-
డబ్బుల్లేక భార్యతో గొడవ.. కూతుళ్లతో విషం తాగి
సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదురవడంతో పిల్లలను పోషించలేక వారికి కూల్డ్రింక్లో విషం కలిపి నవ్వుతూ తాగండర్రా అంటూ చెప్పి ఆపై ఆయన కూడా తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. అయితే తాగిన వెంటనే తప్పు చేశామని భావించి వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులకు చెప్పాడు. వాళ్లు వెంటనే ఆస్పతత్రికి తరలించడంతో ఇద్దరు ప్రాణాలు దక్కగా ఒకరి ప్రాణం పోయింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో చోటుచేసుకుంది. ఆత్మకూర్ గ్రామానికి చెందిన శివకుమార్, లలిత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు నవ్యశ్రీ (4), సిరి (5) ఉన్నారు. వీరు హైదరాబాద్లో నివసిస్తుండేవారు. అయితే ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం మళ్లీ గొడవ జరగడంతో భర్త శివకుమార్ పిల్లలను తీసుకుని హైదరాబాద్ నుంచి స్వగగ్రామం ఆత్మకూర్కు వచ్చాడు. రాత్రి కూల్డ్రింక్స్లో విష గుళికలు కలిపేశాడు. పిల్లలకు తాగించిన అనంతరం ఆయన కూడా తాగాడు. అనంతరం బయటకు వెళ్లి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వచ్చి చూడగా పిల్లలు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. దీంతో ఆందోళన చెందిన శివకుమార్ వెంటనే తాను చేసిన పనిని కుటుంబసభ్యులకు చెప్పాడు. వెంటనే కుటుంబసభ్యులు పిల్లలను, అతడిని ఆస్పతత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే నవ్యశ్రీ మృతి చెందింది. సిరి, శివకుమార్ ప్రాణాపాయంతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంతోశ్కుమార్ తెలిపారు. చదవండి: సెల్ఫీ తీసుకుంటూ ఫోన్తో నీటిలోకి కొట్టుకుపోయిన బాలుడు -
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో దారుణం
-
మృత్యువులోనూ వీడని బంధం
సదాశివపేట: ఆ భార్యాభర్తలను మృత్యువు కబళించింది. హైదరాబాద్లో షాపింగ్ చేయడానికి సదాశివపేట నుంచి ఇద్దరు కొడుకులు, కోడలుతో కలిసి పయనమైన వారి వాహనాన్ని ప్రమాదం వెంటాడింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో క్లాస్వన్ కాంట్రాక్టర్ పిల్లిగుండ్ల నారాయణగౌడ్, ఆయన భార్య సత్యమ్మ దుర్మరణం పాలయ్యారు. వీరి మరణవార్త తెలియడంతో స్వగ్రామమైన సదాశివపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం వీరు వెళుతున్న వాహనం పల్టీకొట్టడంతోప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నారాయణగౌడ్, సత్యమ్మ దంపతుల పెద్ద కొడుకు భాస్కర్గౌడ్, అతడి భార్య హారిక, రెండో కొడుకు భరత్గౌడ్, వాహనం డ్రైవర్ మధుకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు నారాయణగౌడ్, మృతురాలు సత్యమ్మ, కొడుకులు, కోడలు, మనవడు, మనవరాలితో కలిసి పార్చునర్ వాహనంలో ఆదివారం ఉదయం సదాశివపేట పట్టణంలోని స్వగృహం నుంచి బయలుదేరారు. సంగారెడ్డిలోని వైకుంఠ పురం శ్రీ గోదాసమేత లక్ష్మీ విరాట్ వెంకటేశ్వరస్వామి దర్శించుకుని అక్కడి నుంచి సంగారెడ్డిలోని నారాయణగౌడ్ తమ్ముడి ఇంటికి వెళ్లారు. అక్కడ నారాయణగౌడ్ మనవడు, మనవరాలిని దించేసి అదే వాహనంలో భార్య సత్యమ్మ, కొడుకులు భరత్గౌడ్, భాస్కర్గౌడ్, కోడలు హారికతో కలిసి షాపింగ్ చేసేందుకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డుపై వీరు ప్రయాణిస్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నారాయణగౌడ్, సత్యమ్మ దంపతులు దుర్మరణం పాలవ్వగా భరత్గౌడ్, భాస్కర్గౌడ్, హారిక, డ్రైవర్ మధులకు తీవ్రగాయాలయ్యాయి. క్లాస్ వన్ కాంట్రాక్టర్గా ఎదిగి.. మృతుడు నారాయణగౌడ్ బీఈ ఎలక్ట్రికల్ పూర్తి చేసి కాంట్రాక్టర్ పనులు చేపట్టాడు. ప్రస్తుత సంగారెడ్డి ఎమ్మెల్యే చిం తా ప్రభాకర్ సదాశివపేట మున్సిపల్ చైర్మన్గా పని చేసిన 1992 నుంచి 1995 వరకు నారాయణగౌడ్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడిగా పనిచేశారు. అనంతరం కాంట్రాక్టు పనులు చేస్తూ క్లాస్వన్ కాంట్రాక్టర్ స్థాయికి ఎదిగాడు. నారాయణగౌడ్, సత్యమ్మ దంపతుల దుర్మరణంతో సదాశివపేట పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న తోటి కాంట్రాక్టర్లు, ఆయన వద్ద పని చేస్తున్న కార్మికులు, డ్రైవర్లు విషాదంలో మునిగిపోయారు. నారాయణగౌడ్ ఇంటి వద్ద బంధువులు, స్నేహితులు గుమిగూడారు. నారాయణగౌడ్ దుర్మరణం చెందడంతో పట్టణ, మండల పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు సంతాప సూచకంగా నిలిపివేశారు. -
సదాశివపేటలో కూలిన పురాతన భవనం
సురక్షితంగా బయటపడిన కుటుంబ సభ్యులు తప్పిన ప్రమాదం.. పరిశీలించిన ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి సదాశివపేట: ఎడ తెరిపిలేకుండా కురిసిన వర్షాలకు బాగా తడిసిపోయిన అతి పురాతన భవనం అకస్మాత్తుగా కూలిపోయిన సంఘటన గురువారం పట్టణంలోని గడిమైసమ్మ మందిరం సమీపంలో చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం భవనంలో ఉంటున్న అల్లాదుర్గం సురేశ్, భార్య విశాల, నానమ్మ నాగమణి, ఏడాది వయస్సున్న కుమారుడు ప్రద్వీక్లు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలకు భవనం పూర్తిగా తడిసిపోయింది. దీంతో గురువారం అకస్మాత్తుగా పగుళ్లు రావడం గమనించిన సురేశ్ వెంటనే తేరుకుని భవనంలో ఉన్న నానమ్మ, నాగమణి, భార్య విశాల, కుమారుడు ప్రద్వీక్లను చాకచక్యంగా తప్పించారు. భవనం ముఖద్వారం పూర్తిగా కూలిపోయింది. దీంతో సురేశ్ మున్సిపల్ కమిషనర్ ఇస్వాక్ ఆబ్ఖాన్కు, తహసీల్దార్ గిరికి భవనం కూలిన విషయమై ఫోన్లో సమాచారం చేరవేశాడు. కమిషనర్ హైదరాబాద్లో సమావేశంలో ఉండడంతో మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తం చేసి శానిటరీ ఇన్స్పెక్టర్ మధు, టీపీఓ శ్రీనివాస్, అదనపు టీపీఓ ఝాన్సీలను సంఘటన స్థలానికి పంపించారు. కూలిపోయిన పురాతన భవనంలోని వారిని నిచ్చెన సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ గిరితో కలిసి పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తగిన ఆర్థిక సహాయం మంజూరు చేస్తామని కుటుంబ సభ్యులకు తెలిపారు. పురాతన భవనాల్లో ప్రజలెవరూ నివసించవద్దని ప్రజలకు పిలపునిచ్చారు. అనంతరం కమిషనర్ ఇస్వాక్ఆబ్ఖాన్ ఆ భవనాన్ని వెంటనే కూల్చివేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించడంతో జేసీబీ సహాయంతో కూల్చివేశారు. -
దోమల స్వైర విహారం
పట్టపగలే విజృంభణ పారిశుద్ధ్య లోపం, మురుగు నీరే కారణం నివారణ చర్యలు శూన్యం రోగాల బారిన పడుతున్న ప్రజలు సదాశివపేట: నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పట్టణంలోని పలు కాలనీల్లో అపరిశుభ్రత వాతావరణం ఏర్పడింది. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. పట్టపగలే దోమలు ప్రజలపై దాడి చేస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా అవి జలగల్లా పట్టి పీడిస్తున్నాయి. పారిశుద్ధ్య లోపం డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంతో పలు కాలనీల్లో ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది. పిల్లలు, వృద్ధులు రోగాల బారినపడి ఆస్పత్రుల పాలవుతున్నారు. పట్టణంలోని సిద్దాపూర్ కాలనీ, శంభులింగేశ్వరకాలనీ, నాగేశ్వర్నగర్, ఫయాజ్నగర్, గురునగర్, రవీంద్రనగర్, దత్తాత్రేయనగర్, శ్రీరాంనగర్, ప్రియదర్శిని కాలనీ, రాఘవేంద్రనగర్, హనుమాన్నగర్, కృష్ణనగర్, తదితర ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ మురుగునీరు నిలవ ఉండడంతో దోమలకు ఆవాసాలుగా మారాయి. దోమకాటుతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. చాలామంది మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధుల బారినపడి ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు కానీ వైద్య సిబ్బంది కానీ అయా కాలనీలపై కన్నెత్తి చూడడం లేదు. దోమల నివారణకు ఇళ్లలో కాయిల్స్, లిక్వీడ్ సీసాల వినియోగానికి ప్రతి కుటుంబం నేలకు వంద వరకు ఖర్చు చేస్తున్నారు. పట్టణంలో అధికారికంగా 10 వేల వరకు గృహాలు ఉండగా రికార్డుల్లో నమోదుకానీ గృహాలు మరో పదివేల వరకు ఉండవచ్చని అంచన. పత్తాలేని ఫాగింగ్ పట్టణంలో పారిశుద్ధ్యంపై సంబంధిత అధికారులు ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పలు కాలనీల్లో పలు వ్యాధులు ప్రబలుతున్నాయి. డ్రైనేజీలు దోమలకు నిలయాలుగా మారినందువల్ల పిల్లలు, వృద్ధులు ఇబ్బందిపడతున్నారు. శానిటేషన్ సిబ్బంది దోమల నివారణకు ఫాగింగ్ చేయకపోవడం, చెత్తకుండీల వద్ద బ్లీచింగ్ పౌడర్ చల్లకపోవడంతో అపరిశుభ్రత రాజ్యమేలుతుంది. పలు కాలనీల్లో పిల్లలు,వృద్ధులు, యువత అనే తెడాలేకుండా విషజ్వారాల బారినపడుతున్నారు. ఇప్పటికైన మున్సిపల్ అధికారులు స్పందించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటాం పట్టణ పరిధిలో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ పరిధిలో ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నం. సిబ్బందిని అప్రమత్తంగ ఉంచుతూ అందుబాటులో ఉంచాం. కాలనీలో నీరు నీలువ ఉండకుండ ప్రత్యేక చర్యలు చేపడుతున్నం. పలు కాలనీల్లో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా పనులు చేపడుతున్నాం, ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. - ఇస్వాక్ ఆబ్ఖాన్, మున్సిపల్ కమిషనర్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement