-
టీవీలకు అతుక్కుపోతున్నారు!
ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, హాట్స్టార్ వంటి సామాజిక మాధ్యమాలు ఎన్ని వచ్చినా టీవీ చూసే వారి సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉందని, ఈ విషయంలో దక్షిణ భారతీయులు ముందున్నారని తాజా సర్వేలో తేలింది. ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణ భారతంలోనే ఎక్కువ టీవీలు ఉన్నాయని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. దక్షిణ భారత్లో 99.9% ఇళ్లకు విద్యుత్ సదుపాయం ఉండటం, దక్షిణ భారతీయులు మొదట కొనే గృహోపకరణం టీవీయే కావడం దీనికి కారణమని బార్క్ సీఈవో దాస్గుప్తా తెలిపారు. 4,300 పట్టణాల్లో 3 లక్షల మందిని సర్వే చేసి బార్క్ ‘బ్రాడ్కాస్ట్ ఇండియా సర్వే పేరుతో నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం 5 దక్షిణ రాష్ట్రాల్లో 95 శాతం ఇళ్లలో టీవీలు ఉన్నాయి. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 25.9 కోట్ల టీవీలు ఉన్నాయి. 2016తో పోలిస్తే ఇది 8 శాతం ఎక్కువ. ఉత్తర భారతంలో 20.9 కోట్లు, పశ్చిమ భారతంలో 22.1 కోట్లు, తూర్పు భారతంలో 14.6 కోట్ల టీవీలు ఉన్నాయి. దేశం మొత్తం మీద టీవీ ప్రేక్షకుల సంఖ్య 66 శాతం ఉండగా, దక్షిణ భారత దేశంలో అది 95 శాతంగా ఉంది. దేశంలో టీవీ ఉన్న ఇళ్ల సంఖ్య 2018లో 19.7 కోట్లకు చేరింది. 2016తో పోలిస్తే ఇది 7.5% ఎక్కువ. అలాగే టీవీ ప్రేక్షకుల సంఖ్య కూడా 83.6 కోట్లకు (7.2% ఎక్కువ) చేరింది. పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10 మందిలో 87 మంది రోజులో 4 గంటల 10 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 3 గంటల 27 నిమిషాలు టీవీ చూస్తున్నారు. దక్షిణ భారతంలో టీవీ చూసే సమయం ఏటా పెరుగుతోంది. 2016 నుంచి టీవీ ప్రేక్షకుల సంఖ్య 12 శాతం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో టీవీ ఉన్న ఇళ్ల సంఖ్య 2018లో 10 శాతం పెరగ్గా, పట్టణ ప్రాంతాల్లో 4% పెరిగింది. -
బీజేపీ నేత జాత్యహంకార వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత దేశంలో జాతివివక్ష లేదంటూ బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగింది. దక్షిణ భారతీయులపై జాత్యహంకార వ్యాఖలు చేయడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు నైజీరియా విద్యార్థులపై నోయిడాలో జరిగిన దాడిపై 'ఆల్ జజీరా' చానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 'భారతీయులను జాత్యహంకారులు అనడం దుర్మార్గం. ఎందుకంటే మేము నల్లవాడైన కృష్ణుడిని పూజిస్తాం. మాకే కనుక జాతివివక్ష ఉంటే దక్షిణ భారతీయులతో కలిసి ఎలా నివసిస్తాం. మాలోనూ, మన చుట్టూ నల్లజాతీయులు ఉన్నారు. వివిధ వర్గాలకు చెందినప్పటికీ భారతీయులు పరస్పరం సంఘర్షించుకుంటారు. కొంతకాలం క్రితం మహారాష్ట్రలో బిహారీలపై దాడులు జరిగాయి. మరాఠీలను బిహార్ లో బెదిరించారు. ఇవన్నీ జాత్యహంకార దాడులు కాద'ని తరుణ్ విజయ్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు రేగుతున్నాయి. భారత్ అంటే ఉత్తరాది ఒకటే అని ఆయన భావిస్తున్నారని, దక్షిణాది వారితో తమకు ఎటువంటి సమస్యలు లేవని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. -
రెండో రాజధాని హైదరాబాద్
హైదరాబాద్ నగరం దేశంలోని పలు రాష్ట్రాలకు సమీపంగా ఉండి రైల్వే, విమాన, బస్సు మార్గాలను కూడా కలిగి ఉంది. అల నాటి నైజాం నవాబుల కాలంలోనే ఇది అంతర్జాతీయ నగరాలలో ఒకటిగా పేరుగాంచింది. అలాంటి దీనిని దక్షిణ భారతీయులకు కేంద్రపరంగా దేశము యొక్క రెండవ రాజధానిగా హైదరాబాద్ అని ప్రకటిస్తే దేశ వాసులందరికీ ప్రయోజన కరం. అదీగాక ఈ నగరంలో మరాఠీ, బెంగాలీ, తమిళ, కన్నడిగ, ఆంధ్రసీమ వారలకే గాక ఉత్తర భారతం నుండి వలస వచ్చిన యూపీ, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి వారికి ఆశ్రయమిచ్చి అక్కున చేర్చుకొన్నది. సింధీలు, ముస్లింలు, పార్శీలు, కిరస్తానీలు, జైనులు, సిక్కులను సైతం తనలో కలుపు కొని సాహితీ సంగమ క్షేత్రంగా విరాజిల్లుతున్నది కదా! మరి అలాంటి దీనిని మన భారతదేశానికి ఉపరాజధానిని చేస్తే రాజ ధాని కూడా సురక్షిత కేంద్రంగా భాసిల్లుతుందన్న విషయాన్ని విజ్ఞులు, మేధావులు రాజకీయ నాయకులు మరియు కేంద్ర మంత్రివర్యులు (తెలుగు ప్రాంతాల నుండి ప్రాతినిధ్యం వహి స్తున్న వారు) కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొనేలా ఆలోచిస్తే బావుంటుందని అనిపిస్తుంది. - కూర్మాచలం వేంకటేశ్వర్లు, కరీంనగర్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement