-
పారిశ్రామికం పరుగులు
ఏడాదిన్నరలో రూ.24,698 కోట్ల పెట్టుబడులు - విద్యుత్, ఫార్మా రంగాల్లో పెట్టుబడుల వెల్లువ - రెండోస్థానంలో ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు - మూడో వంతు పెట్టుబడులు విద్యుత్ రంగంలోనే - టీఎస్ఐపాస్ కింద 1,798 కంపెనీలకు అనుమతులు - అందులో ఉత్పత్తులు ప్రారంభించినవి 1,029 -1.11 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం అంచనా సాక్షి, హైదరాబాద్: పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తొలి ప్రయత్నం ఫలించింది. నూతన పారిశ్రామిక విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచీ ఇప్పటివరకు(ఏడాదిన్నర) రాష్ట్రానికి దాదాపు రూ.25 వేల కోట్ల పెట్టుబడులు తరలివచ్చా యి. ప్రధానంగా విద్యుత్, ఫార్మా రంగాలకు సంబంధించిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేం దుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎక్కువ ఆసక్తి కనబరిచారు. ఐటీ సేవలు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు పెట్టుబడుల్లో రెండోస్థానంలో నిలిచాయి. కోత లేకుండా నిరాటంకంగా విద్యుత్ను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం... కొత్త విద్యుత్ ప్రాజెక్టుల స్థాపన, విద్యుత్ కొనుగోలుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అందుకే విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు, సౌర విద్యుత్ ప్లాంట్లు, సంబంధిత పరికరాల తయారీ కంపెనీల స్థాపనకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడుల మొత్తంలో మూడో వంతు ఈ రంగంలోనే కేంద్రీకృతమవటం గమనార్హం. విద్యుత్ రంగం ఫస్ట్: విద్యుత్ రంగంలో రూ.8,718 కోట్ల పెట్టుబడులతో 85 కంపెనీలు నెలకొల్పేందుకు అనుమతులు జారీ అయ్యాయి. ఫార్మా పరిశ్రమకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న హైదరాబాద్లో మరిన్ని కొత్త కంపెనీల విస్తరణ ఖాయమైంది. ఫార్మా, కెమికల్ రంగంలో రూ.4,022 కోట్ల పెట్టుబడులతో కొత్తగా 152 కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీకి ముందుకు వచ్చాయి. ఈ రెండు రంగాల తర్వాత ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల స్థాపనకు పారిశ్రామికవేత్తలు మొగ్గు చూపారు. దేశంలోనే పేరొందిన ఐదు ఐటీ కంపెనీలు రూ.2,647 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో తమ కార్యకలాపాల విస్తరణకు ముందుకు వచ్చాయి. వీటితో అత్యధికంగా 22,300 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అమెజాన్, కాగ్నిజెంట్, ఓఎన్జీసీ ఐటీ సర్వీసెస్, సిఫీ టెక్నాలజీస్, మహావీర్ డెవెలపర్స్ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఈ యూనిట్ల నెలకొల్పేందుకు వివిధ జిల్లాల్లోని పారిశ్రామికవేత్తలు ఎక్కువ సంఖ్యలోనే దరఖాస్తు చేసుకున్నారు. ఈ రంగంలో రూ.2,166 కోట్లతో కొత్త యూనిట్ల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందు కొచ్చారు. ఉత్పత్తులు ప్రారంభించిన 1,029 కంపెనీలు ఇప్పటివరకు టీఎస్ఐపాస్ సింగిల్ విండో విధానంలో మొత్తం 1,798 కంపెనీలు అనుమతులు పొందాయి. కేవలం 15 రోజుల్లోనే వీటికి అవసరమైన అనుమతులు జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని కొత్త పంథాను అమలు చేసింది. వీటిలో ఇప్పటికే 1,029 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. మరో 334 కంపెనీల స్థాపన తుది దశలో ఉందని.. ఒకటీ రెండు నెలల్లోనే అవి ఉత్పత్తి దశకు చేరుకుంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. అనుమతులు పొందిన వాటిలో 42 కంపెనీలు ఇప్పటికీ ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. 393 కంపెనీలు ఇప్పుడిప్పుడే నిర్మాణ ప్రక్రియ చేపట్టాయి. ఇప్పటివరకు అనుమతి తీసుకున్న కంపెనీల పెట్టుబడుల మొత్తం రూ.24,698 కోట్లకు చేరింది. వీటి ద్వారా 1.11 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. అనుమతులు పొందిన వాటిలో అత్యధికంగా 336 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, 212 ఇంజనీరింగ్ కంపెనీలు, 171 ఆగ్రో బేస్డ్ కంపెనీలు, 163 ప్లాస్టిక్, రబ్బర్ కంపెనీలున్నాయి. రంగారెడ్డిలోనే ఎక్కువ రాజధానికి దగ్గర ఉండటంతో పాటు ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జిల్లాల్లోనే పెట్టుబడులకు మొగ్గు చూపారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.7,012 కోట్ల విలువైన కంపెనీలు నెలకొల్పనున్నారు. సీఎం సొంత జిల్లా మెదక్లో రూ.6,462 కోట్ల విలువైన కంపెనీలకు అనుమతులు జారీ అయ్యాయి. వరంగల్ రూ.3,309 కోట్ల పెట్టుబడులతో మూడో స్థానంలో నిలిచింది. ఇంచుమించుగా అదే స్థాయిలో మహబూబ్నగర్ జిల్లా నాలుగో స్థానంలో ఉంది. కరీంనగర్, నిజామాబాద్ కొత్త కంపెనీల స్థాపనలో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
రూ. 100 కోట్లు.. వెయ్యి ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కె. తారక రామారావు చేపట్టిన రెండు వారాల అమెరికా పర్యటన సానుకూలాంశాలతో ప్రారంభమైంది. పర్యటన తొలి రోజులో భాగంగా కేటీఆర్ సోమవారం ఇల్లినాయీస్ రాష్ట్రంలోని షికాగో నగరంలో పలువురు పెట్టుబడిదారులు, సంస్థలతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీ టీఎస్ ఐపాస్ ప్రత్యేకతలను వివరించారు. అలాగే ఫార్మా, ఐటీ రంగాల్లో పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ఉన్న అవకాశాలను వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాల్లో 15 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 100 కోట్లు) పెట్టుబడులు పెట్టడంతోపాటు వెయ్యి మందికి ఉపాధి కల్పించేందుకు డిజిటల్ హెల్త్ కేర్ సంస్థ ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ ముందుకొచ్చింది. ఈ మేరకు కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. అలాగే రెడ్ బెర్రీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ కాంత్, జెనెసిస్ ఫార్మాస్యూటికల్స్ చైర్మన్ మోనిఫ్ మాటోక్, సేఫీ హోల్డింగ్స్ సీఈఓ అఫీ హసన్ తదితరులు కేటీఆర్తో సమావేశమై పలు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మీడియాకు ఓ ప్రకటనలో తెలిపింది. తొలి రోజు బిజీ బిజీగా... తొలి రోజు పర్యటనలో కేటీఆర్ బిజీబిజీగా గడిపారు. తొలుత భారత కాన్సుల్ జనరల్ అసఫ్ సయీద్తో సమావేశమైన కేటీఆర్.. ఆ తర్వాత ఇల్లినాయీస్ డిప్యూటీ గవర్నర్ ట్రే చిల్డ్రెస్తో భేటీ అయ్యారు. ఇల్లినాయీస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల నడుమ భాగస్వామ్యానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఫార్మా, ఐటీ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. టీ హబ్తోపా టు తెలంగాణ ప్రభుత్వ విధానాలను అభినందించిన ట్రే చిల్డ్రెస్.. ఇన్నోవేషన్ రంగంలో పెట్టుబడులకు పలు ఇల్లినాయీస్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. తమ రాష్ట్రంలోని షి కాగో నగరంతో తెలంగాణకు.. ముఖ్యంగా హై దరాబాద్ నగరానికి ప్రత్యేక అనుబంధముందన్నారు. పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్కు.. భారత కాన్సుల్ జనరల్ అసఫ్ సయీద్ విందు ఏర్పాటు చేసి జ్ఞాపికను అందజేశారు. ఇండియానా గవర్నర్తో కేటీఆర్ భేటీ షికాగో నుంచి ఇండియానా రాష్ట్ర రాజధాని ఇండియానాపోలిస్కు చేరుకున్న మంత్రి కేటీఆర్.. ఇండియానా గవర్నర్ మైక్ పెన్స్ తో సమావేశమయ్యారు. అనంతరం ఇండియానాపోలిస్-హైదరాబాద్ సిస్టర్ సిటీస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేటీఆర్ తెలంగాణ ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ర్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వారికి వివరించారు. ఇండియానాపోలిస్తో రాష్ట్రానికున్న సాంస్కృతిక, వ్యాపార సంబంధాలపై మంత్రి ప్రసంగించారు. తొలి రోజు పర్యటనలో మంత్రి వెంట పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement