-
వచ్చే ఫిబ్రవరిలో భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకలు
-
‘దిశ’ ఘటనను ఉద్వేగ భరితంగా మలుస్తా: వర్మ
శంషాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనమైన ‘దిశ’ఘటనను తనకున్న సామర్థ్యంతో ఉద్వేగభరితంగా చిత్రం తీసేందుకు యత్నిస్తున్నానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ‘దిశ’చిత్ర కథను తయారు చేసుకునే క్రమంలో సోమవారం శంషాబాద్ ఏసీపీ అశోక్కుమార్తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కథ పరిశోధనలో ఉండటంతో అందులో ప్రధానమైన అంశం ఏమిటనేది ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. -
దిశ: శంషాబాద్ ఏసీపీతో రామ్గోపాల్ వర్మ భేటీ
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచారం, హత్య ఘటనను తెరకెక్కించబోతున్న డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ... ఆ దిశగా సన్నాహాలు వేగవంతం చేశారు. వర్మ ఉన్నట్టుండి సోమవారం రోజున రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ పోలీస్స్టేషన్కు వచ్చి.. అక్కడి ఏసీపీ అశోక్కుమార్తో భేటీ అయ్యారు. దిశ ఘటనపై ఆయనతో చర్చలు జరిపారు. దిశ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమెపై అత్యాచారం జరిగినప్పటి నుంచి ఎన్కౌంటర్ జరిగిన వరకూ ఉన్న పరిస్థితులు కేసు వివరాలను ఏసీపీ వివరించారు. త్వరలో మరికొందరు పోలీస్ అధికారులను కూడా కలుస్తానన్న ఆయన.. సమాచారన్నంతా సేకరించిన తర్వాత తాను సినిమాలో ఏం చూపించాలన్న దానిపై నిర్ణయానికి వస్తానన్నారు. చదవండి: దిశ: చెన్నకేశవులు భార్యను కలిసిన వర్మ దిశ ఘటనపై ఓ సినిమా చేస్తానని ఈ మధ్య ప్రకటించిన నేపథ్యంలో ఆయన పోలీసులను కలడం ఆసక్తిగా మారింది. రామ్గోపాల్ వర్మ ఇటీవల దిశ ఘటనపై స్పందించి అత్యాచారానికి పాల్పడిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఎన్కౌంటర్కు గురైన నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్యను కూడా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా తాను సినిమా తీస్తానని ప్రకటించారు. దిశ ఘటన గురించి సమాచారం తెలుసుకోవడానికి తాను శంషాబాద్ ఏసీపీని కలిసినట్టు వెల్లడించారు. దిశ సినిమాను తీయడానికి నేను చేస్తోన్న పరిశోధనకు ఇది ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. జాతీయ స్థాయిలో ఈ కేసు సంచలనం సృష్టించిందని, ఒక ఎమోషనల్ క్యాప్చర్ చేయాలన్నదే తన ప్రయత్నమని వర్మ చెప్పారు. చదవండి: వర్మకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన కేఏ పాల్ -
తల్లి పనిచేసే స్కూల్లోనే బలవన్మరణం
సాక్షి, శంషాబాద్ రూరల్: తెల్లవారుజామున పాఠశాలను శుభ్రం చేయడానికి వెళ్లిన ఆమెకు తన కుమారుడు పైపునకు విగతజీవిగా వేలాడుతూ కనిపించడంతో షాక్కు గురైంది. ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆమె కన్నీరుమున్నీరైంది. గతంలోనే భర్త మృతిచెందగా ఇప్పుడు కుమారుడి మృతితో ఆమె ఒంటరిగా మారింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాల్మాకులకు చెందిన గుడాల సువర్ణ కుమారుడు శివకుమార్ (24) కారు డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. తండ్రి గతంలోనే మరణించాడు. తల్లి సువర్ణ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో స్వీపర్గా పనిచేస్తోంది. తల్లీకొడుకు మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగేవి. కాగా, శనివారం తెల్లవారుజామున పని కోసం పాఠశాల ఆవరణలోకి సువర్ణ వెళ్లగా కుమారుడు అక్కడ ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. పాఠశాల గది వరండాపై ఉన్న నీటి పైపునకు బట్టతో శివకుమార్ ఉరి వేసుకుని ఉండడం చూసి షాక్కు గురైంది. తన కుమారుడు ఆరి్థక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. తాత్కాలికంగా పాఠశాలకు తాళం పాఠశాల ఆవరణలో ఆత్మహత్య చేసుకోవడంతో శనివారం పాఠశాలకు తాళం వేశారు. విద్యార్థులను పక్కనే ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో కూర్చోబెట్టి తరగతులు కొనసాగించారు. సంఘటన జరిగిన ప్రాథమిక పాఠశాలను శుభ్రం చేశారు. -
తూచ్.. కథ అడ్డం తిరిగింది!
సాక్షి, శంషాబాద్: ప్రభుత్వం పంచాయతీల్లో బాధ్యతాయుత, పారదర్శక పాలన కోసం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, సంబంధిత శాఖ సిబ్బంది మాత్రం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పాలకవర్గం నిర్ణయాలను అమలు చేయాల్సిన పంచాయతీ కార్యదర్శి.. అందుకు విరుద్ధంగా ఓ కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చేందుకు నిబంధనలను తుంగల్లో తొక్కి ఓ అడుగు ముందుకు వేశారు. సర్పంచ్ నుంచి నోట్ అప్రూవల్ లేకుండానే.. చెక్కులపై ఉపసర్పంచ్ సంతకం చేయకున్నా.. ఏకంగా 9,72,981 నిధుల డ్రా చేసేందుకు 7 చెక్కులను జారీ చేయించారు. విషయం ఆలస్యంగా వెలుగు చూడడంతో అధికారులు విచారణ జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్ మండలం బహదూర్గూడ జూనియర్ పంచాయతీ కార్యదర్శి స్రవంతి జూలై 1 నుంచి 31 వరకు మెడికల్ సెలవుపై వెళ్లారు. దీంతో అధికారులు పెద్దగోల్కొండ పంచాయతీ కార్యదర్శి స్వప్నకు ఇ¯Œ చార్జి బాధ్యతలు అప్పగించారు. స్రవంతి సెలవుపై వెళ్లే నాటికి పంచాయతీ ఖాతాలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.7,99,475, సాధారణ నిధులు రూ.2,71,392 జమ ఉన్నాయి. ఆమె తిరిగి ఆగస్టు 1న తిరిగి విధుల్లో చేరారు. ఆ సమయానికి పంచాయతీ ఖాతాలో కేవలం రూ. 23,894 ఉన్నట్లు గుర్తించారు. పంచాయతీ ఖాతా నుంచి డబ్బులు డ్రా అయినట్లు తెలుసుకున్న ఉప సర్పంచ్ ప్రభాకర్.. తాను చెక్కులపై ఎలాంటి సంతకాలు చేయలేదని, నిధుల డ్రా విషయంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని ఆగస్టు 27న ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. నిధుల డ్రాకు నిబంధనలు ఇవీ.. పంచాయతీ ఖాతాలో ఉన్న నిధులను డ్రా చేయడానికి నిబంధనల మార్పుతో పాటు కొత్త పద్ధతిని ఏర్పాటు చేశారు. ఐఎఫ్ఎంఐఎస్ సిస్టమ్తో నిధులను డ్రా చేయాల్సి ఉంటుంది. పంచాయతీ పరిధిలో చేపట్టిన పనులకు చెల్లించే డబ్బులకు పాలకవర్గం తీర్మానం చేసి మినిట్స్ తయారు చేయాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా పంచాయతీ కార్యదర్శి నిధుల డ్రాకు నోట్æ ఫైల్ రూపొందించాలి. ఈ నోట్ ఫైల్పై సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకం చేయాల్సి ఉంటుంది. తర్వాత ఐఎఫ్ఎంఐఎస్ సిస్టమ్లో పంచాయతీ పేరున ఉన్న యూజర్ ఐడీ, పాస్వర్డ్ను ఉపయోగించి, నిధుల డ్రాకు చెక్కులను జారీ తతంగాన్ని పంచాయతీ కార్యదర్శి చేయాల్సి ఉంటుంది. ఇందుకు ప్రైమరీగా సర్పంచ్ సెల్నంబర్, మరోటి పంచాయతీ కార్యదర్శి సెల్ నంబర్లు జత చేయబడి ఉంటాయి. రెండు దశల్లో చేపట్టే ఈ ప్రక్రియకు సంబంధించి ఈ రెండు సెల్ఫో¯Œ నంబర్లకు ఓటీపీ వస్తుంది. అయితే, సదరు రెండు సెల్ నంబర్లకు ఒకటే తరహా ఓటీపీ నంబరు వస్తుండడంతో సర్పంచ్ ప్రమేయం లేకుండానే ఈ ప్రక్రియను పంచాయతీ కార్యదర్శి చేసుకోవచ్చు. ఐఎఫ్ఎంఐఎస్లో మొదటి దశలో నిధుల వివరాలు, పనుల వివరాలను జత చేయాలి. తర్వాత ఆటోమేటిక్గా ఈ నిధులకు సంబంధించి చెక్కు జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన చెక్కులకు సంబంధించి నిధుల డ్రాకు అనుమతికి లేదా ఏవైనా పొరపాట్లు జరిగితే.. చెక్కులను రద్దు చేయడానికి రెండో దశలో కూడా ఓటీపీ నంబరుతో సదరు ప్రక్రియను పంచాయతీ కార్యదర్శి చేపట్టాల్సి ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే.. బహదూర్గూడ పంచాయతీ గతంలో పెద్దగోల్కొండకు అనుబంధంగా ఉండేది. ఆ సమయంలో బహదూర్గూడలో కొన్ని పనులు చేపట్టారు. వీటికి సంబంధించి బిల్లులు చెల్లించలేదు. కొత్త పంచాయతీల ఏర్పాటు సమయంలో.. గతంలో చేపట్టిన పనులు, చెల్లించాల్సిన బిల్లులకు సరిపడు నిధులను కేటాయించిన తర్వాత.. కొత్త పంచాయతీలకు నిధులను పంచారు. ఈ లెక్కన బహదూర్గూడలో ఉమ్మడి పెద్దగోల్కొండ పంచాయతీగా ఉన్న సమయంలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులు కేవలం పెద్దగోల్కొండ పంచాయతీ నుంచి చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ అందుకు విరుద్ధంగా బహదూర్గూడ పంచాయతీ నిధులను చెల్లించేందుకు స్కెచ్ వేశారు. ఇంచార్జిగా బాధ్యతలు తీసుకున్న కార్యదర్శి స్వప్న.. బహదూర్గూడ సర్పంచ్, ఉప సర్పంచ్కు తెలియకుండానే నిధులను డ్రా చేశారు. నిధుల డ్రాకు కావాల్సిన నోట్ ఫైల్, చెక్కులపై ఉప సర్పంచ్ సంతకం లేకుండానే మూడు చెక్కులకు ట్రెజరీ కార్యాలయంలో అనుమతి ఇచ్చి రూ.5,17,838 నిధులు విడుదల చేశారు. వీటిలో రెండు చెక్కులు భూగర్భ మురుగు కాలువ పనులకు సంబంధించనవి కాగా.. ఒక చెక్కు పంచాయతీ సిబ్బంది వేతన బకాయిలకు చెందినవి ఉన్నాయి. నాలుగు చెక్కులు రద్దు.. పంచాయతీ నిధులను డ్రా చేయడానికి కార్యదర్శి మొత్తం 7 చెక్కులను జారీ చేయించారు. అందులో మూడు చెక్కులు పాస్ అవగా.. మిగతా వాటిని రద్దు చేశారు. రద్దు చేయడానికి సరైన కారణాలు చూపించలేదు. ట్రెజరీ కార్యాలయంలో చెక్కులను రద్దు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. చెక్కులను రద్దు చేయాలంటే అందుకు తగిన కారణాలను చూపిస్తూ పంచాయతీ నుంచి అర్జీ ఉండాలి. కానీ, ఇక్కడ సర్పంచ్కు తెలియకుండానే చెక్కుల జారీ, నిధుల డ్రా, చెక్కుల రద్దు జరిగిపోయాయి. పైగా నిధుల డ్రాలో జరిగిన అవకతవకలపై ఆరోపణలు వచ్చిన తర్వాత వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. జూలై 25న చెక్కులతో నిధులు డ్రా కాగా.. వీటికి సంబంధించిన పాత పనులకు 2 నోట్ఫైల్స్పై ఆగస్టు 22న సర్పంచ్తో సంతకం చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. డీపీఓకు నివేదిక అందజేశాం.. బహదూర్గూడ పంచాయతీలో ఉప సర్పంచ్ సంతకం లేకుండా నిధుల డ్రాకు చెక్కులు జారీ అయ్యాయి. ఆయన ఫిర్యాదు చేయడంతో డీపీఓ ఆదేశాల మేరకు విచారణ జరిపాం. నివేదికను డీపీఓకు అందజేశాం. – ఎంపీఓ అన్నపూర్ణ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement