-
అనంత్ అంబానీ అధిక బరువుకి కారణం ఇదే! ఆవిషయంలో..
రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ల వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. జులై 12న అంగరంగ వైభవంగా జరగనున్న పెళ్లితో ఇద్దరు ఒక్కటవ్వనున్నారు. వచ్చే నెల మార్చి 1 నుంచి 3 వరకు గుజరాత్లోని జామ్నగర్లో ఫ్రీ వెడ్డింగ్ వేడుకులు అట్టహాసంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అనంత్ అంబానీ తాన ఫేస్ చేస్తున్న ఆరోగ్య సమస్యలు, ఆ విషయంలో తన భార్య మద్దతు, అందిస్తున్న సహాయ సహకారాల గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. నిజానికి అనంత్ అంబానీ చిన్నతనంలో అసలు పెళ్లే చేసుకోకూడదని అనుకున్నారట. జంతువులంటే తనుకు ఎంతో ఇష్టమని వాటితో స్పెండ్ చేయడమే తనకు ఇష్టమని అన్నారు. అలాంటి నాకు రాధికాను కలిసి ఆమెతో మాట్లాడిన తర్వాత తన అభిప్రాయం మారిందని చెప్పుకొచ్చారు. ఆమె కూడా తనలా జంతువులతో మెలిగే ఆటిట్యూడ్ తనను ఎంతగానో ఇంప్రెస్ చేసిందన్నారు. అలాగే తాను ఫేస్ చేస్తున్న ఆరోగ్య సమస్యల పట్ల తన కాబోయే భార్య ఇచ్చిన మద్ధతు తనను మరింత ఆమెకు దగ్గరయ్యేల చేసిందని అన్నారు. ఆమె తన జీవితంలో భార్యగా అడుపెట్టడం తన అదృష్టం అంటూ రాధికా మర్చంట్పై ప్రసంశల జల్లు కురిపించారు. అనంత్ అధిక బరువు కారణం.. అనంత్ అంబానీ చిన్నతనం నుంచి ఊబకాయం, ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అంతకు ముందు అనంత్ సుమారు 200 కిలోలకు పైగా బరువు ఉండేవాడు. ఆయనకు అత్యంత ఆస్తమా ఉండటం వల్ల ఎక్కువ మోతాదులో స్టిరాయిడ్లు ఇవ్వాల్సి వచ్చిందని నీతా అంబానీ ఒక ఇంటర్యూలో తన కొడుకు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి వివరించారు. ఆస్తమా చికిత్స వల్లే అనంత్ అంతలా బరువు పెరిగేందుకు దారితీసిందని అన్నారు. ఈ ఆస్తమా ట్రీట్మెంట్లో ఉపయోగించే టెరాయిడ్స్, కార్టికోస్టెరాయిడ్స్ అనేవి అతడిలో ఆకలి కోరికను దారుణంగా పెంచేస్తాయిని, వాటి ఫలితంగానే అతడు అధిక బరువు ఉన్నాడని అన్నారు. ఈ ట్రీట్మెంట్ తీసుకునే వ్యక్తులు ఖర్చు చేసేదాని కంటే ఎక్కువ కేలరీలు తీసుకునేలా చేస్తాయట. అదీగాక ఈ కార్టికోస్టెరాయిడ్స్ జీవక్రియను మార్చి కొవ్వు నిక్షేపణను ప్రోత్సహించి, కండరాల ప్రోటీన్ సంశ్లేషను నిరోధిస్తాయి. ఫలితంగా శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. దీంతో ముఖం పొత్తి కడుపు, వీపు వంటి ప్రాంతాల్లో కొవ్వు చేరిపోయి అధిక బరువుకి కారణమవుతుంది. ఇలా దీర్ఘకాలికి లేదా అధిక మోతాదులో స్టెరాయిడ్ల వాడితే అది అధిక బరువుకి సంబంధించిన సమస్యలకు కారణమవుతుందని నీతా చెప్పుకొచ్చారు. ఇక అనంత్ ఎదుర్కొంటున్న ఈ ఆరోగ్య సమస్యల పట్ల ఆయన కాబోయ భార్య సానుకూలంగా స్పందించడమే తన వంతు మద్దతు సహాయ సహకారాలు అందిచేందుకు ముందుకు రావడం విశేషం. తన భార్య రాధికాను ఉద్దేశిస్తూ..ఏ భాగస్వామి అయినా ఇలాంటి మద్దుతు ఇస్తే ఆ వ్యక్తి సులభంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొననడమే గాక తొందరగా రికవరి అవ్వగలడని అనంత్ అంబాని ఉద్వేగంగా అన్నారు. దీనికి మించిన అద్భుతమైన మందు మరొకటి ఉండదన్నారు అనంత్ అంబానీ. కాగ, కొన్నేళ్ల క్రితం అనంత్ అంబానీ 2016లో ఒక్కసారిగా చాలా సన్నమై కనిపించారు. 208 కిలోల ఉండే అనంత్ దాదాపు 108 కిలోలు బరువు తగ్గి ఏకంగా 100 కేజీలకు చేరారు కూడా. దీని కోసం చాలా కష్టపడ్డారు. రోజుకు 5 నుంచి 6 గంటలు వ్యాయామం చేశారు. రోజూ 21 కిలోమీటర్ల వరకు నడిచారు. ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ చన్నా ఆధ్వర్యంలో కఠిన డైట్ పాటించి బరువు తగ్గి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు . కానీ ఆయనకు ఉన్న అనారోగ్య సమస్యల కారణంగానే కొద్ది కాలంలోనే మళ్లీ అనూహ్యంగా బరువు పెరిగారు. (చదవండి: వృద్ధాప్య లక్షణాలు కనిపించకుండా చర్మం నిత్య యవ్వనంలా ఉండాలంటే..) -
మళ్లీ సెల్ఫీ తీసుకునేందుకు కష్టపడ్డ బాబు !
-
సినిమాల్లో స్టార్ హీరోయిన్.. కానీ ఆమె జీవితమే ఓ విషాదగాథ!
అలనాటి హీరోయిన్ శ్రీవిద్య పేరు 1970లో వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1953న 24 జూలై జన్మించిన శ్రీవిద్య 14 ఏళ్లకే తమిళ సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోలతో నటించింది. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత మలయాళంలో తొలి అవకాశం వచ్చింది. 1971లో 'నోట్రుకు నురు' సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఏడాదిలోనే ‘ఢిల్లీ టు మద్రాస్’ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో దాసరి నారాయణరావు తెరకెక్కించిన తాతమనవడు చిత్రంతో అరంగేట్రం చేసింది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషలతో సహా 500కు పైగా సినిమాల్లో నటించింది. అప్పటి హీరోయిన్లలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్గా నిలిచింది. కుటుంబ నేపథ్యం శ్రీ విద్య తండ్రి కృష్ణమూర్తి తమిళ చిత్ర పరిశ్రమలో హాస్యనటుడు.. తల్లి వసంతకుమారి శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. జీవితం సవ్యంగా సాగుతున్న సమయంలోనే శ్రీవిద్య తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత కుటుంబ పోషణకై ఆమె తల్లి కూలి పనికి వెళ్లేది. అప్పట్లో అమ్మకు కనీసం పాలివ్వడానికి కూడా సమయం సరిపోలేదని గతంలో శ్రీవిద్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. వైవాహిక జీవితం శ్రీవిద్య సినిమాల్లో నటిస్తుండాగనే.. తమిళస్టార్ హీరో కమల్ హాసన్తో ప్రేమలో పడింది. వీరిద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. అయితే అప్పటికే కమల్ హాసన్ మరో హీరోయిన్ వాణి గణపతితో ప్రేమలో ఉన్నాడు. ఆ తర్వాత దర్శకుడు భరతన్తో శ్రీవిద్య ప్రేమాయణం కొనసాగించినా.. ఆ బంధంఎక్కువ కాలం నిలవలేదు. చివరికీ మాలీవుడ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న జార్జ్ థామస్ని ప్రేమించి 1978లో పెళ్లి చేసుకుంది. అయితే ఇది కులాంతర వివాహం కావడంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భర్త వేధింపులు పెళ్లయిన తర్వాత క్రైస్తవ మతాన్ని అనుసరించాలని భర్త జార్జ్ షరతు పెట్టాడట. దీంతో శ్రీవిద్య పెళ్లికి ముందే బాప్టిజం పూర్తి చేసింది. పెళ్లి తర్వాత కూడా భర్త బలవంతం వల్లే మళ్లీ నటనలో అడుగుపెట్టింది. అయినప్పటికీ జార్జ్ శ్రీవిద్యను వేధింపులకు గురి చేయడంతో.. ఆ బాధలు భరించలేక 1980లో విడాకులు తీసుకుని జార్జ్తో బంధానికి ముగింపు పలికింది. విడాకులిచ్చినా భర్త వదల్లేదు విడాకుల తర్వాత శ్రీవిద్య నటనలో కొనసాగింది. అయితే విడాకుల తర్వాత కూడా శ్రీవిద్యను జార్జ్ వదల్లేదు. ఆమె ఆస్తులన్నీ తనకు తిరిగి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. చివరకు సుప్రీంకోర్టులో శ్రీ విద్య విజయం సాధించింది. ఆ తర్వాత శ్రీవిద్య చెన్నై వదిలి కేరళలోని తిరువనంతపురంలో స్థిరపడింది. క్యాన్సర్తో మరణం 2003లో శ్రీవిద్యకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆ తర్వాత ఆమె చికిత్స కూడా తీసుకున్నారు. తాను చనిపోవడానికి 2 నెలల ముందు శ్రీవిద్య తన బంధువు సహాయంతో ఓ ట్రస్టు స్థాపించి.. ఆస్తినంతా పేద విద్యార్థులకు చదువు, సంగీతం, నాట్యం కోసం కేటాయించేలా వీలునామా రాసింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న సినీ కళాకారులను ఆదుకోవాలని వీలుమానాలో వెల్లడించింది. అంతేకాదు తన సోదరుడి ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, కార్మికులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వాలని వీలునామాలో ప్రస్తావించింది. క్యాన్సర్తో చివరికి శ్రీవిద్య 19 అక్టోబర్ 2006న మరణించగా.. తిరువనంతపురంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం విజయం సాధించలేకపోయింది. రెండుసార్లు లవ్ ఫెయిల్యూర్, భర్త వేధింపులు, చివరికీ క్యాన్సర్తో మరణం ఆమె జీవితాన్ని విషాదంగా ముగిసేలా చేశాయి. -
మొదట్లో చాలా భయపడేదాన్ని: ప్రియాంక చోప్రా
బాలీవుడ్లో నటి ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే స్పై థ్రిల్లర్ సిటాడెల్ వెబ్ సిరీస్తో అలరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించింది. కెరీర్ ప్రారంభంలో మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఎవరితోనూ పరిచయాలు లేకపోవడంతో భయపడినట్లు తెలిపింది. (ఇది చదవండి: అవార్డులు కొల్లగొట్టిన ఆలియా భట్ మూవీ..!) ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. '20 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టా. మొదట్లో చాలా కష్టంగా అనిపించింది. ఈ పరిశ్రమలో నాకు ఎవరూ తెలియదు. చాలా భయపడేదాన్ని. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో సీరియస్గా తీసుకునేదాన్ని. మానసికంగా ఇబ్బందులు పడ్డా. ఏదైనా సినిమా ఫెయిలైనా.. ఏదైనా అవకాశాన్ని కోల్పోయినప్పుడు ఆ బాధపడేదాన్ని. నేను చూసిన బిగ్గెస్ట్ స్టార్స్తో నటించాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో సంతోషంగా ఉంది.' అని అన్నారు. కాగా.. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ను పెళ్లి చేసుకున్న ప్రియాంక ఓ కూతురు కూడా జన్మించింది. తన ముద్దుల కూతురికి మేరీ మాల్టా అని పేరు పెట్టింది. (ఇది చదవండి: పొలిటీషియన్ను పెళ్లాడిన బుల్లితెర నటి.. దాదాపు పదేళ్ల తర్వాత!) -
అవకాశాలు ఇస్తామని నన్ను డ్రైవర్గా వాడుకున్నారు: నాని
నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. కెరీర్లో తొలిసారిగా పాన్ ఇండియా చిత్రం దసరాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా హీరో రవితేజతో చేసిన చిట్చాట్లో తన కెరీర్, జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అవమానాల గురించి వెల్లడించారు. నాని మాట్లాడుతూ.. 'నా ఫోటో ఆల్భమ్ పట్టుకొని ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగిను. ఎక్కడా కనీసం నన్ను లోపలి కూడా రానివ్వలేదు. చిన్న చిన్న పాత్రలు చేద్దామన్నా ఛాన్సులు రాలేదు. ఆ ప్రయత్నంలో ఉండగానే ఒకరిదిద్దరు కో డైరెక్టర్స్ నన్ను డ్రైవర్ లాగా కూడా వాడుకున్నారు. రకరకాల పనులు చేయించుకున్నారు. చివరకి నా ఎటీఎమ్లో పండగలకు బట్టలు కొనుక్కోకుండా దాచుకున్న డబ్బులను కూడా కొట్టేశారు. ఈ స్కాములన్నీ చూశాక ఇంక యాక్టింగ్ మళ్లీ మళ్లీ మోసపోవడం వల్ల కాదని, నటుడిగా ప్రయత్నాలు ఆపేసి ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా మారాను' అని నాని చెప్పుకొచ్చాడు. అష్టాచమ్మా సినిమాతో హీరోగా మారిన నాని ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాడు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement