-
సెమీకండక్టర్లను ఎగుమతి చేస్తున్న భారత్.. ప్రధాన స్టార్టప్లు ఇవే..
సెమీకండక్టర్లను దిగుమతి చేసుకునే దశ నుంచి వాటిని తయారుచేసుకుని ఇతర దేశాల్లోని ప్రముఖ కంపెనీలకు సరఫరా చేసే స్థాయికి భారత్ చేరుతోంది. దాంతో దేశీయంగా ఉన్న లిస్టెడ్ కంపెనీలు ఇప్పటికే వీటి తయారీలో దూసుకుపోతున్నాయి. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ రంగం మరింత వృద్ధి చెందుతుందని భావించి చాలా స్టార్టప్ కంపెనీలు ఈ సెమీకండక్టర్ల తయారీకి సిద్ధం అవుతున్నాయి. అందులో ప్రధానంగా ఈ కింది కంపెనీలు దేశీయంగా సెమీకండక్టర్ చిప్లను తయారుచేస్తున్నాయి.సాంఖ్యల్యాబ్స్మైండ్గ్రోడ్టెర్మినస్ సర్క్యూట్స్మార్ఫింగ్ మిషన్ఫెర్మియానిక్ఓక్టర్ఆగ్నిట్ఇన్కోర్సైన్ఆఫ్సిలిజియం సర్క్యూట్స్ఔరసెమిసెమీకండక్టర్ విభాగంలో అంకుర సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో టి-హబ్, నీతి ఆయోగ్తో కలిసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద కోహర్ట్-2 కార్యక్రమాన్ని గతంలో చేపట్టాయి. ఈ కార్యక్రమం కింద అంకుర సంస్థలను ఎంపిక చేసి, 6 నెలల పాటు వాటి ఎదుగుదలకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తాయి. దీని కోసం ఇప్పటికే అంకుర సంస్థలను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇందులో ఫేస్ఇంటెల్ సిస్టమ్స్, క్లూపే సైంటిఫిక్, డీప్ గ్రిడ్ సెమి, సెగో ఆటోమొబైల్ సొల్యూషన్, స్పైడెక్స్ టెక్నాలజీస్, జియోకాన్, ఛిపెక్స్ టెక్నాలజీస్, జీలీ స్మార్ట్ సిస్టమ్ ఉన్నాయి. -
1000 ట్రక్కుల భారీ ఆర్డర్.. దక్కించుకున్న బెంగళూరు స్టార్టప్
ఎలక్ట్రిక్ ట్రక్కులు తయారు చేసే బెంగళూరు ఆధారిత స్టార్టప్ ట్రెసా మోటార్స్ లాజిస్టిక్స్ కంపెనీ భారీ ఆర్డర్ దక్కించుకుంది. జేఎఫ్కే ట్రాన్స్పోర్టర్స్ నుండి 1,000 ట్రక్కుల కోసం ప్రీ-ఆర్డర్ను పొందింది. ఈ కంపెనీ మోడల్ V0.1ని అందిస్తోంది. దీన్ని గతేడాది జూలైలో ఆవిష్కరించింది. ట్రెసా కంపెనీ 18T-55T స్థూల వాహన బరువు విభాగంలోనూ ఎలక్ట్రిక్ ట్రక్కులను అభివృద్ధి చేస్తోంది. ట్రెసా ట్రక్కులు ప్రస్తుతం 300kWh బ్యాటరీ ప్యాక్, 24,000Nm మోటరును కలిగి ఉన్నాయి. ఇవి 15 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జీకి సపోర్ట్ చేస్తాయి. 120kmph గరిష్ట వేగాన్ని ఇస్తాయి. ఈ ఎలక్ట్రిక్ ట్రక్కులు ఒక్కసారి పూర్తి ఛార్జ్తో ఎంత రేంజ్ ఇస్తాయన్నది కంపెనీ వెల్లడించలేదు."మేము ఈ స్థితికి చేరుకోవడానికి చాలా సంవత్సరాలు కష్టపడ్డాం. ఇంకా ఇది ప్రారంభం మాత్రమే. జేఎఫ్కే ట్రాన్స్పోర్టర్స్ వంటి ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీలు ముందుకు రావడం మరియు మాపై విశ్వాసం ఉంచడం మాకు చాలా ఆనందంగా ఉంది" అని ట్రెసా మోటర్స్ సీఈవో రోహణ్ శ్రవణ్ పేర్కొన్నారు. ట్రెసా మోటార్స్ అధునాతన ఎలక్ట్రిక్ ట్రక్కులను తమ ఫ్లీట్లో చేర్చడం ద్వారా కార్బన్ ఫుట్ప్రింట్ను తగ్గించే తమ లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేస్తున్నామని జేఎఫ్కే ట్రాన్స్పోర్టర్స్ ఎండీ ఆదిల్ కొత్వాల్ అన్నారు. -
ది గ్రేట్ వడా పావ్ వార్
దిల్లీ ‘వైరల్ వడా పావ్ గర్ల్’గా పాపులర్ అయిన చంద్రికా గెరా దీక్షిత్ తాజాగా తన ఫుడ్ కార్ట్ సార్టప్తో రాత్రికి రాత్రి సెన్సేషన్గా మారింది. దీక్షిత్ పాపులారిటీ మాట ఎలా ఉన్నా ఆమెకు పోటీదారులు పెరిగారు. దీక్షిత్ ఫుడ్ కార్ట్ చుట్టుపక్కల పోటీదారులు వడా పావ్ బండ్లను ఏర్పాటు చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ‘పాపులారిటీనే కొంప ముంచిందా!’ లాంటి హెడ్లైన్స్ నెటిజనుల నుంచి లైన్ కట్టాయి. ‘నిన్న నేను రానందున తన బండిని ఉంచానని ఆంటీ చెప్పింది. ఈరోజు కూడా ఇక్కడే పెట్టింది. ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీయాలనుకోవడం సమంజసమా!’ అని తన ఆవేదనను వెళ్లగక్కింది దీక్షిత్. ఫుడ్ వ్లాగర్ పూడీ మానేహా ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోటీదారు ఆంటీ ‘ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. నా పని నేను చేసుకుపోతున్నాను’ అని ఎర్రటి ఎండల్లో కూల్గా బదులిచ్చింది. ‘బండి ఎవరు పెట్టారనేది కాదు... రుచి ముఖ్యం’ అని కూడా సెలవిచ్చింది. -
భారత్ స్టార్టప్ల దూకుడు
న్యూఢిల్లీ: దేశీ అంకుర సంస్థలు జోరు మీదున్నాయి. స్టార్టప్లు ఈ ఏడాది దాదాపు 8–12 బిలియన్ డాలర్ల వరకు నిధులు సమీకరించే అవకాశం ఉందని వెంచర్ క్యాపిటల్ సంస్థ పీక్ ఫిఫ్టీన్ ఎండీ రాజన్ ఆనందన్ తెలిపారు. దాదాపు 20 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయతగిన ప్రైవేట్ నిధులు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్ సంస్థలు.. స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపుదారులు ఆసక్తిగా ఉన్నారని స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 2021, 2022లో భారతీయ స్టార్టప్లలో ఏటా 8–10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని ఆనందన్ చెప్పారు. దీంతో ఆ రెండు సంవత్సరాల్లో అంకుర సంస్థల్లోకి వచి్చన పెట్టుబడులు 60 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు. ‘గతేడాది 7 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఈ మొత్తం తక్కువని చాలా మంది అంటున్నారు. కానీ, నిజం చెప్పాలంటే ఆరేళ్లకు సరిపడా పెట్టుబడులు రెండేళ్లలోనే వచ్చేసిన నేపథ్యంలో గతేడాది అసలు పెట్టుబడుల పరిమాణం శూన్యంగా ఉండేది. ఈ ఏడాది మనం 8–10 లేదా 12 బిలియన్ డాలర్ల వరకు సమీకరించే దిశగా ముందుకు వెడుతున్నాం. రాబోయే రోజుల్లో 10–12 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టే స్థాయికి స్టార్టప్ వ్యవస్థ చేరుకోగలదు‘ అని ఆనందన్ తెలిపారు. దేశీ స్టార్టప్ వ్యవస్థను పటిష్టంగా నిర్మించుకోవడానికి ఏటా 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 80,000 కోట్లు) సరిపోతాయని చెప్పారు. ప్రస్తుతం భారత్లో 20 స్టార్టప్లు లిస్ట్ అయ్యాయని, వచ్చే 7–8 ఏళ్లలో 100 అంకుర సంస్థలు లిస్టింగ్కి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డీప్టెక్ స్టార్టప్స్ కోసం పాలసీ.. డీప్టెక్ స్టార్టప్స్ కోసం ప్రత్యేక పాలసీని త్వరలోనే ప్రకటించనున్నట్లు పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ తెలిపారు. అంకుర సంస్థలకు నిధులే కాకుండా ప్రభుత్వం నుంచి కూడా ఆర్డర్లు దక్కాల్సిన అవసరం ఉందని, గవర్నమెంట్ ఈ–మార్కెట్ప్లేస్తో ఈ అవకాశం లభిస్తోందని సింగ్ వివరించారు. స్టార్టప్స్ నుంచి జీఈఎం ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ. 22,000 కోట్ల విలువ చేసే కొనుగోళ్లు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. -
రూ.100 కోట్ల కంపెనీ స్థాపించిన యంగ్ లేడీ.. ఎలాగంటే..
ఇంటికో వ్యాపారవేత్త... వీధికో స్టార్టప్ అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఐఐటీల్లో చదవాలని పిల్లలు ఎంతగా కలలు కంటున్నారో ఆ చదువవగానే సొంతంగా ఓ పరిశ్రమ పెట్టాలనీ అంతగానే కలలు కంటున్నారు. ఆ కలలకు దన్నుగా నిలుస్తోంది పారిశ్రామిక రంగం. దీంతో చాలా మంది యువత తమకు నచ్చిన పని చేసుకునేందుకు ఉద్యోగాలను మానేస్తున్నారు. అలా సొంత వ్యాపారాలను ప్రారంభించి విజయం సాధిస్తున్నారు. ఐఐటీలో చదివి స్టార్టప్ను స్థాపించి ఏకంగా రూ.100 కోట్ల కంపెనీగా అభివృద్ధి చేసిన ఆ యువ వ్యాపారవేత్త ఎవరు.. తను చేస్తున్న బిజినెస్ ఏమిటి.. తనను ఆ దిశగా ప్రేరేపించిన సంఘటనలు ఏవైనా ఉన్నాయా అనే అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం. రాజస్థాన్లోని భరత్పూర్కు చెందిన అహానా ఐఐటీ బాంబే నుంచి కెమికల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 2014-16 మధ్య కాలంలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ పట్టా తీసుకున్నారు. అక్కడ చదువుతున్న రోజుల్లో యూఎస్లో ఒక హోటల్కు వెళ్లినప్పుడు అధిక కొవ్వు, క్రీముతో కూడిన ఆహార పదార్థాలను తయారుచేయడం చూశారు. అప్పుడే ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రజలకు అందించాలనే ఆలోచన తనకు తోచింది. సొంతంగా తానే పౌష్టిక ఆహార ఉత్పత్తులను తయారు చేసి తనలాంటి ఆరోగ్య ప్రియులకు అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచనతో ‘ఓపెన్ సీక్రెట్’ పేరుతో రుచికరమైన పోషకాలతో కూడిన చిరుతిళ్లను ఉత్పత్తి చేసే కంపెనీని 2019లో స్థాపించారు. బయట మార్కెట్లో లభిస్తున్న ఫ్యాటీ ఫుడ్స్కు దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తూ పోషకాహార ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నారు. దాంతో అహానా ఉత్పత్తులు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. దీనికి తోడు అవి గొప్ప రుచి, పోషకాహారాన్ని కలిగి ఉన్నందున వ్యాపారం ఊపందుకుంది. ముప్పై ఏళ్ల వయస్సులో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించిన అహానా ప్రస్తుతం ‘ఓపెన్ సీక్రెట్’ కంపెనీకి సీఈవోగా కొనసాగుతున్నారు. అమెరికాలో భారీగా సంపాదిస్తున్నప్పటికీ ఆ ఉద్యోగాన్ని వదిలేసి ప్రస్తుతం రూ.100 కోట్ల విలువైన ఆహార ఉత్పత్తుల సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అహానా గోద్రెజ్ టైసన్ ఫుడ్స్ లిమిటెడ్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్గా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు. ఇదీ చదవండి: యాప్లు అవసరంలేని మొబైల్ ఫోన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా.. గతంలో చదువు అయిపోయాక నాలుగు ఏళ్లు ప్రోక్టర్ అండ్ గాంబుల్లోనూ పనిచేశారు. కృత్రిమ రంగులు, రుచులు, జంక్ ఫుడ్ నుంచి భారతీయులకు పూర్తిగా పౌష్టికాహారాన్ని అందించే దిశగా కృషిచేస్తున్నట్లు అహానా లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!
సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
కింగ్స్ పోరులో పంజాబ్ చేతిలో చెన్నై చిత్తు
IPL 2024 RR vs SRH: సై అంటే సై అంటున్న కొదమసింహాలు
ఆ మహిళ ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చిందా?
తగ్గిన యూపీఐ చెల్లింపులు.. ఎంతంటే..
అసభ్య వీడియోల కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు
ఒకసారి ఆ క్లిప్ చూడండి.. చంద్రబాబు ఎంత నీచుడో..!
నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
ఒకసారి ఆ క్లిప్ చూడండి.. చంద్రబాబు ఎంత నీచుడో..!
తప్పక చదవండి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
Advertisement