-
అక్కను చూడగానే జీపులోంచి దూకేసింది!
ఒలింపిక్స్లో అసమాన పోరాటపటిమను చాటిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్కు సోమవారం త్రిపుర రాజధాని అగర్తలాలో ఘనస్వాగతం లభించింది. అగర్తలా విమానాశ్రయం నుంచి స్థానిక మైదానం వరకు వేలమంది అభిమానులు ఆమెకు స్వాగతం పలికారు. కోచ్ బిశ్వేష్వర్ నందితో కలిసి ఓపెన్ టాప్ జీపులో ఆమె స్వాగతోత్సవం దాదాపు 12 కిలోమీటర్లు సాగింది. దాదాపు ఐదువేల మంది ఈ ర్యాలీలో పాల్గొని ఆమెకు జయజయధ్వానాలు చేశారు. మైదానంలో ఆమెకు త్రిపుర ప్రభుత్వం ఘనసత్కారం నిర్వహించింది. ఆమె విజయోత్సవ ర్యాలీలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అభిమానులతో కలిసి తనకు స్వాగతం పలుకుతున్న అక్కను చూడగానే దీప హృదయం ఉప్పొంగిపోయింది. వెంటనే ఓపెన్ జీపులో నుంచి అమాంతం కిందకు దూకేసింది. ఎంతైనా టాప్ క్లాస్ జిమ్నాస్ట్ కదా! ఎలాంటి ఇబ్బంది పడకుండా అలవోకగా జీపులోంచి దిగి.. పరిగెత్తుకెళ్లి తన సోదరిని ఆమె హత్తుకుంది. తోబుట్టువుల మధ్య ఉండే ప్రేమానురాగాలను ఈ ఘటన చాటింది. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ విభాగంలో అర్హత సాధించిన తొలి క్రీడాకారిణిగా దీప సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రమాదకరమైన విన్యాసం ప్రోడునోవా విభాగంలో అద్భుత ప్రతిభాపాటవాలు చాటి ఆమె ఫైనల్కు వెళ్లింది. కేవలం 0.15 పాయింట్ల తేడాతో పతకం కోల్పోయిన ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. రియో ఒలింపిక్స్లో దీప పతకం గెలువకపోయినా.. తన పోరాటస్ఫూర్తితో 120 కోట్ల భారతీయుల హృదయాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు కూడా పలు రాష్ట్ర ప్రభుత్వాలు రివార్డులు ప్రకటిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆమెకు రూ. 50 లక్షల నజరానా ప్రకటించింది. -
సింధు రజితం గెలుపుపై హర్షం
బిజినేపల్లి: రియో ఒలింపిక్ బ్యాట్మింటన్లో తెలుగు తేజం సింధు ఫైనల్లో రజితం పతకం సాధించడంపై పాలెం నేతాజీ యువజన సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. బ్యాట్మింటన్లో ఫైనల్లో సింధు స్వర్ణ పతకం సాధించేందుకు ఎంతగానో కషి చేసినా ఫలితం దక్కకపోవడం బాధాకరమన్నారు. ఏది ఏమైనా దేశంలో వ్యక్తిగత రజితం పతకం సింధు సాధించడం గొప్ప విషయమన్నారు. హర్షం ప్రకటించిన వారిలో శ్రీనివాస్గౌడ్, సిరిజంగం శ్రీనివాసులు, శ్రీనివాస్, నాగరాజు, జ్ఞానేశ్వర్, కష్ణ, రేణుగౌడ్ ఉన్నారు. -
జర్మనీకి షాకిచ్చిన బ్రెజిల్
రియో డిజెనీరో: నేమర్ మెరుపులతో బ్రెజిల్ మెరిసింది. సొంత గడ్డపై జరుగుతున్న ఒలింపిక్స్లో మొట్టమొదటిసారిగా ఫుట్బాల్ స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. శనివారం మారకనా మైదానంలో జరిగిన ఫైనల్ పోరులో జర్మనీని ఓడించిన బ్రెజిల్ పసిడిని ముద్దాడింది. బ్రెజిల్ షూటౌట్లో 5-4తేడాతో జర్మనీపై గెలిచింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు తలో గోల్ నమోదు చేయకపో్వడంతో షూటౌట్ అనివార్యమైంది. ఇందులో జర్మనీని నిలువరించిన బ్రెజిల్ చాంపియన్గా అవతరించింది.దాంతోపాటు రెండేళ్ల కిందట సొంతగడ్డపై జరిగిన ఫుట్బాల్ వరల్డ్ కప్లో జర్మనీ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఆ వరల్డ్ కప్ లో బ్రెజిల్ 1-7 గోల్స్ తేడాతో ఓటమిపాలైంది. ఫైనల్ మ్యాచ్లో బ్రెజిల్ స్టార్ ఆటగాడు నేమర్ ఆద్యంతం రాణించాడు. ఫస్ట్ హాఫ్లో ఫ్రీకిక్ ద్వారా గోల్ చేసి బ్రెజిల్ను ఆధిక్యంలో నిలిపాడు. అయితే, 59వ నిమిషంలో జర్మనీ కెప్టెన్ మాక్స్ మెయర్ గోల్ చేయడంతో స్కోరు సమమైంది. ఆ తరువాత బ్రెజిల్-జర్మనీలు తమ డిఫెన్స్తో ఆకట్టుకోవడంతో నిర్ణీత వ్యవధిలో మరో గోల్ రాలేదు. ఆపై మరో ఆరు నిమిషాలు అదనపు సమయంలో ఇరు జట్లు గోల్ చేయకపోవడంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు పెనాల్టీ షూటౌట్లో జర్మనీ ఆటగాడు ఒకసారి విఫలమవ్వగా.. బ్రెజిల్ ఐదుసార్లు గోల్ చేసింది. దీంతో 5-4 తేడాతో బ్రెజిల్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఒలింపిక్స్ ఫుట్బాల్ గేమ్లో బ్రెజిల్కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం. గతంలో మూడుసార్లు(1984, 88, 2012 ) ఒలింపిక్స్ ఫైనల్ కు చేరిన బ్రెజిల్ రజతంతో సంతృప్తి పడింది. కాగా నాల్గో ప్రయత్నంలో స్వర్ణాన్ని సాధించడంలో బ్రెజిల్ సఫలమై తమ దేశంలో అభిమానులకు రెట్టింపు జోష్ను అందించింది. -
సందీప్ తోమర్ అవుట్
రియో డి జనీరో: పురుషుల 57కేజీ ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ సందీప్ తోమర్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్లో తను రష్యాకు చెందిన విక్టర్ లెబెడేవ్ చేతిలో 3-7 తేడాతో ఓడాడు. ఆరు నిమిషాల ఈ బౌట్లో సందీప్ ఏ దశలోనూ ప్రత్యర్థిపై పట్టు సాధించలేకపోయాడు. ఆదిలోనే 5-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన విక్టర్ పైచేయి సాధించాడు. అయితే ఆ తర్వాత విక్టర్ క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోవడంతో సందీప్కు రెప్చేజ్ అవకాశం కూడా లేకుండాపోయింది. దీంతో తను రియో నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. 34వ స్థానంలో సందీప్ కుమార్ 50 కి.మీ రేసు నడక ఫైనల్లో సందీప్ కుమార్ 4:07:55 టైమింగ్తో 34వ స్థానంలో నిలిచాడు. విజేతగా నిలిచిన మటెజ్ టోత్కన్నా తను 26 నిమిషాల 57 సెకన్ల ఆలస్యంగా లక్ష్యాన్ని చేరుకున్నాడు. 80 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ రేసును 48 మంది మాత్రమే పూర్తి చేయగలిగారు. -
నా కెరీర్లో ఇదే బెస్ట్ మోమెంట్!
రియో డిజెనీరో: రియో ఒలింపిక్స్ విమెన్ సింగిల్స్ విభాగంలో సెమీస్లోకి అడుగుపెట్టిన భారత షట్లర్ పీవీ సింధు తన విజయప్రస్థానాన్ని మున్ముందు కూడా కొనసాగించాలని భావిస్తోంది. లండన్ ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన చైనా షట్లర్ యిహన్ వాంగ్ను వరుస సెట్లలో ఓడించి సెమీస్లోకి ప్రవేశించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది. తన కెరీర్లో ఉత్తమ విజయాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుందని పేర్కొంది. సెమీస్లో జపాన్ క్రీడాకారిణి నోజోమి ఒకుహరాపై కూడా మంచి ప్రదర్శన ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిపింది. 'రియో ఒలింపిక్స్లో ఈ విజయం సాధించడం ఓ భిన్నమైన భావనను కలిగిస్తోంది. ఇది నా కెరీర్లో బెస్ట్ మూమెంట్. మున్ముందు మరిన్ని విజయాలు వస్తాయని నేను ఆశిస్తున్నా' అని సింధు పేర్కొంది. వరల్డ్ నంబర్ 10 ర్యాంకర్ అయిన సింధు.. సైనా తర్వాత ఒలింపిక్స్ సెమీస్లోకి అడుగుపెట్టిన తొలి భారతీయ షట్లర్గా రికార్డు సృష్టించింది. హోరాహోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సహనంతో చివరివరకు పోరాడటం వల్లే తనకు విజయం దక్కిందని ఆమె పేర్కొంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement