-
బండి స్క్రాప్ కింద అమ్మేశారా? ఈ విషయం తెలుసుకోండి.. వారికి తెలపండి
వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక డ్రైవర్ కారు కొనుగోలు చేశాడు. కొంతకాలం తరువాత స్క్రాప్ కింద విక్రయించేశాడు. కానీ రవాణాశాఖ అధికారులు పన్ను చెల్లించాలని నోటీసు ఇచ్చారు. హడావిడిగా రవాణాశాఖ అధికారులను కలిసి కారును స్క్రాప్ కింద విక్రయించేశానని.. అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఆ విషయాన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉందని అధికారులు బదులిచ్చారు. ఆఖరికి నాలుగు త్రైమాసికాలు పన్నులు చెల్లించాడు. ఇలా చాలా మంది ఇబ్బంది పడుతుండటారు. దీనిపై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్ : నూతన వాహనం కొనుగోలు చేసే సమయంలో ధ్రువీకరణ పత్రాలు సరి చూసుకోవటమే కాదు.. వాహనాన్ని తీసేసినా.. స్క్రాప్ కింద వేసినా.. ఇతరులకు విక్రయించినా ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు తీసుకెళ్లినా అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందే. జిల్లాలో 5 లక్షల 680 వాహనాలు ఉన్నాయి. వాటిలో లారీలు 21,771, మ్యాక్సీ క్యాబ్లు 1320, మోటారు క్యాబ్లు 3160, కమర్షియల్ ట్రాక్టర్లు 19,311, ఆటోలు 29,135, స్కూలు బస్సులు 1461తోపాటు ఇతరత్రా ట్రాన్స్పోర్టు వాహనాలు ఉన్నాయి. వాటిలో అనేక సంవత్సరాలుగా త్రైమాసిక పన్ను బకాయిలు ఉన్నారు. అధికారుల గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 8061 వాహనాలు పన్నులు చెల్లించనవిగా గుర్తించారు. అయితే ఇప్పటికే సదరు వాహన యజమానులకు నోటీసులు జారీ చేయడంతోపాటు నిత్యం పన్ను చెల్లించాలని సమాచారం అందజేస్తున్నారు. లేని వాహనాలు ఎన్నో.. జిల్లాలో త్రైమాసిక పన్నులు చెల్లించాల్సిన వాహనాలు 2061 ఉండగా, వాటిలో అనేక వాహనాలు లేనే లేవని అధికారులు గుర్తించారు. వేలాది వాహనాలు ప్రమాదాలకు గురైనవి, వదిలివేయడం, కాలం చెల్లిన వాహనాలను స్క్రాబ్ వేయడం, ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు తీసుకెళ్లిన వాహనాల గురించి పట్టించుకోకపోవడం, విక్రయించిన వాహనాల గురించి సమాచారం ఇవ్వకపోవడం వంటివి ప్రధానంగా గుర్తించారు. 8061 వాహ నాల్లో సుమారు 2000–3000 వాహనాలు స్క్రాబ్తోపాటు ఇతర అంశాలలో సంబంధిత యజమానుల వద్ద లేనట్లు, గుర్తించినట్లు సమాచారం. పన్ను పడుతూనే ఉంది.. వాహనాలకు సంబంధించి యజమానుల వద్ద వాహనం లేనప్పటికీ త్రైమాసిక పన్నులు మాత్రం పడుతూనే ఉంటాయని అఽధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వాహనదారులు వాహనాలను స్క్రాబ్ వేసినా, ఇతరత్రా అంశాల్లో కోల్పోయినా, కనీసం అధికారులకు సమాచారం ఇవ్వకపోవడంతో వాటికి పన్నులు పడుతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు వాహనాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. వాహనాన్ని స్క్రాబ్ కింద తీసివేసినా, ఫైనాన్స్ వారు తీసుకుపోయినా, ప్రమాదం జరిగి ఎక్కడైనా వాహనం నిలిచిపోయినా తప్పనిసరిగా తెలియజేయాల్సిన అవసరం ఉందని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే అధికం వాహనాలను తీసివేయడం, ఫైనాన్స్ సంస్థల వారు తీసుకెళ్లడం వంటివి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి. వాటికి సంబంధించి యజమానులు దరఖాస్తు చేసుకోకపోవడం వల్ల పన్నులు పెరిగిపోతున్నాయని అధికారులు గుర్తించారు. స్క్రాబ్ చేసిన వాహనానికి సంబంధించి ఛాయిస్ నెంబర్లు దుర్వినియోగానికి పాల్పడితే దానికి సంంధించిన వాహన యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుందని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే క్రమంలో వాహనం స్క్రాబ్ వేసినట్లు దరఖాస్తు చేసుకుని రోడ్డుపై తిరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని, వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదుకు అవకాశం ఉందని చెబుతున్నారు. వాహన యజమానులు ఈ విషయాన్ని గుర్తించి వాహనాన్ని తీసివేసినా, ఫైనాన్షియర్లు తీసుకెళ్లినా, ఇతరత్రా అంశాలు జరిగితే దరఖాస్తు చేసుకోవడంతోపాటు అధికారుల దృష్టికి తీసుకు రావాలని సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకోవాలి వాహనాన్ని తీసివేసినా, స్క్రాబ్కు వేసినా, ఫైనాన్షియర్లు తీసుకెళ్లినా ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవడంతోపాటు అఽధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ట్రాన్స్పోర్టు వాహనాలైతే వాహనాలు మన దగ్గర లేకపోయినప్పటికీ త్రైమాసిక పన్నులు, ఆపైగా జరిమానాలు పడుతూనే ఉంటాయని యజమానులు గ్రహించాలి. స్క్రాబ్కు వేసినప్పటికీ ఛాయిస్ నెంబర్లు దుర్వినియోగం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. యజమానులు గుర్తించి వాహనాల విషయంగా తగు జాగ్రత్తలు తీసుకుని నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలి. – ఇ.మీరప్రసాద్, జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్, కడప -
అరచేతిలో.. ఫ్యాన్సీ నంబర్!
గద్వాల క్రైం: కారు కొనాలనే ఆశయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఆర్థికంగా ఉన్న వారు మాత్రం ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.లక్షలు వెచ్చించి దక్కించుకునేందుకు వెనకడుగు వేయరు. అయితే ఇక్కడే పలువురు యజమానులు దళారుల వైపు.. ఆర్టీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అయినప్పటికీ దళారులకు తెలిసిన సిబ్బంది ద్వారా ఫ్యాన్సీ నంబర్ను పెద్ద మొత్తంలో చెల్లించే యజమానులకు ఎలాగైనా ఫ్యాన్సీ నంబర్ సొంతం చేయాలనే లక్ష్యంతో ఉంటారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి తెలంగాణ ట్రాన్స్పోర్టు శాఖ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వివిధ సేవలు ఆన్లైన్ చేసి దళారీ వ్యవస్థకు చెక్ పెట్టింది. తాజాగా ఫ్యాన్సీ నంబర్ విషయంలోనూ అందరికీ అందుబాటులో ఉండేలా ఆన్లైన్లోనే వాహనదారులకు ఉపయోగపడేలా కోరుకున్న నంబర్ను సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. జిల్లాలో ఈ విధానానికి ఈనెల 10న అనుమతులు జారీ చేయడంతో వాహన యజమానులు ఊరట చెందుతున్నారు. సేవలు ప్రారంభం.. ఫ్యాన్సీ నంబర్ను పొందేందుకు జిల్లా రవాణా శాఖలో ప్రతిరోజూ ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రక్రియ పూర్తయి మొబైల్ నంబర్కు సందేశం వస్తుంది. అనంతరం కోరుకున్న నంబర్ను త్వరగా పొందవచ్చు. ఇక ఎక్కడి నుంచైనా ఆన్లైన్ నంబర్ను ఎంపిక చేసుకునే ఆవకాశం ఉండటంతో వాహనదారులకు ఎంతో ఉపయోగపడనుంది. సద్వినియోగం చేసుకోవాలి వాహనాల రిజిస్ట్రేషన్లో భాగంగా ఫ్యాన్సీ నంబర్లు ఆన్లైన్లో రిజర్వు చేసుకునే అవకాశాన్ని కల్పించాం. ఈ విధానం ద్వారా వాహన యజమానులు కోరుకున్న నంబరును సులువుగా పొందవచ్చు. అలాగే 15 రోజుల్లో వాహనాన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. – పురుషోత్తంరెడ్డి, డీటీఓ -
రవాణా కమిషనర్ కార్యాలయంలో దాడులు
సాక్షి, హైదరాబాద్: స్వయంగా రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొలువుదీరి ఉండే రవాణా కమిషనర్ కార్యాలయంలోనే లంచావతారం పడగవిప్పింది. కొత్త వాహనాల్లో మార్పుచేర్పులు, అక్షర దోషాలను సవరించడం వంటి విధులు నిర్వహించే పరిపాలనాధికారి జె.నరేందర్ మంగళవారం రూ.36 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇలా అవినీ తికి పాల్పడుతూ నరేందర్ ఏసీబీకి చిక్కడం ఇది రెండోసారి. ఖైరతాబాద్లోని రవాణా కమిషనర్ కార్యాలయంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. సంగారెడ్డికి చెందిన సీహెచ్ సందీప్ ట్రేలర్ అండ్ ట్యాంకర్గా వాహనాన్ని మార్పు చేసుకోవడం కోసం రవాణాశాఖ నుంచి ప్రొసీడింగ్స్ను పొందేందుకు గత నెల 13న అడ్మినిస్ట్రేటివ్ అధికారి నరేందర్ను సంప్రదించాడు. సదరు అనుమతుల కోసం రూ.36 వేలు లంచం ఇవ్వాల్సిందిగా నరేందర్ డిమాండ్ చేశాడు. చివరకు రూ.30 వేలు తీసుకొని ప్రొసీడింగ్స్ ఇచ్చేందుకు అంగీకరించాడు. ఈ క్రమంలో సందీప్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారుల సూచన మేరకు రూ.36 వేల నగదును నరేందర్కు అందజేశాడు. అప్పటికే నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు నరేందర్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. 2016 జనవరి 4న ఒక కేసులో రూ.8,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన నరేందర్ తిరిగి మరోసారి పట్టుబడటం గమనార్హం. అతన్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. లంచం అడిగితే ఫిర్యాదు చేయండి.. రవాణా శాఖలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్–1064కు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, రవాణా కమిషనర్ ప్రధాన కార్యాలయంలో ఏసీబీ దాడులతో హైదరాబాద్లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. దళారులను కార్యాలయాల్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ జాగ్రత్తలు పాటించారు. -
జేసీ దివాకర్ రెడ్డికి షాక్
సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి రవాణా శాఖ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. దివాకర్ ట్రావెల్స్కు చెందిన 23 బస్సులను ఆర్టీఏ అధికారులు గురువారం సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా నడస్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ కమిషనర్ సీతారామాంజనేయులు, జాయింట్ కమిషనర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలోని అధికారులు పలు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారంగా టికెట్ ధరలు వసూలు చేస్తున్న 23 బస్సులను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. అంతేకాకుండా దివాకర్ ట్రావెల్స్కు చెందిన 23 ఇంటర్ స్టేట్ క్యారియల్ బస్సుల పర్మిట్లను కూడా రద్దు చేశారు. అదేవిధంగా నిబంధనలను అతిక్రమించినందుకు పలు కేసులు నమోదు చేశారు. అయితే దివాకర్ ట్రావెల్స్పై అనేక ఫిర్యాదులు వచ్చాయని అందులో భాగంగానే తనిఖీలు చేశామని, దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని జాయింట్ కమిషనర్ ప్రసాద్ రావు వెల్లడించారు. -
ఆర్టీఏలో..అలజడి!
జిల్లా ఆర్టీఏలో రోజురోజుకు ముసలం ముదురుతోంది. ఎంవీఐలు మొదలు ఇతర ఉద్యోగులు సైతం ఇక్కడ విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపడంలేదు. ఇప్పటికే అధికారులు, సిబ్బంది కొరతతో సతమతమవుతుండగా.. అందుబాటులో ఉన్నవారిలో పలువురు అవినీతి మరకలు అంటించుకుంటున్నారు. దీంతో మిగతా అధికారులు, ఉద్యోగులు సైతం ఒక్కొక్కరుగా జిల్లా దాటివెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా ఆర్టీఏ సేవలు పూర్తిగా స్తంభిస్తున్నాయి. లైసెన్సులు, ఆర్సీబుక్లు, రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్, ట్యాక్సుల వసూలు తదితర రెగ్యులర్ సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. పాఠశాలల పునఃప్రారంభం నాటికే స్కూల్ బస్సులన్నింటికీ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. స్కూళ్లు మొదలై వారం కావస్తున్నా ఈ విషయంపై ఇప్పటికీ దృష్టిసారించడం లేదు. ఒక్కోసారి పరిగిలో నిర్వహించాల్సిన ఫిట్నెస్ టెస్టులు, ఇతర సేవలకు సైతం వికారాబాద్ రప్పించుకుంటున్నారు. జిల్లాలో కేవలం పరిగిలో మాత్రమే డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఉండగా.. వికారాబాద్లో ఎలాంటి చోదక పరీక్షలు నిర్వహించకుండానే లైసెన్స్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరిగి: జిల్లా పరిధిలో పని చేసేందుకు ఆర్టీ ఏ శాఖ అధికారులు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరులో ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. ఈ మూడింటికీ కలిపి ఒకే ఎంవీఐ పోస్టు ఉంది. పరిగి ఆర్టీఏ యూనిట్ కార్యాలయంలో ఎంవీఐ పోస్టు ఉండగా.. వికారాబాద్, తాండూరుకు సైతం ఇన్చార్జ్ ఎంవీఐగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఇటీవలి వరకు మూడు ఆర్టీఏ కార్యాలయాల్లో ఎంవీఐగా విధులు నిర్వహించిన ప్రవీణ్కుమార్రెడ్డి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఎవరూ రాకపోవటంతో చెకింగ్ ఎంవీఐ కిషోర్ బాబుకు మూడు కార్యాలయాల ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన ఏసీబీ దాడులతో జంకిన ఈయన లాంగ్లీవ్పై వెళ్లిపోయారు. జిల్లాకు చెందిన మరికొందరు ఉద్యోగులు సైతం ఇక్కడ ఇమడలేక జిల్లా దాటి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో వారం రోజులుగా ఆర్టీఏ సేవలు స్తంభించాయి. ఈ విషయంలో వికారాబాద్ ఆర్టీఓ వాణిని వివరణ కోరగా ఇటీవల రెండు మూడు రోజులు సేవలు స్తంభించిన మాట వాస్తవమేనని, సాధ్యమైనంత వరకు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పక్క జిల్లాకు చెందిన జూనియర్ ఎంవీఐలకు జిల్లాలో ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. అధికారులకు అవినీతి మరకలు... జిల్లాలో ఆర్టీఏ ఉద్యోగుల అవినీతి హద్దులు దాటుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.500 చేయాల్సిన పనికి రూ.2 వేలు, రూ.వెయ్యికి పూర్తయ్యే పని కోసం రూ.5 వేలు వసూలు చేస్తున్నారని సమాచారం. రూ.2 వేలలోపు ఖర్చయ్యే హెవీ లైసెన్స్కు ఏకంగా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు దండుకుంటున్నారు. ఇటీవల ఓ ఆర్టీఏ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. దీంతో ఆర్టీఏ అధికారుల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. గతేడాది జిల్లాలో విధులు నిర్వహించే ఓ అధికారి అవినీతి నిర్వాకం రాష్ట్ర సరిహద్దులు దాటిన విషయం తెలిసిందే. ఏకంగా విజయవాడలో లారీలకు బాడీ ఫిట్టింగ్ జరుగుతుండగానే అక్కడికే వెళ్లి ఫిట్నెస్ క్లియరెన్స్ ఇచ్చారు. ఈ ఘటనతో సదరు అధికారిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా అవినీతి మరకలంటించుకున్న అధికారికి మళ్లీ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చి.. కొన్ని నెలల పాటు జిల్లాకు చెందిన మూడు కార్యాలయాల బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిచ్చింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement