-
‘అమిత్ షాకు అందుకే స్వైన్ఫ్లూ సోకింది’
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ చీఫ్ అమిత్ షా ఆరోగ్య పరిస్థితిపై సీనియర్ కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వైన్ఫ్లూతో బాధపడుతున్న అమిత్ షా ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచినందుకే అమిత్ షాకు స్వైన్ఫ్లూ సోకిందని వ్యాఖ్యానించారు. సంకీర్ణ సర్కార్ను కూలదోసే చర్యలు విరమించకపోతే ఆయనకు జ్వరంలో పాటు డయేరియా ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసిన బీజేపీ నేతలు వారిని ముంబై తరలించారని, వారికి బీజుఏపీ, ఆరెస్సెస్ కార్యకర్తలను కాపలగా ఉంచారని హరిప్రసాద్ ఆరోపించారు. జేడీయూ-కాంగ్రెస్ సర్కార్ను కూలదోయాలని ప్రయత్నించడంతోనే అమిత్ షాకు ఈ వ్యాధి సోకిందని ధ్వజమెత్తారు. మరోవైపు స్వైన్ఫ్లూతో బాధపడుతున్న అమిత్ షా కోలుకున్నారని, ఒకట్రెండు రోజుల్లో ఆయనను ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి చేస్తారని బీజేపీ మీడియా చీఫ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూనీ చెప్పారు. -
తూ.గో జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం
తూర్పుగోదావరి: జిల్లాలోని రావులపాలెంలో స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలకు ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. జిల్లాలోనే మొట్టమొదటిగా రావులపాలెం ఈ వ్యాధి వెలుగు చూడటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. గ్రామానికి చెందిన సత్తి వెంకటరెడ్డి భార్య నళిని ఇటీవల తీవ్ర అనారోగ్యంతో మృతి చెందింది. ఈమెకు తీవ్ర జ్వరం రావడంతో రాజమండ్రి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిమోనియా వ్యాధితో ఈమె మృతి చెందినట్టు వైద్యులు స్పష్టం చేశారు. అయితే, ఆమె ఇద్దరు కుమార్తెలు దీప్తి, శ్రీజలు కూడా నాలుగు రోజుల క్రితం జ్వరం బారిన పడటంతో వారిని కూడా రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రికి చేర్పించారు. వీరిలో దీప్తికి సాధారణ జ్వరం కాగా శ్రీజకు మాత్రం స్వైన్ ఫ్లూ సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారించారు. వీరి సమీప బంధువు కర్రి వీరారెడ్డి నాలుగేళ్ల కుమార్తె హర్షిత కూడా జ్వరం బారిన పడటంతో కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఈమెకు కూడా స్వైన్ ఫ్లూ సోకినట్టు నిర్ధారించి చికిత్స అందజేస్తున్నారు. జిల్లాలో మొదటి సారిగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో డీఎంఆండ్హెచ్ఓ కె. చంద్రయ్య హుటాహుటిన రావులపాలెం చేరుకున్నారు. స్థానిక ఊబలంక పీహెచ్సీ వైద్య సిబ్బందితో కలసి బాధితులు ఇళ్ళ వద్ద పరిస్థితిని సమీక్షించారు. గాలి ద్వారా వ్యాపించే ఈ వ్యాధి మరింత మందికి సోకే అవకాశం ఉన్నందున అంతా జాగ్రత్తలు పాటించాలని ఆయా కుటుంబాల వారికి సూచించారు. గ్రామంలో ఏడు వైద్య బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేయించారు. ఎవరికైనా ఈ వ్యాధి సోకినట్లు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. -
జిల్లాలో ఐదు స్వైన్ ఫ్లూ కేసులు
చాగలమర్రి : జిల్లా లో ఐదు స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు డీఎంఅండ్హెచ్ఓ మీనాక్షి మహాదేవన్ తెలిపారు. మంగళవారం స్థానిక మార్కెట్ కాలనీలోని సల్లా నర్సింగ్ హోంను ఆమె పరిశీలించారు. ప్రసాద్ నర్సింగ్ హోం నిర్వాహకులు స్కానింగ్ సెంటర్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇందుకు కావాల్సిన వసతులు, వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో వైద్యులు కొరత ఉందని, అన్ని పీహెచ్సీలకు వైద్యులను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రసాద్ నర్సింగ్ హోం వైద్యులు ప్రసాద్ ఉన్నారు. -
డోన్లో స్వైన్ప్లూ కేసు నమోదు
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో మరో స్వైన్ప్లూ కేసు నమోదయింది. ఇప్పటికే కర్నూలు నగరంలోని ప్రకాష్నగర్, నందికొట్కూరు మండలంలోని ప్రాతకోటకు చెందిన ఇద్దరికి స్వైన్ప్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. తాజాగా డోన్కు చెందిన ఓ మహిళకు సైతం ఈ వ్యాధి ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఈ మహిళ పది రోజుల క్రితం హైదరాబాద్కు వెళ్లొచ్చారు. జనవరి 31న స్వైన్ప్లూ లక్షణాలతో కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్ తరలించారు. వైద్య పరీక్షల్లో స్వైన్ప్లూ ఉన్నట్లు నిర్థారించినట్లు ఎపడమాలజిస్టు మహేష తెలిపారు. -
స్వైన్ ఫ్లూ సైరన్
నిడదవోలు రూరల్: వాతావరణంలో మార్పులతో పాటు జిల్లాలో చలి తీవ్రంగా ఉండటంతో స్వైన్ ఫ్లూ భయం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో పాటు విశాఖలో ఈ వ్యాధితో ఇటీవల ఒకరు మృతిచెందడం, హైదరాబాద్ నుంచి జిల్లాకు ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించడంతో వ్యాధి వ్యాప్తిపై అధికారుల్లో టెన్షన్ నెలకొంది. స్వైన్ ఫ్లూ ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి వైద్యారోగ్యశాఖ నుంచి ఆదేశాలు అందడంతో జిల్లాస్థాయిలో అధికారులు ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించేందుకు సమయాత్తమయ్యారు. గురువారం నుంచి ప్రధాన సెంటర్ల వద్ద అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటుతో పాటు మురికివాడలు, గ్రామాల్లో వైద్యసిబ్బందితో కరపత్రాలు పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించారు. చలితీవ్రత ఎక్కువ ఉండటంతో జ్వరం, జలుబుతో పాటు స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆçస్పత్రుల్లో వైద్యసేవలు పొందాలని, మాస్క్లు వాడాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఏలూరు, తణుకు, భీమవరం ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేశామని అవసరమైతే ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేక గది కేటాయిస్తామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వి.కోటేశ్వరి తెలిపారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే రక్తనమూనాలను తిరుపతి కిమ్స్కు పంపించి వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయిస్తామని చెప్పారు. వ్యాధిపై రెండురోజుల్లో వైద్య నివేదిక అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదుకాలేదని, ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. లక్షణాలు జ్వరం, విపరీతమైన దగ్గు, తలనొప్పిగా ఉండటం, ముక్కు నుంచి జలుబు కారడం, గొంతు నొప్పి, కండరాల నొప్పి, అలసట చెంది నీరసంగా ఉండటం స్వైన్ ఫ్లూ లక్షణాలు. జాగ్రత్తలిలా.. స్వైన్ ఫ్లూ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చేతులను శుభ్రంగా కడగాలి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు, ముక్కు నోటి దగ్గర చేతి రుమాలు, చేతిని అడ్డంగా పెట్టుకోవాలి. ఎవరినైనా కలిసినప్పుడు కరచలానం, కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం వంటివి చేయకూడదు. ఎవరికివారే చేతి రుమాలు వాడాలి. శుభ్రం చేసుకోని చేతులతో కళ్లు, ముక్కు, నోరును తాకకూడదు. స్వైన్ ఫ్లూ సంబంధిత లక్షణాలు కనిపిస్తే స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ‘గంట’కు రూ.100.!
- రియల్ ఎస్టేట్ వ్యాపారిని చితకబాదిన నటి రాధ
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
Advertisement