-
నాడు యాచక వృత్తి.. నేడు సూపర్వైజర్
నందిగామ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి మేలు జరుగుతోంది. ఇందుకు తానే ఉదాహరణ అని ఎన్టీఆర్ జిల్లా నందిగామకి చెందిన ట్రాన్స్జెండర్ ఇనపనుర్తి సహస్ర అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే యాచక వృత్తి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు సూపర్వైజర్గా రాణిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా సహస్ర మాట్లాడుతూ.. ‘నా అసలు పేరు సురేష్. చిన్నతనం నుంచి మహిళగా మారాలని కోరిక. పదవ తరగతి పూర్తికాగానే ఢిల్లీకి వెళ్లాను. అక్కడ హిజ్రాగా మారి నందిగామ వచ్చాను. అందరూ నన్ను దూరంగా పెట్టారు. చేద్దామంటే పని దొరకలేదు. దీంతో యాచించడం తప్ప మరోమార్గం దొరకలేదు. నేను డిగ్రీ పూర్తి చేశాను. ఉద్యోగం కోసం ప్రయత్నించినా రాలేదు. 2019లో సీఎం జగన్ ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు ద్వారా ఏపీఎస్బీసీఎల్కు చెందిన మద్యం దుకాణంలో సూపర్వైజర్గా ఉద్యోగం వచ్చింది. తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాను. సీఎం జగన్ చలవతోనే నేడు నాకు గౌరవం దక్కుతోంది’ అని తెలిపింది. ఇది కూడా చదవండి: కాకినాడ తునిలో దారుణం: మహిళా చిరు వ్యాపారిని డబ్బు కోసం బెదిరించి.. -
ఎంబీఎస్ జ్యువెలరీస్ సూపర్వైజర్ సురేష్ కుమార్ ఇంట్లో ఈడీ తనిఖీలు
-
వీల్చైర్లో వచ్చి.. పరీక్ష రాసి
కదల్లేని పరిస్థితిలో ఉన్నా తన లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు. నడవలేక పోయినా పరీక్ష రాయాలన్న తపనే తనను ముందుకు నడిపింది. దీంతో ఇలా వీల్చైర్లో వచ్చి మరీ పరీక్ష రాసింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లి అంగన్వాడీ టీచర్ గుజ్జ ప్రేమలతకు నెల రోజుల కిందట కాలు ఫ్యాక్చర్ కావడంతో హైదరాబాద్లో శస్త్ర చికిత్స చేయించుకుంది. రెండు నెలలు రెస్టులో ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో హైదరాబాద్లోనే ఉంటూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ ఉద్యోగం కోసం ప్రేమలత ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆమెకు సూపర్వైజర్ ఉద్యోగ పరీక్ష ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి నేరుగా వీల్చైర్లో వచ్చిన ఆమె.. దిండు, స్టూల్ కూడా పరీక్ష కేంద్రానికి వెంట తెచ్చుకున్నారు. నల్లగొండ ఎన్జీ కాలేజీలో పరీక్ష రాసి వెళ్లారు. – సాక్షి స్టాఫ్ ఫొటో గ్రాఫర్ నల్లగొండ -
మద్యం దుకాణం సూపర్వైజర్ అరెస్టు
రణస్థలం: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కోటపాలెం మద్యం దుకాణ సూపర్వైజర్ పాకాడ అప్పలస్వామిని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇంచార్జి సీఐ ఎ.గణపతిబాబు శనివారం అరెస్టు చేశారు. కోటపాలెం ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి అక్రమంగా మద్యం సరఫరా అవుతుందనే ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ సిబ్బంది, ఎన్ఫోర్స్మెంట్ సీఐ బి.నర్సింహులు, సిబ్బంది శుక్రవారం నిఘా వేశారు. బైల్టు దుకాణం నడుపుతున్న సుగ్గు రవికి అప్పలస్వామి 48 మద్యం సీసాలను ఒకేసారి విక్రయించాడు. అక్కడే మాటు వేసిన ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు వీరిద్దరినీ పట్టుకున్నారు. వీరిని అరెస్టు చేశామని ఇన్చార్జి సీఐ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రణస్థలం ఎస్ఐ బి.బంగారురాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన భగీరథ బకాసురులు
సాక్షి, తాండూరు: మిషన్ భగీరథ బకాసురులు అడ్డంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికారు. వివరాలిలా ఉన్నాయి.. తాండూరు నియోజకవర్గంలో సుమారు. రూ.500 కోట్లతో మిషన్ భగీరథ పనులు సాగుతున్నాయి. మిషన్ భగీరథ పనుల పర్యవేక్షణ బాధ్యతలను ఆర్డబ్లుఎస్ శాఖకు అప్పగించారు. బషీరాబాద్ మండలం జీవన్గి, మైల్వార్, కంసన్పల్లితో పాటు పలు గ్రామాల్లో కడప జిల్లాకు చెందిన గురువయ్య కాంట్రాక్టర్గా పనులు చేస్తున్నాడు. రూ.1.50 కోట్లకు సంబంధించి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. రూ.70 లక్షల పనులకు సంబంధించి మిషన్ భగీరథ పనులను పూర్తి చేయడంతో గురువయ్య రెండు నెలల క్రితం తాండూరులోని డీఈఈ కార్యాలయంలో బిల్లుల కోసం వచ్చారు. డీఈఈ గతంలోనే రూ.65 వేలు డిమాండ్ చేయడంతో బిల్లుల కోసం నగదును లంచంగా ఇచ్చారు. దీంతో రూ.70 లక్షల్లో కొంత బిల్లులు చెల్లించారు. అయితే మరో రూ.20 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉండటంతో గత నెలలో గురువయ్య డీఈఈ శ్రీనివాస్ వద్దకు వెళ్లాడు. రూ.30 వేలను చెల్లిస్తేనే బిల్లులు చేస్తామని డీఈఈ చెప్పాడు. చేసేది లేక గురువయ్య గతనెల 25వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అదును కోసం ఎదురు చూసిన ఏసీబీ అధికారులు 20 రోజుల పాటు పక్కా ప్రణాళికతో పట్టుకోవాలని వేచి చూశారు. ఏసీబీ ట్రాప్కు చిక్కిన డీఈఈ శ్రీనివాస్... మిషన్ భగీ«రథ పనుల కోసం బిల్లులు చేయాలని అందుకు కావాల్సిన పర్సంటేజ్ సిద్ధం చేసుకున్నానని కాంట్రాక్టర్ గురువయ్య అధికారులకు నమ్మబలికాడు. దీంతో గురువయ్య ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో రూ.30 వేలు తీసుకుని డీఈఈకి ఇచ్చేందుకు వచ్చారు. అయితే డబ్బులను వర్క్ఇన్స్పెక్టర్ మహేందర్కు ఇవ్వాలని చెప్పి పంపించారు. కార్యాలయ ఆవరణలో డబ్బులు తీసుకుంటుండగా మహేందర్ను.. రెడ్ హ్యాండెడ్గా డీఈఈ శ్రీనివాస్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అవినీతి అధికారులను వదలం.. అవినీతికి పాల్పడే అధికారులు ఎవరైన సరే ఆటకట్టిస్తామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. మిషన్ భగీరథ పనుల్లో కాంట్రాక్టర్ గాజుల గురువయ్య నుంచి లంచం డిమాండ్ చేస్తున్నారని బాదితుడు సమాచారం అందించారు. ఈ మేరకు ఈనెల 25వ తేది నుంచి నిఘా పెట్టడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ పనులను పూర్తి చేసిన గురువయ్యకు బిల్లుల కోసం వెళితే లంచం డిమాండ్ చేశారని దీంతో గురువయ్య ఇప్పటి వరకు రూ.95 వేలు ఆర్డబ్లుఎస్ డీఈఈ శ్రీనివాస్కు లంచంగా ఇచ్చారని విచారణలో తేలిందన్నారు. లంచం తీసుకుంటు పట్టుబడిన డీఈఈ శ్రీనివాస్ను, వర్క్ ఇన్స్పెక్టర్ మహేందర్ను అరెస్టు చేసి చంచల్గుడ జైలుకు తరలిస్తామన్నారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు నాగేంద్రబాబు, రాంలింగారెడ్డి, గంగాధర్, మజిద్లతో పాటు ఏసీబీ సిబ్బంది తదితరులున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement