-
ఓటీటీలో ‘ది ఘోస్ట్’.. రిలీజ్ డేట్ ఫిక్స్?
ఇటీవల విడుదలైన నాగార్జున యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ది ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వహించిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్కు సంబంధించి అప్డేట్ వచ్చింది. ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. నవంబరు 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. గతంలోనూ నాగార్జున నటించిన ‘వైల్డ్డాగ్’ మూవీ అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఓటీటీలో మాత్రం ఆ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. నాగార్జున తాజా చిత్రం ది ఘోస్ట్ అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాల్సిందే. (చదవండి: ‘ది ఘోస్ట్’ మూవీ రివ్యూ) అసలు కథేంటంటే..: విక్రమ్ (నాగార్జున) ఓ అనాథ. కల్నల్ నాగేంద్ర నాయుడు విక్రమ్ను చేరదీస్తాడు. నాగేంద్ర నాయుడు కూతురు అనుపమ (గుల్ పనాగ్), విక్రమ్ అక్కాతమ్ముడిలా కలిసి మెలిసి ఉంటారు. అయితే అనుపమ మాత్రం తనకు నచ్చిన వాడైన అశోక్ నాయర్ను పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లోంచి వెళ్లిపోతుంది. 20 ఏళ్ల పాటు ఇంటికి దూరంగా ఉంటుంది. అనుని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను విక్రమ్కి అప్పగించి కన్నుమూస్తాడు నాగేంద్ర నాయుడు. 20 ఏళ్ల పాటుగా దూరంగా ఉన్న అనుపమ తన బిడ్డ అదితి (అనికా సురేంద్రన్) ఆపదలో ఉందని విక్రమ్కు కాల్ చేస్తుంది. తన సమస్యను వివరిస్తుంది.అసలు అనుపమకు వచ్చిన సమస్య ఏంటి? అదితిని చంపేందుకు ప్రయత్నం చేసిన వారు ఎవరు? విక్రమ్ ది ఘోస్ట్గా ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు ఘోస్ట్ వెనుకున ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఈ కథలో ప్రియ(సోనాల్ చౌహాన్) పాత్ర ఏంటి? చివరకు అదితిని విక్రమ్ కాపాడాడా? అన్నదే కథ. -
‘ది ఘోస్ట్’ మూవీ రివ్యూ
టైటిల్ : ది ఘోస్ట్ నటీ నటులు : నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనికా సురేంద్రన్ తదితరులు బ్యానర్ : శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాత : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు సంగీతం : మార్క్ కే రాబిన్ సినిమాటోగ్రఫర్ : ముఖేష్ విడుదల తేది : అక్టోబర్ 5, 2022 టాలీవుడ్ కింగ్ నాగార్జున, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కిన చిత్రం ది ఘోస్ట్. ఈ మూవీ దసరా కానుకగా.. అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలే టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. మరి ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయి? ఆడియెన్స్ను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం. ది ఘోస్ట్ కథ ఏంటంటే.. విక్రమ్ (నాగార్జున) ఓ అనాథ. కల్నల్ నాగేంద్ర నాయుడు విక్రమ్ను చేరదీస్తాడు. నాగేంద్ర నాయుడు కూతురు అనుపమ (గుల్ పనాగ్), విక్రమ్ అక్కాతమ్ముడిలా కలిసి మెలిసి ఉంటారు. అయితే అనుపమ మాత్రం తనకు నచ్చిన వాడైన అశోక్ నాయర్ను పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లోంచి వెళ్లిపోతుంది. 20 ఏళ్ల పాటు ఇంటికి దూరంగా ఉంటుంది. అనుని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను విక్రమ్కి అప్పగించి కన్నుమూస్తాడు నాగేంద్ర నాయుడు. 20 ఏళ్ల పాటుగా దూరంగా ఉన్న అనుపమ తన బిడ్డ అదితి (అనికా సురేంద్రన్) ఆపదలో ఉందని విక్రమ్కు కాల్ చేస్తుంది. తన సమస్యను వివరిస్తుంది. అసలు అనుపమకు వచ్చిన సమస్య ఏంటి? అదితిని చంపేందుకు ప్రయత్నం చేసిన వారు ఎవరు? విక్రమ్ ది ఘోస్ట్గా ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు ఘోస్ట్ వెనుకున ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఈ కథలో ప్రియ(సోనాల్ చౌహాన్) పాత్ర ఏంటి? చివరకు అదితిని విక్రమ్ కాపాడాడా? అన్నదే కథ. ఎవరెలా నటించారంటే.. నాగార్జున ఇప్పటి వరకు అన్ని రకాల పాత్రలను పోషించారు. యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని రకాల కారెక్టర్లలో కనిపించారు. ఇక ఘోస్ట్లో అయితే మరింత స్టైలీష్గా కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్ల్లోనూ కొత్తగా కనిపించాడు. విక్రమ్, ఘోస్ట్ ఇలా రెండు రకాలుగా మెప్పించేశారు. సోనాల్ చౌహాన్ చేసిన స్టంట్స్ అదిరిపోయాయి. అయితే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. అనుపమ పాత్ర, అదితి పాత్రలకు మంచి ఇంపార్టెన్స్ లభించింది. శ్రీకాంత్ అయ్యర్, రవి వర్మ వంటి వారు తమ స్టైల్లో నటించేశారు. ఎలా ఉందంటే.. కిడ్నాపింగ్స్, ఎక్స్టార్షన్స్, బ్లాక్ మెయిల్స్ నేపథ్యంలో ఈ కథను రాసుకున్నాడు ప్రవీణ్ సత్తారు. ఇక ఇందులో ఫ్యామిలీ డ్రామాను ఇరికించడంతో కొత్తదనం వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా బ్యాలెన్సింగ్ చూపించాడు దర్శకుడు. ప్రవీణ్ సత్తారు సినిమాల్లో మేకింగ్ బాగుంటుందని అందరికీ తెలిసిందే. ది ఘోస్ట్ చిత్రంలోనూ ప్రవీణ్ సత్తారు మార్క్ కనిపించింది. కథనం ఎక్కడా కూడా స్లోగా అనిపించదు. అసలు కథ ప్రారంభించేందుకు కొద్దిగా సమయాన్ని తీసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ కథ ట్రాక్ ఎక్కిన తరువాత.. పరుగులు పెడుతుంది. విక్రమ్.. ఘోస్ట్ అని రివీల్ చేసే సీన్, ఇంటర్వెల్ అదిరిపోతుంది. అయితే సెకండాఫ్లో ఘోస్ట్ ఫ్లాష్ బ్యాక్ను మాత్రం అంత ఎఫెక్టివ్గా చూపించినట్టు అనిపించదు. ద్వితీయార్థం మాత్రం కాస్త గాడితప్పినట్టు కనిపిస్తుంది. క్లైమాక్స్ ఊహకు తగ్గట్టుగానే సాగుతుంది. ప్రథమార్థంలో ఉన్న ఇంట్రెస్ట్ సెకండాఫ్కు వచ్చే సరికి ఉండదనిపిస్తుంది. ఇక సాంకేతిక చూస్తే.. మార్క్ కే రాబిన్ ఇచ్చిన నేపథ్య సంగీతం అదిరిపోయింది. పాటలు, మాటలు అంతగా గుర్తుండవు. ముఖేష్ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
రక్షన్తో కోలీవుడ్కు నాగార్జున
టాలీవుడ్ స్టార్ నటుడు నాగార్జున కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఘోస్ట్. ప్రవీణ్ సత్తారు కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు, శరత్ మారర్ నిర్మించారు. నటి సోనాల్ చౌహాన్ కథానాయకిగా నటించిన ఇందులో శ్రీకాంత్ అయ్యర్, మనీశ్ చౌదరి, విక్రమాదిత్య, రవివర్మ ముఖ్యపాత్రలు పోషించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విజయదశమి సందర్భంగా బుధవారం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్రం యూనిట్ చెన్నైలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటుడు నాగార్జున మాట్లాడుతూ.. ఈ చిత్రం గురించి మాట్లాడే ముందు పొన్నియిన్ సెల్వన్ చిత్ర దర్శకుడు, తన మంచి మిత్రుడు మణిరత్నం అద్భుతమైన చిత్రా న్ని తెరకెక్కించినందుకు గానూ కంగ్రాట్స్ చెబుతున్నానన్నారు. మణిరత్నం దర్శకత్వంలో తాను ఇంతకు ముందు ఇదయతై తిరుడాదే (తెలుగులో గీతాంజలి) చిత్రం చేశానని గుర్తు చేశారు. ఆయన చాలా గొప్ప దర్శకుడని ప్రశంసించారు. అదేవిధంగా తాను నటించిన ఉదయం, రక్షన్, పయనం, ఇటీవల కార్తీతో కలిసి నటించిన తోళా చిత్రాలను ఇక్కడి ప్రేక్షకులు ఆదరించారన్నారు. ఇకపోతే తాను చెన్నై, గిండీలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదివినట్లు చెప్పారు. ఆ తరువాత హైదరాబాద్కు వెళ్లినా, చెన్నైకి వచ్చినప్పుడల్లా ఇక్కడ తిరిగిన ప్రాంతాలు గుర్తుకొస్తాయన్నారు. రక్షకన్ చిత్రం గురించి చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచం చాలా చిన్నదైపోయిందన్నారు. కోవిడ్ తరువాత చిత్రాలకు భాషాబేధం చెరిగిపోయిందని తెలిపారు. మంచి కంటెంట్ ఉండే చిత్రాలను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తున్నారన్నారు. అదేవిధంగా ప్రేక్షకులు ఇప్పుడు చిత్రాలను చూడటానికి థియేటర్లకు వస్తున్నారన్నారు. రక్షన్ చిత్రాన్ని ఇతర భాషల్లో విడుదల చేయాలని ముందు అనుకోలేదన్నారు. ఇది యూనివర్శల్ చిత్రం అనే నమ్మకం కలగడంతో తమిళంలోనూ విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. చిత్రం కోసం రిహార్సల్స్ చేసి నటించినట్లు తెలిపారు. తమిళ వెర్షన్కు తానే డబ్బింగ్ చెప్పినట్లు చెప్పారు. చిత్రంలో యాక్షన్ సన్నివేశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా వచ్చాయన్నారు. నటి సోనాల్ చౌహాన్ పోరాట సన్నివేశాల్లోనూ చక్కగా నటించారని ప్రశంసించారు. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవం అని నటి సోనాల్ సౌహాన్ పేర్కొన్నారు. నాగార్జున్ ఎంతగానో సహకరించారని కొనియాడింది. -
కత్తులతో నాగార్జున వేట.. 'ది ఘోస్ట్' నుంచి కొత్త అప్డేట్
Nagarjuna As A Killing Machine From The Ghost Movie: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఘోస్ట్'. ఈ చిత్రానికి 'గరుడవేగ' ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. సోనాల్ చౌహాన్ కథానాయిక. నాగ్, సోనాల్ ఇద్దరూ ఇంటర్పోల్ ఆఫీసర్స్ పాత్రల్లో కనిపించనున్నారు. అనిఖా సురేంద్రన్, గుల్ పనాగ్ ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ విజువల్ ట్రీట్ను చిత్రబృందం షేర్ చేసింది. 'కిల్లింగ్ మేషిన్' పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియోలో నాగార్జున కత్తులతో శత్రువులను వేటాడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా సిద్ధమవుతోన్న ఈ మూవీని నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ 5న ఈ మూవీ వరల్డ్వైడ్గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. -
మూడోవారం కూడా డబ్బులొస్తున్నాయి, సక్సెస్ అంటే ఇదే: హీరో
‘‘ఎఫ్ 3’లో వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఉంది. స్టార్స్తో ‘దిల్’ రాజు తీసిన ‘ఎఫ్ 3’ పాన్ ఇండియా సినిమా కింద లెక్క. ఓ హీరోకి రేచీకటి, మరో హీరోకి నత్తి, హీరోయిన్స్కు డబ్బు పిచ్చి. ‘ఎఫ్ 3’లో ఇలాంటివి పెట్టి సినిమాను హిట్ చేయడం అనిల్కే సాధ్యం’’ అన్నారు ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎఫ్ 3’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మే 27న విడుదలైంది. సోమవారం జరిగిన ఈ సినిమా ట్రిపుల్ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాఘవేంద్రరావు. ‘‘డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉండటం కంటే మించిన ఆనందం ఓ యాక్టర్కు ఏదీ ఉండదు’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘సక్సెస్ అంటే ఈ కరోనా పరిస్థితుల్లోనూ మూడో వారంలో ఇంకా రెవెన్యూ రావడమే. సక్సెస్ అంటే ఇదే. ‘ఎఫ్ 3’కి అందరూ హ్యాపీ’’ అన్నారు. ‘‘ఇప్పుడు సినిమాకి ప్యారలల్గా ఓటీటీ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ‘ఎఫ్ 3’ని ఆదరిస్తున్నారంటే ఇది రియల్ సక్సెస్’’ అన్నారు అనిల్ రావిపూడి. డిస్ట్రిబ్యూటర్స్కి షీల్డ్స్ ప్రదానం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement