-
ప్రపంచంలో అత్యంత సంపన్నమైన గ్రామం ఎక్కడుందో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన గ్రామం ఎక్కడుందో మీకు తెలుసా?. చాలా మంది అమెరికా లేదా వేరొక దేశం పేరు చెబుతారు కానీ, అది అబద్దం. మన దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన గ్రామం ఉంది. ఈ గ్రామంలో 7,600 ఇల్లు ఉన్నాయి. ఈ గ్రామలోని ప్రజలు డబ్బు దాచుకోవడానికి ఆ గ్రామంలో 17కి పైగా బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులో వారు 5,000 కోట్ల రూపాయల డిపాజిట్ చేశారు. మనం మాట్లాడుతున్న గ్రామం పేరు మాధపర్. ఈ గ్రామం గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది. అంచనాల ప్రకారం గ్రామంలో సగటు తలసరి డిపాజిట్ సుమారు 15 లక్షల రూపాయలు. ఈ గ్రామంలో 17 బ్యాంకులు మాత్రమే కాకుండా పాఠశాలలు, కళాశాలలు, సరస్సులు, పచ్చదనం, ఆనకట్టలు, ఆరోగ్య కేంద్రాలు, దేవాలయాలు ఉన్నాయి. ఈ గ్రామంలో అత్యాధునిక గౌశాల కూడా ఉంది. కానీ ఈ గ్రామం, మన దేశంలోని సంప్రదాయ గ్రామాల కంటే ఎందుకు భిన్నంగా ఉంది అంటే?. దీనికి ప్రధాన కారణం గ్రామస్థుల కుటుంబ సభ్యులు, బంధువులలో ఎక్కువ మంది యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆఫ్రికా, గల్ఫ్ దేశాలు వంటి విదేశాలలో నివసిస్తున్నారు. 65% కంటే ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు వారు దేశం వెలుపల నుంచి తమ కుటుంబాలకు భారీ మొత్తంలో డబ్బును పంపుతున్నారు. ఆ గ్రామ ఎన్ఆర్ఐలలో చాలా మంది డబ్బు సంపాదించిన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి గ్రామంలో తమ వెంచర్లను ప్రారంభించారు. కొన్ని నివేదికల ప్రకారం, మాధపర్ విలేజ్ అసోసియేషన్ అనే సంస్థను 1968లో లండన్ లో ఏర్పాటు చేశారు. విదేశాల్లో నివసిస్తున్న మాధపర్ ప్రజల మధ్య సమావేశాలను సులభతరం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రజల మధ్య మంచి సంబందాన్ని ఏర్పాటు చేయడానికి గ్రామంలో కూడా ఇలాంటి ఒక కార్యాలయాన్ని ప్రారంభించారు. చాలామంది గ్రామస్థులు విదేశాల్లో స్థిరపడినప్పటికీ వారు తమ మూలాలను ఎన్నడూ మారిచిపోలేదు. వారు నివసిస్తున్న దేశం కంటే గ్రామ బ్యాంకుల్లో తమ డబ్బును ఆదా చేయడానికి ఇష్టపడతారు. వ్యవసాయం ఇప్పటికీ ఇక్కడ ప్రధాన వృత్తిగా ఉంది. -
ఆశ్రయానికి నో.. రెండు కోట్లు ఇచ్చేందుకు ఓకే!
లండన్: శరణార్థులను తమ గ్రామంలోకి అనుమతివ్వకుండా అందుకు ప్రతిగా కోట్ల రూపాయల ఫైన్ చెల్లించేందుకు స్విట్జర్లాండ్ లోని ఓ గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రూ.1,96,17,606 వారికి చెల్లిస్తామని ప్రకటించారు. డబ్బు అయితే, వారి జీవనోపాధికి పనికొస్తుందని ఆ గ్రామ అధికారి ప్రకటించాడు. మొత్తం 50 వేల మంది సిరియా ప్రాంతానికి చెందిన శరణార్థులను తమ దేశంలోకి అనుమతించేందుకు స్విట్జర్లాండ్ నిర్ణయించింది. అందులో భాగంగా ఆయా గ్రామాల్లో వారిని సర్దేందుకు గ్రామానికి పదిమంది చొప్పున నిర్ణయించారు. అంతకంటే ముందు ఆ గ్రామంలో శరణార్ధులపై అభిప్రాయ సేకరణ చేస్తారు. అందులో భాగంగా దాదాపు 300మంది మిలియనీర్లు, 20,000మంది జనాభాతో ఉన్న స్విట్జర్లాండ్ లోని ''లీలి' అనే గ్రామంలో అభిప్రాయ సేకరణ చేపట్టగా వారు శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు నిరాకరించి డబ్బు సహాయం చేస్తామని చెప్పారు. ఒక వేళ తాము ఆశ్రయం ఇస్తే అలాగే ఇతరులు కూడా ఆశపడి తమ గ్రామానికి వస్తారని, అలా కాకుండా డబ్బు సహాయం చేయడం ద్వారా శరణార్థి శిబిరాల్లో ఉంటున్న వారికి భవిష్యత్ అందించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. వారి భాష తీరు కూడా వేరని, పిల్లల చదువులు వంటి సమస్యలు వస్తాయని తెలిపారు.
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి.. మోదీకి కృతజ్ఞతలు
హీట్ పెంచేలా మృణాల్.. చీరలో మరింత అందంగా ఆషిక!
ఒడిశా: పాలిటిక్స్కు వీకే పాండియన్ గుడ్బై
అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు కీలక సూచన.. ఇకపై..
నా బయోపిక్లో ఈ హీరోల్లో ఎవరు నటించినా ఓకే.. నేను కూడా..
బన్నీతో బాక్సాఫీస్ వార్కి సై అంటున్న బాలీవుడ్ హీరో
రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్గా..!
ఇజ్రాయెల్ హీరో? ఎవరీ అర్నాన్ జమోరా
ముంబైలో తప్పిన విమానాల ఢీ
Advertisement