-
ట్రాన్స్జెండర్ పట్ల వివక్ష తగదు : విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ : ట్రాన్స్జెండర్ పట్ల సమాజంలో కొనసాగుతున్న వివక్షను రూపుమాపాల్సి ఉందని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్ (హక్కుల పరిరక్షణ) బిల్లుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. తరతరాలుగా సమాజంలో ట్రాన్స్జండర్స్ వివక్ష, అవహేళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను వారికి నిరాకరించడం శోచనీయమని తెలిపారు.ఈ నేపథ్యంలో ట్రాన్స్జెండర్ వర్గాల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం ప్రవేశపెట్టిన బిల్లుకు తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సమాజంలో ట్రాన్స్జెండర్ వ్యక్తులు నిత్యం ఎదుర్కొనే వివక్షను తొలగించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. థర్డ్ జెండర్ పేరిట ఆయా వర్గాలకు జరిగే అన్యాయాన్ని, వారిపట్ల అనుసరించే అనుచిత వైఖరిని రూపుమాపేందుకు ఈ బిల్లు ఎంతగానో తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.అలాగే ఈ బిల్లు ద్వారా ట్రాన్స్జెండర్ సామూహికవర్గం ప్రయోజనాల పరిరక్షణతో పాటు వారికి విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి కనీస సదుపాయాలు పొందే చట్టబద్దమైన అర్హత లభిస్తుందని చెప్పారు. బిల్లులోనే సెక్షన్ 4 (2) ట్రాన్స్జెండర్గా ఒక వ్యక్తిని గుర్తించడం అన్నది స్వీయ ప్రకటిత లింగ గుర్తింపు ద్వారా అని చెబుతోంది. ఈ విధంగా ఏ వ్యక్తి అయినా తనకు తాను ట్రాన్స్జెండర్ అని స్వయంగా ప్రకటించే అవకాశం కల్పించడం వలన తప్పుడు క్లైయిమ్ల ద్వారా ఆ సామాజికవర్గం పొందే ప్రయోజనాలు దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని విజయసాయి రెడ్డి వెల్లడించారు. జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేసే గుర్తింపు పత్రం ద్వారా ఒక వ్యక్తిని ట్రాన్స్జెండర్గా గుర్తించవచ్చని బిల్లులో చెప్పారు. అలాగే స్వయం ప్రకటిత మార్గం ద్వారా కూడా ట్రాన్స్జెండర్ను గుర్తించడం జరుగుతుందని బిల్లులో పేర్కొన్నారు. ఈ వైరుధ్యంపై బిల్లులో ఎక్కడ స్పష్టత, వివరణ లేదని అన్నారు. దేశంలో తీవ్ర నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన ట్రాన్స్జెండర్ సామూహిక వర్గం సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి ఈ బిల్లుకు మద్దతు తెలపాలని సభలోని అన్ని పక్షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. -
ట్రాన్స్జెండర్స్ బిల్లుపై అసంతృప్తి
కీలక అంశాలను ప్రస్తావించలేదు: స్టాండింగ్ కౌన్సిల్ న్యూఢిల్లీ: ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం ఉద్దేశించిన బిల్లులో కీలకమైన పలు అంశాలను ప్రస్తావించలేదని పార్లమెంటరీ స్టాండింగ్ కౌన్సిల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. సదరు వ్యక్తులకు సంబంధించి పౌర హక్కులైన పెళ్లి, విడాకులు వంటి వాటి గురించి బిల్లులో ప్రస్తావించలేదని పేర్కొంది. బీజేపీ ఎంపీ రమేశ్ బైస్ నేతృత్వంలోని ఈ ప్యానెల్ సామాజిక న్యాయం, సాధికారత అనే అంశానికి సంబంధించిన నివేదికను శుక్రవారం లోక్సభ ముందు ఉంచింది. అందులో ట్రాన్స్జెండర్లను ఇప్పటికీ భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 377 కింద నేరస్తులుగా పరిగణించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ముసాయిదా ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ (హక్కుల రక్షణ) బిల్లు 2016లో కీలకమైన పెళ్లి, విడాకులు, దత్తత వంటి పౌర హక్కులకు సంబంధించి ఎటువంటి ప్రస్తావనా లేదని ప్యానెల్ పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెనుకబడిన తరగతుల కేటగిరీలో ట్రాన్స్జెండర్లకు సామాజికంగా, విద్యా పరంగా రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఈ బిల్లులో ప్రస్తావించలేదని వెల్లడించింది. ప్రస్తుతం ప్రతిపాదించిన చట్టం ట్రాన్స్జెం డర్ల హక్కులకు సంబంధించి చాలా తక్కువ స్థాయిలో ఉందని పేర్కొంది. హార్మోన్ల ప్రకారం.. లేదా సర్జరీ కింద తమ జెండర్ను ఎంచుకునే స్వేచ్ఛ, అవ కాశం వారికి ఉండాలని స్పష్టంచేసింది. ముసాయిదా బిల్లులో ట్రాన్స్జెండర్ నిర్వచనం స్పష్టంగా లేదని, అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా మార్చాల్సిన అవసరముందని అభిప్రా యపడింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement