-
కుకింగ్ చేస్తే రైస్‘పుల్లింగ్’!
సాక్షి, హైదరాబాద్: చంద్రయాన్–3 పేరుతో హైదరాబాద్లో ఒకరిని బురిడీ కొట్టించి రూ. 3 కోట్లు కొల్లగొట్టిన రైస్ పుల్లింగ్ గ్యాంగ్ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ కేటుగాళ్ల మోడస్ ఆపరెండీని సీసీఎస్ పోలీసులు వివరించారు. సాధారణ చెంబు, బిందెలకు అతీంద్రియశక్తులు ఉన్నాయంటూ నమ్మించి నిండా ముంచడం వారి శైలి అని... సాధారణ చెంబు/బిందెను ‘రైస్పుల్లర్’గా మార్చడానికి ‘కుకింగ్’ చేస్తుంటారని పేర్కొన్నారు. అమోఘ శక్తులంటూ... రైస్ పుల్లింగ్ అంటే బియ్యాన్ని ఆకర్షించి తన వైపునకు లాక్కోవడం. ఇలాంటి శక్తులున్న పాత్రలు, బిందెలు, చెంబుల పేరు చెప్పి మోసగాళ్లు అందినకాడికి దండుకుంటుంటారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వీటికి చేజిక్కించుకుంటే అమోఘ మైన ఫలితాలు ఉంటాయని నమ్మబలుకుతారు. సాధారణంగా కేటుగాళ్లు కస్టమర్లకు రైస్పుల్లింగ్కు సంబంధించిన వీడియోలు, ఫొటోలనే చూపిస్తుంటారు. అనేక సందర్భాల్లో తాము విక్రయిస్తున్న పాత్రలను చూసే అవకాశం కొనే వారికి ఇవ్వరు. అయితే ఎవరైనా తమకు ఆ పాత్ర మహిమల్ని ప్రత్యక్షంగా చూపించాలని కోరితే మాత్రం చూపిస్తారు. ఇలాంటి ముఠాలు బియ్యాన్ని తమదైన శైలిలో అన్నంగా వండటం ద్వారా రైస్ పుల్లింగ్ చేసేలా చేస్తారు. బియ్యంలో సన్నని ఇనుప రజను కలిపి బిరుసుగా అన్నం వండుతారు. దీన్ని ఎండబెట్టడం ద్వారా మళ్లీ బియ్యంలా కనిపించేలాగా చేస్తారు. అనంతరం రైస్పుల్లర్గా పేర్కొనే పాత్ర లోపలి భాగంలో ఎవరికీ కనిపిచంకుండా అయస్కాంతం ఏర్పాటు చేస్తారు. దీంతో ఈ పాత్రకు దగ్గరగా ఇనుప రజనుతో కూడిన బియాన్ని ఉంచితే అది దానికి అతుక్కుంటుంది. ఇలాంటి షోలు చూపించే ఈ మోసగాళ్లు అమాయకులను బుట్టలో వేసుకుంటుంటారని పోలీసులు వివరిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ముఠాలకు చెందిన వారిలో అనేక మంది తొలుత బాధితులుగా మారినవారేనని పోలీసులు చెబుతున్నారు. తాము నష్టపోయిన మొత్తాన్ని తిరిగి అదే మార్గంలో సంపాదించాలనో, అసలు ఈ రైస్పుల్లర్లు ఉన్నాయా? లేవా? అనే అధ్యయనం కోసమో అలాంటి ముఠాలతో జట్టుకడుతున్నారు. ఒకసారి తేలిగ్గా డబ్బు వచ్చిపడిన తర్వాత అదే దందా కొనసాగించేస్తున్నారు. ప్రధానంగా తమిళనాడు, కర్ణాటకతో పాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో రైస్ పుల్లింగ్, డబుల్ ఇంజిన్గా పిలిచే రెండు తలల పాములతో మోసాలు చేసే ముఠాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దొంగ సర్టిఫికేషన్లు రైస్ పుల్లింగ్ ముఠాల్లో కొన్ని ప్రత్యేకంగా కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తుంటాయి. వాటి కేంద్రంగానే కొన్ని ఉపకరణాలను కలిగి ఉండి ఆయా రైస్పుల్లర్స్ను పరీక్షించినట్లు నటిస్తూ ఆయా ఉపకరణాలు నిజమైనవనేలా సర్టిఫికేషన్ ఇచ్చేస్తుంటారు. ఇదంతా దాన్ని కొనే వారి ఎదురుగానే జరుగుతుంది. ఇలాంటి ముఠాల చేతిలో మోసపోయిన వారి సంఖ్య పదుల్లో ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే ఇకపై ఇంకెవరూ మోసపోకుండా అప్రమత్తం చేసిన వాళ్లవుతారని చెబుతున్నారు. కస్టడీకి తీసుకోవాలని నిర్ణయం పోలీసులు అరెస్టు చేసిన విజయ్కుమార్, సాయి భరద్వాజ్, సంతోష్, సురేందర్లను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించాలని అధికారులు నిర్ణయించారు. -
చంద్రయాన్-3 సక్సెస్ పేరిట రైస్ పుల్లింగ్.. పాత్ర పేరుతో 20కోట్లు..
సాక్షి, హైదరాబాద్: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రయాన్-3 సక్సెస్తో ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు మారుమోగ్రుతోంది. అయితే, కొందరు కేటుగాళ్లు చంద్రయాన్-3 పేరును వాడుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ ఉదంతంపై హైదరాబాద్లో కేసు నమోదు అయ్యింది. వివరాల ప్రకారం.. కొందరు కేటుగాళ్లు చివరిని చంద్రయాన్-3ని కూడా వదిలిపెట్టలేదు. చంద్రయాన్ సక్సెస్కు రైస్ పుల్లింగ్ కారణమని భారీ మోసానికి తెర లేపారు. చంద్రయాన్-3 విజయానికి ఉపయోగించిన పాత్ర అమ్ముతామని కొందరు కేటుగాళ్లు ఓ వ్యాపారవేత్త వద్ద నుంచి ఏకంగా రూ.20కోట్లు దోచేశారు. ఇది మహిళ గల పాత్ర అంటూ కలరింగ్ ఇచ్చి బురిడీ కొట్టించారు. దీంతో, బాధితుడు.. నగరంలోని మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి విజయ్ కుమార్ అనే వ్యక్తితో సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: ఉజ్జయిని ఘోరం.. బాధితురాలి దత్తతకు ముందుకు వచ్చిన పోలీసాయన -
నిధుల వేటలో.. మోసం లోతుల్లో!
రైస్ పుల్లింగ్.. పూడు పాములు.. అక్షయపాత్ర.. సంజీవని వేరు.. బంగారు నాణేలు.. పేర్లు వేరైనా మోసం ఒక్కటే. ఊరికే డబ్బు వస్తుందంటే చాలు.. నమ్మడం అలవాటైన వాళ్లు మోసగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును వాళ్ల చేతిలో పెట్టి తీరా మోసపోయాక లబోదిబోమంటున్నారు. ఇక గుప్త నిధుల కోసమని అమావాస్య రాత్రిళ్లు.. పౌర్ణమి వెలుగుల్లో అడవిని జల్లెడ పడుతున్నారు. చారిత్రక ఆలయాలు, ప్రాంతాలను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఖాళీ కుండలు వెక్కిరిస్తున్నా అన్వేషణ మాత్రం కొనసాగుతోంది. గతేడాది పలమనేరు మండలం దేవలంపెంట పురాతన శివాలయం ఎదురుగా ఉన్న నంది విగ్రహంలో కోట్లాది రూపాయల విలువైన వజ్రాలు ఉన్నాయంటూ దాన్ని హైదరాబాద్ ముఠా ధ్వంసం చేసింది. ఇది కేవలం మోసమేనని పోలీసులు నిర్ధారించారు. ఇందుకు కారణమైన వారిని అరెస్టు చేశారు. ఏడాది క్రితం మండలంలోని దొడ్డిపల్లి అడవిలో ఓ ముఠా గుప్తనిధుల తవ్వకాలకు వెళుతూ వేటగాళ్ల కరెంటు ఉచ్చుకు చిక్కి ఇద్దరు గాయపడ్డారు తాజాగా నియోజకవర్గంలో బేలుపల్లి సమీపంలోని శాతపురాళ్ల ఆలయం వద్ద ఓ ముఠా తవ్వకాలు చేపట్టడం కలకలం రేపింది. .. ఇలాంటి ఘటనలు పోలీసుల దృష్టికి వెళితే కానీ విషయాలు వెలుగులోకి రాని పరిస్థితి. పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాల్లో తరచుగా తవ్వకాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పలమనేరు: జిల్లాలోని పడమటి మండలాల్లో గుట్టుచప్పుడు కాకుండా గుప్తనిధుల వేట సాగుతోంది. రాత్రివేళల్లో కొన్ని అంతర్ రాష్ట్ర ముఠాలు స్థానికులను ఏజెంట్లుగా నియమించుకొని తమ పని కానిచ్చేస్తున్నాయి. ముఖ్యంగా పురాతన, పాడుబడ్డ ఆలయాల్లో పూర్వీకులు బంగారాన్ని దాచి ఉంటారనే అనుమానంతో ఈ తవ్వకాలు చేపడుతున్నారు. ఈ కారణంగా ఇప్పటికే పురాతన ప్రాశస్త్యం ఉన్న పలు ఆలయాలు ధ్వంసమయ్యాయి. జిల్లాలోని పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాలు ఇటు కర్ణాటక, అటు తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నాయి. దీంతో పక్క రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి ఎన్నో అడ్డదారులు ఉన్నాయి. ఎవరైనా, ఎప్పుడైనా సులభంగా వచ్చే వీలుంది. దీంతో గుప్త నిధుల వేటగాళ్లు ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. గతంలోనూ నకిలీ బంగారు నాణేలు, రైస్పుల్లింగ్, పూడుపాములు, అక్షయపాత్ర, సంజీవిని వేరు లాంటి రకరకాల మోసాలు, ఘటనలు ఈ ప్రాంతంలోనే చోటు చేసుకోవడం గమనార్హం. దుర్గం కొండపై ఉన్న ప్రాచీన ఆధారాలన్నింటినీ అక్రమార్కులు పెకళించారు. కృష్ణమ్మకొండపై సైతం దేవతా మూర్తులను పెకళించి నిధులకోసం అన్వేషించారు. కుప్పం ప్రాంతంలోని కర్ణాటక సరిహద్దు గ్రామాలు.. పుంగనూరు, సోమల, చౌడేపల్లె్ల, రామసముద్రంలో తవ్వకాలు షరామామూలుగా సాగుతున్నాయి. రాత్రి వేళల్లో గుట్టుగా.. ∙పలమనేరు మండలంలోని చెల్లెమ్మ చెరువులో పురాతన కాలంనాటి ఓ పుష్కరిణి గతంలో బయటపడింది. దీంతో బంగారు నాణేలున్నాయని పలువురు గతంలో తవ్వకాలు చేపట్టారు. ∙జగమర్ల అటవీప్రాంతంలో రంగురాళ్లు, వజ్రాల కోసం రాత్రి పూట కర్ణాటక వ్యక్తుల వేట కొనసాగుతోంది. ∙బైరెడ్డిపల్లె మండలంలోని బాపలనత్తం అడవిలో ఉండే పాండవ గుహల్లో ఇప్పటికే పలుమార్లు తవ్వకాలు చేశారు. అందులో ఏమీ దొరక్కపోయినా తవ్వకాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ∙ఇదే మండలంలోని అటవీప్రాంతంలో ధనబండ వద్ద ధనం ఉందని గతంలో తవ్వకాలు జరిగాయి. ∙వీకోట మండలంలోని దుర్గంకొండ, కృష్ణమ్మ కొండ, క్రిష్ణాపురం, మోట్లపల్లె, గోనుమాకులపల్లె, కోటనక్కనపల్లె గ్రామాల్లోని పాత ఆలయాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ∙మోట్లపల్లె వద్ద పంటపొలాల్లో బండల కింద గుప్త నిధులు ఉన్నాయని కర్ణాటకకు చెందిన ఓ ముఠా నాటు బాంబులతో ఆ బండలు పగులగొ ట్టింది. రాతి కింద బొగ్గులు ఉన్న కుండలు అక్కడ బయటపడడం గమనార్హం. అమావాస్య, పౌర్ణమి రాత్రుల్లో అధికం బైరెడ్డిపల్లె మండలంలోని బాపలనత్తం సమీపంలో పాండవ గుహలున్నాయి. సుమారు పదెకరాల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాంతంలో గతంలో పాండవులు నివసించారని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ ఓ ప్రత్యేకమైన చంద్రాకారంలో బండలతో నిర్మించిన గుడులున్నాయి. అయితే వీటి కింద నిధి నిక్షేపాలు ఉన్నాయని పలు ముఠాలు ఇప్పటికే ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేశాయి. ఈ ప్రాంతం అడవిలో ఉండడంతో స్థానికులు సైతం గుర్తించేందుకు వీలుకాని పరిస్థితి. ఈతంతు అమావాస్య, పౌర్ణమి రాత్రుల్లోనే సాగుతోంది. కొన్ని ఆలయాల వద్ద బండలపై చెక్కిన లిపిని పరిశీలించి బంగారం ఉంటుందని కొందరు ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఏదేమైనా ఈ ముఠాల మాటలను నమ్మి ఈ ప్రాంతవాసులే కాకుండా చుట్టుపక్క రాష్ట్రాలకు చెందిన వారు సైతం లక్షలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని ఘటనలో మినహా చాలా వరకు పోలీసుల దృష్టికి కూడా వెళ్లని పరిస్థితి నెలకొంది. అమాయకంగా నమ్మకండి గుప్తనిధులు, రైస్పుల్లింగ్ లాంటి మో సాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. చాలా వరకు అరెస్టులు కూడా చేశాం. పత్రికల్లోనూ వెలుగులోకి వస్తున్నా అమాయకంగా నమ్మి మోసపోతున్నారు. ఇలాంటి ముఠాల కదలికలపై నిఘా ఉంచాం. ఎవరికైనా సమాచారం ఉంటే పోలీసులను ఆశ్రయిస్తే వారి ఆటకట్టిస్తాం. – గంగయ్య, డీఎస్పీ, పలమనేరు -
వీడిన విశాఖ కిడ్నాప్ కేసు మిస్టరీ
-
విశాఖ కిడ్నాప్ కేసు: ఇద్దరు అరెస్టు
సాక్షి, విశాఖపట్నం: రియల్ఎస్టేట్ వ్యాపారి సురేష్ కిడ్నాప్ కేసు మిస్టరీ వీడింది. నిందితులు పల్లపు ప్రసాద్, ప్రతాప్రెడ్డిలను విశాఖ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వ్యాపార లావాదేవీలు, రైస్ పుల్లింగ్ వ్యవహారాలే కిడ్నాప్నకు ప్రధాన కారణమని తేలింది. విశాఖ కమిషనర్ ఆర్కే మీనా కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘రియల్ఎస్టేట్ వ్యాపారి సురేష్ను నలుగురు కిడ్నాప్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. కత్తి, తుపాకీతో సురేష్ను బెదిరించారు. డబ్బులు లేవని బంగారం ఉందని అతను కిడ్నాపర్లకి చెప్పాడు. సురేష్ తనభార్యకి ఫోన్ చేసి బంగారం తీసుకు రమ్మన్నాడు. అతని భార్య బంగారం తీసుకువచ్చిన తర్వాత భార్యాభర్తలు గొడవలు పడ్డారు. అదే సమయంలో సురేష్ కొడుకు డయల్ 100 కి ఫోన్ చేశాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో నిందితులు పారిపోయారు. (చదవండి: వ్యాపారి కిడ్నాప్ కేసు దర్యాప్తు ముమ్మరం) నిందితులు పల్లపు ప్రసాద్ (ఎ 1), ప్రతాప్రెడ్డి (ఎ 2)లను అరెస్టు చేశాం. ఈ కేసులో మొత్తం ఏడుగురి పాత్ర గుర్తించాం. మిగిలిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. అరెస్ట్ అయినవారిపై రైస్ పుల్లింగ్ తో పాటు పలు కేసులు ఉన్నాయి. నిందితులలో కొంతమందితో సురేష్ కి రైస్ పుల్లింగ్ ద్వారా పరిచయం ఉంది. సురేష్ పైన కూడా కేసులు ఉన్నాయి. కేసులతో పాటు డబ్బులు ఉన్నవ్యక్తిని కిడ్నాప్ చేస్తే త్వరగా డబ్బులు వస్తాయని నిందితులు ఊహించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రసాద్ పై మూడు కేసులు ఉన్నాయి. మరో నిందితుడు ప్రతాప్రెడ్డిపై నాలుగు కేసులు ఉన్నాయి. గతంలో ప్రసాద్ కూడా రైస్ పుల్లింగ్ వ్యవహారంలో కిడ్నాప్ కి గురై మోసపోవడంతో ఈజీ మనీ కోసం అదే మార్గాన్ని ఎంచుకున్నాడు. (విభేదాలే కిడ్నాప్కి కారణమా..?)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
PrajwalRevannavideo: త్వరలో భారత్కు ప్రజ్వల్ రేవణ్ణ..?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- షుగర్ పేషెంట్స్ పళ్లు తినకూడదా? తింటే ఏవి తినాలి?
- పవన్ కల్యాణ్కి షాక్.. సినిమా నుంచి స్టార్ డైరెక్టర్ తప్పుకొన్నాడా?
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
Advertisement