-
IAS Officer: ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి.. అలా చేయడంతో షోకాజ్ నోటీసులు
ఢిల్లీలోని బ్యూరోక్రాట్ల నియంత్రణ, పోస్టింగ్పై కేంద్రంతో జరిగిన తగాదా కేసులో సుప్రీం కోర్టు ఆప్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం రంగం చేసింది. అదీగాక సుప్రీం కోర్టు నుంచి ఈవిధంగా తీర్పు వెలువడిన వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అవినీతి అధికారులను తొలగించి కష్టపడి పనిచేసే అధికారులను తీసుకొచ్చేలా బదిలీలు ఉంటాయని ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్ ఇలా ప్రకటించిన కొద్ది గంటల్లోనే సర్వీసెస్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి ఆశిష్ మోర్ పదవీచ్యుత్తులయ్యారు. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం బదిలీ ఉత్తర్వును ఉల్లంఘించిన ఐఏఎస్ అధికారి ఆశిష్ మోర్కు ఈ నెల 13న షోకాజ్ నోటీసులు పంపింపించింది. ఆ అధికారి సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించనందుకు గానూ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కూడా యోచిస్తున్నట్లు తెలిపింది. దీనిపై 24 గంటల్లో ఆశిష్ మోర్ నుంచి సమాధానం కూడా కోరింది ఢిల్లీ ప్రభుత్వం. ఈ మేరకు సేవల శాఖ(సర్వీస్ డిపార్ట్మెంట్) మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ..కొత్త అధికారిని ఆయన స్థానంలో బదిలీ చేసేందుకు ఫైల్ సమర్పించమని సేవల కార్యదర్శి ఆశిష్ మోర్ని ఆదేశించినట్లు తెలిపారు. ఐతే ఆయన మంత్రి కార్యాలయానికి తెలియజేయకుండా సచివాలయానికి వెళ్లిపోయారని ఆరోపించారు. ఫోన్ని కూడా స్విచ్ ఆఫ్లో పెట్టుకుని పరారిలో ఉన్నారని మండిపడ్డారు. ఆ అధికారికి ఈ విషయాన్ని అధికారికంగా ఆయన వాట్సాప్, ఈమెయిల్ ద్వారా తెలియజేసినప్పటికీ అతని నుంచి ఎటువంటి స్పందన లేదని చెప్పారు. ఆయన బదిలీ అయ్యేందుకు సిద్ధంగా లేరని కూడా ఆరోపించారు. మోర్ మే 21 2015 నాటి హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ను ఇంకా పక్కన పెట్టలేదని సూచిస్తూ.. షోకాజ్ నోటీసులు పంపినట్లు మంత్రి సౌరబ్ భరద్వాజ్ పేర్కొన్నారు. దీనిపై త్వరితగతిన ఆశిష్ మోర్ వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, సేవల నిర్వహణపై ఢిల్లీ ప్రభుత్వానికి శాసన కార్యనిర్వాహక అధికారాలు ఉన్నాయని గతవారమే సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ఢిల్లీ ప్రభుత్వం సరిగ్గా పనిచేయని అధికారులపై ఈ విథంగా కఠిన చర్యలు తీసుకునే ప్రక్రియను ప్రారంభించింది. (చదవండి: కర్ణాటక సీఎం ఎపిసోడ్పై సస్పెన్స్.. ‘నేనే సీఎం అవుతానని ఆశిస్తున్నా’) -
టెలికాం దిగ్గజానికి షోకాజు నోటీసు
ముంబై : దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్కు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ షోకాజు నోటీసులు జారీచేసింది. తన కస్టమర్లకు పారదర్శకత లేని, వివక్షపూరితమైన టారిఫ్లు అందజేస్తుందనే ఆరోపణలతో ట్రాయ్ ఈ నోటీసులు పంపింది. మార్చి 25 వరకు ఈ నోటీసులపై స్పందించాలని ఆదేశించింది. కస్టమర్లు, ప్రత్యర్థ సంస్థల నుంచి ఎయిర్టెల్కు వ్యతిరేకంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎయిర్టెల్ పారదర్శకత లేని వివక్షపూరితమైన టారిఫ్లను అందిస్తుందని ఫిర్యాదులు అందినట్టు ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి చెప్పారు. నెల నుంచి వీటిపై వివరాలు అందించాలని ఎయిర్టెల్కు ఆదేశాలు వెళ్తున్నాయి. కానీ ఎయిర్టెల్ వివరాలను అందించకపోవడంతో, ట్రాయ్ షోకాజు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసుల్లో ఎలాంటి రకమైన టారిఫ్లను ఎయిర్టెల్ ఆఫర్ చేస్తుందో వెల్లడిచేయాలని ఆదేశించింది. ఎయిర్టెల్ కూడా ఈ నోటీసులను ధృవీకరించింది. ట్రాయ్ ఇచ్చిన సమయం లోపల ఈ నోటీసులపై స్పందిస్తామని పేర్కొంది. ఎయిర్టెల్పై యాక్షన్ తీసుకునే ముందు కంపెనీ వెర్షన్ కూడా వినాలనుకుంటున్నట్టు రెగ్యులేటరీ తెలిపింది. రెగ్యులేటరీకి రిపోర్టు చేసిందో లేదో బట్టి కంపెనీపై చర్యలు తీసుకుంటామని ట్రాయ్ అధికారులు చెప్పారు. దోపిడి పూరిత ధరల విధానంపై ట్రాయ్ జారీచేసిన టారిఫ్ ఆర్డర్ అనంతరం పంపిన తొలి షోకాజు నోటీసు ఇదే. ఈ నిబంధనల కింద టెల్కోలు కొంత మంది సబ్స్క్రైబర్లకు కొన్ని ప్రత్యేక ప్లాన్లను ఆఫర్ చేయడానికి వీలులేదు. -
ఆరు టెల్కోలకు షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డాట్) ఆరు టెలికం కంపెనీలకు డిమాండ్ కమ్ షోకాజ్ నోటీసులు జారీ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఆరు టెల్కోలు 2006–07 నుంచి 2009–10 మధ్యకాలంలో వాటి ఆదాయాలను తక్కువ చేసి చూపాయన్న కాగ్ నివేదిక ఆధారంగా ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. నోటీసులు పొందిన సంస్థల్లో భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులర్ వంటి టెల్కోలున్నాయి. ‘కాగ్ నివేదిక ఆధారంగా డాట్ ఆరు ప్రైవేట్ టెలికం సంస్థలకు డిమాండ్ కమ్ షోకాజ్ నోటీసులు పంపింది. నాలుగు ఆర్థిక సంవత్సరాలకు (2006–07 నుంచి 2009–10 వరకు) సంబంధించి రూ.29,474 కోట్ల మొత్తానికి గానూ నోటీసుల జారీ జరిగింది’ అని టెలికం మంత్రి మనోజ్ సిన్హా బుధవారం లోక్సభకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఈ మొత్తంలో లైసెన్స్ ఫీజు రూ.6,490 కోట్లుగా, వడ్డీ రూ.13,751 కోట్లుగా, పెనాల్టీ రూ.3,178 కోట్లుగా, పెనాల్టీ మీది వడ్డీ రూ.6,055 కోట్లుగా ఉందని వివరించారు. రూ.29,474 కోట్ల మొత్తంలో భారతీ ఎయిర్టెల్ వాటా రూ.8,162 కోట్లుగా, రిలయన్స్ గ్రూప్ వాటా రూ.7,701 కోట్లుగా, టాటా టెలిసర్వీసెస్ వాటా రూ.5,718 కోట్లుగా, వొడాఫోన్ వాటా రూ.4,695 కోట్లుగా, ఐడియా వాటా రూ.2,708 కోట్లుగా, ఎయిర్సెల్ వాటా రూ.490 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. -
‘ఆ హోంగార్డు’లకు షోకాజ్ నోటీసులు!
సాక్షి, హైదరాబాద్: సమ్మె నేపథ్యంలో అభ్యంతరకరంగా వ్యవహరించిన హోంగార్డులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడానికి పోలీసు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. గురువారం ఇక్కడ ఇందిరాపార్క్ వద్ద ధర్నా, సచివాలయ ముట్టడికి యత్నం సహా మరికొన్ని నిరసనలకు హోంగార్డులు దిగారు. ఇవి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడంతో పరిస్థితి లాఠీచార్జ్ వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి నగరంలోని ఐదు పోలీసుస్టేషన్లలో క్రిమినల్ కేసులు సైతం నమోదయ్యారుు. వీటికి బాధ్యుల్ని గుర్తించేందుకు దర్యాప్తు అధికారులు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన చిత్రాలను, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా నిరసనల్లో చురుగ్గా పాల్గొన్న, అభ్యంతరకరంగా వ్యవహరించిన హోంగార్డుల్ని గుర్తిస్తున్నారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ ఇలా విభాగాలవారీగా ఉన్నతాధికారులు ఈ నోటీసులు తయారు చేస్తున్నారు. వీటిని సంబంధిత హోంగార్డులకు అందించి వారంలోగా సమాధానం ఇవ్వాల్సిందిగా స్పష్టం చేయనున్నారు. వాటి ఆధారంగా చర్యలు తీసుకొంటారు. -
పక్కా సమాచారం ఇవ్వాల్సిందే
బెదిరింపులకు దిగడం సరికాదు కేసులకు హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు పలువురు అధికారులకు జరిమానా ఆర్టీఐ రాష్ట్ర కమిషనర్ విజయబాబు అనంతపురం టౌన్ : సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా దరఖాస్తు చేస్తే వివరాలన్నీ పక్కాగా ఇవ్వాల్సిందే.’ అని సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ పి.విజయబాబు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులకు సూచించారు. ఆర్టీఐకి సంబంధించిన కేసుల విచారణకు అప్పిలేట్ అధికారులు హాజరుకాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం డ్వామా హాల్లో సీమ పరిధిలోని జిల్లాల్లో మునిసిపాలిటీ, పంచాయతీరాజ్, డీఆర్డీఏ–వెలుగు, డ్వామా శాఖలకు సంబంధించి 36 కేసులపై విచారణ చేపట్టారు. సుమారు 18 కేసులకు సంబంధించి అధికారులు రాకపోవడంపై మండిపడ్డారు. వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసినా కమిషన్ ముందుకు హాజరుకాని డీఆర్డీఏ, ఐకేపీ పుట్టపర్తి ఏపీఎం, బ్రహ్మసముద్రం ఈఓఆర్డీకి రూ.5 వేలు, కడప మునిసిపల్ కార్యాలయం సిటీ ప్లానింగ్ అధికారికి రూ.2 వేలు జరిమానా విధించారు. సమాచారం అడిగిన వారితో పాటు హైదరాబాద్ నుంచి కమిషన్ వస్తే జిల్లాలోనే ఉన్న అధికారులు రావడం లేదంటే వారికి చట్టంపై ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చని విజయబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓపై ఆగ్రహం : సోమందేపల్లి మండలంలో పింఛన్లకు సంబంధించి సమాచారం ఇవ్వలేదని, రూ.10.67 లక్షల అవినీతి జరిగిందని సమాచార హక్కు దరఖాస్తుదారుడు బాబుప్రసాద్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం కోసం రూ.3342 కట్టించుకున్నారని, వివరాలు మాత్రం అందజేయలేదన్నారు. పైగా బెదిరిస్తున్నారని ఎంపీడీఓ లలితాబాయిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీడీవోను ఆయన ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం డీఆర్డీఏ పీడీ పరిధిలో ఉంటుందని ఆమె తెలుపగా అదే విషయాన్ని రాసివ్వాలని, రికవరీ నివేదికను కమిషన్కు అందజేయాలని ఆదేశించారు. విచారణకు ఆదేశం : ∙దర్మవరంలోని బీఎస్ఆర్ బాలికల హైస్కూల్, ఎస్పీసీఎస్ గర్్ల్స హైస్కూల్స్లో ఉపాధ్యాయులు మహిళలే ఉండాలని జీవో 33 ఉందని, నిబంధనలకు విరుద్ధంగా సుమారు 19 మంది పురుషులు ఉన్నట్లు అనంతపురానికి చెందిన ఉపాధ్యాయుడు పెద్దన్న తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి వివరాలు కోరినా ఇవ్వడం లేదని చెప్పడంతో తక్షణం విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ∙పెనుకొండ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందని, వివరాలడిగితే సరిగ్గా ఇవ్వడం లేదని బాబావలి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక పుట్టపర్తి వెలుగు కార్యాలయంలో గతంలో పంపిణీ చేసిన గడ్డపారల వివరాలు అడిగితే రికార్డులు లేవని సమాధానం ఇచ్చారని కర్ణాటక నాగేపల్లికి చెందిన ప్రసాద్ విచారణలో తెలిపారు. దీంతో సంబంధిత ఉన్నతాధికారికి షోకాజ్ నోటీస్తో పాటు రూ.5 వేలు జరిమానా విధించారు. తాడిపత్రికి సంబంధించి ఓ పంచాయతీలో పని చేస్తున్న వారి వివరాలు ఇవ్వనందుకు డీపీఓకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement