-
రైతుల కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టండి
సాక్షి, అమరావతి : రైతులకు గిట్టుబాటు ధరతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని రైతు సంఘాల ప్రతినిధులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాను కోరారు. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ శనివారం నిర్వహంచిన రైతు మహాసభలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్షా తాడేపల్లిగూడెంలో హార్టికల్చర్ యూనివర్శిటీ గెస్ట్హౌస్లో పలు రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై చర్చించేందకు కనీసం వారం, పది రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరపాలంటూ భారతీయ కిసా¯ŒS సంఘం ప్రతినిధులు అమిత్షాకు వినతిపత్రం అందజేశారు. క్వింటా ధాన్యం పండించడానికి రైతుకు రూ.2 వేలు ఖర్చు అవుతుండగా, ప్రభుత్వం రూ.1,500 మించి గిట్టుబాటు ధర కల్పించడం లేదని.. ఈ పరిస్థితుల్లో రైతులకు లాభదాయకత ఎలా సా««దl్యమో ఆలోచించాలని సంఘ ప్రతినిధులు ఆయనకు వివరించారు. దీనికి స్పందించిన అమిత్షా ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు. రిఫైన్డు పామ్ ఆయిల్ దిగుమతులపై ప్రస్తుతం ఉన్న సుంకాన్ని 30 శాతం పెంచి, దేశీయ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆయిల్ పామ్ రైతులు కోరారు. కొబ్బరి పంట రైతులకు గిట్టుబాటు ధర కల్పన, ప్రకృతి వ్యవసాయం పోత్సహించేందుకు కేంద్ర బడ్జెట్లో అదనపు నిధుల కేటాయింపు అంశాలపై ఆయా రైతు సంఘాల ప్రతినిధులు వినతి ప్రతాలు ఇచ్చారు. ఈ సమస్యలపై కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడతానని అమిత్షా హామీ ఇచ్చారు. భారతీయ కిసా¯ŒS సంఘం జాతీయ కార్యదర్శి కుమార్స్వామి, రాష్ట్ర అధ్యక్షుడు జి. రాంబాబు వివిధ రైతు సంఘాల ప్రతిని«ధులు అమిత్షాను కలిసిన వారిలో ఉన్నారు. ప్రత్యామ్నాయం చూపాకే నిర్వాసితులను ఖాళీ చేయించాలి రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్షాను పోలవరం నిర్వాసితుల ప్రతినిధుల బృందం కలిసింది. తమకూ పెరిగిన రేట్ల ప్రకారం ఆర్ఆర్ ప్యాకేజీని అమలు చేయాలని వినతిపత్రం ఇచ్చింది. ఇటీవల కాలువ నిర్మాణంలో భూములు పోయిన వారికి ఎకరాకు రూ.15 లక్షల వరకు పరిహారం అందజేశారని, తమకు గతంలో ఎకరాకు రూ.రెండు లక్షలు, రూ.మూడు లక్షల పరిహారం అందిందని గుర్తు చేశారు. తమకూ ఆర్ఆర్ ప్యాకేజీని అందజేయాలని, నిర్వాసితులకు ప్రత్యామ్నాయ పునరావాస ఏర్పాట్లు చూపిన తర్వాతే అక్కడి నుంచి ఖాళీ చేయించాలని కోరారు. పోలవరం నిర్వాసితుల తరుపున పోరాడుతున్న వనవాసి కల్యాణ ఆశ్రమం జాతీయ కన్వీనర్ గిరీష్ కుజార్, రాష్ట్ర కన్వీనర్ సుబ్బరాయశాస్రి నాయకత్వంలో 20 మంది నిర్వాసితులు అమిత్షాను కలిశారు. -
ఏపీ ఎక్స్ప్రెస్లో చోరీ
తాడేపల్లిగూడెం : ఢిల్లీ నుంచి వస్తున్న ఏపీ ఎక్్సప్రెస్ టూటైర్ ఏసీలో నగదు, బ్యాంకు కార్డులు, అత్యవసర మందులు కలిగిన బ్యాగును బోగీల్లో పని చేసే వ్యక్తులు సోమవారం దొంగిలించినట్టు తణుకు బార్ అసోసియేష¯Œæకు చెందిన ఎం.రవిసోమశేఖర్ తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. భోపాల్లో రైలు ఎక్కానని చాలాసేపటి వరకూ బ్యాగు తనవద్దే ఉందని బోగీల్లో దుప్పట్లు మార్చే వ్యక్తి ఒకరు అనుమానాస్పదనంగా తిరిగారని, కొంత సేపటికి బ్యాగు కలిపించలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏలూరులోని పోలీసు అధికారి ఒకరికి ఈ సమాచారం బాధితుడు అందించారు. అధికారి ఆదేశం మేరకు తాడేపల్లిగూడెం సివిల్ పోలీసులు రైల్వే స్టేషన్æకు చేరుకున్నారు. ఏసీ ఎక్్సప్రెస్ 2.40 గంటలకు తాడేపల్లిగూడెం స్టేషన్కు చేరుకోగానే అనుమానిత వ్యక్తిని పోలీసులు పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ చర్యను నిరసిస్తూ బోగీలో ఇదే తరహా విధుల్లో ఉన్న సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తూ పలుమార్లు చైన్ లాగారు. దీంతో 2.43కు బయలుదేరాల్సిన రైలు దాదాపు 38 నిమిషాలపాటు ఆగిపోయింది. దీంతో విశాఖ వెళ్లే రెండు రైళ్లను ట్రాక్ మళ్లించి రైల్వే అధికారులు పంపించారు. చైన్లాగిన వారిని జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్
- మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
- బెదిరింపుల పర్వం!
- ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?
- సమస్య ఏదైనా.. సత్తిబాబు మీ వెంటున్నాడు..
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మే నెలలో 12 రోజులు బంద్!
- దుబాయ్లో అతి పెద్ద విమానాశ్రయం.. ప్రత్యేకతలు ఇవే..
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
Advertisement