschauer bei Reuters?https://t.co/FAvszjzZvE via @YouTube — Alexander Prinz (@prinzartair) September 18, 2023 ఇది కూడా చదవండి: భారత్పై సంచలన ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ఆగుతుందటే..
ఫ్రాంక్ఫర్ట్, జర్మనీ: రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఇప్పటికి ఏడాదిన్నర పైబడింది. అయినా కూడా అక్కడ యుద్ధం సద్దుమణిగే పరిస్థితులైతే కనుచూపుమేరలో కనిపించడం లేదు. ప్రపంచ దేశాల్లో కూడా ఇదే అభిప్రాయం నెలకొందని ఉక్రెయిన్లో యుద్ధం ఇప్పటిలో ఆగదని సుదీర్ఘంగా కొనసాగుతుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు నాటో చీఫ్ జెన్స్ స్టోల్టన్బెర్గ్. ఏడాదిన్నర పైబడింది.. ఫిబ్రవరి 2022లో మాస్కో ఉక్రెయిన్కు బలగాలను పంపడంతో మొదలైన యుద్ధంలో ఉక్రెయిన్ మొదట్లో అంత దూకుడుగా వ్యవహారింకపోయినా జూన్ నుంచి మాత్రం దూకుడు పెంచి ప్రతిదాడులు కూడా మొదలు పెట్టిందని ఈ యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశముందని అన్నారు నాటో చీఫ్ స్టోల్టన్బెర్గ్. చాలా వరకు యుద్ధాలు మొదలైనప్పుడు ఊహించినదానికంటే ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటాయని చెబుతూనే వీలైనంత తొందరగా అక్కడ శాంతి స్థాపించబడాలని కోరుకుంటున్నానన్నారు. ఆపితే అంతే సంగతులు.. యుద్ధంలో వ్లాదిమిర్ జెలెన్స్కీ గానీ ఉక్రెయిన్ గానీ పోరాడకపోతే ఆ దేశం తుడిచి పెట్టుకుపోతుందనడంలో సందేహమే లేదు. ఎప్పుడైతే రష్యా ఆయుధాలను విడిచిపెడుతుందో అప్పుడే యుద్ధం సద్దుమణుగుతుందని అన్నారు. ఇక ఉక్రెయిన్ నాటో సభ్యత్వం గురించి ప్రస్తావిస్తూ ఉక్రెయిన్ నాటోలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని క్యివ్ ఇప్పటికే నాటోకు చాలా దగ్గరైందని అన్నారు. యుద్ధం ముగిశాక ఉక్రెయిన్కు అన్నివిధాలా భద్రతా భరోసా కల్పించాలని అన్నారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ రూ.330 -
G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్లో గొప్పేముంది?
క్యివ్: భారత దేశం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని ప్రకటించిన ఢిల్లీ డిక్లరేషన్కు సభ్యదేశాలు ఆమోదం తెలిపాయి. ఇందులో ప్రస్తావించిన ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశాన్ని కూడా జీ20 దేశాలు ఆమోదించాయి. కానీ ఢిల్లీ డిక్లరేషన్లో ఉక్రెయిన్ యుద్ధం అంశంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ. ఉక్రెయిన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒలెగ్ నికోలెంకో తన ఎక్స్(ట్విట్టర్) ద్వారా డిక్లరేషన్పై స్పందిస్తూ భారత్ ప్రతిపాదించిన ఢిల్లీ డిక్లరేషన్లో ఎక్కడా రష్యా పేరును ప్రస్తావించకుండా డాక్యుమెంటేషన్ చేసి ఆమోదం పొందడంలో గొప్పేముందని ప్రశ్నించారు. పదాల అమరిక విషయంలో నేర్పును కనబరచి సమావేశాల్లో మా ప్రస్తావన తీసుకొచ్చినందుకు జీ20 భాగస్వామ్య దేశాలకు కృతజ్ఞతలు చెబుతూ మాకు కూడా సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించి ఉంటే ఇక్కడి పరిస్థితులను కళ్ళకు కట్టేవాళ్లమని అన్నారు. ఢిల్లీ డిక్లరేషన్లో పదాలను ఈ విధంగా వాడి ఉంటే మరింత అర్ధవంతంగానూ వాస్తవానికి దగ్గరగానూ ఉండేదని చెబుతూ డిక్లరేషన్ను సవరించి మరీ చూపించారు. G20 adopted a final declaration. We are grateful to the partners who tried to include strong wording in the text. However, in terms of Russia's aggression against Ukraine, G20 has nothing to be proud of. This is how the main elements of the text could look to be closer to reality pic.twitter.com/qZqYluVKKS — Oleg Nikolenko (@OlegNikolenko_) September 9, 2023 ఇది కూడా చదవండి: G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్పై ఏకాభిప్రాయం సాధించిన భారత్ -
రక్షణ మంత్రిని తొలగించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
క్యివ్: రష్యాతో జరుగుతున్న యుద్ధం నేపధ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యివ్ రక్షణ శాఖ మంత్రి బాధ్యతల నుండి ఒలెక్సి రెజ్నికోవ్ను తప్పిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఆయన స్థానంలో రుస్తెం ఉమెరోవ్ను నూతన రక్షణశాఖ మంత్రిగా నియమిస్తున్నట్లు ప్రకటించి ఇది రక్షణశాఖలో సరికొత్త విధానాన్ని అమలుచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అధ్యక్షుడి నిర్ణయం ప్రకటించిన తర్వాత రెజ్నికోవ్ తన రాజీనామాను పార్లమెంటుకు సమర్పించారు. యధాప్రకారం సాయంత్రం జరిగే మీడియా సమావేశంలో వ్లాదిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ.. ఒలెక్సి రెజ్నికోవ్ రష్యాతో యుద్ధం మొదలైన నాటి నుండి దాదాపు 550 రోజులు యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కానీ ప్రస్తుతం రక్షణశాఖలో సరికొత్త విధానాన్ని అనుసరించాల్సిన అవసరముందని అందుకే క్రిమియా రాష్ట్ర సంపద నిధుల సంరక్షకుడిగా వ్యవహరిస్తున్న ఉమెరోవ్కు రక్షణశాఖ బాధ్యతలు అప్పచెబుతున్నామని అన్నారు. పార్లమెంట్ ఉమేరోవ్ అభ్యర్ధిత్వాన్ని ఆమోదిస్తుందని భావిస్తున్నామన్నారు. Zelenskyi's evening speech in which he talks about the replacement of Minister of Defense Oleksii Reznikov. He is replaced by Rustem Umerov. -- "Oleksii Reznikov went through these more than 550 days of full-scale war. I believe that the Ministry needs new approaches and other… pic.twitter.com/o7NCvszWoi — NOELREPORTS 🇪🇺 🇺🇦 (@NOELreports) September 3, 2023 ఉక్రెయిన్ అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయం ఉక్రెయిన్ రక్షణశాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫిబ్రవరి 2022లో రష్యాతో యుద్ధం మొదలైన నాటి నుండి ఒలేక్సి రెజ్నికోవ్ పాశ్చాత్య దేశాల నుండి బిలియన్ డాలర్ల సహాయాన్ని పొందడంలో కీలక పాత్ర పోషించారు. కానీ రక్షణశాఖలో అంతర్గత ఆరోపణలు పెచ్చుమీరడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధ్యక్షుడి నిర్ణయాన్ని పార్లమెంట్ ఆమోదిస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి. కానీ రెజ్నికోవ్ను ఉన్నట్టుండి బాధ్యతల నుండి తప్పించడాన్నే మీడియా హైలైట్ చేస్తూ రెజ్నికోవ్కు వేరే బాధ్యతలు ఏమైనా అప్పగిస్తున్నారా అన్నది అధ్యక్షుడే తెలపాల్సి ఉంటుంది. రక్షణశాఖలో భారీగా జరుగుతున్న అవినీతి నేపధ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు చేసే వారు కూడా లేకపోలేదు. అంతర్జాతీయ అవినీతి దేశాల జాబితాలో ఉక్రెయిన్ 180 దేశాల్లో 116 వ స్థానంలో ఉంది. అవినీతి విషయంలో ఒకప్పటితో పోలిస్తే ఉక్రెయిన్ ఇప్పుడు చాల మెరుగయ్యిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. I have submitted my letter of resignation to Ruslan Stefanchuk @r_stefanchuk, Chairman of the Parliament of Ukraine @verkhovna_rada It was an honor to serve the Ukrainian people and work for the #UAarmy for the last 22 months, the toughest period of Ukraine’s modern history. 🇺🇦 pic.twitter.com/x4rXXcrr7i — Oleksii Reznikov (@oleksiireznikov) September 4, 2023 ఇది కూడా చదవండి: జీ20 సదస్సుకు జిన్పింగ్ స్థానంలో చైనా ప్రీమియర్ -
రష్యా డ్రోన్లను కూల్చేసిన ఉక్రెయిన్
క్యివ్: దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతమైన ఒడెస్సాపై రష్యా శనివారం మొత్తం 25 డ్రోన్లతో దాడి చేసింది. ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ వాటిలో 22 డ్రోన్లను సమర్ధవంతంగా కూల్చేసినట్లు తెలిపింది ఉక్రేయి రక్షణ శాఖ. ఈ దాడుల్లో ఒడెస్సాలో దానుబే నది వద్దనున్న రెనీ పోర్టులో కొద్దిపాటి విధ్వంసం చోటు చేసుకుంది. యుద్ధ ప్రారంభ రోజులతో పోలిస్తే ఉక్రెయిన్ రష్యా దాడులను సమర్థవంతంగానే తిప్పి కొడుతోంది. ఒక పక్క రష్యా దాడులను అడ్డుకుంటూనే మరోపక్క వారిపై ఎదురుదాడి చేస్తోంది. ఇప్పటికే రష్యా చెరలో నుండి అనేక ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ తాజాగా పోర్టు ప్రాంతంలో రష్యా ప్రయోగించిన ఇరాన్ షాహెద్ డ్రోన్లను చిత్తు చేసింది. మొత్తం 25 డ్రోన్లలో 22 డ్రోన్లను నేలకూల్చినట్లు తెలిపింది ఉక్రెయిన్ రక్షణ శాఖ. ఈ దాడుల్లో ఇద్దరు గాయపడగా అక్కడక్కడా ఇఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బ తిన్నట్లు వెల్లడించింది ఉక్రెయిన్ సైన్యం. పోర్టు ప్రాంతమైన ఒడెస్సా పోర్టు నుంచి ఉక్రెయిన్ ధాన్యం ఎగుమతి చేసేది. నౌకాశ్రయంలో జరిగిన నష్టం ఎంతనేది ఇప్పుడే చెప్పలేమంది సైన్యం. ఈ పోర్టు ధ్వంసం చేసి ధాన్యం రవాణాను దెబ్బతీయాలన్నది రష్యా ఉద్దేశ్యమై ఉంటుందని తెలిపింది. ఇది కూడా చదవండి: సైనికులు ప్రాణాలు పోతుంటే..పుతిన్ పట్టనట్లు చేస్తున్న పని చూస్తే..షాకవ్వతారు -
వినాశకర సాటన్-ll మిసైల్ను బయటకు తీసిన రష్యా.. ఏమీ మిగలదు!
మాస్కో: రష్యా అత్యంత వినాశకరమైన అణుక్షిపణి (సర్మాత్)సాటన్-ll ను బయటకు తీసి కీలక ప్రాంతాల్లో మోహరించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ క్షిపణి విజయవంతమైనప్పుడు దీని గురించి చెబుతూ.. ఇకపై మాతో కయ్యానికి కాలు దువ్వే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిదని ప్రత్యర్థులను హెచ్చరించారు. తాజాగా ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యా ఈ క్షిపణిని బయటకు తీయడం చర్చనీయాంశమైంది. శుక్రవారం సాటన్-llగా పిలవబడే ఈ సర్మాత్ ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ను రష్యా సైన్యం బయటకు తీసినట్లు రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కాస్మోస్ ప్రకటించింది. ఈ మేరకు రోస్కాస్మోస్ జనరల్ డైరెక్టర్ యూరి బోరిసోవ్ సాటన్-ll విధినిర్వహణకు సిద్ధమైందని ప్రకటించారు. అసలేంటి సాటన్-ll ప్రత్యేకత.. సాటన్-ll మిసైల్ పొడవు 116 మీటర్ల. 220 టన్నులు బరువుండే ఈ మిసైల్ 10-15 వార్హెడ్లను అమర్చే వీలుంటుంది. అందుకే ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలను సులువుగా ఛేదిస్తుంది. శత్రువుల రాడార్లు, ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలు ఈ మిసైల్ను గుర్తించే లోపే ఇది లక్ష్యాన్ని చేరుకుని విధ్వంసాన్ని సృష్టిస్తుంది. సాటన్-ll గంటకు 10 వేల నుంచి 18 వేల కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. ఐరోపాలోని ఏ ప్రాంతానికైనా ఇది కేవలం 3 నిమిషాల్లోపే చేరుకోగలదు. ఇక అగ్రరాజ్యం అమెరికా చేరుకోవడానికి ఈ క్షిపణికి కేవలం 14 నిముషాలు మాత్రమే పడుతుంది. ఉక్రెయిన్తో యుద్ధం మొదలై ఏడాదిన్నర పైబడిండి. ఇప్పటికీ యుద్ధం ఒక కొలిక్కి రాకపోగా ఉక్రెయిన్ రష్యా దాడులను సమర్ధవంతనగానే తిప్పికొట్టింది. ఇక ఇప్పుడైతే అమెరికా అండదండలతో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తూ రష్యా సేనలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యుద్ధప్రారంభంరోజుల్లో రష్యా స్వాధీనం చేసుకున్న ఒక్కో ప్రాంతాన్ని తిరిగి తన వశం చేసుకుంటోంది. ఇప్పటికే డిఫెన్స్లో పడిన రష్యా సేనలు ఈ నేపథ్యంలోనే ఈ భయానక మిసైళ్లను బయటకు తీసిందని చెప్పేవారు లేకపోలేదు. మరోపక్క రష్యా ఈ క్షిపణిని నాటో సంస్థ మూలస్థంభాలైన అమెరికా, యూకెలపై మాత్రమే ప్రయోగించడానికి సిద్ధం చేసిందనే వారూ ఉన్నారు. ఏదైతేనేం ప్రస్తుతానికైతే రష్యా తన అమ్ములపొదిలోని అత్యంత భయంకరమైన మిసైళ్లను బయటకు తీసి కీలక ప్రాంతాల్లో మోహరించింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ జాతీయ టీవీ ఛానల్లో ప్రసంగిస్తూ.. మాతృదేశాన్ని కాపాడుకోవడానికి మాకున్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామని అన్నారు. అందులో భాగంగానే ఈ చర్యకు ఉపక్రమించారని మాత్రం అర్ధమవుతోంది. BREAKING: Putin has put the ‘Satan-2’ nuclear weapon on combat duty for the first time Putin unveiled the RS-28 Sarmat rocket system along with five other weapons in this video at a conference in March 2018 Putin claimed the Sarmat can fly a trajectory over the South Pole and… pic.twitter.com/otKqUi6uIw — Liam McCollum (@MLiamMcCollum) September 1, 2023 ఇది కూడా చదవండి: ‘నాలుగు కాళ్ల’ వింత కుటుంబం.. పశువుల తరహాలో నడక! -
వీడియో చెప్పిన కథ : రష్యాను భయపెడుతోన్న ఉక్రెయిన్ డ్రోన్లు
క్యివ్: రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ పుంజుకున్నట్లే కనిపిస్తోంది. చిన్న పాపను అడ్డం పెట్టుకుని ఇద్దరు రష్యా సైనికులు పారిపోతున్న దృశ్యాలే అందుకు సాక్ష్యం. ఉక్రెయిన్ డ్రోన్ కెమెరాలో ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అమెరికా అండతో ఇటీవల డ్రోన్ దాడులను ముమ్మరం చేసిన ఉక్రెయిన్ రష్యా సేనలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ భూభాగంపై ఉన్న రష్యా సైనికులు ఎప్పుడు ఎటునుంచి ఏ డ్రోన్ దాడి చేస్తుందో అర్ధంకాక భయంతో బిక్కుబిక్కుమంటూ మాస్కోకు తిరుగుముఖం పడుతున్నారు. తాజాగా ఉక్రెయిన్ డ్రోన్ కెమెరాలో రికార్డయిన కొన్ని దృశ్యాల్లో రష్యా సైనికుల ప్రాణభీతి తేటతెల్లమైంది. ఇద్దరు రష్యా సైనికులు ఉక్రెయిన్లోని టోక్మాక్ నగరం నుండి మరో చోటకి వెళ్తుండగా వారి వాహనం దారిమధ్యలో పాడైంది. దీంతో వారిద్దరూ ఏం జరిగిందో చూసేందుకు వాహనం నుండి కిందకు దిగారు. కానీ ఉక్రెయిన్ బలగాలు ఎక్కడ డ్రోన్లతో దాడి చేస్తారోనని భయంతో చిన్న పాపను అడ్డుపెట్టుకున్నారు. వీడియోలో వాహనానికి ఒక పక్కన ఆయుధాన్ని మరో పక్కన నిల్చుని ఉన్న ఒక చిన్న పాపను స్పష్టంగా చూడవచ్చు. వాహనం మరమ్మతు చేస్తున్నంత సేపు పాపను తమ పక్కనే పెట్టుకున్నారు రష్యా సైనికులు. పాప అక్కడున్నంత వరకు డ్రోన్లు తమపై దాడి చేయవన్నది వారి నమ్మకం. అంతలో అటుగా మరొక వాహనం రావడంతో వారిని సాయమడిగిన రష్యా సైనికులు పాపను అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు. పాపం వారి ప్రాణాలు కాపాడిన చిన్నారి మాత్రం అక్కడే నిల్చుండిపోయింది. Ukrainian drone footage captures Russian soldiers fleeing near Tokmak. They are in such a hurry that they leave behind a small child and a rifle. pic.twitter.com/yUgML9jJ8J — Visegrád 24 (@visegrad24) August 27, 2023 రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై రెండేళ్లు కావస్తోంది. ఇరుపక్షాలు శాంతించే దాఖలాలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. . యుద్ధం కారణంగా ఇప్పటికే లక్షల సంఖ్యలో సామాన్యులు, సైనికులు మృతిచెందారు. యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో కూడా తెలియని పరిస్థితి. యుద్ధాల గురించి చరిత్ర చెప్పేది ఒక్కటే. యుద్ధం ముగిసిన తర్వాతే అసలు యుద్ధం మొదలవుతుందని.. భావితరాల బ్రతుకులు ఆకలికేకలతో మొదలై వారి చావుకేకలతో కథ ముందుకు సాగుతుంటుందని. ఈ యుద్ధం ఎప్పుడు ఎలా ముగుస్తుందో మరి. ఇది కూడా చదవండి: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఉపశమనం -
ప్రిగోజిన్ మరణంపై అనేక అనుమానాలు!
వాషింగ్టన్: రష్యాలోని కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ మరణంపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ సహా పదిమంది దుర్మరణం పాలయ్యారు. అయితే, ఈ విమానం ప్రమాదవశాత్తూ కూలిపోలేదని, ఉద్దేశపూర్వకంగా కూల్చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, విమానం కూలిన తీరుతో పాటు ఇతరత్రా అంశాలను విశ్లేషించి ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపాయి. ఈ మేరకు పెంటగాన్ అధికార ప్రతినిధి జనరల్ పాట్ రైడర్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానాన్ని క్షిపణితో కూల్చేశారని చెప్పారు. అయితే, దీనిపై మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు. ఈ ఘటనపై అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పుతిన్ తన శత్రువులను తుదముట్టించే క్రమంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పారు. విమానం ప్రమాదవశాత్తూ కూలిపోలేదని, కూల్చేశారని వివరించారు. అయితే, పేలుడుకు కారణమేమిటనే విషయం కానీ, తన పేరును కానీ వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు. మరోవైపు, తన సెక్యూరిటీతో పాటు తన అనుచరుల భద్రత విషయంలో తమ చీఫ్ ప్రిగోజిన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారని వాగ్నర్ గ్రూపుకు చెందిన సైనికులు చెబుతున్నారు. అలాంటిది కీలక అనుచరులను వెంటబెట్టుకుని ఒకే విమానంలో ఎందుకు ప్రయాణించారో తెలియడం లేదంటున్నారు. వాగ్నర్ గ్రూపులోని కీలక వ్యక్తులంతా సెయింట్ పీటర్స్బర్గ్కు ఎందుకు వెళుతున్నారో కూడా తెలియదని చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియా ప్రిగోజిన్ ఆఫ్రికా దేశంలో ఉన్నారని అక్కడ తమ సైన్యంలో ఎవరైనా చేరాలనుకుంటే చేరవచ్చని ఆయన తెలుపుతున్నట్లు ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం చూస్తే తిరుగుబాటు నాయకుడిని ఆఫ్రికాలోనే హత్య చేసి దాన్ని విమాన ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రిగోజిన్ చనిపోయాడన్న వార్తపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ.. వాస్తవాలు ఏమిటో తెలియదు కానీ ఇందులో ఆశ్చర్యమేమీ లేదని అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ అయితే.. ప్రిగోజిన్ విమాన ప్రమాదంపై హేతుబద్దమైన అనుమానాలున్నాయని అన్నారు. మొత్తంగా రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఎదురు తిరిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనడానికి ప్రిగోజిన్ ఉదంతాన్ని ఉదహరిస్తూ ప్రపంచ నేతలు స్పందించడం కొసమెరుపు. ఇది కూడా చదవండి: భారత్ చైనా సంబంధాలు బలపడాలి: జిన్పింగ్ -
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. ఎయిర్పోర్టులు మూసివేత
మాస్కో: మాస్కో శివార్లలో ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేయగా వాటిని కూల్చేశామని తెలిపింది పుతిన్ సైన్యం. దీంతో అప్రమత్తమై నాలుగు ప్రధాన ఎయిర్పోర్టుల్లో రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపింది రష్యా రక్షణ శాఖ. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులతో విరుచుకుపడింది. మాస్కో సరిహద్దుల్లోని బ్రియాన్స్క్ ప్రాంతంలో క్రాస్నోగోర్స్క్ పట్టణంలో నాలుగు డ్రోన్లు ప్రవేశించడంతో వాటిని రష్యా సైన్యం కూల్చివేసింది. గగనతలాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఈ దాడులకు పాల్పడటంతో అప్రమత్తమై ముందు జాగ్రత్తగా వ్నుకోవో, షెరెమెట్యెవో, డొమోడెడెవో, జుకోవ్స్కీ ఎయిర్పోర్టుల్లో రాకపోకలను నిలిపివేశారు రష్యా అధికారులు. రష్యా ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ డ్రోన్ల దాడులను ముమ్మరం చేసిందని గత ఆదివారం కూడా జరిగిన దాడుల్లో డ్రోన్లు రైల్వే స్టేషన్ పైకప్పు భాగంలోకి దూసుకుపోగా ఐదుగురు ప్రాణాలు కోలోయారని గుర్తు చేశారు. ఆ సమయంలో రైల్వే స్టేషన్లో సుమారు 50 మంది ఉండగా మరణించిన ఐదుగురిలో ఇద్దరు ఆసుపత్రికి తరలించడానికి నిరాకరించారని మిగిలిన ముగ్గురు ఆసుపత్రిలో మరణించారని తెలిపారు. అంతకుముందు ఇదే కుర్స్క్ ప్రాంతానికి చెందిన వొల్ఫినోలో కూడా ఉక్రెయిన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇటీవలి కాలంలో మరింత బలాన్ని వెనకేసుకున్న ఉక్రెయిన్ యుద్ధం తొలినాళ్లలో కోల్పోయిన ఒక్కో ప్రాంతాన్ని మెల్లగా తిరిగి చేజిక్కించుకుంటోంది. ఇది కూడా చదవండి: కార్చిచ్చును వంటింట్లో మంటలతో పోల్చిన జో బైడెన్ -
రష్యా కేంద్ర బ్యాంకు సంచలనం: ఆర్థిక వేత్తల ఆందోళన
రష్యా సెంట్రల్ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ కరెన్సీ రూబుల్ కనిష్టానికి పడిపోయిన నేపథ్యంలో కీలక వడ్డీరేట్లను భారీగా పెంచేసింది. 12 శాతం లేదా 350 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు పెంపును మంగళవారం ప్రకటించింది. ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి దేశం కరెన్సీ విలువ దిగజారిపోవడం, ద్రవ్యోల్బణంపై పోరులో భాగంగా అత్యవసర చర్యకు ఉపక్రమించింది. తద్వారా రూబుల్ను బలోపేతం చేయాలని భావిస్తోంది. యుద్ధం , ఆంక్షలు పరిష్కారం కానంతవరకు గతంలో 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను ఏకంగా 12 శాతానికి పెంచుతున్నట్లు రష్యా సెంట్రల్ బ్యాంక్ మంగళవారం వెల్లడించింది.రష్యన్ కరెన్సీ సోమవారం డాలర్తో పోలిస్తే రూబుల్ 102 మార్కు వద్ద 16 నెలల కనిష్టానికి చేరడంతో ఈ కఠిన చర్యలకుది గింది. సంవత్సరం ప్రారంభం నుండి దాని విలువలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ కోల్పోయింది .దాదాపు 17 నెలల్లో కనిష్ట స్థాయిని తాకింది. గత మూడు నెలల్లో ద్రవ్యోల్బణం 7.6 శాతానికి చేరుకుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుందని, ఇది రూబుల్ పతనం ప్రమాదాన్ని పెంచుతుందని అంచనా వేస్తూ, గత నెలలో 1 శాతం మేర వడ్డీరేటును పెంచింది. వడ్డీ రేట్లపై దాని తదుపరి సమావేశం సెప్టెంబర్ 15న జరగనుంది.ఒక్కసారిగా కీలక వడ్డీ రేట్లను 350 బేసిస్ పాయింట్లు పెంచటంపై ప్రపంచ ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది గ్లోబల్ మార్కెట్లను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. లండన్లోని బ్లూబే అసెట్ మేనేజ్మెంట్లో సీనియర్ ఎమర్జింగ్ మార్కెట్ల సావరిన్ స్ట్రాటజీ తిమోతీ యాష్ స్పందన: యుద్ధం కొనసాగుతున్నంత కాలం రష్యా, రష్యా ఆర్థిక వ్యవస్థ, రూబుల్కు మరింత దిగజారుతుంది. హైకింగ్ పాలసీ రేట్లు దేనినీ పరిష్కరించని వ్యాఖ్యానించారు. రూబుల్ తరుగుదల వేగాన్ని తాత్కాలికంగా తగ్గించవచ్చు కానీ ప్రధాన సమస్య అయిన యుద్ధం , ఆంక్షలు పరిష్కరించుకోవాలన్నారు. లండన్లోని ఈక్విటీ క్యాపిటల్లో చీఫ మాక్రో ఎకనామిస్ట్ స్టువర్ట్ కోల్ ఏమన్నారంటే..రూబుల్ విలువ పతనానికి ఇది అత్యవసర ప్రతిస్పందన.కరెన్సీ పతనం ద్రవ్యోల్బణాన్ని పెంచే ప్రమాదం ఉంది.ఇది ఉక్రెయిన్ దాడి ఖర్చుల గురించి రష్యన్ ప్రజలకు పంపే సంకేతమన్నారు. యుద్ధం కారణంగా సైనిక వ్యయం పెరిగిపోవడం, రష్యా వాణిజ్య సమతుల్యతపై పాశ్చాత్య ఆంక్షల ప్రభావం, ద్రవ్యోల్బణం లాంటి కారణాలతో రష్యా కేంద్ర బ్యాంకు రేటు పెంపు నిర్ణయం తాత్కాలిక పరిష్కారమే. రూబుల్ పతనం, ఇంధన ధరలు, ఎగుమతి ఆదాయాలు క్షీణించడంతో పాటు వస్తువుల దిగుమతులు వేగంగా పుంజుకోవడం వల్ల కరెంట్ ఖాతా మిగులు బాగా తగ్గిపోయిందని ఆర్థిక వేత్తలంటున్నారు. అంతేకాదు తాజా రేట్ల పెంపు ఇండియా చెల్లింపులను కూడా ప్రభావితం చేయవచ్చని అంచనా. ఈ ప్రభావం ఆసియా స్టాక్మార్కెట్లతోపాటు, భారత స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపి నష్టాలకు దారితీయెుచ్చనే ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్పై దాడి నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత, రూబుల్ డాలర్తో పోలిస్తే 130కి పడిపోయింది, అయితే సెంట్రల్ బ్యాంక్ దాని కీలక వడ్డీ రేటును 20శాతం వరకు పెంచి మూలధన నియంత్రణలను అమలులోకి తెచ్చింది. ఆ తర్వాత నెలరోజుల్లో రేట్లను తగ్గించి కరెన్సీ విలువను స్థిరీకరించే ప్రయత్నాలు చేసింది. -
భారత్లో జరిగే జీ-20 సదస్సులో అదే హాట్ టాపిక్
వాషింగ్టన్: సెప్టెంబర్ నెలలో జరగనున్న జీ-20 సదస్సులో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి సంబంధించిన చర్చే ప్రధానం కానుందని చెబుతున్నాయి వైట్ హౌస్ వర్గాలు. ఈ మేరకు అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఒక ప్రకటన చేశారు. ఈ దఫా జీ-20 సదస్సు భారత్లో జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ ప్రథమార్ధంలో న్యూఢిల్లీ వేదికగా అజరిగే ఈ సదస్సుకు అతిరధ మహారధులంతా హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా పాల్గొనబోయే ఈ సమావేశంలో మిగతా అంశాలతో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన చర్చ కూడా జరగనుందని సమావేశానికి హాజరుకానున్న అన్ని దేశాలు ఇదే అంశానికి పెద్ద పీట వేసినా ఆశ్చర్యపోనక్కరలేదని అన్నారు అమెరికా అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్. నాటో సభ్యత్వం కోసం ఉక్రెయిన్ ప్రయత్నం చేయడంతో యుద్ధానికి బీజం పడింది. 2022, ఫిబ్రవరి 24న రష్యా స్పెషల్ మిలటరీ ఆపరేషన్ ప్రారంభించింది. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మొదలైన యుద్ధం ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది. ఇక ఉక్రెయిన్ నాటో సభ్యత్వంపై ఇటీవల జరిగిన సమావేశాల్లో భాగస్వామి దేశాలు సంయుక్తంగా ఒక నిర్ణయానికి వచ్చాయి. రష్యాతో జరుగుతున్న యుద్ధం సమసిపోతే గానీ ఉక్రెయిన్ సభ్యత్వం గురించి ఎటూ తేల్చలేమని తేల్చేశాయి. ఇటీవల సౌదీ రాజు అధ్యక్షతన ఆ దేశంలో జరిగిన సమావేశంలోనూ ప్రధానంగా ఉక్రెయిన్ గురించిన చర్చ జరిగింది. వచ్చే నెల జీ-20 సదస్సులో కూడా అదే హాట్ టాపిక్ కానుంది. ఎక్కడ సమావేశాలు జరిగినా రష్యా ఉక్రేయి యుద్ధం ప్రస్తావన వస్తూనే ఉంది. సుదీర్ఘన్గా కొనసాగుతున్న యుద్ధం తదనంతర పరిణామాల దృష్ట్యా ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఎలాగైనా యుద్ధాన్ని ఓ కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తుండడం మంచి పరిణామమే. ఇది కూడా చదవండి: 24 ఏళ్లయ్యింది.. ఇకనైనా తొలగించండి ప్లీజ్.. మళ్లీ -
రష్యా యుద్ధనౌకపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి..
మాస్కో: నోవోరోసిస్క్ లోని రష్యా నల్ల సముద్ర నౌకాదళ స్థావరంపై ఉక్రేనియన్ డ్రోన్ దాడికి పాల్పడిండి. ఈ దాడిలో రష్యా యుద్ధనౌక దారుణంగా దెబ్బతింది. దీంతో నౌకాశ్రయంలోని కార్యకలాపాలను నిలిపివేసినట్లు తెలిపింది కాస్పియన్ పైప్లైన్ కన్సార్టియం. ఈ దాడికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ ఇంటర్నెట్లో వైరలయ్యాయి. నిరంతరాయంగా కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ రష్యాను చావుదెబ్బ తీసింది. ప్రపంచ దేశాలకు చమురు తోపాటు ధాన్యాన్ని సరఫరా చేసే రష్యా నల్ల సముద్ర నౌకాదళ స్థావరంపై ఉక్రేనియన్ డ్రోన్ దాడి చేసింది. దాడిలో ఒలెనెగోర్స్కీ గోర్న్యాక్ అనే యుద్ధ నౌక తీవ్రస్థాయిలో దెబ్బతింది. డ్రోన్ల ద్వారా సుమారు 450 కిలోల టీఎన్టీని మోసుకెళ్లి ఓడను ఢీకొట్టినట్లు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వర్గాలుప్రకటించాయి. దాడి సమయంలో యుద్ధనౌకపై సుమారు 100 మంది రష్యా సాయుధులు ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు. రాత్రిపూట జరిగినా కూడా డ్రోన్ కెమెరాలో దాడికి సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ వీడియాను ఉక్రెయిన్ బలగాలు మీడియాకు చేరవేశాయి. దాడి అనంతరం రష్యా బలగాలు రెండు సీ డ్రోన్ల సాయంతో బేస్ వెలుపల ఉక్రెయిన్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. దాడిలో జరిగిన నష్టం గురించి మాత్రం వారు ప్రస్తావించలేదు. ఉక్రెయిన్ రిటైర్డ్ నావికా దళాధిపతి ఆండ్రియ్ రైజంకో మాట్లాడుతూ ఈ దాడుల కోసం ఉక్రెయిన్ సముద్ర డ్రోన్లు దాదాపు 760 కిలోమీటర్లు ప్రయాణించి ఉంటాయని. ఉక్రెయిన్ డ్రోన్లు అంత దూరం ప్రయాణించడం ఇదే మొదటిసారని ఆయన అన్నారు. POV: you ram into a Russian landing warship as a little simple drone pic.twitter.com/u79u5A4Shb — Illia Ponomarenko 🇺🇦 (@IAPonomarenko) August 4, 2023 ఇది కూడా చదవండి: పుతిన్ శత్రువుపై మరిన్ని కేసులు.. ఎంత కాలం శిక్ష పడనుందో తెలుసా? -
ఉక్రెయిన్ బందీలపై రష్యా బలగాల అకృత్యాలు
క్యివ్: రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో బందీలుగా చెరపట్టబడిన వారిని రష్యా సాయుధ బృందాలు అత్యంత క్రూరంగా హింసిస్తున్నట్లు చెబుతున్నారు ఉక్రెయిన్ అధికారులు. అంతర్జాతీయ మానవతా న్యాయ సంస్థ గ్లోబల్ రైట్స్ కంప్లయన్స్ వారు ఇచ్చిన నివేదిక ప్రకారం 18 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో మొత్తం 97,000 నేరాలు నమోదుకాగా వాటిలో 220 కేసులలో ఇప్పటికే తీర్పులిచ్చాయి స్థానిక న్యాయస్థానాలు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కూడా అరెస్టు చేయాలని కొన్ని న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి. కానీ క్రెమ్లిన్ వర్గాలు ఈ తీర్పులకు స్పందిస్తూ అవి దేశరక్షణలో భాగంగా జరిగిన స్పెషల్ మిలటరీ ఆపరేషన్ అంటూ చెప్పుకొచ్చాయి. ఇదిలా ఉండగా బ్రిటీష్, ఐరోపా సంయుక్త దేశాలు, అమెరికా సహకారంతో నడిచే మొబైల్ జస్టిస్ టీమ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఖేర్సన్ పరిసర ప్రాంతంలోని 35 చోట్ల 320 యుద్ధ నేరాలు ఆరోపించబడ్డాయని తెలిపింది. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ల తాజా విచారణలో ప్రకారం రష్యా రాజకీయ నాయకుడితో ఉక్రెయిన్ కు చెందిన ఇద్దరు చేతులు కలిపి ఖేర్సన్ నుండి ఎందరో అనాధలను ఖైదీలుగా తరలించారు. వారినందరినీ చిత్రహింసలకు గురిచేస్తూ రష్యా సైన్యం లైంగిక దాడులకు కూడా పాల్పడుతోందన్నారు. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్లు ప్రాసిక్యూట్ చేసిన 36 మంది మాత్రం కరెంటు షాక్ ఇవ్వడం, చావబాదడం తోపాటు అత్యాచారానికి పాల్పడతామంటూ బెదిరించినట్టు తెలిపారు. గ్లోబల్ రైట్స్ కంప్లయన్స్ న్యాయ సలహాదారు మాత్రం ఖైదీలపై రష్యా ఆకృత్యాలపై పూర్తి స్థాయి నివేదిక ఇంకా అందాల్సి ఉందన్నారు. ఇది కూడా చదవండి: సముద్రంలో ఒళ్ళు గగుర్పొడిచే సాహసం.. తలచుకుంటేనే.. -
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. మాస్కో విమానాశ్రయం మూసివేత
మాస్కో: ఆదివారం ఉదయం మాస్కో నగరంలో మొత్తం మూడు డ్రోన్లతో ఉక్రెయిన్ దాడికి పాల్పడగా ఒకదాన్ని నగరం శివార్లలోనే కూల్చేశాయి రష్యా బాలగాలు. రెండిటిని మాత్రం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ దెబ్బతీశాయి. ప్రమాదంలో ఎవ్వరికి గాయాలు తగల్లేదని తెలిపింది రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ. దీంతో కొద్దిసేపు మాస్కో విమానాశ్రయాన్ని మూసివేశారు ఎయిర్పోర్టు అధికారులు. ఉక్రెయిన్ సరిహద్దు నుండి సుమారు 500 కి.మీ(310 మైళ్ళు) మేర ఆ దేశం అప్పుడప్పుడు దాడులకు పాల్పడింది. కానీ ఈసారి మాత్రం ఉక్రెయిన్ క్రెమ్లిన్, సరిహద్దులోని రష్యా పట్టణాల మీద దాడి చేసింది. మాస్కో నగర మేయర్ సెర్గీ సొబ్యానిన్ దాడులపై స్పందిస్తూ.. ఈ దాడుల్లో రెండు సిటీ ఆఫీస్ టవర్లు కొంత వరకు దెబ్బతిన్నాయని.. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు. ఆదివారం జరిగిన డ్రోన్ల దాడుల్లో ఒకదాన్ని మాస్కో ఒడింట్సోవ్ జిల్లాలోని రక్షణ బలగాలు మట్టుబెట్టాయని మరో రెండు డ్రోన్లను తమ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ధ్వంసం చేసిందని.. వాటి శకలాలు నిర్మానుష్య ప్రాంతంలో నేలకూలాయని అన్నారు. ఈ కారణంగానే కొద్దిసేపు వ్నుకోవో విమానాశ్రయానికి రాకపోకలను నిలిపివేసినట్లు చెబుతూ దీన్ని మేము తీవ్రవాదుల చర్యగానే పరిగణిస్తున్నామని తెలిపింది రష్యా రక్షణ శాఖ. ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున మరో భారతీయుడు -
ప్రత్యర్ధికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరణ.. ఏకంగా టోర్నీ నుంచి ఔట్!
మిలాన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్స్లో ఉక్రేనియన్ ఫెన్సర్ ఓల్గా ఖర్లాన్ అనర్హత వేటు పడింది. ప్రత్యర్ది రష్యన్ ఫెన్సర్స్ అన్నా స్మిర్నోవాతో కరచాలనం చేసేందుకు నిరాకరించడంతో ఆమెను ఈ ఛాంపియన్షిప్స్ నుంచి తప్పించారు. గరువారం జరిగిన మ్యాచ్లో స్మిర్నోవాపై 15-7 తేడాతో ఖర్లాన్ విజయం సాధించింది. అయితే మ్యాచ్ పూర్తి అయిన తర్వాత స్మిర్నోవా.. ఓల్గాకు షెక్హ్యాండ్ ఇచ్చేందుకు ఆసక్తి చూపింది. కానీ ఓల్గా ఖర్లాన్ మాత్రం అందుకు విముఖత చూపింది. కాగా గతేడాది ఫిభ్రవరి నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన దేశానికి మద్దతుగా షెక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఓల్గా నిరకారించింది. " మాపై ఎటువంటి చర్యలు తీసుకున్న పర్వాలేదు. మేము ఎప్పటికి వారితో(రష్యా) చేతులు కలపము" అంటూ తనపై వేటు పడిన అనంతరం ఓల్గా వాఖ్యనించింది. చదవండి: IND vs WI: కోహ్లి సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన గిల్! వీడియో వైరల్
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
టీడీపీ మరో కుట్ర మాచర్లలో హైటెన్షన్
బంగారుకొండను పేరుస్తున్న ఆర్బీఐ..!
రేవ్ పార్టీలో పట్టుబడ్డ టీడీపీ నేతలు
’ఆప్‘ రాకతో నెలకు రూ. 18 వేలు ఆదా: రాఘవ్ చద్దా
ఈ భారత సంతతి సీఈవో వేతనం రూ.1,260 కోట్లు!
16ఏళ్లకు స్టార్ ఆపై 22ఏళ్లకే విషాదం.. రజనీకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు?
రిమాండ్ రిపోర్టులోవిస్తుపోయే నిజాలు
బెంగళూరు: రేవ్పార్టీ ముసుగులో వ్యభిచార దందా?
షోకాజ్ నోటీసులపై స్పందించిన బీజేపీ ఎంపీ
అసలు ఈ గొడవ కి ముందు వీడియో.. లైవ్ లో చూపించిన అంబటి
తప్పక చదవండి
- నిందితుని కోసం ఆసుపత్రిలోకి దూసుకొచ్చిన పోలీస్ వ్యాన్
- బంగారుకొండను పేరుస్తున్న ఆర్బీఐ..!
- జీహెచ్ఎంసీలో కామ పిశాచి!
- అందుకే నా పేరుకి బ్లూ చేర్చా: ‘పుష్ప పుష్ప..’ సింగర్
- ‘బీజేపీ చేయలేని పని రాహుల్ చేస్తున్నారు’
- అంబానీల అతిథులకు కరీంనగర్ కానుకలు
- కన్హయ్యకు రూ. 52 లక్షలు? ఎవరెవరిచ్చారు?
- తెలుగు రాష్ట్రాల్లో డెత్ ట్రావెల్స్
- ‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్
- అదే మా ఓటమిని శాసించింది.. లేదంటే విజయం మాదే: డుప్లెసిస్
Advertisement