-
క్యూట్గా నవ్వుతున్న చిన్నారిని గుర్తు పట్టారా.. ఇప్పుడేలా ఉందంటే?
ఇటీవలే మిలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్లో ధడక్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన భామ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటోంది. తాజాగా ఆమె చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దివంగత నటి శ్రీదేవితో కలిసి ఉన్న ఆ ఫోటో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఆ ఫోటోలో క్యూట్గా నవ్వుతున్న చిన్నారిని ఎవరో మీరు గుర్తు పట్టారా? మరెవరో కాదు.. శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్. దివంగత నటి కూతురు జాన్వీ కపూర్ ఫోన్ వాల్పేపర్గా ఉన్న ఫోటోతో నెట్టింట్లో వైరలవుతోంది. జాన్వీ జిమ్ చి ఇంనుంటికి వెళ్తుండగా ఈ ఫోటో కెమెరాలకు చిక్కింది. అదే సమయంలో ఆమె ఫోన్ వాల్పేపర్గా ఉన్న త్రోబాక్ పిక్ కనిపించింది. చిన్ననాటి ఫోటోలో జాన్వీ తన తల్లి ఒడిలో చిరునవ్వుతో క్యూట్గా ఉంది. ఫోటో చూసిన కొంతమంది అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. కొందరెమో ఎమోషనల్ అవుతూ ఎమోజీలు జతచేశారు. మరికొందరు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే స్పోర్ట్స్ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. ఆమెకు వరుణ్ ధావన్ నటించిన బవాల్ చిత్రంలోనూ కనిపించనుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
శ్రీదేవి అంత్యక్రియలు.. ఆలస్యానికి కారణాలివే!
దుబాయ్ : దిగ్గజ నటి శ్రీదేవి మరణించి దాదాపు 35 గంటలు గడుస్తున్నా తుది వీడ్కోలుపై ఇంకా స్పష్టత రాలేదు. ఆమె పార్థివదేహాన్ని దుబాయ్ నుంచి ముంబైకి తరలించడంలో జాప్యం నెలకొంది. శనివారం రాత్రి హోటల్ గదిలో అచేతనంగా పడిఉన్న శ్రీదేవిని స్థానిక వైద్య బృందం, పోలీసులు కలిసి రషీద్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయారని వైద్యులు నిర్ధారించడంతో మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఫోరెన్సిక్ ల్యాబ్లో పోస్ట్మార్టం నిర్వహించారు. అక్కడి నుంచి భౌతిక కాయాన్ని భారత్కు తరలించడానికి సుదీర్ఘ ప్రక్రియ అవసరమవుతుంది. ఈ వ్యవహారం గురించి ‘ప్రవాసీ మిత్ర’ ఎడిటర్ భీంరెడ్డి కొంత సమాచారాన్ని అందించారు. దుబాయ్ నుంచి మృతదేహాన్ని తరలించాలంటే.. ►మృతదేహానికి అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆ ఫోరెన్సిక్ నివేదికను రూపొందిస్తారు. ►అనంతరం పార్థివదేహాన్ని ముహైస్నాకు తరలించి, విమానంలో రవాణా చేసేందుకు అనువుగా సుగంధపరిమాళాలు, శుభ్రమైన వస్త్రాల్లో చుడతారు. ఈ ఎంబామింగ్ ప్రక్రియకు కనీసం రెండు గంటలు పడుతుంది. ►ఈలోపే స్థానిక పోలీసులు డెత్ సర్టిఫికేట్ను జారీచేయాల్సిఉంటుంది. ఇందుకోసం మృతురాలు/మృతుడి కుటుంబీకుల నుంచి అఫిడవిట్ తీసుకుంటారు. ఫోరెన్సిక్ రిపోర్టు అందిన తర్వాతే పోలీసులు ముందుకు వెళతారు. ►దుబాయ్లోని ఇండియన్ ఎంబసీ అధికారులు.. మృతురాలు/మృతుడి పాస్పోర్టును రద్దు చేస్తారు. ►ఆ తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుమతితో మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తారు. ►అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కు తరలిస్తారు. కస్టమ్స్ క్లియరెన్స్ అనంతరం విమానంలో భారత్కు తరలిస్తారు. ►శ్రీదేవి పార్థివదేహాన్ని తరలించేందుకు ఇప్పటికే ప్రత్యేక విమానాన్ని సిద్ధంగా ఉంచారు. ►భారతకాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6 గంటలకు విమానం ముంబైకి చేరుకునే అవకాశంఉంది. -
శ్రీదేవి మరణవార్తను బ్రేక్ చేసింది అతనే!
ముంబై : లెజెండ్ శ్రీదేవి హఠాన్మరణానికి సంబంధించిన వార్త ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులను ఒక్కసారిగా కలచివేసింది. మేనల్లుడి పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. తాను బస చేసిన జుమేరియా ఎమిరేట్స్ టవర్ హోటల్లో అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. దగ్గర్లోని రషీద్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు చెప్పారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. శ్రీదేవి మరణించిన విషయాన్ని మొదట మీడియాకు చెప్పింది ఆమె మరిది సంజయ్ కపూర్. శ్రీదేవీ మరణించిన కొద్దిసేపటికే సంజయ్ కపూర్.. దుబాయ్లోని ప్రఖ్యాత ‘ఖలీజ్ టైమ్స్’తో మాట్లాడారు. శ్రీదేవి హఠాన్మరణంతో తమ కుటుంబం మొత్తం షాక్కు గురైందని, ఆమెకు ఎలాంటి గుండె జబ్బులూ లేవని చెప్పారు. హోటల్ గదిలో ఉన్నప్పుడే నొప్పితో ఆమె కుప్పకూలిపోయారని వివరించారు. వివాహకార్యక్రమంలో పాల్గొనేందుకు సంజయ్ శనివారం ఉదయమే దుబాయ్కి వెళ్లారు. శ్రీదేవి దంపతులతోపాటే వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం దుబాయ్లోనే ఉన్న అతను.. వదిన పార్థివదేహం తరలింపునకు సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారు. సోమవారం మధ్యాహ్నానికి శ్రీదేవి మృతదేహం ముంబై చేరుకోనుంది. అభిమానుల సందర్శనార్థం పార్థివదేహాన్ని మెహబూబా స్టూటియోలో ఉంచుతారు. అనంతరం జుహూలోని శాంతా క్రజ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. భర్త బోనీ, మరుదులు సంజయ్,అనిల్ - తోటికోడళ్లతో శ్రీదేవి (పాత ఫొటో) -
అంబానీల విమానంలో శ్రీదేవి మృతదేహం తరలింపు
ముంబై : దివంగత సినీతార శ్రీదేవీ పార్థివదేహం మరికొద్ది సేపట్లోనే దుబాయ్ నుంచి ముంబైకి తరలించనున్నారు. భారత కుబేరులు అంబానీ కుటుంబానికి చెందిన ప్రత్యేక జెట్ విమానంలో భౌతికకాయాన్ని తీసుకురానున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. దుబాయ్లో శ్రీదేవీకి పోస్ట్మార్టం ప్రారంభమైన సమయంలోనే ముంబై నుంచి అంబానీ విమానం బయలుదేరి వెళ్లింది. 13 సీట్లున్న ఈ ప్రత్యేక విమానం(ఎంబ్రార్-135బీజే) రిలయన్స్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రావెల్ లిమిటెడ్కు చెందినది. ఈ సంస్థ ప్రస్తుతం అనిల్ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తోంది. బోనికపూర్ మేనల్లుడు మొహిత్ మార్వా పెళ్లి కోసం రస్ ఆల్ ఖైమాకు వెళ్లిన శ్రీదేవి శనివారం రాత్రి తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. దుబాయ్లోని రషీద్ ఆసుపత్రిలో ఇప్పటికే శ్రీదేవి పోస్టుమార్టం పూర్తయింది. అయితే, దౌత్య వ్యవహారాల కారణంగా భౌతికాయం తరలింపు ఆలస్యమవుతోంది. సోమవారం మధ్యాహ్నాంలోగా ఈ ప్రక్రియ పూర్తికానుంది. శ్రీదేవి పార్థివదేహాన్ని మొదట ఆమె ఇంటికి తరలిస్తారు. అటు నుంచి మెహబూబా స్టూడియోకు తీసుకెళతారు. అనంతరం జుహూలోని శాంతా క్రజ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. టీనా-అనిల్ అంబానీ దంపతులతో శ్రీదేవీ-బోనీ జంట(పాత ఫొటో) -
మాజీ సీఎం సిఫారసుతో సినిమాల్లోకి
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కామరాజర్ సిఫార్సుతోనే శ్రీదేవి బాలనటిగా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ విషయం ఆమె తండ్రి అయ్యప్పన్ సన్నిహిత మిత్రులకు మాత్రమే తెలుసు. వారిలో ఒకరైన 81 ఏళ్ల బాలు నాయకర్ శ్రీదేవి మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. శ్రీదేవి స్వగ్రామంలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీదేవి తండ్రి అయ్యప్పన్, తాను సాత్తూరు కోర్టులో జూనియర్ న్యాయవాదులుగా ఉన్న సమయంలో స్నేహితులమయ్యామని చెప్పారు. అయ్యప్పన్కు చెన్నై సీఐటీ నగర్లో ఓ ఇల్లు కూడా ఉండేదని.. శ్రీదేవి నాలుగేళ్ల వయసులో ఆయన చెన్నైకు వచ్చేశారన్నారు. ఆ ఇంటికి సమీపంలోనే అప్పటి కాంగ్రెస్ నేత, దివంగత సీఎం కామరాజర్ నివాసం ఉండేదని ఆయన వివరించారు. కామరాజర్కు అయ్యప్పన్ సన్నిహితుడని.. ఆ పరిచయం శివకాశి నియోజకవర్గం నుంచి అయ్యప్పన్ ఎమ్మెల్యేగా పోటీచేయడానికి దారితీసిందన్నారు. ఆ ఎన్నికల్లో అయ్యప్పన్ ఓడిపోయాడని, దాంతో చెన్నైకు పరిమితమైనట్టు ఆయన తెలిపారు. ఓ సాయంత్రం అయ్యప్పన్ శ్రీదేవిని వాకింగ్కు తీసుకెళ్లిన సమయంలో కామరాజర్ చూశారని.. అప్పట్లో చిన్నారి శ్రీదేవి అందం, చురుకుదనం చూసి అక్కడే ఉన్న రచయిత కన్నదాసన్ను పిలిచి సినిమాల్లో నటింపజేయడానికి ఏర్పాట్లుచేయాలని సూచించినట్టు నాయకర్ తెలిపారు. అనంతరం కామరాజర్ సిఫారసుతో కన్నదాసన్.. నిర్మాత సాండో చిన్నప్ప దేవర్కు శ్రీదేవి గురించి చెప్పినట్టు ఆయన వివరించారు. అదే సమయంలో బాలనటి కోసం ఎదురుచూస్తున్న దేవర్, తొనైవన్ సినిమాలో శ్రీదేవికి అవకాశం కల్పించారన్నారు. దానితో మొదలైన శ్రీదేవి సినీ ప్రస్థానం ముంబై వరకు సాగించిందని ఆయన వివరించారు. శ్రీదేవి శాశ్వతంగా దూరం కావడం వేదన కల్గిస్తోందని నాయకర్ చెప్పారు. ప్రస్తుతం మీనంపట్టిలోని పూర్వీకుల నివాసంలో అయ్యప్పన్ సోదరుడు రామస్వామి కుటుంబం ఉంటున్నట్టు ఆయన చెప్పారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement