-
ML Ashwini: ఆరు భాషలు నిలబెట్టాయి
భాష విజయానికి సాధనం. రాజకీయాల్లో భాషతో ఆకర్షించేవారు వేగంగా పైమెట్టు మీదకు చేరుతారు. అయితే ఆ రంగంలో బహుభాషలతో ఆకట్టుకునే మహిళలు తక్కువ. కాని సామాన్య టీచరైన ఎం.ఎల్.అశ్విని తనకు వచ్చిన ఆరు భాషల వల్ల జన సామాన్యంలో చొచ్చుకుపోతూ బిజెపి అధినాయకత్వాన్ని మెప్పించింది. కేరళలో మహామహులు పోటీపడిన కాసర్గోడ్ పార్లమెంట్ స్థానానికి పార్టీ ఆమెను నిలబెట్టింది. అశ్విని పరిచయం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బిజెపి విడుదల చేసిన కేరళ అభ్యర్థుల్లో కాసరగోడ్ అభ్యర్థి పేరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ అభ్యర్థి పూర్వాశ్రమంలో ఒక మామూలు స్కూల్ టీచర్. ఆ తర్వాత ఆమె ఉంటున్న ఊరు మంజేశ్వరకు కేవలం బ్లాక్ పంచాయతీ మెంబర్. పార్టీలో కేవలం మహిళా మోర్చా జాతీయస్థాయి సభ్యురాలు. అయినా సరే ఆమెకే పార్టీ అధిష్టానం సీటు ఇచ్చింది. దానికి కారణం ఆమెకు తెలిసిన ఆరు భాషలు. మలయాళం, కన్నడం, తమిళం, తుళు, హిందీ, ఇంగ్లిష్. ఆమె పేరు ఎం.ఎల్.అశ్విని. భాషతో గెలిచింది కాసరగోడ మంగుళూరుకు దగ్గరగా ఉంటుంది. కన్నడిగులు కూడా ఇక్కడ ఉంటారు. బెంగళూరులో పుట్టి పెరిగిన ఎం.ఎల్.అశ్విని కాసరగోడకు కోడలుగా వచ్చింది. ‘బెంగళూరు మెట్రోపాలిటిన్ సిటీ. అన్నిభాషల వారూ ఉంటారు. నాకు భాషలు నేర్చుకోవడం ఇష్టం. చిన్నప్పుడే ఇంగ్లిష్ మీద పట్టు వచ్చింది. కన్నడ నా మాతృభాష. నా చుట్టుపక్కల తుళు కుటుంబాలు ఉండేవి. వారి నుంచి తుళు నేర్చుకున్నాను. తమిళం కూడా బెంగళూరులోనే నేర్చుకున్నాను. కాసరగోడ వచ్చాక మలయాళం చాలా సులువుగా నేర్చుకున్నాను. హిందీ బాగా తెలుసు. ఇలా ఆరు భాషల్లో నేను అనర్గళంగా మాట్లాడగలను’ అంటుందామె. ఇంట్లో కూడా ఆమె తన భాషలను సాధన చేస్తానని చెప్పింది. ‘నేను నా భర్తతో తుళులో మాట్లాడతాను. నా భర్త, కొడుకు మలయాళంలో మాట్లాడుకుంటారు. మా అమ్మాయి నేను కన్నడంలో మాట్లాడుకుంటాం. ఇలా అన్ని భాషలు మా ఇంట్లో వినిపిస్తూనే ఉంటాయి’ అంటుందామె. ఇన్ని భాషలు రావడం ఆమెకు మేలు చేసింది. ఢిల్లీ వెళ్లాక జాతీయ పార్టీలో ఢిల్లీలో కేంద్ర స్థానంలో ఉంటాయి. స్కూలు టీచర్ ఉద్యోగం మానేసి బి.జె.పిలో చేరాక ఆమెకు మహిళా మోర్చాలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పార్టీ స్థానం ఇచ్చింది. అంతే కాదు ఢిల్లీ కేంద్రంగా దాదాపు 10 రాష్ట్రాలలో మహిళా మోర్చా సభ్యులతో కార్యకలాపాలు బలపరచడానికి ఆమెకు బాధ్యత అప్పగించింది. ‘ఢిల్లీలో జాతీయ స్థాయి నాయకులు హిందీలోకాని, ఇంగ్లిష్లో కాని మాట్లాడటం సౌకర్యంగా భావిస్తారు. కేరళ నుంచి వచ్చిన నాయకులు మలయాళం లేదా తమిళం వంటి భాషలు అనర్గళంగా మాట్లాడతారుకాని ఇంగ్లిష్, హిందీ పూర్తిగా రావు. నాకు రావడం లాభించింది’ అంటుంది అశ్విని. మహిళా మోర్చా తరఫున జమ్ము కశ్మీర్తో మొదలు ఉత్తరప్రదేశ్, అస్సాం వరకు ఆమె పని చేసినప్పుడు దిగువ శ్రేణి కార్యకర్తలతో వాళ్లకు తెలిసిన భాషల్లో మాట్లాడుతూ సులువుగా కలిసిపోవడం పార్టీ గమనించింది. కాసరగోడ్లో ఉన్న కన్నడ, మలయాళ, తమిళ భాషీయులతో ఆమె భాషలతో చొచ్చుకుపోవడం పార్టీ దృష్టికి వచ్చింది. అందుకే జిల్లా అధ్యక్షుడు రావిష్ తంత్రి, జాతీయ ప్రతినిధీ సీనియర్ నేత అయిన పి.కె.కృష్ణదాస్ను కాదని పార్టీ అశ్వినికి సీటు ఇచ్చింది. భాష గొప్ప సాధనం: ‘విజయానికి భాష గొప్ప సాధనం’ అంటుంది అశ్విని. ‘రాజకీయాలలో ప్రజలకు తెలిసిన భాషలో మంచి ఉపన్యాసం ఇవ్వగలిగిన వారికి ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. నేను ఏ భాషలో అయినా మంచి ఉపన్యాసం ఇవ్వగలను. అందుకే నాకు ఈ అవకాశం దక్కింది. భాషలు ఎన్ని తెలిస్తే అంత మంచిది’ అందామె. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాసరగోడ్లో బి.జె.పి మూడో స్థానంలో నిలిచింది. ఈసారి ఏమవుతుందో చూద్దాం. -
స్కూల్లో ఏఐ పంతులమ్మ పాఠాలు!
ఏఐ టెక్నాలజీ ఉద్యోగులు అవసరం లేకుండా కంపెనీని నిర్వహించే గలిగే సామార్థ్యాన్ని అందిస్తుంది. దీన్ని చూసే యువతలో భయాలు మొదలయ్యాయి. అసలే ఉద్యోగాలు దొరక్క బాధపడుతుంటే..ఇక ఈ టెక్నాలజీ వస్తే అంతే పరిస్థితి అని బెంబేలెత్తిపోతున్నారు. అసలు భవిష్యత్తులో ఉద్యోగాలు అనేది ప్రశ్నార్థకమో అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేంత వరకు సాధ్యమనేది క్లారిటీ లేదు గానీ చాలా రంగాల్లోకి ఈ ఏఐ టెక్నాలజీనే తీసుకొచ్చేలా ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడూ టీచర్ అవసరం లేకుండానే క్లాస్లో పాఠాలు చెప్పే ఏఐ పంతులమ్మను తీసుకొచ్చింది కొచ్చికి చెందిన స్టార్ట్-అప్, మేకర్ల్యాబ్స్. ఎలా పాఠాలు చెప్పిందంటే.. కేరళలో తిరువనంతపురంలోని ఓ స్కూల్లో ఏఐ టీచర్ని ప్రవేశ పెట్టింది కొచ్చికి చెందిన స్టార్ట్-అప్, మేకర్ల్యాబ్స్. అక్కడ ఏఐ టెక్నాలజీతో కూడిన టీచరమ్మ ఎలా పాఠాలు చెబుతుందో పరీక్షించారు. చక్కటి చీరకట్టులో ఈ ఏఐ పంతులమ్మ సుమారు మూడు వేల మందికి విద్యార్థులకు చకచక పాఠాలు బోధించటం, సందేహాలు నివృత్తి చేయడం వంటివి చేసింది. ఈ ఏఐ టీచరమ్మ పేరు ఐరిస్ . ఇది మొత్తం మూడు భాషల్లో మాట్లాడగలదు. దీని నాలెడ్జ్ బేస్లో ఇతర ఆటోమేటెడ్ టీచింగ్ టూల్స్ కంటే మెరుగైన అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. ఇది చాట్ జీపీటీ వంటి ప్రోగ్రామ్ల ద్వారా కూడా పనిచేయగలదు. ఈ ఐరిస్ పంతులమ్మ అచ్చం స్త్రీ స్వరంలోనే మాట్లాడుతుంది. ఒక టీచర్ ఎలా పాఠాలు చెబుతుందో అలా అర్థవంతంగా చెప్పగలదు. విద్యార్థుల ప్రశ్నలకు ఉపాధ్యాయుడు ఎలా విడమరిచి వివరించి చెబుతాడో అలానే అన్నింటికి సమాధానాలు ఇచ్చింది ఏఐ ఐరిస్. ఈ మేరకు మేకర్స్ ల్యాబ్ సీఈవో హరిసాగర్ మాట్లాడుతూ.."విద్యార్థులు తమ ల్యాబ్ ద్వారా అనేక నైపుణ్యాలు అభివృద్ధి చేసుకున్నారు. రోబిటిక్స్ వంటి రంగాల్లో అనుభవాన్ని పొందారు కూడా. అలాగే విద్యార్థుల నుంచి ఈ ఏఐ టీచరమ్మ పట్ల సానుకూల స్పందన వచ్చింది. ఎక్కువ మంది క్లాస్ రూంలో ఈ ఏఐ టీచర్ ఉండే బాగుంటుంది అని తమ అభిప్రాయన్ని వెలిబుచ్చడం విశేషం". అని అన్నారు. (చదవండి: జస్ట్ రూ. 150ల ప్రాజెక్టుతో నాసాకు, ఈ విద్యార్థి చాలా స్పెషల్!) -
ఎంతిచ్చినా ఓయూ రుణం తీరదు..
ఉస్మానియా యూనివర్సిటీ: తండ్రి స్కూల్ టీచర్. అయినా..8 మంది కుటుంబ సభ్యుల కారణంగా పేదరికం..పస్తులు తప్పలేదు. ఇంటర్ వరకు కాళ్లకు చెప్పులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. అయినా ఎక్కడా రాజీపడకుండా బాగా కష్టపడి చదువుకొని..లక్ష్యాన్ని సాధించి అమెరికాలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ పూర్వవిద్యార్థి గోపాల్ టీకే కృష్ణ. 77వ ఏట ఓయూలో తను చదివిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థుల తరగతి గది భవన నిర్మాణం కోసం రూ.5 కోట్ల విరాళాన్ని అందచేసి చరిత్ర సృష్టించారు. 107 ఏండ్ల ఓయూలో సుమారు కోటి మందికి పైగా విద్యార్థులు చదవుకున్నారు. దేశ ప్రధాని మొదలు సీఎంలు, మంత్రులు, ఇతర పెద్ద హోదాలలో స్థిరపడ్డారు. కానీ ఇంత వరకు ఎవరు కూడా వ్యక్తిగతంగా రూ.5 కోట్లను విరాళంగా ఇవ్వలేదు. గోపాల్ టీకే కృష్ణ తొలిసారి ఓయూకు రూ.5 కోట్ల చెక్కును అందచేసి ‘ఎంతిచి్చనా ఓయూ రుణం తీర్చుకోలేను. ఇక్కడ చదివిన చదువే నాకు ఎంతగానో తోడ్పడింది’ అని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. పేదరికం నుంచి ఎదిగి.. గోపాల్ టీకే కృష్ణ పూర్వీకులది ఏపీలోని ఏలూరు జిల్లా. కానీ తమిళనాడులోని కోయంబత్తూరులో స్థిరపడ్డారు. కొన్నేళ్లు వారి కుటుంబం హైదరాబాద్లోని నారాయణగూడలో నివాసం ఉన్నారు. గోపాల్ కృష్ణ తండ్రి టీకే శ్రీనివాస చారి, తల్లి లక్ష్మీరాజమళ్. వీరికి 6 మంది సంతానం. అందులో నలుగురు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలు. శ్రీనివాసచారి తల్లిదండ్రులు కూడా కలిసి మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉండేవారు. శ్రీనివాస చారి అబిడ్స్లో మెథడిస్ట్ హైసూ్కల్లో టీచర్గా పని చేశారు. రెండో సంతానం అయిన గోపాల టీకే కృష్ణ దేశ స్వాతంత్య్ర పోరాటం సమయంలో 1947, ఫిబ్రవరి 16న జన్మించారు. ఆ సమయంలో స్వాతంత్య్రం కోసం జరిగే ఉద్యమాలు, అల్లర్ల కారణంగా నారాయణగూడలోని ఇంటికి వెళ్లకుండా మెథడిస్ట్ స్కూల్లోనే 18 నెలల పాటు తలదాచుకున్నారు. తండ్రికి నెలకు రూ.270 వేతనం వలన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా కుటుంబంలో ముగ్గురు ఇంజినీర్లు, ఒకరు డాక్టర్ కోర్సు చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. నిజాం ట్రస్ట్ ఫండ్తో అమెరికాకు ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి 1969లో అమెరికాకు వెళ్లినట్లు గోపాల్ టీకే కృష్ణ తెలిపారు. సెమిస్టర్కు రూ.99 ఫీజు, నెలకు రూ.100 నేషనల్ ఫెలోషిప్తో సెమిస్టర్కు రూ.99 ఫీజుతో ఇంజినీరింగ్ పూర్తి చేసి, రూ.10 వేల అప్పుతో పాటు నిజాం ట్రస్ట్ ఫండ్ రూ.1500 ఆరి్థక సహాయంతో అమెరికాకు వెళ్లినట్లు చెప్పారు. తర్వాత రూ.5 లక్షలను నిజాం ట్రస్ట్కు తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ చైర్మన్గా.. అమెరికాలోని అయోవా స్టేట్లో రిపబ్లికన్ పారీ్టకి మూడు సార్లు చైర్మన్గా ఎన్నికయినట్లు తెలిపారు. ఎనిమిది భాషలు తెలిసిన గోపాల్ కృష్ణ అయోవాలో కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తన ముగ్గురు కొడుకులు డీన్ లాయర్గా, గోల్డెన్ గూగుల్ ఉద్యోగిగా, ఆల్విన్ నిర్మాణ రంగంలో పని చేస్తున్నట్లు తెలిపారు. తన పిల్లలకు రూపాయి కూడా ఇవ్వకుండా ఓయూకు రూ.5 కోట్లను అందచేసినట్లు తెలిపారు. -
రెడీ టు బడి
డిజిటల్ స్టార్ కావడం అనేది అదృష్టం కాదు. అవకాశం.ఆ అవకాశం చేతికి అందాలంటే ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనేది బాగా తెలిసి ఉండాలి.చాలామందిలో ఈ అవగాహన లోపించి ‘ఆరంభ శూరత్వం’ ప్రదర్శిస్తున్నారు.‘ఇది మనకు వర్కవుట్ అయ్యేలా లేదు’ అని రథాన్ని వెనక్కి మళ్లిస్తున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకొని.. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కావాలని కలలు కనే యువతరం కోసం ‘స్పియర్క్రాఫ్ట్ అకాడమీ’లాంటి నయా స్కూల్స్ వస్తున్నాయి. ‘కంటెంట్ కోచ్’లాంటి నయా గురువులు వస్తున్నారు.కెమెరా యాంగిల్స్ నుంచి ‘ఏ టైమ్లో వీడియోను రోస్ట్ చేయాలి?’ ‘బ్రాండ్లతో ఎలా కొలాబరేట్ కావాలి... లాంటి సమస్త విషయాలను నేర్చుకుంటున్నారు... దిల్లీకి చెందిన ఇరవై సంవత్సరాల కడలికి డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కావాలనేది కోరిక. పబ్లిక్ స్పీకింగ్, బ్లాగింగ్పై పట్టు సాధించడానికి షార్ట్ కమ్యూనికేషన్ కోర్సులో చేరింది. డిజిటల్ స్టార్డమ్ ప్రభావంతో, తాము కూడా ఆ స్థాయిలో పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతో పర్సనల్ బ్రాండ్ బిల్డింగ్ కోసం బడి బాట పడుతున్న అనేకానేక మందిలో కడలి ఒకరు. 2022తో పోల్చితే మన దేశంలో 2024లో కంటెంట్ క్రియేటర్ల సంఖ్య బాగా పెరిగిందని చెబుతోంది ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ఫర్మ్ జెమ్ఫో. ‘ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే చాలు, ఆడియో అండ్ వీడియో కాప్చరింగ్ తెలిసి ఉంటే చాలు కంటెంట్ క్రియేటర్గా రాణించవచ్చు అని అనుకోవడానికి లేదు. నేర్చుకోవడానికి చాలా ఉంది’ అంటున్నాడు కంటెంట్ కోచ్, బ్రాండ్ కన్సల్టంట్ మనీష్ ΄ాండే. మనీష్లాంటి కంటెంట్ కోచ్ల ద్వారా సాంకేతిక విషయాలపై నైపుణ్యంతో ΄ాటు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో ఎలాంటి వీడియోలు ఆదరణ పోందుతున్నాయో తెలుసుకుంటున్నారు ఔత్సాహిక కంటెంట్ క్రియేటర్లు. డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఇన్ఫ్లూయెన్సర్లు కావాలనుకునేవారి కోసం ‘స్పియర్క్రాఫ్ట్ అకాడమీ’ పేరుతో ఫస్ట్ స్కూలు ఏర్పాటయింది. ‘కంటెంట్ను ఎలా క్రియేట్ చేయాలి? ఎలా ఎడిట్ చేయాలి? పర్సనల్ గ్రూమింగ్, వార్డ్రోబ్ మేనేజ్మెంట్, బాడీ లాంగ్వేజ్...ఇలా వెరైటీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాం. మంచి స్పందన ఉంది’ అని చెబుతున్నారు ‘స్పియర్క్రాఫ్ట్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సౌమ్యబాత్రసేన్ గు΄్తా.మరోవైపు మైక్రో అండ్ నానో న్ఫ్లూయెన్సర్లు కంటెంట్ కోచ్లకు బిగ్గెస్ట్ క్లయింట్స్గా ఉన్నారు. కన్సల్టేషన్ కోసం తన దగ్గరకు వస్తున్న వారిలో చిన్న వ్యా΄ారాలు చేస్తున్నవారు, నెయిల్ ఆర్టిస్ట్లు, స్కిన్కేర్ క్రియేటర్లు... ఇలా అన్ని రకాల వారు ఉన్నారని హైదరాబాద్కు చెందిన కంటెంట్ కోచ్ ఇషిక పన్సారీ చెబుతోంది. ‘ఆరు నెలల వ్యవధిలో 600 మందికి శిక్షణ ఇచ్చాను’ అని చెబుతుంది ఇషిక. సెషన్లో భాగంగా కంటెంట్ ఐడియాలు ఇస్తుంది. ‘బార్టర్ డీల్స్ నుంచి బ్రాండ్ కొలాబ్రేషన్స్, యాడ్–జెనరేటెడ్ రెవెన్యూ వరకు కంటెంట్ క్రియేషన్ స్పేస్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయిన్పటికీ ‘డబ్బు’ అనేది చివరి అంశం. డబ్బు సం΄ాదించడానికి ఓపిక, స్థిరత్వం ఉండాలి’ అంటాడు కంటెంట్ కోచ్ మనీష్ ΄పాండే. ఇరవై రెండు సంవత్సరాల దామినీ చౌదురీ ఫుడ్, ఫ్యాషన్, లైఫ్స్టైల్ ఇన్ఫ్లూయెన్సర్గా రాణించాలనుకుంటుంది. ‘ఇటీవలే పర్సనల్ స్టైలింగ్, ఇమేజ్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశాను. నాకు 7,000 ఫాలోవర్స్ ఉన్నారు’ అంటున్న దామిని శిక్షణ ద్వారా ఓవరాల్ ప్రెజెంటేషన్, అ్ర΄ోచ్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంది. ‘ఆడియెన్స్తో కనెక్ట్ అయ్యే స్పార్క్ అనేది ఏ కొద్దిమందికో పరిమితమైనది కాదు’ అంటున్న కంటెంట్ కోచ్లు బ్రాండ్తో ఎలా కొలాబరేట్ కావాలి. ఎలా నెగోషియేట్ చేయాలి, కంటెంట్ను ఎలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి, బెటర్ కెమెరా యాంగిల్ ఎలా ఉపయోగించాలి... మొదలైన టెక్నికల్ యాస్పెక్ట్స్ను సులభంగా తెలియజేస్తున్నారు. కంటెంట్ క్రియేషన్ కోర్సుల కోసం చాలామంది స్కిల్స్ షేర్, ఉడెమీలాంటి ఆన్లైన్ లెర్నింగ్ ΄్లాట్ఫామ్లపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. వీడియో రోస్ట్ చేయడానికి రోజులో మంచి టైమ్ ఏమిటి? ఎలాంటి పరికరాలు కావాలి? ఎలాంటి లైటింగ్ బాగా ఉపయోగపడుతుంది... లాంటి విషయాలను నేర్చుకుంటున్నారు. కొండంత అండ... మన దేశంలోని టాప్ డిజిటల్ స్టార్స్లో 27 సంవత్సరాల బృంద శర్మ ఒకరు. డిజిటల్ స్టార్ కావాలని, అవుతానని ఎప్పుడు అనుకోలేదు. కొండలు, గుట్టలు అంటే ఆమెకు ఇష్టం. వాటిని వెదుక్కుంటూ వెళ్లడం అంటే ఇష్టం. దుబాయ్లో చేసే 9–5 ఉద్యోగం కంటే కొండల గుండెల చప్పుడు వినడం అంటేనే ఆమెకు ఇష్టం. ఎన్నో దేశాలలో ఎన్నో పర్వతాలకు సంబంధించిన ఆసక్తికరమైన చరిత్రను ఇన్స్టాగ్రామ్ వేదికగా లోకంతో పంచుకునేది. ఆ తరువాత ట్రావెలింగ్కు సంబంధించిన వీడియోలతో ఫుల్–టైమ్ ఇన్ఫ్లూయెన్సర్గా మారింది. ప్రకృతిపై ప్రేమ, ప్రయాణం అనేది పూర్తిగా తన వ్యక్తిగత విషయం అన్నట్లుగా ఉండేది బృంద. అయితే అనునయ్సూద్ అనే ఫ్రెండ్ సలహాతో ఇన్స్టాగ్రామ్ మిషన్ ్ర΄ారంభించింది. తన వీడియోలను వైరల్ చేయాలని, కావాలనీ... బృంద ఎప్పుడూ అనుకోలేదు. అయితే కంటెంట్లో ఉన్న సత్తాతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. బృందశర్మను డిజిటల్ స్టార్ను చేశాయి. ప్రేక్షక లోకమే ΄పాఠశాల సీఏ పరీక్షలు పూర్తయిన తరువాత ఫైనాన్స్ర్΄÷ఫెషన్లోకి వచ్చింది ట్వింకిల్ జైన్. ఫైనాల్సియల్ లిటరసీని దృష్టిలో పెట్టుకొని 2021 నుంచి సోషల్ మీడియా వేదికగా వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ‘బిజినెస్ అండ్ ఫైనాన్స్కు సంబంధించిన వీడియోలు ఎవరు చూస్తారు?’ అని అనుకొని ఉంటే 26 సంవత్సరాల వయసులోనే టాప్ డిజిటల్ స్టార్స్ జాబితాలో ట్వింకిల్ పేరు ఉండేది కాదు. తెలిసో తెలియకో జటిలమైన విషయాలను మరింత జటిలంగా చెబుతూ శ్రోతలను భయభ్రాంతులకు గురి చేస్తారు కొందరు. మరి కొందరు మాత్రం ఎంత జటిలమైన విషయాన్ని అయినా ‘ఓస్ ఇంతేనా’ అన్నట్లుగా సులభంగా అర్థమయ్యేలా చెబుతారు. ట్వింకిల్ జైన్ రెండో కోవకు చెందిన వ్యక్తి. ప్రేక్షక లోకమే ఆమె ΄ాఠశాల. వారి నుంచే విలువైన ΄ాఠాలను నేర్చుకుంది. -
ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలవన్మరణం.. కారణం ఇదే..!
గద్వాల క్రైం: కుటుంబ సమస్యలతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన గద్వాల మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని న్యూ హౌసింగ్బోర్డులో నివాసం ఉంటున్న విజయ్మోహన్రెడ్డి(53) మోమిన్మొహల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా ఇంట్లో సమస్యలు తీవ్రం కావడంతో బుధవారం ఇంట్లోంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి మండలంలోని పూడురూ గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో చెట్టుకు చీరతో ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం స్థానిక రైతులు గమనించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ఆనంద్ చేరుకుని పరిశీలించగా మృతుడి గుర్తింపుకార్డు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి భార్య కొన్నేళ్ల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు. రెండో భార్య స్వాతికి 6ఏళ్ల కూతురు ఉంది. కుమారుడు హేమంత్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి మరికల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయలైన ఘటన గురువారం ఎలిగండ్ల వంతెన వంద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధన్వాడ మండలం గున్ముక్లకు చెందిన మంగలి శివశంకర్(42) మరికల్లో ఓ హేర్కంటింగ్ షాప్లో పని చేస్తున్నాడు. పనులు ముగించుకుఇన సాయంత్రం 7 గంటలకు గున్ముక్లకు స్కూటీపై తిరుగు ప్రయాణం అవుతుండగా మరికల్ చౌరస్తాలో ఎమ్మోనోనిపల్లికి చెందిన నవీన్ లిప్ట్ అడిగి స్కూటీ ఎక్కాడు. ఎలిగండ్ల స్టేజీ సమీపంలోని జాతీయ రహదారి వంతెన మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కంటెయినర్ స్కూటీని ఢీకొనడంతో శివశంకర్ అక్కడిక్కడే మృతి చెందాడు. నవీన్కు తీవ్రగాయలు కావడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్రెడ్డి తెలిపారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement